Awards
-
వేడుకగా భారత్ అన్మోల్ వుమెన్ అవార్డ్స్ వేడుక (ఫోటోలు)
-
తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి
మాదాపూర్: వాణిజ్యం, వ్యాపారం లేకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు నడవలేవని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో గురువారం హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ 2వ ఎడిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కీలక రంగాలలో అమూల్యమైన సేవలు అందించిన వారికి అవార్డులను అందజేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏడాదికాలంలో ప్రభుత్వం వ్యాపారరంగ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని తెలిపారు. 2023లో తెలంగాణ అభివృద్ధి 2ఎక్స్గా ఉందని, రాబోయే నాలుగు సంవత్సరాలలో దాన్ని 10ఎక్స్కు చేరుస్తామన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 11 మందికి లెజెండ్ పురస్కారాలను అందజేశారు. సీఎస్ఆర్ కేటగిరీలలో ఉత్తమ గ్రూప్గా ఐటీసీకి అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ వై.కిరణ్, భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఏటా... సినిమా డే, అవార్డులు
పది రీళ్ళ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన ఫిబ్రవరి 6న ఇకపై ప్రతి ఏడాది ‘తెలుగు సినిమా దినోత్సవం’ జరపాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) నిర్ణయించింది. ‘భక్త ప్రహ్లాద’ రిలీజై 93 వసంతాలు నిండిన వేళ హైదరాబాద్లోని ఛాంబర్ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా ‘తెలుగు సినిమా డే’ నిర్వహించింది. రచయిత పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫెడరేషన్తో సహా పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్ల ముఖ్యులూపాల్గొన్నారు. తెలుగు ప్రభుత్వాలు ఇచ్చే సినీ అవార్డులతోపాటు ఇకపై ఏటా ‘టీఎఫ్సీసీ’ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.జాతీయ అవార్డులందుకున్న వారినీ, ఇండియన్ పనోరమాకు ఎంపికైన చిత్రాల వారినీ ‘సినిమా డే’ నాడు సత్కరించాలని నిర్ణయించింది. అలాగే, ఏటా ఫిబ్రవరి 6నే అన్ని శాఖల సంఘాలూ తెలుగు సినిమా జెండా ఎరేయాలని పిలుపునిచ్చింది. జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరికి అప్పగించింది. అలాగే ఎంతో పరిశోధన చేసి, ‘భక్త ప్రహ్లాద’ అసలు రిలీజ్ తేదీ ఫిబ్రవరి 6 అని నిరూపించిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత రెంటాల జయదేవను సినీ పరిశ్రమ పక్షాన అభినందించి, సన్మానించారు. సౌతిండియన్ సినిమా చరిత్రపై ఆయన పరిశోధనా గ్రంథం ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ను పరిశ్రమ పక్షాన ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ అందుకున్నారు. పరుచూరి మాట్లాడుతూ–‘‘1931 అక్టోబర్ 31న ‘కాళిదాస్’ రిలీజైంది. 3 లఘు చిత్రాలను కలిపి, ఒకే ప్రదర్శనగా వేసిన ఆ సినిమాను తమిళులు తమ సినిమాగా చెప్పుకుంటున్నా, అందులోని 4 రీళ్ళ ‘కాళిదాస్’ పూర్తి తెలుగు డైలాగ్స్ చిత్రమని జయదేవ తన పరిశోధనలో అన్ని సాక్ష్యాలతో నిరూపించారు. పుస్తకంలో ప్రచురించారు. అందుకని ఫిబ్రవరి 6తోపాటు అక్టోబర్ 31న కూడా మర్చిపోకుండా పెద్దల్ని స్మరించుకొని, వేడుక చేసుకోవాలి’’ అన్నారు. సన్మాన గ్రహీత రెంటాల జయదేవ మాట్లాడుతూ–‘‘1932 ఫిబ్రవరి 6న ‘భక్త ప్రహ్లాద’ విడుదలైందని 2011లోనే సాక్ష్యాధారాలు సేకరించి, అసలు చరిత్రను బయటపెట్టాను. అప్పట్లో దానికి ప్రభుత్వ నంది అవార్డు దక్కినా, ఇవాళ పరిశ్రమ నన్ను సత్కరించడం మర్చిపోలేను. దీంతోపాటు తెలుగు త్యాగరాయ కీర్తనలతో ‘కాళిదాస్’ తెలుగు సినిమా అని మనం హక్కుల కోసం క్లెయిమ్ చేసుకోవాలి. ఇలా మరుగునపడిన ఎన్నో అంశాల్ని వెలికి తీసి, మన సినిమా చరిత్రను నిక్షిప్తం చేసి, భావితరాలకు అందించేందుకు ఛాంబర్ ఒక ట్రస్టు కింద నిధిని ఏర్పాటు చేయాలి’’ అన్నారు.ఈ వేడుకల్లో ఛాంబర్ కార్యదర్శి – నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, నటుడు మురళీ మోహన్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, నిర్మాతలు ఆచంట గోపీనాథ్, టి. రామ సత్యనారాయణ, నటుడు మాదాల రవి తదితరులుపాల్గొన్నారు. -
BCCI Naman Awards 2025: విజేతలు వీరే (ఫోటోలు)
-
'వెటకార' పురస్కారాలు
ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా పురస్కారాలు, బిరుదులు, ఘన సత్కారాలు దక్కుతాయి. వివిధ రంగాలలోని ప్రతిభావంతులను సత్కరించే పద్ధతి పురాతన రాచరికాల కాలం నుంచే ఉండేది. అయితే రాజుల కాలంలో పురస్కారాలు, సత్కారాలు మాత్రమే ఉండేవి. వెటకారాలు ఉండేవి కావు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం విస్తరించాక, వెటకార పురస్కారాలు కూడా మొదలయ్యాయి.ఆధునిక ప్రపంచంలో ‘నోబెల్’ పురస్కారాలను అత్యున్నత పురస్కారాలుగా పరిగణిస్తాం. బుకర్ ప్రైజ్, పులిట్జర్ అవార్డు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి వాటికి కూడా ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా ప్రపంచంలో గౌరవాదరణలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కొంత పేరు గడించినా, పరమ చెత్త ప్రదర్శనలు చేసేవారిని బహిరంగంగా వెటకారం చేయడానికి కూడా అవార్డులు ఉన్నాయి. ఇవి ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అవార్డులు. నోబెల్ బహుమతికి బదులుగా ఇగ్ నోబెల్ బహుమతి, పులిట్జర్ బహుమతికి బదులుగా ఫూలిట్జర్ బహుమతి ఇలాంటి అవార్డులే! వివిధ రంగాలకు సంబంధించి ఇలాంటి వెటకార పురస్కారాలు మరిన్ని కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ∙పన్యాల జగన్నాథదాసుఇగ్ నోబెల్శాస్త్ర సాంకేతిక సాహితీ రంగాలతో పాటు ప్రపంచశాంతి కోసం పాటుపడే వారికి ఏటా ఇచ్చే నోబెల్ బహుమతులు ఎంతటి ప్రతిష్ఠాత్మకమైనవో అందరికీ తెలుసు. పనికిమాలిన పరిశోధనలు సాగించేవారికి ‘ఇగ్ నోబెల్’ బహుమతుల గురించి ఎక్కువమందికి తెలీదు. ‘ఇగ్ నోబెల్’ బహుమతులు ఇవ్వడాన్ని 1991లో మొదలుపెట్టారు. వెటకార పురస్కారాల్లో ఇగ్ నోబెల్ తీరే వేరు! ‘ఆనల్స్ ఆఫ్ ఇంప్రొబాబుల్ రీసెర్చ్ (ఏఐఆర్) అనే శాస్త్రీయ హాస్య పత్రిక 1991 నుంచి ఏటా ‘ఇగ్ నోబెల్’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పత్రిక సంపాదకుడు మార్క్ అబ్రహాం వినూత్న ఆలోచనకు ఫలితమే ‘ఇగ్ నోబెల్’ పురస్కారాలు. అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీతల చేతుల మీదుగా ‘ఇగ్ నోబెల్’ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. ‘ఇగ్ నోబెల్’ గ్రహీతలు వేదిక మీద ప్రసంగాలు చేస్తారు. ఈ కార్యక్రమం అసలు నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని తలపిస్తుంది. ‘ఇగ్ నోబెల్’ పురస్కారానికి ఎంపికైన వారికి ‘ఘనం’గా నగదు బహుమతి కూడా ఇస్తారు. ఎంతనుకున్నారు? అక్షరాలా వంద లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్ డాలర్లు కాదు లెండి, జింబాబ్వే డాలర్లు. అమెరికన్ డాలర్లలో ఈ మొత్తం విలువ 0.40 డాలర్లు (రూ.33.73) మాత్రమే! ఈ పురస్కారంలోని వెటకారం అర్థమైంది కదా!అసలు నోబెల్ను మించినన్ని విభాగాలు ఇగ్ నోబెల్లో ఉన్నాయి. బోటనీ, అనాటమీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పీస్, డెమోగ్రఫీ, ప్రొబాబిలిటీ, ఫిజియాలజీ విభాగాల్లో ‘ఇగ్’ నోబెల్ పురస్కారాలు ఇస్తారు. ఈసారి ‘ఇగ్’నోబెల్ విజేతలు, వారి ఘనతలు ఒకసారి చూద్దాం:⇒ బోటనీ విభాగంలో ఈసారి ఇగ్ నోబెల్ పొందినవారు అమెరికన్ శాస్త్రవేత్త జాకబ్ వైట్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్లో పరిశోధనలు సాగిస్తున్న జపానీస్ శాస్త్రవేత్త ఫిలిపె యమషిటా. వీరిద్దరూ కనుగొన్న అద్భుతం ఏమిటంటే– కృత్రిమ మొక్కల కుండీలు ఉన్న పరిసరాల్లో నిజమైన మొక్కలను కూడా పెంచుతున్నట్లయితే, కృత్రిమ మొక్కల ఆకారాలను నిజమైన మొక్కలు అనుకరిస్తాయట! ప్రపంచానికి ఏ రకంగానూ పనికిరాని ఈ అద్భుతాన్ని కనుగొన్నందుకే వీళ్లకు ఈ పురస్కారం.⇒ అనాటమీ విభాగంలో ఈసారి ఏకంగా పదిమంది ఇగ్ నోబెల్ను పొందారు. వివిధ దేశాలకు చెందిన ఈ పరిశోధకులు మూకుమ్మడిగా ఒకే అంశంపై పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనాంశం నెత్తి మీద మొలిచే జుట్టు. భూమ్మీద ఉత్తరార్ధ గోళంలో ఫ్రాన్స్కు చెందిన 25 మంది పిల్లలను, దక్షిణార్ధ గోళంలో చిలీకి చెందిన 25 మంది పిల్లలను నమూనాగా తీసుకున్నారు. ఉత్తరార్ధ గోళంలోని పిల్లలతో పోల్చుకుంటే, దక్షిణార్ధ గోళానికి చెందిన పిల్లల్లో నెత్తి మీద జుట్టు అపసవ్య దిశలో రింగులు తిరిగిన వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.⇒ ఫిజిక్స్ విభాగంలో హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త జేమ్స్ సి. లియావో ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. చనిపోయిన చేప కళేబరానికి బోలు గొట్టాన్ని కడితే, అది ప్రవాహానికి ఎదురీదగలదని తన పరిశోధనలో తేల్చారు. నిర్ణీత పరిస్థితుల్లో ఒక వస్తువు తన శక్తిని ఏమాత్రం ఉపయోగించుకోకుండానే ప్రవాహానికి ఎదురీదడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.⇒ మెడిసిన్ విభాగంలో జర్మనీలోని హాంబర్గ్ వర్సిటీకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇగ్ నోబెల్ దక్కింది. తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించని నకిలీ మందుల కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించే నకిలీ మందులే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని వీరు కనుగొన్నారు.