Yashasvi Jaiswal
-
IPL 2025: రియాన్ పరాగ్ విధ్వంసకర శతకం.. 16 ఫోర్లు, 10 సిక్సర్లతో..!
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగుల బ్యాటింగ్ ఊచకోత మొదలైంది. నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ముగ్గురు రాయల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. స్టార్ బాయ్ రియాన్ పరాగ్, వికెట్కీపర్ బ్యాటర్ దృవ్ జురెల్ విధ్వంసకర సెంచరీలతో విరుచుకుపడగా.. యువ సంచలనం యశస్వి జైస్వాల్ మెరుపు అర్ద శతకంతో బీభత్సం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ రెండు గ్రూప్లుగా విడిపోయి ఆడిన మ్యాచ్లో తొలుత రియాన్ పరాగ్ శతకొట్టాడు. రియాన్ 64 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం జురెల్ 44 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆతర్వాత జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ముగ్గురిలో రియాన్ పరాగ్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. 144* (64) - What a Riyan yaar 🔥💗 pic.twitter.com/K6Ht3wRFQE— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2025రియాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రియాన్ తన వీర బాదుడును ముగించుకుని పెవిలియన్కు వెళ్తుండగా సహచరులు సంజూ, జైస్వాల్, జురెల్ ప్రశంసలతో ముంచెత్తారు. సంజూ 'వెల్ డన్ మచ్చా..నైస్ హిట్టింగ్' అనగా.. జైస్వాల్, జురెల్ 'వాట్ ఎ రియాన్' అంటూ అభినందించారు. సహచరులు రియాన్ను అభినందిస్తున్న వీడియో రాయల్స్ తమ సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా అన్ని జట్లు ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్తో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తమ ప్రయాణాన్ని మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో ప్రారంభిస్తుంది. ఈ సీజన్లో రాయల్స్, సన్రైజర్స్ జట్లు బ్యాటింగ్ విస్పోటాలు కలిగి ఉన్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. బౌలర్లను ఊచకోత కోయడంలో ఈ ఇరు జట్ల మధ్య పోటీ పెడితే ఎవరు గెలుస్తారో చెప్పలేం.సన్రైజర్స్లో ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ లాంటి విధ్వంసకర యోధులు ఉండగా.. రాయల్స్లో రియాన్ పరాగ్, దృవ్ జురెల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, హెట్మైర్ లాంటి చిచ్చరపిడుగులు ఉన్నారు.సన్రైజర్స్ హైదరాబాద్..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్మైర్, రియాన్ పరాగ్, యుద్ద్వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
IPL 2025: రాయల్స్ మునుపటి వైభవం సాధిస్తుందా?
మొట్ట మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ గెలుచుకున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియా స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ (Shane Warne) నాయకత్వంలో 2008లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2022లో రన్నర్ అప్ గా నిలవడంతో పాటు.. మొత్తంగా ఆరుసార్లు ప్లేఆఫ్లకు చేరుకుంది. రాయల్స్ కెప్టెన్గా టీమిండియా వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (Sanju Samson) కొనసాగుతున్నాడు. 2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని రూ.18 కోట్ల భారీ ధరకు రెటైన్ చేసుకుంది.భారత్ క్రికెట్ లో అపార నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల లో ఒకడిగా 30 ఏళ్ళ ఈ కేరళ వికెట్ కీపర్ ఖ్యాతి వహించాడు. సామ్సన్ నాయకత్వం, సామర్థ్యాలపై ఉన్న అపార విశ్వాసాన్ని రాయల్స్ పునరుద్ఘాటించింది. సీజన్లోని మొదటి మ్యాచ్ నుంచే అతను పూర్తిగా ఫిట్గా, అందుబాటులో ఉండాలని ఫ్రాంచైజీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీల్ రెండో రోజున (మార్చి 23న) హైదరాబాద్ వేదిక గా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ తో రాయల్స్ ఈ సీజన్ లో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.గాయం నుంచి కోలుకున్న సామ్సన్ ఇంగ్లండ్తో జరిగిన ఐదో టి20 మ్యాచ్ సందర్భంగా సామ్సన్ కుడి చూపుడు వేలు కి గాయమైంది. కొన్ని రోజుల తర్వాత అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది, రెండు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న సామ్సన్ మళ్ళీ కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతను ఇంకా జట్టు శిక్షణ శిబిరంలో చేరలేదు. సంజు సామ్సన్ పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే సామ్సన్ బ్యాటింగ్ ఫిట్నెస్ పరీక్షలో విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, వికెట్ కీపింగ్ విధులను తిరిగి ప్రారంభించడానికి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. అయితే రాయల్స్ జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నందున వికెట్ కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగించే అవకాశముంది. బౌలింగ్ లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం తో రాయల్స్ కొత్త ఉత్సాహం తో ఉంది. గత సంవత్సరం చివరి దశలో తడబడిన తర్వాత, మెగా వేలంలో రాయల్స్ తమ జట్టును స్మార్ట్ కొనుగోళ్ల ద్వారా పునర్నిర్మించింది.ప్రధాన కోచ్ గా చేరిన రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంతో రాయల్స్ విధానంలో మార్పు కనిపిస్తోంది. మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ఖచ్చితత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. సామ్సన్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మైర్, రియాన్ పరాగ్, మరియు ధ్రువ్ జురెల్ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నందున బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ బలోపేతం చేయడానికి రాయల్స్ జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణాతో సహా వేలంలో కీలకమైన చేర్పులను చేసింది.రాయల్స్ జట్టులో వ్యూహాత్మక మార్పులు రాయల్స్ 2025 సీజన్ కోసం జట్టులో వ్యూహాత్మక మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్లను వదులుకోవడం వారి జట్టు యొక్క ప్రధాన వ్యూహంలో మార్పును సూచిస్తుంది. జోఫ్రా ఆర్చర్ను కొనుగోలు చేయడంతో బౌలింగ్ కి గణనీయమైన పదును లభించింది. ఇంకా ఫజల్హాక్ ఫరూఖీ , తుషార్ దేశ్పాండే లతో పాటు స్పిన్ విభాగంలో వానిందు హసరంగా, మహేష్ తీక్షణ ఉన్నందున మిడిల్ ఓవర్ల లలో వైవిధ్యం, పొదుపుగా బౌలింగ్ చేసే అవకాశముంది. నితీష్ రాణా చేరికతో బ్యాటింగ్ యూనిట్ బలోపేతమయ్యింది. కోల్కతా నైట్ రైడర్స్ తరపున నిలకడగా రాణించిన రాణా బ్యాటింగ్ ని బలోపేతం చేస్తాడనడంలో సందేహం లేదు. ఇంకా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కొనుగోలు ఫ్రాంఛైజీ దీర్ఘకాలిక దృక్పథాన్ని నొక్కి చెబుతుంది.రాయల్స్ ప్రధాన ఆటగాళ్లు:సంజు సామ్సన్కెప్టెన్గా, అత్యంత నమ్మకమైన బ్యాటర్గా, సామ్సన్ ముందు నుండి నాయకత్వం వహించే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఈ సీజన్లో జోస్ బట్లర్ లేనందున సామ్సన్ పై బాధ్యత మరింత పెరిగే అవకాశముంది. జట్టుకి స్థిరత్వాన్నివ్వడం, క్లిష్టమైన సమయాల్లో ఆదుకోవడం ఇప్పుడు సామ్సన్ పైనే ఉంటుంది.యశస్వి జైస్వాల్అపార నైపుణ్యం ఉన్న యువ బ్యాటర్ జైస్వాల్ ఇటీవలి ఫామ్ అంత నిలకడగా లేనందున, భారత పరిమిత ఓవర్ల జట్టులోకి మళ్ళీ రావడానికి ఐపీఎల్ అతనికి మరో అవకాశం కల్పిస్తోంది.నితీష్ రాణాకోల్కతా నైట్ రైడర్స్ నుండి రాయల్స్ కి మారడం రాణా ఐపీఎల్ కెరీర్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ అతని బహుముఖ ప్రజ్ఞ రాజస్థాన్కు గట్టి బలాన్నిస్తోంది.జోఫ్రా ఆర్చర్గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్ తిరిగి రావడంతో రాజస్థాన్ బౌలింగ్ కు మళ్ళీ పదును చేకూరింది. వ్యక్తిగతంగా సంవత్సరాల గాయాల వైఫల్యాల తర్వాత, ఐపీఎల్ 2025 ఇంగ్లాండ్ పేసర్కు తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు అవకాశాన్ని కల్పిస్తుండంలో సందేహం లేదు.రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టుసంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్పాండే, శుభమ్ దూబే, ఎఫ్ యుధ్వీర్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.చదవండి: టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఓపెనర్కు గాయం
రంజీట్రోఫీ 2024-25 సీజన్లో విదర్భతో సెమీఫైనల్కు ముందు ముంబై క్రికెట్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గాయం కారణంగా సెమీస్కు దూరమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. జైశ్వాల్ ఎడమ కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ప్రాక్టీస్ సమయంలో తన కాలి చీలమండలో నొప్పి వచ్చినట్లు జైశ్వాల్ టీమ్ మెనెజ్మెంట్కు తెలియజేసినట్లు సమచారం. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు తన గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి జైశ్వాల్ను బీసీసీఐ రిలీజ్ చేయడంతో.. అతడిని ముంబై క్రికెట్ అసోషియేషన్ విధర్బతో సెమీస్కు ఎంపిక చేసింది. అంతలోనే గాయం కారణంగా జైశూ జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్ బై జాబితాలో మాత్రం జైశ్వాల్ ఉన్నాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని మరోక క్రికెటర్తో బీసీసీఐ భర్తీ చేయనుంది. అయితే జైశ్వాల్ గాయపడడంతో ఈ ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు బ్యాకప్ ఓపెనర్ లేకుండానే ఆడనుంది. ఒకవేళ రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ గాయపడితే బీసీసీఐ ఎవరిని జట్టులోకి తీసుకుంటుందో చూడాలి.కాగా జైశ్వాల్ గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇక ముంబై-విదర్భ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ నాగ్పూర్ వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. యశస్వీ దూరం కావడంతో ముంబై ఇన్నింగ్స్ను ఆయుష్ మాత్రే, ఆకాష్ ఆనంద్ ఆరంభించనున్నారు.జైశ్వాల్కు ఫస్ట్ క్లాస్క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో ఈ ముంబైకర్ 5 సెంచరీలతో సహా 3712 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత జట్టులోకి యశస్వి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు భారత టెస్టు జట్టులో జైశ్వాల్ రెగ్యూలర్ ఓపెనర్గా కొనసాగుతున్నాడు.చదవండి: WPL 2025: గెలుపు జోష్లో ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్.. -
రంజీ సెమీఫైనల్ పోరుకు యశస్వి జైస్వాల్
ముంబై: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల ఇంగ్లండ్పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్కు చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టులో చోటు దక్కలేదు. ప్రాథమిక జట్టులో జైస్వాల్ను ఎంపిక చేసినా... అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం 15 మందితో కూడిన జట్టు నుంచి అతడిని తప్పించారు.ప్రస్తుతానికి జైస్వాల్తో పాటు పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లుగా ఉన్నారు. అత్యవసమైతేనే వీరు దుబాయ్కు వెళ్లనున్నారు. దీంతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్ కోసం జైస్వాల్ ముంబై సెలెక్టర్లు ఎంపిక చేశారు. విదర్భతో ఈనెల 17 నుంచి జరగనున్న సెమీఫైనల్ పోరులో యశస్వి, సూర్యకుమార్, శివమ్ దూబే, అజింక్య రహానే, శార్దుల్ ఠాకూర్ వంటి భారత ఆటగాళ్లు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సీజన్లో జమ్మూకశ్మీర్తో ఆడిన ఏకైక రంజీ మ్యాచ్లో జైస్వాల్ ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగినా... భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోయాడు. గతేడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భను చిత్తు చేసిన ముంబై జట్టు 42వసారి టైటిల్ చేజిక్కించుకుంది. ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్ ), ఆయుశ్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భక్తల్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, సిద్ధేశ్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్, హార్దిక్ తమోర్, సూర్యాన్ష్ షెడ్గే, శార్దుల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్, మోహిత్ అవస్థి, సెల్వెస్టర్ డిసౌజ, రోస్టన్ డియాస్, అథర్వ అంకొలేకర్, హర్ష్ తన్నా. -
ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు? ఇదేం పద్ధతి?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ఖరారు చేసింది. ప్రాథమిక జట్టులో రెండు మార్పులు చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)ను తప్పించిన యాజమాన్యం.. జట్టులో కొత్తగా ఇద్దరు బౌలర్లకు చోటిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) బీసీసీఐ సెలక్టర్ల తీరును విమర్శించాడు. జైస్వాల్పై వేటు వేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈ మాజీ ఓపెనర్.. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ను పక్కనపెట్టడాన్నీ తప్పుబట్టాడు.యశస్వి జైస్వాల్పై వేటుకాగా జనవరి 18న బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యశస్వి జైస్వాల్తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా ఉన్నాయి. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ఖరారు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆయా బోర్డులకు ఫిబ్రవరి 12 వరకు గడువు ఇవ్వగా.. మంగళవారం రాత్రి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.యశస్వి జైస్వాల్పై వేటు వేయడంతో పాటు బుమ్రా ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలిపింది. వీరి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ప్రధాన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా భారత జట్టు గురించి ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆఖరికి అతడికి జట్టులోనే స్థానమే లేకుండా చేశారుఈ మేరకు.. ‘‘బుమ్రా గైర్హాజరీ కారణంగా సెలక్టర్లు సిరాజ్ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా. అలా అయితే నలుగురు పేసర్లు జట్టులో ఉండేవారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తుదిజట్టులో యశస్విని ఆడించేందుకు శ్రేయస్ అయ్యర్నే పక్కనపెట్టాలని చూసిన యాజమాన్యం ఇప్పుడు కనీసం అతడికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కూడా కల్పించకపోవడం గమనార్హం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే టెస్టుల్లో, టీ20లలో ఓపెనర్గా తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్.. ఇటీవల ఇంగ్లండ్తో స్వదేశంలో తొలి మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు భారత ఇన్నింగ్స్ ఆరంభించగా.. వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో వచ్చాడు.ఇక మోకాలి గాయం వల్ల భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరం కాగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ధనాధన్ ఇన్నింగ్స్(36 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కోహ్లి గాయం కారణంగానేఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కోహ్లి గాయం కారణంగానే తనకు తుదిజట్టులో చోటు దక్కిందని.. లేదంటే ఈ మ్యాచ్లో తాను భాగమయ్యేవాడినే కాదని తెలిపాడు. అంటే.. జైస్వాల్ను ఆడించే క్రమంలో అయ్యర్ను తప్పించేందుకు కూడా మేనేజ్మెంట్ వెనుకాడలేదని తేలింది. అయితే, తాజాగా జైసూను చాంపియన్స్ ట్రోఫీ ప్రధాన జట్టు నుంచి తీసేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. అరంగేట్ర వన్డేలో జైస్వాల్ విఫలమయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంగ్లండ్తో సిరీస్ల సందర్భంగా సత్తా చాటిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: Chris Gayle: అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే -
ఇంగ్లండ్తో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! కింగ్, సింగ్ ఎంట్రీ?