⇒ కెమిస్ట్రీ విభాగంలో ఆమ్స్టర్డామ్ వర్సిటీకి చెందిన టెస్ హీరమన్స్, ఆంటోనీ డెబ్లాస్, డేనియల్ బాన్, శాండర్ వూటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. ఆల్కహాల్ ప్రభావంతో మత్తెక్కి ఉన్న క్రిములను, మత్తు లేకుండా పూర్తి చలనశీలంగా ఉన్న క్రిములను క్రోమాటోగ్రఫీ పరిజ్ఞానంతో వేరుచేయవచ్చని వీరు కనుగొన్నారు.⇒ బయాలజీ విభాగంలో మినెసోటా వర్సిటీకి చెందిన ఫోరై్డస్ ఎలీ, విలియమ్ పీటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ దక్కించుకున్నారు. ఆవులు పాలు చేపడంపై నాడీ వ్యవస్థ పరోక్షంగా ప్రభావం చూపుతుందని వీరు కనుగొన్నారు. దీని కోసం వారు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. ఒక ఆవు వెనుక నిలుచున్న పిల్లి దగ్గర ఒక కాగితం సంచిని పేల్చారు. అధాటుగా జరిగిన ఈ పరిణామంతో ఆవు పొదుగు నుంచి పాల చుక్కలు నేలరాలాయి.⇒ ఇగ్ నోబెల్ శాంతి బహుమతి అమెరికన్ మానసిక శాస్త్రవేత్త బి.ఎఫ్.స్కిన్నర్కు మరణానంతరం లభించింది. తన జీవిత కాలంలో ఆయన ఒక విచిత్రమైన అంశంపై ప్రయోగాలు సాగించాడు. యుద్ధాలు జరిగేటప్పుడు సైనిక బలగాలు ప్రయోగించే క్షిపణుల్లో సజీవంగా ఉన్న పావురాలకు గూళ్లు ఏర్పాటు చేసి, వాటిని కూడా క్షిపణులతో పంపినట్లయితే, ఆ శాంతి కపోతాలు క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలవని ఆశించాడు.⇒ ప్రొబాబిలిటీ విభాగంలో ఫ్రాంటిసెక్ బార్టోస్ నేతృత్వంలోని చెక్ శాస్త్రవేత్తల బృందానికి ఈసారి ఇగ్ నోబెల్ లభించింది. ఒక నాణేన్ని బొమ్మ బొరుసు వేసేటప్పుడు దానిని ఏవైపు పైకి ఉంచి పట్టుకుంటామో, ఎక్కువ సార్లు అదేవైపు తిరిగి నేల మీదకు పడుతుందని వీరు కనుగొన్నారు. ఈ సంగతిని కనుగొనడానికి ఏకంగా 3,50,757 సార్లు నాణెంతో బొమ్మ బొరుసు వేశారు.⇒ డెమోగ్రఫీ విభాగంలో ఇగ్ నోబెల్ ఈసారి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త సాల్ జస్టిన్ న్యూమన్కు దక్కింది. జనన మరణాల రికార్డులను నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోనే ఎక్కువమంది దీర్ఘాయుష్కులు ఉంటున్నట్లు ఆయన ఒక రహస్య పరిశోధన ద్వారా కనుగొన్నాడు.⇒ ఫిజియాలజీ విభాగంలో ఇగ్ నోబెల్ను జపానీస్ శాస్త్రవేత్త ర్యో ఒకాబే నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దక్కించుకుంది. ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వివిధ రకాల స్తన్యజీవులపై పరిశోధనలు జరిపి, స్తన్యజీవులు ఆసనం ద్వారా కూడా శ్వాసక్రియ సాగించగలవని తేల్చారు.మరికొన్ని వెటకారాలుగోల్డెన్ కేలా: అంతర్జాతీయ సినిమా రంగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులకు ఉన్న పేరు ప్రతిష్ఠలు అందరికీ తెలిసిన సంగతే! ఏటా అత్యుత్తమ సినిమాలకు, వాటిలో నటించిన నటీ నటులకు, దర్శకులు సహా ఇతర సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ఇస్తారు. ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే బాలీవుడ్లో అతి చెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో కొన్నేళ్లుగా ‘గోల్డెన్ కేలా’ అవార్డులు ఇస్తున్నారు. ‘ర్యాండమ్ మ్యాగజీన్’ అనే హాస్యపత్రిక ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఈసారి ‘బచ్చన్ పాండే’ చిత్రం అతిచెత్త చిత్రంగా ‘గోల్డెన్ కేలా’ పొందింది. ఈ చిత్ర దర్శకుడు ఫర్హద్ సమ్జీ, ఇందులో నటించిన అక్షయ్ కుమార్, కృతి సనోన్ ‘గోల్డెన్ కేలా’ పొందారు.గోల్డెన్ రాస్బరీ: ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే అతిచెత్త హాలీవుడ్ చిత్రాలకు కొన్నాళ్లుగా ‘గోల్డెన్ రాస్బరీ’ అవార్డులు ఇస్తున్నారు. అమెరికన్ ప్రచారకర్త జాన్ జె.బి. విల్సన్ నెలకొల్పిన ‘గోల్డెన్ రాస్బరీ ఫౌండేషన్’ ద్వారా ఏటా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఈ అవార్డులు తీసుకోవడానికి పలువురు ప్రముఖులు ముఖం చాటేసినా, కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, వీటిని అందుకోవడం విశేషం. ఈ అవార్డును స్వయంగా అందుకున్న వారిలో టామ్ గ్రీన్, సాండ్రా బులక్ వంటి ప్రముఖులు ఉన్నారు.బిగ్ బ్రదర్ అవార్డు: పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. జార్జ్ ఆర్వెల్ నవల ‘1984’లోని ‘బిగ్ బ్రదర్’ పాత్ర స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పారు. గోప్యతకు భంగం కలిగించే అంశాలపై ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు, ఈ అంశాలపై చర్చను రేకెత్తించేందుకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రైవసీ ఇంటర్నేషనల్’ ఈ అవార్డులను ఇస్తోంది. ఆర్వెల్ ‘1984’ నవలకు యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 1999 నుంచి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఫిన్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ‘బిగ్ బ్రదర్’ అవార్డులు ఇస్తున్నాయి.పిగాసస్ అవార్డు: ఇదొక విచిత్రమైన అవార్డు. అతీంద్రియ, మానవాతీత మాయలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. కెనడియన్–అమెరికన్ రచయిత, ఐంద్రజాలికుడు జేమ్స్ రాండీ 1982లో ఈ అవార్డును నెలకొల్పారు. ఇజ్రాయెలీ–బ్రిటిష్ ఐంద్రజాలికుడు యూరీ గెల్లర్ పేరుతో ఈ అవార్డును ‘యూరీ ట్రోఫీ’ అని కూడా అంటారు. ఈ అవార్డు లోగో ‘రెక్కల పంది’ కావడంతో ఇది ‘పిగాసస్’ అవార్డుగా పేరు పొందింది. మానవాతీత మానసిక శక్తులతో అత్యధిక సంఖ్యలో జనాలను మభ్యపెట్టిన వ్యక్తులకు, అతీంద్రియ కథనాలను వాస్తవ కథనాల్లా ప్రచురించే మీడియా సంస్థలకు, అతీంద్రియ అంశాలపై అధ్యయనాల కోసం నిధులు సమకూర్చే సంస్థలకు, ఒక వెర్రిబాగుల అంశాన్ని అతీంద్రియ ప్రభావంగా ప్రకటించే శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ఇస్తారు.ఘంటా అవార్డు: బాలీవుడ్లోని అతిచెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో ఇచ్చే అవార్డు ఇది. బాలీవుడ్ దర్శక నిర్మాత, రచయిత కరణ్ అంశుమాన్, ఆయన మిత్రుడు ప్రశాంత్ రాజ్ఖోవా 2011లో ఈ అవార్డును నెలకొల్పారు. అట్టహాసంగా జరిగే ఈ అవార్డుల కార్యక్రమానికి స్వయంగా హాజరై, అవార్డులు తీసుకోవడానికి చాలామంది ముఖం చాటేస్తారు. అయితే, బాలీవుడ్ హీరోలలో రితేశ్ దేశ్ముఖ్, హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఈ అవార్డుల వేడుకకు హాజరై, స్వయంగా అవార్డులు అందుకోవడం విశేషం.పురస్కారాల చరిత్రపురస్కార సత్కారాల గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్రే ఉంది. ప్రపంచంలో తొలి పురస్కారం ఎవరు పొందారో, దానిని ఎవరు ఇచ్చారో స్పష్టమైన ఆధారాలేవీ చరిత్రలో నమోదు కాలేదు. ఏదో ఒక రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, గొప్ప ఘనత సాధించిన వారికి పురస్కారాలు అందజేసే పద్ధతి శతాబ్దాలుగా ప్రపంచమంతటా ఉంది. ప్రాచీన కాలంలో రోమన్ పాలకులు పురస్కారాలు ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టి ఉంటారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికే రోమన్ పాలకులు తమ పౌరులకు పురస్కారాలను బహూకరించేవారు. సైనిక విజయాలలో కీలక పాత్ర పోషించిన సైనికులకు, సామాజిక పురోగతికి కృషి చేసినవారికి, రాజ్యం పట్ల విధేయత కలిగిన వారికి పురస్కారాలను ప్రకటించి, వారిని బహిరంగ వేదికపై ఘనంగా సత్కరించేవారు. మధ్యయుగాల నాటికి పురస్కార సత్కారాదులు ఆనాటి రాజ్యాలన్నింటికీ వ్యాపించాయి. ఆనాటి యూరోపియన్ రాజ్యాల్లో వివిధ రకాల క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్ల్సిల్ బెల్స్, ఆర్నేట్ కప్పులు, కిప్ కప్పులు వంటివి బహూకరించేవారు. వీటిని బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా క్రీడా పోటీల్లో బహూకరిస్తున్న కప్పులు ఆనాటి కిప్ కప్పుల నమూనానే అనుసరిస్తుండటం విశేషం. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాజ్యంలో కింగ్ హెన్రీ–VIII హయాంలో వివిధ రకాల క్రీడా పోటీలకు ఆదరణ బాగా ఉండేది. కింగ్ హెన్రీ–VIII కాలంలో ఏటా రకరకాల క్రీడల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేసేవారు. ఆ కాలంలో విలువిద్య పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. ఈ పోటీల్లో విజేతలకు ‘స్కార్టన్ సిల్వర్ యారో’ అనే వెండి బాణాన్ని ప్రత్యేకమైన కర్రపెట్టెలో భద్రపరచి బహిరంగ వేదికపై బహూకరించేవారు. క్రీడాకారులతో పాటు కవులను, పండితులను, కళాకారులను కూడా ఆనాటి రాజులు ఘనంగా సత్కరించేవారు. బహుమానాలుగా విలువైన భూములను, భవంతులను, వెండి బంగారాలను ఇచ్చేవారు. కాళ్లకు గండపెండేరాలను, చేతులకు కంకణాలను తొడిగేవారు. వివిధ విద్యలలో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి కనకాభిషేకాలు, గజారోహణలు వంటి సత్కారాలను కూడా ఘనంగా చేసేవారు.ఇలాంటివి మరిన్ని అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాల్లో వెటకారంగా ఇచ్చే ఈ పురస్కారాలను స్వయంగా స్వీకరించే వారి సంఖ్య మాత్రం ఎప్పుడూ తక్కువే! పాత్రికేయ రంగంలో పులిట్జర్ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. తప్పుడు కథనాలతో ఊదరగొట్టే పాత్రికేయులు, మీడియా సంస్థల కోసం కొందరు ఔత్సాహికులు ‘ఫూలిట్జర్ అవార్డు’ నెలకొల్పారు. గందరగోళంగా ఇంగ్లిష్ రాసేవారికి ‘గోల్డెన్ బుల్’ అవార్డు ఇస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థల మీద కోపంతో కొన్నేళ్ల కిందట ‘ఫేక్ న్యూస్ అవార్డు’ నెలకొల్పారు. క్రీడా పోటీల్లో అతిచెత్త ఆటతీరు కనబరచిన క్రీడాకారులకు ‘వుడెన్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. అతీంద్రియ పరిశోధకులకు ‘బెంట్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చెత్త ఆధునిక కళాఖండాలను సృష్టించేవారికి ‘టర్నిప్ ప్రైజ్’ ఇస్తున్నారు. వెటకారంగా ఇచ్చే ఇలాంటి పురస్కారాలు ఇంకా చాలానే ఉన్నాయి. జనాలకు ఇదో రకం వినోదం. -