కటక్ వేదికగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. ఈ మ్యాచ్లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కటక్ వన్డేలో ఎలాగైనా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది.మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని యోచిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్లే గెలిచి మరో 25 మ్యాచ్ల్లో ఓటమిచవిచూసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.కింగ్ ఇన్.. జైశ్వాల్ ఔట్!మోకాలి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని భారత జట్టు వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం ధ్రువీకరించాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.కటక్ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేసిన జైశ్వాల్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. దీంతో అతడిని పక్కన పెట్టి యథావిధిగా గిల్ను ఓపెనర్గా పంపాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. గిల్ స్దానంలో కోహ్లి బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది.మరోవైపు ఈ మ్యాచ్లో యువపేసర్ అర్ష్దీప్ సింగ్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దం చేసేందుకు అర్ష్దీప్ను ఈ మ్యాచ్లో ఆడించాలని మెనెజ్మెంట్ నిర్ణయించందంట. దీంతో మరో యువ పేసర్ హర్షిత్ రాణా బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.కటక్ వన్డేతో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. కానీ పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ను ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తే కేఎల్ రాహుల్ బెంచ్కే పరిమితం కానున్నాడు.రోహిత్ ఫామ్లోకి వస్తాడా?కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ అభిమానులను అందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్తో సిరీస్లో కూడా కూడా అదేతీరును కనబరుస్తున్నాడు. తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హిట్మ్యాన్ ఔటయ్యాడు.ఈ క్రమంలో రోహిత్కు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడని, అతడి ఫామ్పై మాకు ఎటువంటి ఆందోళన లేదని కోటక్ అన్నారు. అదేవిధంగా ఈ సిరీస్ కంటే ముందు శ్రీలంకపై వన్డేల్లో రోహిత్ మెరుగ్గా రాణించాడని, తిరిగి తన ఫామ్ను అందుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ),శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్, బెన్ డకెట్, లివింగ్స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... -
కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్కే వేటు
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు ముందు నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కోహ్లి కూడి కాలి మోకాలికి గాయమైంది.దీంతో నాగ్పూర్ వన్డేకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే కోహ్లి ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 8న కటక్ వేదికగా జరగనున్న రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లి కుడి కాలి మోకాలికి బంతి తాకింది. అయినప్పటికి అతడు తన ప్రాక్టీస్ను కొనసాగించాడు. ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ శిక్షణ తర్వాత హూటల్కు వెళ్లాక అతడి మోకాలిలో వాపు కన్పించింది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతిని ఇచ్చాము. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడు కటక్ వన్డేలో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.అదేవిధంగా కోహ్లి గాయంపై టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం అప్డేట్ ఇచ్చాడు. "విరాట్ భాయ్ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మా తర్వాతి గేమ్కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" తొలి వన్డే అనంతరం గిల్ పేర్కొన్నాడు.జైశ్వాల్పై వేటు..ఇక విరాట్ కోహ్లి రెండో వన్డేకు అందుబాటులోకి వస్తే యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్పై వేటు పడే అవకాశముంది. నాగ్పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశూ.. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని పక్కన పెట్టి శుబ్మన్ గిల్ను యథావిధిగా ఓపెనర్గా పంపాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది.సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లి..ఇక ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లికి ఓ ప్రపంచరికార్డు ఊరిస్తోంది. కటక్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్లో పాకిస్తాన్పై ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్కు మైండ్ బ్లాంక్! వీడియో
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) సంచలన క్యాచ్తో మెరిశాడు. జైశూ అద్బుతమైన క్యాచ్తో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ను పెవిలియన్కు పంపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హర్షిత్ రాణా.. మూడో బంతిని బెన్ డకెట్కు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డకెట్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ మిస్టైమ్ కావడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్లో ఉన్న జైశ్వాల్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇక జైశ్వాల్ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ బిత్తర పోయారు.వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జైశ్వాల్తో పాటు హర్షిత్ రాణా వన్డేల్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి కూడి మోకాలికి గాయమైంది.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్చదవండి: IND vs ENG1st Odi: ఇంగ్లండ్తో తొలి వన్డే.. భారత్కు భారీ షాక్YASHASVI JAISWAL TAKES A BLINDER ON DEBUT. 🤯- Harshit Rana has 2 early wickets. pic.twitter.com/GxnVvxDOta— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2025 -
Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రం
టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్(India vs England) టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య నాగ్పూర్లో గురువారం మ్యాచ్ మొదలైంది. అయితే, దురదృష్టవశాత్తూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రంటాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ విషయాన్ని వెల్లడించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్తో తొలి వన్డేతో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యువ పేసర్ హర్షిత్ రాణా యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించాడు.‘‘టాస్ ఓడినా మరేం పర్లేదు. మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. బంతితో, బ్యాట్తో దూకుడుగానే రాణించాలని కోరుకుంటున్నాం. ఇదొక సరికొత్త ఆరంభం. చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం.జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మోకాలి సమస్య వల్ల కోహ్లి ఆడలేకపోతున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. ఇప్పటికే టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకున్న జైసూ.. తాజాగా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. మరోవైపు.. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల ఇంగ్లండ్తో నాలుగో టీ20 సందర్భంగా.. శివం దూబేకు కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. జో రూట్కు స్వాగతంమరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సరికొత్త ఉత్సాహంతో వన్డే బరిలో దిగుతున్నామని.. జో రూట్కు తిరిగి జట్టులోకి స్వాగతం పలికాడు. ఇక తాము ప్రస్తుతం పటిష్ట జట్టుతో తలపడుతున్నామన్న బట్లర్.. హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రతి విషయంలోనూ తమను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తాము ముగ్గురు పేసర్లతో పాటు ఒక అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను కూడా ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడే నిమిత్తం ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సూర్యకుమార్ సేన 4-1తో జయభేరి మోగించింది. అనంతరం గురువారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్కు తెరలేచింది.భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.భారత్తో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: హార్దిక్ పాండ్యా లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్కప్ ఆడాం: రోహిత్ శర్మ -
మా మధ్య అలాంటి పోటీ లేనేలేదు.. రోహిత్ భయ్యా మాత్రం: గిల్
జట్టు విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని తాను అభినందిస్తానని టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) అన్నాడు. తనకు ఎవరిపట్లా ద్వేషభావన లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడేటపుడు ఆటగాళ్లంతా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారని.. తాను కూడా అంతేనని పేర్కొన్నాడు.కాగా వన్డే, టీ20, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా ఒకప్పుడు శుబ్మన్ గిల్కు ప్రాధాన్యం దక్కిన విషయం తెలిసిందే. అయితే, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రాకతో టెస్టుల్లో ఓపెనర్గా గిల్ స్థానం గల్లంతైంది. ఇక అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన తర్వాత.. కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ కొత్త ఓపెనింగ్ జోడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.టీ20లలో కొత్త జోడీకేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్తో పాటు పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ టీ20లలో భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలతో సంజూ.. ఇంగ్లండ్తో స్వదేశంలో తాజా సిరీస్లో అద్భుత ప్రదర్శనతో అభిషేక్ ఓపెనర్లుగా తమ స్థానాలను పటిష్టం చేసుకున్నారు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో సంజూ విఫలమైనా అతడికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగానే ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. అభిషేక్ ఈ సిరీస్లో రికార్డు శతకం(54 బంతుల్లో 135)తో సత్తా చాటి ఓపెనర్గా పాతుకుపోయేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.‘టాక్సిక్’ కాంపిటిషన్?ఈ నేపథ్యంలో ఓపెనింగ్ స్థానం విషయంలో శుబ్మన్ గిల్కు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ పోటీగా తయారయ్యారని.. దీంతో అతడు ఇబ్బందులు పడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మంగళవారం మీడియా గిల్ను ప్రశ్నించగా.. హుందాగా స్పందించాడు.‘‘అభిషేక్ నాకు చిన్ననాటి నుంచే స్నేహితుడు. అదే విధంగా జైస్వాల్ కూడా నాకు ఫ్రెండే. మా మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని నేను అనుకోను. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు తాను గొప్పగా రాణించాలని కోరుకుంటాడు.అతడు బాగా ఆడకూడదనుకోనుప్రతి మ్యాచ్లోనూ అద్బుతంగా ఆడాలనే అనుకుంటాడు. అంతేకానీ.. ‘అతడు బాగా ఆడకూడదు. అలాగైతేనే నేను బాగుంటాను’ అనుకునే వాళ్లు ఎవరూ ఉండరు. జట్టు కోసం ఎవరైతే కష్టపడి ఆడి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటారో వారిని తప్పక అభినందించాలి’’ అని శుబ్మన్ గిల్ సమాధానం ఇచ్చాడు.ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వన్డేల్లో గత ఏడాదిన్నర కాలంగా రోహిత్ భాయ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మాకు అదొక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఇక ముందు కూడా అదే జోరును కొనసాగిస్తాడు’’ అని శుబ్మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో గిల్తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ.. జట్టు ఫైనల్ చేరడంలో కీలకప్రాత పోషించాడు. అంతేకాదు.. శ్రీలంకతో గతేడాది వన్డే సిరీస్లోనూ రెండు అర్ధ శతకాలు బాదాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 6) నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇందులో రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగనున్నారు.చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్సిగ్నల్! -
‘ఇగో’ చూపించాలనుకుంటే జట్టులో చోటుండదు: సంజూకు వార్నింగ్
టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson) ఆట తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్(Krishnamachari Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ ‘ఇగో’ చూపించాలనుకుంటే మాత్రం జట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఇకముందైనా షాట్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని సూచించాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో రెండు టీ20 శతకాలతో చెలరేగిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్తో సిరీస్లో పూర్తిగా విఫలమయ్యాడు.స్వదేశంలో బట్లర్ బృందంతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్(India vs England)లో సంజూ మొత్తంగా కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు.. పదే పదే ఒకే రీతిలో అవుటయ్యాడు. షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో విఫలమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్లకు సులువైన క్యాచ్లు ఇచ్చి వెనుదిరిగాడు.‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. ‘‘సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృథా చేసుకున్నాడు. ఐదోసారి కూడా అదే రీతిలో అవుటయ్యాడు.మరోసారి పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. నాకు తెలిసి.. అతడు తన ‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఇలా చేశాడని అనుకుంటున్నా. ‘లేదు.. లేదు.. నేను ఈ షాట్ కచ్చితంగా ఆడగలను’ అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.అసలు అతడు ఫామ్లేమితో సతమతమయ్యాడా? లేదంటే.. ‘ఇగో’ ట్రిప్నకు ఏమైనా వెళ్లాడా? నాకైతే అతడి గురించి ఏమీ ఏమీ అర్థం కావడం లేదు. ఈ సిరీస్లో.. నిజంగా తీవ్రంగా నిరాశపరిచాడు.జైస్వాల్ తిరిగి వస్తాడుసంజూను చాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదని అంతా మాట్లాడుకుంటున్నాం కదా! ఇదిలో ఇలాగే ఆడితే మాత్రం.. సెలక్టర్లు మాత్రం అతడిపై మరోసారి వేటు వేస్తారు. యశస్వి జైస్వాల్ తిరిగి వస్తాడు. తదుపరి టీ20 మ్యాచ్లో సంజూ శాంసన్ను కాదని యశస్వి జైస్వాల్ను ఆడిస్తారు’’ అని చిక్కా సంజూకు హెచ్చరికలు జారీ చేశాడు.గాయం.. ఆరు వారాలు దూరంఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా గాయపడ్డ సంజూ శాంసన్.. ఆరు వారాలు పూర్తిగా ఆటకు దూరం కానున్నాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్కు కేరళ జట్టుకు అతడు అందుబాటులో ఉండటం లేదు. కాగా ఇంగ్లండ్తో ఆదివారం ముంబైలో జరిగిన చివరిదైన ఐదో టి20లో బ్యాటింగ్ చేస్తుండగా సీమర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అతని కుడి చూపుడు వేలికి గాయమైంది.‘స్కానింగ్లో స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో శాంసన్ ఆరు వారాలు ఆటకు దూరమవుతాడు. పుణే వేదికగా ఈ నెల 8 నుంచి 12 వరకు జమ్మూ కశ్మీర్తో కేరళ ఆడే రంజీ క్వార్టర్ ఫైనల్ పోరులో అతను బరిలోకి దిగడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సామ్సన్ ఐపీఎల్ కల్లా అందుబాటులో ఉంటాడని బోర్డు పేర్కొంది.ఇక ఐపీఎల్లో సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను టీమిండియా 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం గురువారం(ఫిబ్రవరి 6) నాగ్పూర్లో జరిగే తొలి వన్డేతో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
అంతర్జాతీయ టీ20లలో సంజూ శాంసన్ అరుదైన ఘనత
సౌతాఫ్రికా గడ్డపై శతకాలతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్ సంజూ శాంసన్(Sanju Samson).. స్వదేశంలో మాత్రం తేలిపోయాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England)లో పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ ఐదో టీ20 సందర్భంగా అతడు అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ(Rohit Sharma), యశస్వి జైస్వాల్తో కలిసి ఎలైట్ క్లబ్లో చేరాడు.కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సంజూ శాంసన్ రెండు అంతర్జాతీయ టీ20 శతకాలు బాదిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్తో సొంతగడ్డపై కూడా బ్యాట్ ఝులిపిస్తాడని ఎదురుచూసిన అభిమానులను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ నిరాశపరిచాడు.ఆరంభం బాగున్నాకోల్కతాలో 26 పరుగులతో ఫర్వాలేదనిపించిన సంజూ.. ఆ తర్వాత చెన్నైలో ఐదు, రాజ్కోట్లో మూడు, పుణెలో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో సంజూ శాంసన్ అంచనాలు అందుకోలేకపోయాడు. ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా అదే జోరును కొనసాగించలేకపోయాడు.తొలి బంతికే సిక్స్ బాదిమొత్తంగా ఏడు బంతుల్లో పదహారు పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్లో మరో పేసర్ జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్లోనూ సంజూ విఫలమైనప్పటికీ.. తన ఇన్నింగ్స్ను సిక్సర్తో ఆరంభించడం ద్వారా అరుదైన ఫీట్ నమోదు చేశాడు.టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఓ మ్యాచ్లో తొలి బంతికే సిక్స్ బాదిన మూడో భారత క్రికెటర్గా సంజూ చరిత్రకెక్కాడు. అంతకుముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించారు. కాగా ఇంగ్లండ్తో ఐదో టీ20లొ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో డీప్ స్వ్కేర్ లెగ్ మీదుగా ఫ్లాట్ సిక్స్(70 మీటర్లు) బాదాడు. ఇక తొలి ఓవర్లోనే అతడు మరో సిక్స్, ఫోర్ బాదడం విశేషం.సంజూకు భారత మాజీ క్రికెటర్ మద్దతుఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ ఇంగ్లండ్తో ఐదు టీ20లలో కలిపి కేవలం 51 పరుగులే చేశాడు. దీంతో అతడి నిలకడలేమి ఆట తీరుపై మరోసారి విమర్శలు వస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు మద్దతుగా నిలిచాడు. ‘‘టీ20 క్రికెట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు.. ముఖ్యంగా బ్యాటింగ్ టాలెంట్ కోసం చూస్తున్నట్లయితే.. వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.మ్యాచ్పై వారి ప్రభావం ఎలా ఉంటోంది.. జట్టు కోసం వారు ఏం చేయగలరన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంజూ శాంసన్ విషయానికొస్తే.. కఠినమైన పిచ్లపై అతడు అద్బుతమైన శతకాలతో జట్టును గెలిపించాడు.టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిదికాబట్టి అలాంటి వాళ్లు కొన్నిసార్లు విఫలమైనా పెద్దగా పట్టించుకోకూడదు. అయితే, దీర్ఘకాలంలో ఇదే పునరావృతమైనా కాస్త వేచిచూడాలి. టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిది. దూకుడుగా ముందుకెళ్లేందుకు రిస్క్ తీసుకుంటే ఇలాంటివి తప్పవు. ఇలాంటి వాళ్లకు ఫామ్లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు’’ అని సంజయ్ మంజ్రేకర్ సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, ఐదో టీ20 ఆరంభానికి ముందు అతడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన క్రికెటర్లురోహిత్ శర్మ- 2021లో ఇంగ్లండ్పై- అహ్మదాబాద్ వేదికగా ఆదిల్ రషీద్ బౌలింగ్లోయశస్వి జైస్వాల్- 2024లో జింబాబ్వేపై- హరారే వేదికగా సికందర్ రజా బౌలింగ్లోసంజూ శాంసన్- 2025లో ఇంగ్లండ్పై- ముంబై వేదికగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్All those fake narrative PR by Rishabh Pant against Sanju Samson that "can't play extra pace, can't play short ball, can't play Archer". Sanju silenced all those critics by his performance🥵 . 6️⃣, 6️⃣ and 4️⃣ vs Jofra Archer in the FIRST over of the match. pic.twitter.com/YmAxAqoXrw— Rosh🧢 (@ImetSanjuSamson) February 3, 2025 -
జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?: అశ్విన్
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సెలక్షన్ కమిటీ చైర్మన్ అయ్యే అవకాశం వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతలు చేపట్టబోనని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా చీఫ్ సెలక్టర్గా ఉండటం తలనొప్పితో కూడిన పని అని అశూ వ్యాఖ్యానించాడు.ఆచితూచి...భారత్లో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని.. అయితే, వారిలో ఎవరిని జట్టుకు ఎంపిక చేయాలనేది ఎల్లప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఓ ఆటగాడి వైపు మొగ్గు చూపేటపుడు ప్రదర్శన, ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగానే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.కాగా ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్లను ప్రకటించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించే ఎక్కువగా చర్చముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కని సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఇంగ్లండ్తో వన్డేల్లోనైనా అవకాశం ఇవ్వాల్సిందని కొంతమంది అభిప్రాయపడగా.. సంజూ శాంసన్కు ఈసారీ అన్యాయం జరిగిందంటూ సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.వన్డేల్లో రిషభ్ పంత్ కంటే మెరుగ్గా ఉన్న సంజూ శాంసన్ను వికెట్ కీపర్ కోటాలో చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ అంతర్జాతీయ టీ20లకి తిరిగి వస్తే.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ పరిస్థితి ఏమిటి?వీరే కాకుండా ఓపెనింగ్ కోటాలో రుతురాజ్ గైక్వాడ్కు దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? దేశవాళీ క్రికెట్ వన్డే ఫార్మాట్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ను సెలక్టర్లు కనికరించకపోవడానికి కారణం? .. ఇలాంటి చర్చలు భారత క్రికెట్ వర్గాల్లో జరుగుతున్నాయి.జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అంతర్జాతీయ టీ20లలోకి యశస్వి జైస్వాల్ తప్పక తిరిగి రావాలి. అతడు వరల్డ్ కప్ జట్టులో ఉన్న వ్యక్తి. మొదటి ప్రాధాన్యం కలిగిన ఓపెనర్.ఒకవేళ వచ్చే ఐపీఎల్ సీజన్లో శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ భారీగా పరుగులు చేస్తే.. సెలక్టర్లకు తలనొప్పి మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా లేదంటే.. టీమ్ మేనేజర్గా.. అదీ కాదంటే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందంలో ఉండే అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు తీసుకోను.ప్రతిభ ఉన్న క్రికెటర్లకు కొదువలేకపోవడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, సెలక్టర్లకు మాత్రం ఇది ఒక సమస్య. ఏదేమైనా.. పోటీలో ఉన్న ఆటగాళ్లందరి ప్రదర్శన, ప్రధాన టోర్నమెంట్లో ఒత్తిడిని ఏమేరకు జయించగలరన్న అంశాల ఆధారంగా ఎంపిక చేస్తే బాగుంటుంది.క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించగలిగే వాళ్లకే పెద్దపీట వేయాలి. ఎవరు గొప్ప ఆటగాడు అన్న ప్రశ్నలకు సమాధానమిచ్చే కొలమానాలు ఏవీ లేవు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, అరుదైన నైపుణ్యాలు, ఫామ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. చదవండి: భారత్తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
ICC టెస్టు జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురు.. కెప్టెన్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 2024 ఏడాదికిగానూ పురుషుల అత్యుత్తమ టెస్టు(ICC Men’s Test Team of the Year 2024) జట్టును శుక్రవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి స్థానం దక్కింది. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఎంపికయ్యాడు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2024లో ఓపెనర్లుగా టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ చోటు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) స్థానం సంపాదించాడు.లంక నుంచి అతడుఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి, టెస్టు క్రికెట్ వీరుడు జో రూట్ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐదో స్థానంలో ఇంగ్లండ్ నూతన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆరో స్థానంలో శ్రీలంక శతకాల ధీరుడు కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్గా ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ ఎంపిక కాగా.. ఆల్రౌండర్గా టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఇక ఈ జట్టులో ఏకంగా ముగ్గురు పేసర్లకు ఐసీసీ చోటిచ్చింది. కెప్టెన్ కమిన్స్తో పాటు.. న్యూజిలాండ్ రైటార్మ్ బౌలర్ మ్యాట్ హెన్రీ.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లి- రోహిత్లకు దక్కని చోటుఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, రోహిత్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ మాత్రం గతేడాది అత్యుత్తమంగా రాణించాడు.జైసూ, బుమ్రా హిట్ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో భారీ శతకం(161) బాదడం అతడి ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి 2024లో జైసూ 1771 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా సైతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.మరోవైపు.. జడేజా సైతం స్థాయికి తగ్గట్లుగా రాణించి.. ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే... ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను కూడా శుక్రవారం ప్రకటించారు. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో శ్రీలంక క్రికెటర్లు హవా చూపించారు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024: చరిత్ అసలంక (శ్రీలంక- కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గనిస్తాన్), పాతుమ్ నిసాంక(శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక- వికెట్కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్తాన్), హరీస్ రౌఫ్(పాకిస్తాన్), అల్లా ఘజన్ఫర్(అఫ్గనిస్తాన్).చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
తుస్సుమన్న టీమిండియా స్టార్లు.. శ్రేయస్, శివమ్ దూబే కూడా..!