అర్హులకే పద్మ అవార్డులు వచ్చాయి: బండి సంజయ్
-
ఉగాదికి గద్దర్(సినిమా)అవార్డులు: భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్:ఉగాదికి గద్దర్ (సినిమా) అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఈ మేరకు శనివారం(జనవరి18) సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు,అధికారులకు సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు.అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు చెప్పారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు.గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవార్డుల ప్రదానం జరగలేదన్నారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ఏటా అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ చర్చించింది.గతంలో తెలుగు సినిమా రంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు బహుకరించేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డుల సంప్రదాయం కొనసాగినప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సినిమా రంగానికి అవార్డులివ్వలేదు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత సినిమా రంగానికి తెలంగాణ యుద్ధనౌక గద్దర్ పేరుతో అవార్డులివ్వాలని నిర్ణయించింది. -
‘చేంజ్ మేకర్’ అవార్డుల ప్రధానోత్సవంలో సీనీ తారల సందడి (ఫోటోలు)
-
డిజిటల్ దివా ఆఫ్ ది ఇయర్: ఎవరీ సిండ్రిల్లా
-
‘ఎల్లే గ్రాడ్యుయేట్స్ అవార్డ్స్–2024’ లో మెరిసిన బాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు
-
జాకీర్ హుస్సేన్ అందుకున్న అవార్డ్స్, ఆసక్తికరమైన విషయాలు
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) మరణం ఆయన అభిమానులకు తీరని లోటు అని చెప్పవచ్చు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు మిస్ యూ మ్యూజిక్ లెజండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు జాకీర్ జీవితంలో ప్రత్యేకమైన విషయాల గురించి చర్చించుకుంటూ పోస్ట్లు పెడుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన జాకీర్ హుస్సేన్.. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, ఫ్యూజన్ సంగీత రంగంలో గణనీయమైన కృషి చేశారు. జాజ్, రాక్ వంటి సంగీతంలో నైపుణ్యం సాధించి ఆపై వాటికి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని మిళితం చేయడంలో జాకీర్ హుస్సేన్ ఒక మార్గదర్శకుడిగా నిలిచారు. శక్తి బ్యాండ్లోని జాన్ మెక్లాఫ్లిన్ వంటి కళాకారులతో పాటు అమెరికన్ వాద్యకారుడు మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ కోసం ఆయన పనిచేశారు. ఆ ప్రదర్శనలు అన్నీ సంచలనం రేపాయి. చిత్ర పరిశ్రమలో జాకీర్ హుస్సేన్ పాత్రజాకీర్ హుస్సేన్ అనేక చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చి తనదైన ముద్ర వేశారు. ఆయన సంగీతం అందించిన సాజ్, కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి చిత్రాలకు మంచి ఆదరణ వచ్చింది. ఆపై పలు సినిమాల్లో కూడా నటించారు కూడా. చివరగా మంకీ మ్యాన్ (2024) చిత్రంలో ఆయన కనిపించారు. జాకీర్ హుస్సేన్ సినిమాకి చేసిన కృషి చెరగని ముద్ర వేసింది. తబలాలో అతని నైపుణ్యాన్ని ప్రపంచ చలనచిత్రాలతో మిళితం చేసింది. భారత చిత్ర పరిశ్రమకు జాకీర్ హుస్సేన్ అందించిన గణనీయమైన సహకారం మరువలేనిదని చెప్పవచ్చు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ఆయన ప్రదర్శనలిచ్చారు. ఈ క్రమంలో విమర్శకుల నుంచి కూడా ఆయన ప్రశంసలు అందుకున్నారు.జాకీర్ హుస్సేన్ గురించి ఆసక్తికరమైన విషయాలుజాకీర్ హుస్సేన్ తన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా మార్గదర్శకత్వంలో మూడు సంవత్సరాల వయస్సులోనే తబలా వాయించడం ప్రారంభించారు. ఆపై ఏడేళ్ల వయస్సులోనే తన మొదటి బహిరంగ సంగీత ప్రదర్శన ఇచ్చారు.ఆయన కేవలం 12 సంవత్సరాల వయస్సులో తన మొదటి అంతర్జాతీయ సంగీత కచేరీ పర్యటనను ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించారు.సంగీతంలో రాణించడంతో పాటు, అతను ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.జాకీర్ హుస్సేన్ మిక్కీ హార్ట్తో కలిసి "ప్లానెట్ డ్రమ్" ఆల్బమ్లో తన సహకారానికి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని సాధించిన కొద్దిమంది భారతీయ సంగీతకారులలో ఒకరిగా రికార్డ్ క్రియేట్ చేశారు.భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే కాకుండా.. జాకీర్ జార్జ్ హారిసన్, జాన్ మెక్లాఫ్లిన్ (శక్తి), యో-యో మా వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి.. తూర్పు. పాశ్చాత్య సంగీత సంప్రదాయాల మధ్య అంతరాన్ని తగ్గించారు.జాకీర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో వర్క్షాప్ల ద్వారా తదుపరి తరం తబలా ప్లేయర్లను పెంపొందించడంలో తనవంతుగా పనిచేశారు.అతను భారతదేశంలో 'నేషనల్ ట్రెజర్' బిరుదుతో గౌరవించబడ్డారు. ఆపై భారతీయ సంగీతానికి సాంస్కృతిక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. -
రిహాన్నా నుంచి అమీ జాక్సన్ దాకాముద్దుగుమ్మల సందడి మామూలుగా లేదుగా (ఫోటోలు)
-
అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ మూవీ సత్తా.. అవార్డులు కొల్లగొట్టేసింది!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న. గతేడాది థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. శౌర్యువ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సలార్ పోటీని తట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది.తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. మెక్సికోలో జరిగిన ఐఎఫ్ఏసీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్కోర్, బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సెట్ డిజైన్, బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ ఫీచర్ సౌండ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సౌండ్ విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. కాగా.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ చిత్రంగా హాయ్ నాన్న తెరకెక్కించారు. గతంలో న్యూయార్క్లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్- 2024 ఎడిషన్లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది.కథ విషయానికి వస్తే..ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు.అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! Congratulations to the entire team of #HiNanna 🫶 This film truly deserves all the love it's receiving, nd it's heartwarming to see it being celebrated🥺❤️ pic.twitter.com/oAIJDNSMRX— Vyshuuᴴᴵᵀ ³ (@vyshuuVyshnavi) November 26, 2024 -
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
ఇంతకంటే ఇంకేం కావాలి?.. యశస్వి జైస్వాల్ భావోద్వేగం(ఫొటోలు)
-
ఈ చిత్రం అద్భుతం కదూ..!
సూర్యచంద్రులను ఏకకాలంలో మోస్తూ.. తాడుపై బ్యాలెన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రం అద్భుతం కదూ.. అమెరికాలోని యూటా రాష్ట్రంలో సూర్యగ్రహణం సమయంలో బెల్వా హేడెన్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రం నేచర్స్ బెస్ట్ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో అవుట్డోర్ అడ్వెంచర్ కేటగిరీలో మొదటి బహుమతిని గెలుచుకుంది. -
తెలంగాణ పోలీస్కు కేంద్ర పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పనితీరు కనబర్చిన తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటించే ‘కేంద్ర హోంమంత్రి దక్షత పథక్’ అవార్డుకు రెండు విభాగాల్లో కలిపి మొత్తం 26 మంది తెలంగాణ పోలీసు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు, భద్రతా సంస్థ, ఇంటెలిజెన్స్ విభాగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), అసోం రైఫిల్స్తోపాటు నేర దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన ఫోరెన్సిక్ సైన్స్ సిబ్బందికి ఈ అవార్డులు ఇస్తున్నారు.2024కు గాను మొత్తం 463 మంది సిబ్బంది అవార్డులకు ఎంపికైనట్టు కేంద్ర హోంశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ నుంచి స్పెషల్ ఆపరేషన్ ఫీల్డ్ విభాగంలో ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ భాస్కరన్. ఆర్, ఇన్స్పెక్టర్లు భీసం హరిప్రసాద్, కాంపల్లి శ్రీనివాస్, చీగూరి సుదర్శన్రెడ్డి, గ్రూప్ కమాండర్ జాజాల రాఘవేంద్రరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు చారి రాంబాబు, డొంకల రాంబాబు, సోము గౌతంరెడ్డి, పొన్న సంతోష్కుమార్, దుండిగల్ల రాజేశ్, ఏఆర్ఎస్సై మహ్మద్ ముజీబ్, హెడ్కానిస్టేబుళ్లు దేవులపల్లి మోహన్రెడ్డి, పండరి రవీందర్, సీనియర్ కమాండోలు తిప్పని రాకేశ్, ఉడుతనూరి మల్లేశ్, కానిస్టేబుళ్లు కడారి హరిబాబు, అంగీల జిడియో డార్లింగ్ మార్కస్, డి.రామచంద్రారెడ్డి, మదారి నాగరాజు, పట్లావత్ రాజేందర్, కేసరి శ్రీకాంత్æ గౌడ్, జూనియర్ కమాండో గంటా సాయి కుమార్ ఉన్నారు. అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఐపీఎస్ అధికారి సంగ్రామ్సింగ్ పాటిల్, ఏసీపీ శ్రీధర్రెడ్డి పులిమామిడి, డీఎస్పీ సత్యనారాయణ దీపు, ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి మామిళ్ల ఉన్నారు. -
బుల్లితెర అవార్డుల పండుగ.. ఛీఫ్ గెస్ట్ ఎవరంటే?