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో స్టార్ ప్యాకప్ ఉన్న ముంబై టీమ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే ఆలౌటైన ఈ మాజీ రంజీ ఛాంపియన్.. రెండో ఇన్నింగ్స్లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి ముంబై 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను సమం చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 206 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమైన స్టార్లు జమ్మూ అండ్ కశ్మీర్తో మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్లు రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 26 పరుగులకు (5 ఫోర్లు) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులే బిచానా ఎత్తిన రోహిత్ శర్మ.. సెకెండ్ ఇన్నింగ్స్లో కాస్త పర్వాలేదన్నట్టుగా 35 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 2 సొగసైన బౌండరీలు, 3 భారీ సిక్సర్లు బాది తన పాత రోజులను గుర్తు చేశాడు.శ్రేయస్ మరోసారి..!ఈ మ్యాచ్లో టీమిండియా వన్డే ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు రెండు ఇన్నింగ్స్ల్లో శుభారంభాలే లభించాయి. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో తొలి బంతికే సిక్సర్ బాది జోష్ మీదున్నట్లు కనిపించిన శ్రేయస్ 7 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ అదే జోష్ను ప్రదర్శించిన శ్రేయస్.. వచ్చీ రాగానే ఎడాపెడా నాలుగు బౌండరీలు (16 బంతుల్లో 17 పరుగులు) బాది ఔటయ్యాడు.రెండో ఇన్నింగ్స్లోనూ డకౌటైన శివమ్ దూబేఈ మ్యాచ్లో విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండు ఇన్నింగ్స్ల్లోనూ డకౌటై నిరాశపరిచాడు. శ్రేయస్, శివమ్ దూబేల వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి రహానే (12), షమ్స్ ములానీ (0) క్రీజ్లో ఉన్నారు.ముంబై పరువు కాపాడిన శార్దూల్ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై పరువు కాపాడాడు. 100లోపే ఆలౌటైయ్యేలా కనిపించిన ముంబైను శార్దూల్ తన హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. తొలి ఇన్నింగ్స్లో మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న శార్దూల్ 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. శార్దూల్కు తనుశ్ కోటియన్ (26, 5 ఫోర్లు) కాసేపు సహకరించడంతో ముంబై 100 పరుగుల మార్కును దాటింది. -
రోహిత్ బాటలోనే జైస్వాల్.. ఊరించి ఊసూరుమనిపించారు..!
చాలాకాలం తర్వాత రంజీల్లో ఆడుగుపెట్టిన టీమిండియా బ్యాటింగ్ స్టార్లు ఘోరంగా విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్లు నిన్న ప్రారంభం కాగా.. తొలి రోజు భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా పూర్తిగా తేలిపోయారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) ఖాతా కూడా తెరవలేదు.టీమిండియా స్టార్ బ్యాటర్ల ప్రదర్శన సెకెండ్ ఇన్నింగ్స్లోనైనా మారుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అయితే వారి ఆశలు ఆదిలోనే అడియాశలయ్యాయి. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన వీరు సెకెండ్ ఇన్నింగ్స్లో గుడి కంటే మెల్ల మేలన్నట్టుగా రెండంకెల స్కోర్లు చేశారు.రోహిత్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. జైస్వాల్ 51 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో రోహిత్ క్రీజ్లో ఉండింది కొద్ది సేపే అయినా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇదొక్కటే టీమిండియా అభిమానులకు ఊరట కలిగించే విషయం.మ్యాచ్ విషయానికొస్తే.. జమ్మూ అండ్ కశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకు ఆలౌటైన ముంబై, సెకెండ్ ఇన్నింగ్స్లో కూడా అదే పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు తొలి సెషన్లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ముంబై టాప్ త్రీ బ్యాటర్లు రోహిత్ (28), యశస్వి (26), హార్దిక్ తామోర్ (1) ఔట్ కాగా.. అజింక్య రహానే (1), శ్రేయస్ అయ్యర్ (4) క్రీజ్లో ఉన్నారు. ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 206 పరుగులు చేసింది. శుభమ్ ఖజూరియా (53), అబిద్ ముస్తాక్ (44) ఓ మోస్తరుగా రాణించారు. -
Rohit Sharma: వింటేజ్ ‘హిట్మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలమైన ఈ ముంబై రాజా.. రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్తో పోరు(Mumbai Vs Jammu Kashmir)లో రెండు ఇన్నింగ్స్లో కలిపి కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు.ఫలితంగా అతడిపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ ఇకనైనా టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించి.. యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కెప్టెన్గా, బ్యాటర్గా ఫెయిల్కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో కెప్టెన్గా, బ్యాటర్గా రోహిత్ విఫలమయ్యాడు. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి సొంతగడ్డపై భారత్ 3-0తో ప్రత్యర్థి చేతుల్లో వైట్వాష్కు గురైంది.అనంతరం.. ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కూడా రోహిత్ చేతులెత్తేశాడు. ఫలితంగా 3-1తో ఓడిన భారత్.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఇక గత పదకొండు ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9.రంజీల్లోనైనా రాణిస్తాడనిఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అంశం తెరమీదకు రాగా.. తాను ఇప్పట్లో తప్పుకొనే ప్రసక్తి లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనలకు అనుగుణంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీల బరిలో దిగాడు.ఇందులో భాగంగా గురువారం జమ్మూ కశ్మీర్తో మొదలైన మ్యాచ్లో యశస్వి జైస్వాల్తో కలిసి రోహిత్ ముంబై ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కనీసం రెండో ఇన్నింగ్స్లోనైనా రాణిస్తాడనుకుంటే.. శుక్రవారం కూడా రోహిత్ అభిమానులను మెప్పించలేకపోయాడు.వింటేజ్ హిట్మ్యాన్ను గుర్తుచేసి.. మరోసారి విఫలమైఆరంభంలో దూకుడుగా ఆడుతూ సిక్స్లు, బౌండరీలు బాదిన రోహిత్ శర్మ.. వింటేజ్ హిట్మ్యాన్ను గుర్తు చేశాడు. అయితే, అదే జోరును కొనసాగించలేకపోయాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.VINTAGE ROHIT SHARMA IS BACK....🔥#RohitSharma#RanjiTrophy#Ranjitropy #RohitSharmapic.twitter.com/NQ3T9m52cu— HitMan (@HitMan_4545) January 24, 2025 జైసూ, గిల్, పంత్ కూడా అంతేఇక తొలి ఇన్నింగ్స్లో ఉమర్ నజీర్ బౌలింగ్లో పోరస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి అవుటైన రోహిత్.. తాజాగా యుధ్వీర్ సింఘ్ బౌలింగ్లో అబిద్ ముస్తాక్ చేతికి ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ శతకం(161- పెర్త్) యశస్వి జైస్వాల్ కూడా రంజీ ట్రోఫీలో నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్తో తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్.. రెండో ఇన్నింగ్స్లో 51 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరి వైఫల్యం కారణంగా ముంబై జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు.. శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ కూడా రంజీ పునరాగమనంలో వైఫల్యం చెందారు. కర్ణాటకతో మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్గా బరిలోకి దిగిన గిల్ నాలుగు పరుగులకే పరిమితమయ్యాడు. ఇక ఢిల్లీ క్రికెటర్ రిషభ్ పంత్ సౌరాష్ట్రతో మ్యాచ్లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం గమనార్హం. చదవండి: Ind vs Engఅతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ What a Lofted drive - rohit sharma #INDvENG #INDvsENG #ChampionsTrophy #RanjiTrophy#RohitSharma pic.twitter.com/igEGrpYc1n— kuldeep singh (@kuldeep0745) January 24, 2025 -
ఘోరంగా విఫలమైన రోహిత్, యశస్వి, గిల్, పంత్.. ఐదు వికెట్లతో సత్తా చాటిన జడేజా
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్లు ఇవాల్టి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో హేమాహేమీలంతా బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ తరఫున శుభ్మన్ గిల్.. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్.. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.తేలిపోయిన పంత్.. ఐదేసిన జడేజాఎలైట్ గ్రూప్ డిలో భాగంగా ఇవాళ ఢిల్లీ, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడటంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కకావికలం చేశాడు. జడ్డూ 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. జడేజాకు మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) తోడయ్యాడు. ఈ జడేజా 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, యువరాజ్ సింగ్ దోడియా తలో వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు సెకెండ్ ఇన్నింగ్స్లో హ్యాట్రిక్ తీసే అవకాశం ఉంటుంది. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత.పేలవ ఫామ్ను కొనసాగించిన రోహిత్.. నిరాశపరిచిన జైస్వాల్, శ్రేయస్, దూబేఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముంబై తొలి ఇన్నింగ్స్లో 33.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన రంజీల్లోనూ కొనసాగింది. హిట్మ్యాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మరో టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (0) నిరాశపరిచారు. ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానే (12) కూడా తేలిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైను మరో టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (51) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. శార్దూల్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని ముంబై 100 పరుగుల మార్కును దాటగలిగింది. శార్దూల్కు తనుశ్ కోటియన్ (26) కాసేపు సహకరించాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లు యుద్వీర్ సింగ్ చరక్ (8.2-2-31-4), ఉమర్ నజీర్ మిర్ (11-2-41-4), ఆకిబ్ నబీ దార్ (13-3-36-2) స్టార్లతో నిండిన ముంబై బ్యాటింగ్ లైనప్కు బెంబేలెత్తించారు.తీరు మార్చుకోని గిల్గిల్ వైఫల్యాల పరంపర రంజీల్లోనూ కొనసాగుతుంది. బీజీటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్.. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. వి కౌశిక్ 4, అభిలాశ్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ 2, యశోవర్దన్ పరంతాప్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో పంజాబ్ సారధిగా వ్యవహరిస్తున్న గిల్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో రమన్దీప్సింగ్ (16), మార్కండే (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కట్ చేస్తే! 3 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. పదేళ్ల తర్వాత రంజీట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ.. అక్కడ కూడా తీవ్ర నిరాశపరిచాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ ఆరంభం నుంచే జమ్మూ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి 19 బంతులు ఆడి పేసర్ ఉమార్ నజీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. అతడితో పాటు మరో స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సైతం విఫలమయ్యాడు. జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అకిబ్ నబీబ్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై కేవలం 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్, జైశ్వాల్తో పాటు కెప్టెన్ అజింక్య రహానే,హార్దిక్ తోమార్, శివమ్ దూబే వంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్కు చేరారు. జమ్మూ బౌలర్ ఉమార్ నజీర్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు.తీరు మారని రోహిత్..కాగా రోహిత్ శర్మ రెడ్బాల్ ఫార్మాట్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 5 ఇన్నింగ్స్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.అంతకముందు న్యూజిలాండ్ సిరీస్లోనూ హిట్మ్యాన్ అదే తీరును కనబరిచాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తన రిథమ్ను తిరిగి పొందేందుకు రంజీల్లో ఆడాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ కూడా తన మార్క్ను చూపించలేకపోయాడు. కనీసం సెకెండ్ ఇన్నింగ్స్లోనైనా హిట్మ్యాన్ తన బ్యాట్కు పనిచెబుతాడో లేదో చూడాలి.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా Rohit Sharma out for 3 in 19 😶Embarrass!ng #RohitSharmapic.twitter.com/UIoY5tCj6Z— Veena Jain (@DrJain21) January 23, 2025 -
Shubman Gill: అక్కడే కాదు.. ఇక్కడా ఫెయిల్!.. సింగిల్ డిజిట్ స్కోర్
దేశవాళీ క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్(Shubman Gill) పూర్తిగా నిరాశపరిచాడు. పంజాబ్(Punjab) తరఫున బరిలోకి దిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. కాగా గత కొంతకాలంగా భారత ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్ తదితరులు టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే.తారలు దిగి వచ్చారుఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలు కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబై తరఫున.. రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున.. శుబ్మన్ గిల్ పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెకండ్ లెగ్ బరిలో దిగారు. కోహ్లి మాత్రం మెడనొప్పి వల్ల ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడుపంజాబ్ ఓపెనర్గా గిల్ విఫలంఇక బెంగళూరు వేదికగా కర్ణాటక- పంజాబ్ మధ్య గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన కర్ణాటక.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ప్రభ్సిమ్రన్ సింగ్తో కలిసి శుబ్మన్ గిల్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, కర్ణాటక బౌలర్ అభిలాష్ శెట్టి వరుస ఓవర్లలో ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్లో తొలి వికెట్గా గిల్ వెనుదిరిగాడు.కర్ణాటక పేసర్ల జోరుమొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న గిల్.. ఒకే ఒక్క ఫోర్ కొట్టి నిష్క్రమించాడు. క్రిష్ణన్ శ్రీజిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. ప్రభ్సిమ్రన్ సింగ్ 28 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో ఆరు పరుగులు చేసి.. అభిలాష్ శెట్టి బౌలింగ్లో అనీశ్ కేవీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక మరో పేసర్ వాసుకి కౌశిక్ కూడాపంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.వన్డౌన్ బ్యాటర్ బ్యాటర్ ఫుఖ్రాజ్ మన్(1)తో పాటు.. నాలుగో స్థానంలో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్(0)ను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన 10 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి.. కష్టాల్లో కూరుకుపోయింది.బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గిల్ ఫ్లాఫ్ షోకాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో శుబ్మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. గాయం వల్ల తొలి టెస్టుకు దూరమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్లో జరిగిన ఈ మ్యాచ్లో గిల్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 31, 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.అయితే, గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టుకు దూరంగా ఉన్న ఈ వన్డౌన్ బ్యాటర్.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో 20, 13 పరుగులు చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియాతో ఈ ఐదు టెస్టుల సిరీస్లో శుబ్మన్ గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్- జైస్వాల్ కూడా ఫెయిల్ఇందులో ఒక్క అర్ధ శతకం కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగి ఫామ్లోకి రావాలని ఆశించిన గిల్కు మొదటి ప్రయత్నంలోనే చుక్కెదురైంది. కర్ణాటకతో మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లోనైనా అతడు రాణిస్తాడేమో చూడాలి! మరోవైపు.. జమ్మూ- కశ్మీర్తో మ్యాచ్లో ముంబై ఓపెనర్లు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ కూడా ఫెయిలయ్యారు. జైస్వాల్ నాలుగు, రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. చదవండి: NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా.. -
Ind vs Eng: అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు.. ఇదే లాస్ట్ ఛాన్స్!
అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ సిరీస్లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.అరంగేట్రంలో డకౌట్.. ఆ వెంటనే సెంచరీగతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా.. అభిషేక్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ అభిషేక్ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.కాబట్టి అభిషేక్కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ కావడం అభిషేక్ శర్మకు మరో మైనస్. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్ ఫామ్లో ఉన్నాడు.అలా అయితే వృథానేఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్తో వన్డేల్లో శుబ్మన్ గిల్- రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథిఏదేమైనా యశస్వి జైస్వాల్ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్ చోప్రా అన్నట్లు అభిషేక్ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.చదవండి: జైస్వాల్కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే!.. టీమిండియా నుంచి ఎవరంటే?
క్రికెట్ ప్రపంచంలో ‘ఫ్యాబ్ ఫోర్’గా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు పేరుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నలుగురు బ్యాటర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా ముఖ చిత్రమైన కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు.. శతకాల విషయంలో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.సెంచరీల మెషీన్వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన రన్మెషీన్.. ఇప్పటికే సచిన్ టెండుల్కర్(49) రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధికసార్లు వంద పరుగులు అందుకున్న క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఒక శతకం సాధించాడు కోహ్లి. కెప్టెన్గా భారత్కు టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అద్భుతమైన గణాంకాలుమరోవైపు.. ఆస్ట్రేలియా సారథిగా పనిచేసిన స్టీవ్ స్మిత్.. బ్యాటర్గా అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. 114 టెస్టుల్లో 34 సెంచరీల సాయంతో 9999, 165 వన్డేల్లో పన్నెండుసార్లు శతక్కొట్టి 5662, 67 టీ20లలో 1094 పరుగులు సాధించాడు.టెస్టుల్లో తనకు తానే సాటి ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 152 టెస్టు మ్యాచ్లు ఆడిన రూట్.. 36 సెంచరీల సాయంతో 12972 పరుగులు సాధించాడు. అదే విధంగా 171 వన్డేల్లో 16 శతకాలు నమోదు చేసి 6522 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 32 అంతర్జాతీయ టీ20లలో 893 రన్స్ చేశాడు.తొలిసారి ఆ ఐసీసీ ట్రోఫీ అందుకున్న నాయకుడుఇదిలా ఉంటే.. న్యూజిలాండ్కు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత కేన్ విలియమ్సన్కే దక్కుతుంది. అతడి కెప్టెన్సీలో 2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ను కివీస్ జట్టు సొంతం చేసుకుంది. ఇక కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా 105 టెస్టుల్లో 33 శతకాలు బాది 9276 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 165 వన్డేల్లో 13 సెంచరీలు చేసి 6811 పరుగులు సాధించాడు. 93 టీ20లు ఆడి 2575 రన్స్ చేశాడు.నవతరం ఫ్యాబ్ ఫోర్ వీరేఇలా ఈ నలుగురు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని 2013లోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవే ఊహించాడు. అందుకే పుష్కరకాలం క్రితమే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు ‘ఫ్యాబ్ ఫోర్’(ఫ్యాబ్యులస్ ఫోర్)గా నామకరణం చేశాడు. క్రోవే ఉపయోగించిన ఈ పదం తర్వాతి కాలంలో బాగా పాపులర్ అయింది.తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకేల్ ఆర్థర్టన్ నవతరం ‘ఫ్యాబ్ ఫోర్’గా ఓ నలుగురు యువ క్రికెటర్ల పేర్లను చెప్పారు. అయితే, ఇందులో ఇద్దరి విషయంలో మాత్రమే నాసిర్ హుసేన్, ఆర్థర్టన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్తో పాటు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్లకు ఈ ఇద్దరూ ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చారు.నా దృష్టిలో ఆ నలుగురే..యశస్వి జైస్వాల్తో పాటు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్, పాకిస్తాన్ యువ తరంగం సయీమ్ ఆయుబ్ ఉంటాడని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. అయితే, ఆర్థర్టన్ మాత్రం యశస్వి, హ్యారీ బ్రూక్లతో పాటు శ్రీలంక సంచలన క్రికెటర్ కమిందు మెండిస్, న్యూజిలాండ్ యంగ్ స్టార్ రచిన్ రవీంద్రలకు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చాడు.సూపర్ ఫామ్లో ఆ ఆరుగురుకాగా ఈ గతేడాది యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1771 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 2024లో ఐదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీల సాయంతో 1575 పరుగలు చేశాడు.ఇక కమిందు మెండిస్ 1458 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. ట్రవిస్ హెడ్ 1399, సయీమ్ ఆయుబ్ 1254 పరుగులు సాధించారు. ఇక రచిన్ రవీంద్ర రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1079 పరుగులు చేశాడు. టీమిండియాను న్యూజిలాండ్ టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీస్ చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
ముంబై జట్టు ప్రకటన.. రోహిత్ శర్మకు చోటు! కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) రంజీ ట్రోఫీ 2024-25లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నీ సెకెండ్ రౌండ్లో భాగంగా జమ్మూ కాశ్మీర్తో జరగనున్న మ్యాచ్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. 2015లో చివరిసారి రంజీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిట్మ్యాన్.. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ ప్రాతిష్టత్మక టోర్నీలో ఆడనున్నాడు.రెడ్ బాల్ ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో హిట్మ్యాన్ దారుణంగా నిరాశపరిచాడు. అంతకముందు న్యూజిలాండ్ సిరీస్లోనూ అదే తీరును కనబరిచాడు. ఈ క్రమంలో రోహిత్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని పలువురు క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో రోహిత్ తన పూర్వ వైభావాన్ని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే.. సీనియర్ ఆటగాళ్లు సైతం దేశీవాళీ క్రికెట్లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే రోహిత్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇక జట్టులో విధ్వంసకర ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ను కూడా ముంబై సెలక్టర్లు చేర్చారు. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ జనవరి 23 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.పదేళ్ల తర్వాత..రోహిత్ శర్మ చివరగా 2015లో ముంబై తరపున రంజీల్లో ఆడాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆఖరిగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్(114) సెంచరీతో మెరిశాడు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో రోహిత్కు అద్భుతమైన రికార్డు ఉంది.ఇప్పటివరకు 128 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన ఈ ముంబైకర్ 9287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 29 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు సన్నద్దం కానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.జమ్మూ కాశ్మీర్తో మ్యాచ్కు ముంబై జట్టు ఇదే..అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మ్హత్రే, శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్ , సిల్వెస్టర్ డిసౌజా, రొయిస్టన్ ద్యాస్, కర్ష్ కొఠారిచదవండి: IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ ప్రకటన.. -
‘గిల్ కంటే బెటర్.. టీమిండియా భవిష్య కెప్టెన్గా అతడికే నా ఓటు’
టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకోవడం సరికాదని.. పాకిస్తాన్పై శతకం బాదినప్పుడు మాత్రమే గిల్ ప్రశంసలకు అర్హుడని పేర్కొన్నాడు. నిజానికి గిల్ కంటే.. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుందన్నాడు. అదే విధంగా.. భారత జట్టు భవిష్య కెప్టెన్(India Future Captain) ఎవరైతే బెటర్ అన్న అంశం గురించి కూడా బసిత్ అలీ ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయ్ స్టేడియంలో బంగ్లాదేశ్తో మ్యాచ్తో రోహిత్ సేన ఫిబ్రవరి 20న తమ వేట మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో.. ఈ ఐసీసీ వన్డే ఫార్మాట్ ఈవెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఈ టీమ్కు శుబ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది.గిల్ కంటే జైస్వాల్ బెటర్అంతేకాదు.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ను తొలిసారిగా వన్డే జట్టులోకి తీసుకుంది. ఇక వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్తో పాటు రిషభ్ పంత్కు కూడా బీసీసీఐ చోటిచ్చింది. ఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్, పంత్ పేర్లను ప్రస్తావిస్తూ.. చాంపియన్స్ ట్రోఫీలో తుదిజట్టు కూర్పు గురించి బసిత్ అలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘గిల్ కంటే జైస్వాల్ బిగ్ ప్లేయర్. గిల్ ఓవర్రేటెడ్. ఒకవేళ అతడు పాకిస్తాన్ మీద సెంచరీ కొడితే అప్పుడు అతడిని మనం ప్రశంసించవచ్చు. అయినా సరే.. నా దృష్టిలో గిల్ కంటే.. జైస్వాల్ మెరుగైన ఆటగాడు. అతడి టెక్నిక్ బాగుంటుంది. ప్రతి విషయంలోనూ జైస్వాలే బెటర్.టీమిండియా భవిష్య కెప్టెన్గా అతడికే నా ఓటుఇక టీమిండియా భవిష్య కెప్టెన్గా నా ఆప్షన్ రిషభ్ పంత్(Rishabh Pant). అతడికే నా ఓటు. కెప్టెన్గా శుబ్మన్ గిల్కు అవకాశాలు ఉండవచ్చు. అయితే, రిషభ్ పంత్ నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడు. అతడిని కెప్టెన్ను చేస్తే వ్యక్తిగత ప్రదర్శనతో పాటు.. సారథిగానూ అదరగొట్టగలడు. టీమిండియాకు అతడికి అవసరం ఉంది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.ఓపెనర్గా జైసూ, మిడిల్ ఆర్డర్లో పంత్ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత తుదిజట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగితే మంచిది. ఒకరు ఓపెనర్(జైస్వాల్)గా.. మరొకరు మిడిలార్డర్(పంత్)లో రావాలి. ఏదేమైనా జైస్వాల్ లేకుండా ప్లేయింగ్ ఎలెవన్ ఉండదనే అనుకుంటున్నా.అదే విధంగా.. రిషభ్ పంత్ కూడా తుదిజట్టులో ఉంటాడు. మైదానం నలుమూలలా షాట్లు బాదగల సత్తా అతడి సొంతం. కేఎల్ రాహుల్కు అలాంటి నైపుణ్యాలు లేవు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టు, టీ20లో టీమిండియా తరఫున రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.అతడి వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమేఅయితే, వన్డేల్లో మాత్రం రోహిత్- గిల్ భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్-వైస్ కెప్టెన్ జోడీని విడదీసి.. జైస్వాల్ను ఓపెనర్గా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బసిత్ అలీ మాత్రం గిల్ను కాదని.. ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయని జైసూకు ఓటేయడం గమనార్హం.ఇక వన్డేల్లో గిల్కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 47 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2328 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. మరోవైపు.. పంత్ వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమే. 31 వన్డేల్లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 871 రన్స్ మాత్రమే చేశాడు.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
ఇంగ్లండ్తో స్వదేశంలో మూడు వన్డేల(Ind vs Eng ODI Series)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. ఇదే జట్టు ఒక్క మార్పుతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలోకి దిగుతుందని వెల్లడించిందిఓపెనర్గా ఎవరు?కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్(Shubman Gill) వైస్ కెప్టెన్గా ఎంపికకాగా.. మరో యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఈ ఇద్దరిలో ఎవరు తుదిజట్టులో ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్ అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో దుమ్ములేపాడు. అనంతరం రెండు ద్విశతకాలు కూడా బాది సత్తా చాటాడు. అదే టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలోనూ జైసూ ఎంట్రీ ఇచ్చాడు.బుమ్రా బదులు హర్షిత్ రాణాఇక ఇప్పటి వరకు ఓవరాల్గా టీమిండియా తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. టెస్టుల్లో 1798, టీ20లలో 723 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పితో బాధపడుతున్న పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేనట్లు తెలుస్తోంది.అందుకే ఇంగ్లండ్తో వన్డేలకు బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు టీమిండియా సెలక్టర్లు. అయితే, ఫిట్నెస్ ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా జట్టుతో చేరనుండగా.. హర్షిత్ పక్కకు తప్పుకొంటాడు.షమీతో పాటు వారు కూడాఇక ఈ జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ స్థానం సంపాదించగా.. స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్తో పాటు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక పేసర్ల విభాగంలో మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మొత్తం ఐదు టీ20లు(జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2) జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది.ఇంగ్లండ్తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.ఇంగ్లండ్తో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).భారత్తో వన్డేలకు/చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్తో టీ20లకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