స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేడుక బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో స్టార్ మా సీరియల్స్కు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అందించే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం ఇవాళ బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనుంది.ఈ గ్రాండ్ అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరావు శతజయంతి పురస్కరించుకొని టీవీ నటులు, అక్కినేనిని గుర్తు చేస్తూ చేసిన మెడ్లీ ఈ కార్యక్రమంలో హైలైట్గా నిలువనుంది. ఈ వేడుకలో బుల్లితెర నటీనటుల సందడి స్టార్ మా పరివార్ అవార్డ్స్లో చూసేయండి. -
ఉత్తమ పరిశోధనలకు ఉన్నత పురస్కారాలు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించి, నాణ్యతను పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి అవార్డులను ప్రవేశపెడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పీహెచ్డీ పరిశోధనలు అందించిన వారిని ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో సత్కరించనుంది. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాల్లో భాగంగా ఏటా వివిధ విభాగాల్లో అత్యుత్తమమైన పది పీహెచ్డీ థీసిస్లకు ఈ అవార్డు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రాల దగ్గర నుంచి వైద్య శాస్త్రాలతో సహా ఐదు విభాగాల్లో రెండు చొప్పున ఉత్తమ థీసిస్లకు సైటేషన్ అవార్డులు ప్రదానం చేస్తారు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం యూజీసీ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.ఏటా సెప్టెంబర్ 5న ప్రదానంప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కాన్వకేషన్ ద్వారా పీహెచ్డీలు పొందిన రీసెర్చ్ స్కాలర్లు తదుపరి ఏడాదిలో ‘సైటేషన్’ అవార్డుకు అర్హులుగా పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల నుంచి పీహెచ్డీలు పొందిన వారు వర్సిటీల ద్వారా నామినేట్ అవ్వొచ్చు. ఇందుకోసం ప్రతి విశ్వవిద్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఏటా ఐదు థీసిస్లను నామినేట్ చేస్తుంది. ఏటా జనవరి నుంచి మార్చి 31 వరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా వర్సిటీల నుంచి నామినేషన్లు యూజీసీ స్వీకరిస్తుంది. ఆగస్టు 1న విజేతలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో విజేతలను యూజీసీ సత్కరిస్తుంది.యూజీసీ అధ్యయనం ప్రకారం దేశంలో పీహెచ్డీలో ప్రవేశాలు భారీగా పెరుగుతున్నాయి. 2010–11లో దేశవ్యాప్తంగా 77,798 పీహెచ్డీ ప్రవేశాలు నమోదవగా, 2017–18లో ఈ సంఖ్య 1,61,412కు పెరిగింది. ఏటా సగటున 10 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది.కొత్త ఆవిష్కరణలు అవసరంకొత్త ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి చాలా అవసరం. ఉన్నత విద్యా సంస్థలు కొత్త విజ్ఞానాన్ని సమాజానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది డాక్టోరల్ డిగ్రీల నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. భారతీయ విశ్వవిద్యాలయాలలో మంచి నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించే ప్రయత్నంలో యూజీసీ ఏటా ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం కోసం మార్గదర్శకాలను విడుదల చేశాం. – మామిడాల జగదీశ్ కుమార్, యూజీసీ చైర్మన్ -
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో భారత హాకీ స్టార్లు
భారత దిగ్గజం, మాజీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) స్టార్స్ అవార్డుల రేసులో నిలిచారు. ఎఫ్ఐహెచ్ విడుదల చేసిన తుది జాబితాలో భారత పురుషుల జట్టు నుంచి వీరిద్దరిరు మాత్రమే నామినేట్ అయ్యారు. ఇక మహిళల జట్టులో ఏ ఒక్కరు రేసులో నిలువలేకపోయారు. ఎవరు ఏ కేటగిరీలో అంటే?కాగా.. ఇటీవల ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో భారత జట్టు కాంస్యం గెలవడంలో కెప్టెన్ హర్మన్తో పాటు గోల్కీపర్ శ్రీజేశ్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కేటగిరీలో హర్మన్ప్రీత్తో పాటు బ్రింక్మన్, జోప్ డి మోల్ (నెదర్లాండ్స్), ముల్లర్ (జర్మనీ), వాలెస్ (ఇంగ్లండ్) నామినేట్య్యాడు.ఇక.. ‘బెస్ట్ గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం పీఆర్ శ్రీజేశ్, పిర్మన్ బ్లాక్ (నెదర్లాండ్స్), కాల్జడో (స్పెయిన్), డేన్బర్గ్ (జర్మనీ), శాంటియగో (అర్జెంటీనా) పోటీపడుతున్నారు. ఎఫ్ఐహెచ్ నియమించిన నిపుణుల ప్యానెల్ వీరిని తుది జాబితాకు ఎంపిక చేసింది. ఈ ప్యానెల్లో పలువురు ప్లేయర్లు, కోచ్లు, వివిధ దేశాలకు చెందిన సమాఖ్యల్లోని సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. విజేతల్ని ఎంపిక చేస్తారిలా!ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్, నేషన్స్ కప్ హాకీ, ఒలింపిక్ క్వాలిఫయర్స్, ఒలింపిక్స్లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా నిపుణుల ప్యానెల్... ఆటగాళ్లను అవార్డుల కోసం నామినేట్ చేసింది. ఇక వచ్చే నెల 11 వరకు జరిగే ఓటింగ్లో పోల్ అయిన ఓట్ల శాతంతో విజేతల్ని ప్రకటిస్తారు. కాగా ప్యారిస్లో భారత్ కాంస్యం గెలిచిన తర్వాత శ్రీజేశ్ తన అంతర్జాతీయ కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. హర్మన్ప్రీత్ తాజాగా ఆసియా చాంపియన్స్లో భారత్కు టైటిల్ అందించిన జోష్లో ఉన్నాడు.చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా -
Filmfare Awards South 2024: ఫిలిం ఫేర్ అవార్డుల ఈవెంట్లో తళుక్కుమన్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఒకవైపు యాక్టింగ్.. మరోవైపు హోస్టింగ్.. గ్లోబల్ స్థాయికి రానా క్రేజ్!