ఫామ్లో ఉన్నంత మాత్రాన కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు: డీకే
విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్(Karun Nair) సూపర్ ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్లు ఆడిన 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. ఏడు ఇన్నింగ్స్లో అతడు నాటౌట్గా నిలవడం విశేషం.బ్యాటర్గా దుమ్ములేపుతూనే.. కెప్టెన్గానూ కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో విదర్భను విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్కు చేర్చాడు. దేశీ వన్డే టోర్నీలో విదర్భ ఇలా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.అతడిని ఎంపిక చేయాలిఈ నేపథ్యంలో కరుణ్ నాయర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో.. కరుణ్ నాయర్ను ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ క్రమంలో మరో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) మాత్రం భిన్నంగా స్పందించాడు. కరుణ్ నాయర్ అద్బుతమైన ఫామ్లో ఉన్నా.. అతడిని ఈ మెగా ఈవెంట్కు ఎంపిక చేయడం కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం గురించి క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ కరుణ్ నాయర్ ఆడుతున్న తీరు అమోఘం. అతడు ఊహకు అందని రీతిలో పరుగుల వరద పారిస్తున్నాడు.ఫామ్లో ఉన్నంత మాత్రాన సెలక్ట్ చేయరుఅందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు అతడి గురించే చర్చిస్తున్నారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కరుణ్ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. ఎందుకంటే.. సెలక్టర్లు ఇప్పటికే టీమ్ గురించి తుది నిర్ణయానికి వచ్చి ఉంటారు.ఏదేమైనా కరుణ్ నాయర్ గొప్ప ఆటగాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్లో అద్భుతంగా ఆడగలిగే ఇన్ ఫామ్ బ్యాటర్ను ఎవరు మాత్రం కాదనుకుంటారు. అతడు గనుక తిరిగి జట్టులోకి వస్తే నాకూ సంతోషమే’’ అని డీకే పేర్కొన్నాడు.అయితే, ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కూడా కరుణ్ నాయర్ ఎంపికయ్యే అవకాశం లేదని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్తో వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో జైసూ ఆడటం ఖాయం‘‘ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సెలక్టర్లు జైస్వాల్కు విశ్రాంతినిచ్చారు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన అనంతరం ఈ యువ ఆటగాడికి తగినంత రెస్ట్ అవసరం.ఈ విషయంలో సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వందకు వంద శాతం ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేస్తారు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడిస్తారు. వన్డేల్లో అరంగేట్రం కదా అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేయగలడు. ఇంగ్లండ్తో టీ20లలో ఆడనంత మాత్రాన అతడికి వచ్చే నష్టమేమీ లేదు’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో, టీ20లలో అదరగొడుతున్న జైస్వాల్ ఇంత వరకు వన్డేల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఓ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ను పంపించాలని సూచించాడు. తద్వారా శుబ్మన్ గిల్పై వేటు వేయాలని పరోక్షంగా సెలక్టర్లకు సలహా ఇచ్చాడు.దుబాయ్ వేదికగాపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన దుబాయ్(Dubai)లో భారత జట్టు తమ మ్యాచ్లు ఆడనుంది.ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13 డెడ్లైన్ విధించగా.. బీసీసీఐ మాత్రం మినహాయింపు కోరింది. జనవరి 17 నాటికి తమ జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నప్పటికీ.. ఇంత వరకు ఆ వివరాలు వెల్లడించలేదు.అతడిని సెలక్ట్ చేయండిఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ హిందుస్తాన్ టైమ్స్తో ఈ విషయం గురించి మాట్లాడాడు. ‘‘సెలక్టర్లకు నాదో సలహా. యశస్వి జైస్వాల్ను 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఆడించండి. అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్బుతం. వన్డే ఫార్మాట్కు కూడా అతడు సరిగ్గా సరిపోతాడు. కచ్చితంగా అతడిని టీమిండియా వన్డే జట్టులోకి తీసుకోవాలి’’ అని వీరూ భాయ్ పేర్కొన్నాడు.పంత్ వద్దు: భజ్జీమరోవైపు.. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా తన మొదటి ఓటు సంజూ శాంసన్కే వేస్తానని కుండబద్దలు కొట్టాడు. కాగా ఓపెనింగ్ జోడీగా సెహ్వాగ్ రోహిత్- జైస్వాల్ల పేర్లను సూచించగా.. భజ్జీ రిషభ్ పంత్ను కాదని సంజూ శాంసన్కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడం విశేషం.కాగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టు, టీ20లలో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయాడు. అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో మెరిసిన జైసూ ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు ఓవరాల్గా భారత్ తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 1798, 723 పరుగులు చేశాడు. అయితే, జైస్వాల్కు ఇంత వరకు వన్డేల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. రోహిత్ శర్మతో కలిసి శుబ్మన్ గిల్ యాభై ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు.జైసూ భేష్అయితే, ఇటీవలి కాలంలో గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ యశస్వి జైస్వాల్ పేరు చెప్పడం గమనార్హం. కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో జైసూ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. కేవలం 32 మ్యాచ్లలోనే అతడు ఐదు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు, ఓ డబుల్ సెంచరీ సాయంతో 1511 పరుగులు సాధించాడు. చదవండి: ILT20 2025: చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్ -
ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఇటీవల ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో రోహిత్ పేలవ ప్రదర్శన కనబర్చగా... యశస్వి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఆసీస్తో ప్రతిష్టాత్మక సిరీస్లో భారత జట్టు పరాజయం పాలవగా... ప్లేయర్లందరూ దేశవాళీ టోర్నీ ల్లో ఆడాలనే డిమాండ్ పెరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ‘అందుబాటులో ఉన్నవాళ్లందరూ రంజీ ట్రోఫీలో ఆడాలి’ అని ఆటగాళ్లకు చురకలు అంటించాడు. ఈ నేపథ్యంలో రోహిత్, యశస్వి ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ముంబై రంజీ కెపె్టన్ రహానేతో కలిసి రోహిత్ సుదీర్ఘ సమయం నెట్స్లో గడపగా... బుధవారం జైస్వాల్ ప్రాక్టీస్ చేశాడు. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండగా... జమ్ముకశ్మీర్తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్లో వీరిద్దరూ ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 20 వరకు జట్టును ప్రకటించే అవకాశం ఉందని... ఆ సమయంలో ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉంటారా లేదా అని అడిగి ఎంపిక చేస్తామని ముంబై క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. ‘రోహిత్ను కూడా అడుగుతాం. అతడు అందుబాటులో ఉంటానంటే జట్టులోకి ఎంపిక చేస్తాం’ అని అన్నారు. -
BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?
ఆద్యంతం ఆసక్తి రేపిన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ను రోహిత్ సేన 1-3తో ఓడి పరాజయంతో ముగించింది. తద్వారా పదేళ్ల తర్వాత కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar)ని తమ సొంతం చేసుకుంది. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యమైందా? అంటే.. నిజంగా లేదనే చెప్పాలి. భారత్ బ్యాటర్ల తప్పిదాల వల్లే ఆసీస్ జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు.ఈ సిరీస్ లో భారత్ తరుఫున పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే అద్భుతంగా ఆడాడు. నిజానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ సైతం ఈ విషయాన్నిఅంగీకరించరు. వాస్తవానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ బుమ్రా ని ఎదుర్కొనడానికి భయపడ్డారనేది చేదు నిజం.'బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?'మెల్బోర్న్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ సైతం బుమ్రా పై ప్రశంసలు కురిపించడం విశేషం. "బుమ్రా ఒక్కడూ వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఆడుతున్నాడు" అని గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గిల్క్రిస్ట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సైతం బుమ్రాని ప్రశంసలతో ముంచెత్తారు. బుమ్రాని వాళ్ళు వెస్టిండీస్ దిగ్గజాలతో పోల్చడం విశేషం. ఆదివారం సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా మైదానంలోకి రాకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా హావభావాలను భారత్ ఆటగాళ్లకన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు, వాళ్ళ అభిమానులు, కామెంటేటర్లు ఎక్కువగా నిశితంగా పరిశీలించాలంటే అతని ప్రాముఖ్యమేమిటో అర్ధమౌతుంది.ముఖ్యంగా మెల్బోర్న్లో నాలుగో రోజు బుమ్రా భారత్ ని గెలిపించేందుకు బాగా శ్రమించడంతో అతని శరీరం తట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా, ఈ సిరీస్లో ఏకంగా 32 వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా రికార్డ్ నెలకొల్పినప్పటికీ భారత్ పరాజయంతో వెనుదిరగాల్సి వచ్చింది.ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ అంతంతమాత్రమేఈ సిరీస్లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మెరుగ్గా ఆడారనడం సరికాదు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ కన్నా భారత్ బ్యాటింగ్ లైనప్లో అస్థిరత వారిని గెలిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఈ సిరీస్ లో భారత్ బ్యాటర్ల టాప్ ఆర్డర్ (1 నుండి 7) వరకు సగటు 24.67తో పోలిస్తే.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ సగటు 28.79 మాత్రమే. టీమిండియా బ్యాటర్ల రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో పోలిస్తే.. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్ల నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో కాస్త పైచేయి సాధించారు.ఇక తొమ్మిదో స్థానం నుంచి పదకొండో స్థానాల బ్యాటర్ల ఆట తీరును పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ సగటు 9.64తో కాగా ఆస్ట్రేలియా సగటు 15గా నమోదైంది. ఇక ఈ సిరీస్లో బుమ్రా తర్వాత మరో సానుకూలాంశం యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు 43.44 సగటుతో 391 పరుగులు సాధించి ఈ సిరీస్లో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్గా నిలిచాడు. కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి అడపాదడపా మెరుపులు మెరిపించారు కానీ నిలకడగా రాణించలేదు.ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అబ్బురపరిచాడు. అయితే, ఈ సిరీస్లో టీమిండియా తరఫున ప్రధానంగా వైఫల్యం చెందినది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పక తప్పదు.రోహిత్ శర్మ అయిదు ఇన్నింగ్స్లలో 6.20 సగటు కేవలం 31 పరుగులు సాధించగా, కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం.మేనేజ్మెంట్ తప్పిదాలు కూడామొత్తం మీద భారత్ బ్యాటర్ల వైఫల్యం.. టీమ్ మేనేజ్మెంట్ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెల్బోర్న్ నాలుగో రోజు ఆటముగిసేలోగా ఆస్ట్రేలియా బ్యాటర్లని ఆలౌట్ చేయడంలో వైఫల్యం.. అదే రోజు యశస్వి జైస్వాల్ వరుసగా క్యాచ్లు జారవిడవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెల్బోర్న్లో గెలుపొంది ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అదే ఆత్మవిశ్వాసం తో సిడ్నీలో గెలిచి పదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంది. -
CT 2025: యశస్వి జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు బంపరాఫర్!?
టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అద్భుత ప్రదర్శనతో జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal). తొలుత(2023) టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. వెస్టిండీస్తో మ్యాచ్లో భారీ శతకం(171) బాది.. తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. విండీస్తో సిరీస్తోనే టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.డబుల్ సెంచరీల వీరుడునిలకడైన ఆట తీరుతో దాదాపు ఏడాదిన్నర కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు జైస్వాల్. ముఖ్యంగా టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయి.. ఇప్పటికే ఎన్నెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడిన జైస్వాల్.. 1798 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం విశేషం.వన్డేల్లో మాత్రం నో ఛాన్స్!ఇక అంతర్జాతీయ టీ20లలో 23 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ ముంబై బ్యాటర్.. 723 రన్స్ సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ(Rohit Sharma)కు జోడీగా, టీ20లలో శుబ్మన్ గిల్(Shubman Gill)కు జంటగా ఓపెనర్గా పాగా వేసిన 23 ఏళ్ల జైసూకు ఇంత వరకు వన్డేల్లో మాత్రం అవకాశం రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ- గిల్లు వన్డేల్లో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ యువ బ్యాటర్కు ఇంత వరకు సెలక్టర్లు పిలుపునివ్వలేదు.మెగా టోర్నీకి ఎంపిక?! అయితే, స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా జైస్వాల్ వన్డేల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనవరి 22 నుంచి భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో జైసూ వన్డే అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనుంది.లిస్ట్-‘ఎ’ క్రికెట్లో గణాంకాలు ఇలాఅందుకే ఈ మెగా టోర్నీకి ముందు జైస్వాల్ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్- గిల్లకు చాంపియన్స్ ట్రోఫీలో బ్యాకప్ ఓపెనర్గా జైస్వాల్ను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంగ్లండ్తో కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఆడించి అతడిని సన్నద్ధం చేయాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో యశస్వి జైస్వాల్ మెరుగైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కేవలం 32 మ్యాచ్లలోనే 1511 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, ఏడు హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ(203) ఉంది.నితీశ్ కుమార్ రెడ్డికి బంపరాఫర్!ఇక జైస్వాల్తో పాటు మరో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆంధ్ర క్రికెటర్ ఇప్పటికే టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో శతకంతో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు.అయితే, ఇప్పట్లో వన్డేల్లో నితీశ్ రెడ్డి అరంగేట్రం చేసే అవకాశం లేకపోయినా.. చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతడు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు రెవ్స్పోర్ట్స్ పేర్కొంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా నితీశ్ రెడ్డి ఎంపికకానున్నట్లు పేర్కొంది. అయితే, ప్రధాన జట్టులో కాకుండా ట్రావెలింగ్ రిజర్వ్స్లో అతడు చోటు సంపాదించనున్నట్లు సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్తో సిరీస్లలోనైనా ఆడిస్తారా? -
మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. దీంతో పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ చేజారిపోయింది.అయితే ఈ సిరీస్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన యశస్వి.. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్, హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు.మొత్తం ఐదు మ్యాచ్లలో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు సహా అతను 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ (448) తర్వాత ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. తాజాగా తన తొలి ఆస్ట్రేలియా పర్యటనపై జైశ్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.‘ఆ్రస్టేలియా గడ్డపై ఎంతో నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తూ మేం ఆశించిన ఫలితం రాలేదు. అయితే మున్ముందు మరింత బలంగా పైకి లేస్తాం. మీ అందరి మద్దతు ఎంతో ప్రోత్సాహించింది’ అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యశస్వి ఈ పోస్ట్ చేశాడు. కాగా జైశ్వాల్ పోస్ట్పై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా స్పందించాడు. నీ పనిని ప్రేమించు బ్రదర్ అంటూ ఖావాజా కామెంట్ చేశాడు.చదవండి: PAK vs SA: రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్ View this post on Instagram A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28) -
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్లో ఓడి, బ్రిస్బేన్లో మ్యాచ్ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్తో ఈ సిరీస్లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.స్టార్క్కు చుక్కలు చూపించిన జైసూఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్లో చితకబాదాడు. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు.ఆల్టైమ్ రికార్డు బ్రేక్అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్గా 145 పరుగుల లీడ్లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డుSometimes JaisWall, sometimes JaisBall! 🔥Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
టీమిండియా ప్లేయర్లు అబద్దాల కోరులు: భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా(Surinder Khanna) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ సేనను ‘అబద్దాల కోరు’గా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు. సరిగ్గా ఆడటం చేతగాకే సాకులు వెదుక్కొంటూ.. వివాదాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.శుభారంభం చేసినా..భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులో ఆడుతోంది. అయితే, పెర్త్లో 295 పరుగుల తేడాతో గెలిచి.. శుభారంభం చేసినా.. తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది.అడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. కాస్త కష్టపడినా కనీసం డ్రా చేసుకోగలిగే మ్యాచ్లో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.జైస్వాల్ అవుటైన తీరుపై వివాదంఇక ఈ మ్యాచ్లో చక్కటి ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్((Yashasvi Jaiswal’s controversial dismissal) జరిగిందంటూ) కావడంతో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో జైసూ.. లెగ్సైడ్ దిశగా షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే, బంతి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది.ఈ నేపథ్యంలో ఆసీస్ అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ స్పందించలేదు. దీంతో కంగారూలు రివ్యూకు వెళ్లగా.. చాలాసార్లు రీప్లేలో చూసినా స్పష్టత రాలేదు. స్నీకో మీటర్లోనూ బంతి బ్యాట్ను లేదంటే గ్లౌవ్ను తాకినట్లుగా శబ్దం రాలేదు. అయినప్పటికీ విజువల్ ఎవిడెన్స్ కారణంగా.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ తారుమారు చేస్తూ.. జైస్వాల్ను అవుట్గా ప్రకటించారు.కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయిఫలితంగా కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమికి బాటలు పడ్డాయి. అయితే, తాను అవుట్ కాలేదని టెక్నాలజీ(స్నీకో) చెబుతున్నా అవుట్గా ప్రకటించడం పట్ల జైస్వాల్ అంపైర్ల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినప్పటికీ వాళ్లు అతడిని మైదానం వీడాల్సిందిగా కోరగా.. ఈ విషయమై వివాదం చెలరరేగింది.మండిపడ్డ సన్నీఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జైస్వాల్ స్పష్టంగా నాటౌట్ అని తెలుస్తున్నా.. ఆసీస్కు అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సురీందర్ ఖన్నా మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించాడు. నిజాయితీ ఆడటం నేర్చుకోండి‘‘ఇందులో వివాదం సృష్టించడానికి తావులేదు. నాలుగు కోణాల్లో పరిశీలించిన తర్వాత బంతి బ్యాటర్ గ్లౌవ్ను తాకి.. అలెక్స్ క్యారీ చేతుల్లో పడినట్లు తేలింది. ఆకాశ్ దీప్ కూడా ఇలాగే.. తాను క్యాచ్ అవుట్ అయినా.. మైదానం వీడకుండా ఫిర్యాదులు చేస్తూ ఉండిపోయాడు.వీళ్లంతా అబద్దాల కోరులు. ముందు నిజాయితీ ఆడటం నేర్చుకోండి. అప్పుడే మీరు గెలుస్తారు. అయినా, బ్యాట్ మన చేతుల్లోనే ఉన్నపుడు.. అది బంతిని లేదంటే గ్లౌవ్ను తాకిందా లేదా స్పష్టంగా తెలుస్తుంది కదా!అందుకే ఓడిపోయాంమనం చెత్తగా ఆడాం కాబట్టే ఓడిపోయాం. ఇంత చెత్తగా ఎవరైనా బ్యాటింగ్ చేస్తారా? రండి వచ్చి ఐపీఎల్లో పరుగులు సాధించండి. మరీ దూకుడుగా ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. సానుకూల దృక్పథంతో ఆడండి.కనీసం కొత్త సంవత్సరంలో అయినా టీమిండియాను అదృష్టం వరిస్తుందో చూడాలి’’ అంటూ సురీందర్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వార్తా సంస్థ IANSతో మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యానించాడు. కాగా ఢిల్లీకి చెందిన సురీందర్ ఖన్నా 1979- 84 మధ్య టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడి.. 176 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరుగనుంది. జనవరి 3-7 మధ్య ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బద్దలు
ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్ చేసిన ఆటగాళ్లుఆయుశ్ మాత్రే 17 ఏళ్ల 168 రోజులుయశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజులురాబిన్ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులుటామ్ ప్రెస్ట్ 19 ఏళ్ల 136 రోజులుమాత్రే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. నాగాలాండ్తో మ్యాచ్లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్లో మాత్రే.. అంగ్క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్కు 156 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ (28 బంతుల్లో 73 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్ చేసింది. శార్దూల్ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్లో బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్తో మెరిసిన శార్దూల్ ఠాకూర్ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్స్టన్ డయాస్ రెండు, సుయాన్ష్ షేడ్గే ఓ వికెట్ దక్కించుకున్నారు. నాగాలాండ్ ఇన్నింగ్స్లో డేగా నిశ్చల్ (5), హేమ్ చెత్రి (2), యుగంధర్ సింగ్ (0), కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ (0), చేతన్ బిస్త్ (0) ఔట్ కాగా.. రుపేరో (22), జే సుచిత్ (9) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో నాగాలాండ్ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.ఈ మ్యాచ్లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్మెంట్ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
అత్యుత్తమ టెస్టు జట్టు కెప్టెన్గా బుమ్రా.. భారత్ నుంచి మరొకరికి చోటు
క్రికెట్ ఆస్ట్రేలియా 2024 ఏడాదికి గానూ అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టు( Cricket Australia's Test team of 2024)ను ప్రకటించింది. ఈ టీమ్కు టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను కెప్టెన్గా ఎంచుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. కేవలం ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రమే చోటిచ్చింది.భారత్ నుంచి మరొకరికి చోటుకాగా 2024లో టెస్టుల్లో సూపర్ ఫామ్లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లతో సీఏ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఉండగా.. జో రూట్(Joe Root) వన్డౌన్ బ్యాటర్గా ఎంపికయ్యాడు.లంక ఆటగాడికి స్థానంఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర.. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ తార హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్ కోటాలో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ క్యారీ స్థానం సంపాదించగా.. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, భారత స్టార్ బుమ్రా, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్వుడ్ ఎంపికయ్యారు. ఏకైక స్పిన్నర్గా కేశవ్ మహరాజ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా 2024కు గానూ ఎంచుకున్న అత్యుత్తమ టెస్టు జట్టుయశస్వి జైస్వాల్(భారత్), బెన్ డకెట్(ఇంగ్లండ్), జో రూట్(ఇంగ్లండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్(శ్రీలంక), అలెక్స్ క్యారీ(ఆస్ట్రేలియా), మ్యాచ్ హెన్రీ(న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్- భారత్), జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా).2024లో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే?యశస్వి జైస్వాల్ఈ ఏడాదిలో 15 టెస్టులాడి 1478 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉనఆయి. అత్యధిక స్కోరు 214బెన్ డకెట్బెన్ డకెట్ 2024లో 17 టెస్టు మ్యాచ్లు ఆడి 1149 రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 153.జో రూట్ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఈ సంవత్సరం 17 టెస్టుల్లో ఆడి 1556 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఆరు శతకాలు, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 262.రచిన్ రవీంద్రకివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఈ ఏడాది 12 టెస్టు మ్యాచ్లలో కలిపి.. 984 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు: 249.హ్యారీ బ్రూక్ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2024లో 12 టెస్టుల్లో కలిపి 1100 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోరు 317.కమిందు మెండిస్శ్రీలంక తరఫున ఈ ఏడాది అద్భుత ఫామ్ కనబరిచిన కమిందు మెండిస్ 9 టెస్టులు ఆడి.. 1049 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. హయ్యస్ట్ స్కోరు: 182.అలెక్స్ క్యారీఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 2024లో తొమ్మిది టెస్టులు ఆడాడు. 42 డిస్మిసల్స్లో భాగం కావడంతో పాటు.. నాలుగు స్టంపౌట్లు చేశాడు. అదే విధంగా.. మూడు అర్ధ శతకాల సాయంతో 440 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98.మ్యాట్ హెన్రీకివీస్ పేసర్ మ్యాచ్ హెన్రీ ఈ ఏడాది తొమ్మిది టెస్టులాడి 48 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 7-67.జస్ప్రీత్ బుమ్రాటీమిండియా వైస్ కెప్టెన్ 2024లో పదమూడు టెస్టు మ్యాచ్లు ఆడి ఏకంగా 71 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 6-45. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరిన ఫాస్ట్బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆసీస్తో తొలి టెస్టుకు సారథ్యం వహించి.. భారత్ను 275 పరుగుల తేడాతో గెలిపించాడు. జోష్ హాజిల్వుడ్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ఈ సంవత్సరం 15 టెస్టు మ్యాచ్లలో కలిపి 35 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5-31.కేశవ్ మహరాజ్సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ ఏడాది 15 టెస్టుల్లో పాల్గొని 35 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5-59. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో సౌతాఫ్రికా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