రానా.. సీనీ ప్రియులకు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనదైన నటనతో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో, విలన్ అనేకాదు పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాడు. కథలో కొత్తదనం ఉంటేనే అంగీకరిస్తాడు. అందుకే నేటితరం నటుల్లో రానాకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను సైతం గెలుచుకున్నాయి.ఈ మధ్యకాలంలో అత్యధిక అవార్డులు అందుకున్న హీరో రానా అని చెప్పొచ్చు. ఆయన నటించి తొలి వెబ్ సిరీస్ ‘రానానాయుడు’కి ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి. తాజాగా ఇందులో నటనకు గాను ఉత్తమ నటుడిగా రానా అవార్డును పొందారు. ‘స్ట్రీమింగ్ అకాడమీ అవార్డు’లో ఆయన ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ‘ఇండియన్ టెలీ అవార్డు 2024’లోనూ రానాకి ఉత్తమ నటుడు(రానా నాయుడు) అవార్డు లభించింది. అలాగే 68వ ఫిల్మ్ఫేర్ అవార్డుల్లోనూ ఉత్తమ సహాయక నటుడు(భీమ్లానాయక్) అవార్డు రానాను వరించింది.హోస్ట్గానూ..రానా కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు.అప్పడప్పుడు బుల్లితెరపై కూడా మెరుస్తుంటాడు. ఆయన హోస్ట్గాను పలు టీవీ, ఓటీటీ షోలు చేశాడు. అలాగే పలు ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి..తనదైన మాటలతో రక్తి కట్టించాడు. ఇక ఇప్పుడు అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ' ఐఫా అవార్డ్స్2024'కి రానా హోస్ట్గా చేయబోతున్నాడు. యూ ఏ ఈ అబుదాభి లోని యస్ ద్వీపం వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో జరిగే ‘ఐఫా అవార్డ్స్2024'ప్రధానోత్సవక కార్యక్రమానికి యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి రానా హోస్ట్గా చేయబోతున్నాడు. అలాగే ఓ టాక్ షో కూడా ప్లాన్ చేశాడు. తన స్నేహితులు, సినీ ప్రముఖులతో కలిసి రానా టాక్ షో చేయబోతున్నాడు. ఇది ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.నిర్మాతగానూ..ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు రానా. తనకు నచ్చిన సినిమాలను నిర్మించడంతో పాటు కొన్నింటికి సమర్పకుడిగా వ్యవహరిస్తుంటాడు. కేరాఫ్ కంచరపాలెం, గార్గి, చార్లీ 777, పరేషాన్, కృష్ణ అండ్ హీస్ లీల లాంటి చిన్న సినిమాలను తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి పెద్ద విజయం అందించాడు. ఆయన నిర్మించిన ‘35-చిన్న కథ కాదు’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. -
సైమా అవార్డ్స్ 2024.
-
రిలీజ్కు ముందే అవార్డుల పంట.. ఆ సినిమా అరుదైన ఘనత!
కని కస్రుతి, ప్రీతి పాణిగ్రాహి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గర్ల్స్ విల్ బి గర్ల్స్'. ఈ చిత్రానికి సుచి తలాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ (IFFLA)లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెలుచుకుంది. రిచా, చద్దా అలీల నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా ఇప్పటికే రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాన్స్లోని బియారిట్జ్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్లను గెలుచుకుంది. అంతే కాకుండా సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకుంది. తమ చిత్రం పెద్ద విజయం సాధించడం పట్ల రిచా చద్దా ఆనందం వ్యక్తం చేశారు.రిచా మాట్లాడుతూ.. " మా చిత్రం గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ గెలవడం ఒక అపురూపమైన గౌరవం. మా టీమ్ మొత్తం కృషి, అంకితభావాన్ని గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. 'గర్ల్స్ విల్ బి గర్ల్స్' అనేది మన హృదయాలకు దగ్గరైన కథ. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. -
ఘనంగా ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమం (ఫోటోలు)