జైస్వాల్ నాటౌట్.. ఆస్ట్రేలియా మోసం
-
IND Vs AUS: పోరాడినా... ఓటమి తప్పలేదు
భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యం... తొలి సెషన్లో 33/3 స్కోరుతో కాస్త ఆందోళన... అయితే రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా చేజార్చుకోలేదు... దాంతో ఓటమిని తప్పించుకోవడంపై ఆశలు... విరామం తర్వాత 121/3తో మెరుగైన స్థితి... అయితే అనూహ్యంగా 9 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడ్డాయి... పంత్ ఆడిన తప్పుడు షాట్తో ఈ పతనం మొదలైంది... అయినా సరే జైస్వాల్ పట్టుదలగా ఆడుతుండటం, మరో నాలుగు వికెట్లు ఉండటంతో కొంత భరోసా... మరో 21.2 ఓవర్లు నిలబడిగలిగితే చాలు... మ్యాచ్ను ‘డ్రా’గా ముగించవచ్చు... కానీ జైస్వాల్ అవుట్ కావడంతో అంతా మారిపోయింది... అతను వెనుదిరిగిన తర్వాత టీమిండియా ఆట ముగించేందుకు ఆసీస్కు 8.2 ఓవర్లు సరిపోయాయి... ఒక్క సెషన్లోనే 7 వికెట్లు చేజార్చుకున్న భారత్ మరో 12.5 ఓవర్లు మిగిలి ఉన్న దశలో ఓటమిని ఖరారు చేసుకుంది... వరుస మలుపులతో సాగుతూ వచ్చిన మెల్బోర్న్ టెస్టులో చివరకు ఆ్రస్టేలియానే గెలుపు బావుటా ఎగరవేసింది. వేర్వేరు సందర్భాల్లో పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా... వాటిని సమర్థంగా ఉపయోగించుకోలేక రోహిత్ బృందం సిరీస్లో వెనుకబడిపోయింది. ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉండాలంటే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో భారత్ నిలిచింది. మెల్బోర్న్: నాలుగేళ్ల క్రితం ‘గాబా’ మైదానం తరహాలో భారీ లక్ష్యాన్ని ఛేదించి మెల్బోర్న్లో భారత్ సంచలన విజయం సాధిస్తుందని ఆశించిన భారత అభిమానులకు నిరాశ తప్పలేదు. గెలుపు కాదు కదా ... ఓటమి నుంచి తప్పించుకొని ‘డ్రా’గా ముగించే చాన్స్ కూడా ఆ్రస్టేలియా ఇవ్వలేదు. ఎంసీజీలో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 79.1 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (208 బంతుల్లో 84; 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కమిన్స్, బోలండ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, లయన్కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో ఐదు టెస్టుల సిరీస్లో ఆ్రస్టేలియా 2–1తో ముందంజ వేసింది. చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది. మ్యాచ్లో కీలకమైన 90 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. జైస్వాల్ మినహా... సిరీస్లో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న కెపె్టన్ రోహిత్ శర్మ (9) ఈసారి చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ను ఆరంభించాడు. అయితే 40 బంతులు ఎదుర్కొన్న అతను తొలిసారి కమిన్స్ బౌలింగ్లో దూకుడైన షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. అదే ఓవర్లో రాహుల్ (0) కూడా అవుట్ కాగా, స్టార్క్ పదునైన బంతిని డ్రైవ్ చేయబోయిన కోహ్లి (5) కూడా స్లిప్లో చిక్కడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత జైస్వాల్, పంత్ (104 బంతుల్లో 30; 2 ఫోర్లు) సాధికారికంగా ఆడారు. 27.5 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే టీ తర్వాత ఎట్టకేలకు పార్ట్టైమర్ హెడ్తో బౌలింగ్ చేయించిన వ్యూహం ఫలించింది. పంత్ను అవుట్ చేసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. అంతే... ఆ తర్వాత జట్టు పతనం వేగంగా సాగిపోయింది. 34 పరుగుల వ్యవధిలోనే జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. జడేజా (2), నితీశ్ రెడ్డి (1) విఫలం కాగా, సిరాజ్ (0)ను లయన్ ఎల్బీగా అవుట్ చేయడంతో ఆసీస్ సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 228/9తో ఆట కొనసాగించిన ఆసీస్ 234 పరుగులకు ఆలౌటైంది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 474; భారత్ తొలి ఇన్నింగ్స్: 369; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 234; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కేరీ (బి) కమిన్స్ 84; రోహిత్ (సి) మార్‡్ష (బి) కమిన్స్ 9; రాహుల్ (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 5; పంత్ (సి) మార్‡్ష (బి) హెడ్ 30; జడేజా (సి) కేరీ (బి) బోలండ్ 2; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) లయన్ 1; సుందర్ (నాటౌట్) 5; ఆకాశ్దీప్ (సి) హెడ్ (బి) బోలండ్ 7; బుమ్రా (సి) స్మిత్ (బి) బోలండ్ 0; సిరాజ్ (ఎల్బీ) (బి) లయన్ 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–25, 2–25, 3–33, 4–121, 5–127, 6–130, 7–140, 8–150, 9–154, 10–155. బౌలింగ్: స్టార్క్ 16– 8–25–1, కమిన్స్ 18–5–28–3, బోలండ్ 16–7 –39–3, మార్‡్ష 3–2–2–0, లయన్ 20.1–6– 37–2, హెడ్ 5–0–14–1, లబుషేన్ 1–1–0–0. చాలా నిరాశగా ఉంది. చివరి వరకు పోరాడాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగాం కానీ అది సాధ్యం కాలేదు. ఆఖర్లో అంతా మారిపోయింది. టెస్టు మొత్తాన్ని చూస్తే మాకూ కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ మేం వాడుకోలేక పోయాం. వారి చివరి వికెట్ భాగస్వామ్యం కూడా దెబ్బ తీసింది. 340 పరుగులు ఎప్పుడైనా కష్టమే. చివరి రెండు సెషన్లలో ధాటిగా ఆడి లక్ష్యం చేరేందుకు ప్రయతి్నంచేందుకు కావాల్సిన పునాది వేయలేకపోయాం. తర్వాతి టెస్టుకు ముందు కొన్ని లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది. గట్టిగా ప్రయతి్నంచి 2–2గా మార్చే ప్రయత్నం చేస్తాం. నా బ్యాటింగ్ గురించి చెప్పాలంటే మానసికంగా నేను సరైన స్థితిలో లేను. నేను ఏం చేయాలని ప్రయతి్నంచినా కలిసి రావడం లేదు. ఫలితం దక్కకపోవడం నిరాశ కలిగిస్తోందనేది మాత్రం వాస్తవం. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ జైస్వాల్ అవుట్పై వివాదం! చక్కటి ఇన్నింగ్స్తో ఓటమి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్న సమయంలో యశస్వి జైస్వాల్ అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. కమిన్స్ బౌలింగ్లో లెగ్సైడ్ దిశగా వెళుతున్న బంతిని ఆడి కీపర్ కేరీకి అతను క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ విల్సన్ స్పందించకపోవడంతో ఆసీస్ రివ్యూ కోరింది. ఇదే చివరకు చర్చకు దారి తీసింది. వరుస రీప్లేల తర్వాత స్పష్టత రాకపోగా, ‘స్నికో’లో కూడా ఏదీ తేలలేదు. ఇక్కడా బంతి బ్యాట్ను తాకినట్లుగా కనిపించలేదు. అయితే ముందు భాగంనుంచి చూసిన రీప్లేలో బంతి బ్యాట్ను దాటిన తర్వాత దిశను మార్చుకున్నట్లుగా కనిపించింది. దీని ఆధారంగానే అది బ్యాట్కు తగిలిందని చెబుతూ థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ‘అవుట్’గా ప్రకటించడంతో జైస్వాల్ నిరాశగా మైదానం వీడాడు. అయితే ‘స్నికో’ను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ప్రశి్నంచిన సునీల్ గావస్కర్... ఇక సాంకేతికత ఎందుకని, కొన్నిసార్లు బ్యాట్కు తగలకపోయినా బంతి దిశ మార్చుకోవడం సహజమని విమర్శించాడు. మరోవైపు మాజీ అంపైర్ సైమన్ టఫెల్ కూడా ఇది ‘అవుట్’ అని నిర్ధారించాడు. అంపైరింగ్ ప్రొటోకాల్ ప్రకారం బంతి దిశ మార్చుకున్నట్లు కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు టెక్నాలజీ వాడాల్సిన అవసరం లేదని అన్నాడు. భారత కెపె్టన్ రోహిత్ శర్మ కూడా జైస్వాల్ బ్యాట్కి బంతి తాకిందని, అతను అవుట్ అని తేల్చి వివాదానికి ముగింపు పలకడం గమనార్హం. -
‘థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే.. జైస్వాల్ నాటౌట్’
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు((Yashasvi Jaiswal’s controversial dismissal) )పై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. జైసూ నాటౌట్ అని స్పష్టంగా తెలుస్తున్నా.. అవుట్గా ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక ఆధారంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు.సరైన కారణాలు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేయడం ఏమిటని రాజీవ్ శుక్లా(Rajiv Shukla) మండిపడ్డారు. అదే విధంగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఈ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులుఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మెల్బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్టు ఆఖరిరోజైన సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన ఆసీస్ చేతిలో 184 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.ఘోర ఓటమిభారత ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ఒంటరి పోరాటం చేసిన యశస్వి జైస్వాల్ అవుటైన విధానం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఐదో రోజు ఆటలో భాగంగా కమిన్స్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు జైస్వాల్. అయితే, బంతి అతడి గ్లౌవ్ను తాకినట్లుగా కనిపించి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ వికెట్ కోసం అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.ఈ క్రమంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా స్నీకో మీటర్లో స్పైక్ రాకపోయినా.. థర్డ్ అంపైర్ జైస్వాల్ను అవుట్గా ప్రకటించాలని ఫీల్డ్ అంపైర్కు సూచించాడు. దీంతో భారత్ కీలక వికెట్ కోల్పోగా.. మ్యాచ్ పూర్తిగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. ఆఖరికి 184 పరుగుల తేడాతో కంగారూ జట్టు రోహిత్ సేనపై విజయదుందుభి మోగించి.. 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేఅయితే, జైస్వాల్ అవుటా? నాటౌటా? అన్న అంశంపై క్రీడా వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. థర్డ్ అంపైర్ నిర్ణయం వల్ల జైస్వాల్కు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘మీరు సాంకేతికతను ఉపయోగించాలనుకుంటే.. మొత్తంగా దానినే పరిగణనలోకి తీసుకోండి.అంతేకానీ మిథ్యనే నిజమని భావించవద్దు. అక్కడ స్నీకో మీటర్ ఉంది. అందులో లైన్ స్ట్రెయిట్గానే ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా నాటౌట్’’ అని తన అభిప్రాయాన్ని స్టార్ స్పోర్ట్స్ షోలో పంచుకున్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నాడు.సిరీస్లో వెనుకబడిన టీమిండియాకాగా ఆసీస్తో పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ మ్యాచ్లో ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో మూడో టెస్టు డ్రా చేసుకున్న రోహిత్ సేన.. మెల్బోర్న్ టెస్టులో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. కమిన్స్ బృందం విధించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 155 పరుగులకే కుప్పకూలింది. ఇరుజట్ల మధ్య జనవరి 3న సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మొదలుకానుంది. ఇక జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో 82 పరుగులు చేసి దురదృష్టకరరీతిలో రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 84 పరుగుల వద్ద థర్డ్ అంపైర్ నిర్ణయానికి బలయ్యాడు.చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 నామినీస్ వీరే.. జైస్వాల్కు నో ఛాన్స్
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 నామినీస్ జాబితాను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 30) విడుదల చేసింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్.. శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నామినేట్ కాగా.. బౌలింగ్ విభాగం నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే నామినేట్ అయ్యాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డుకు నామినేట్ కాకపోవడం గమనార్హం. జైస్వాల్ (29 ఇన్నింగ్స్ల్లో 1478 పరుగులు) ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ కాకుండా అతని కంటే తక్కువ పరుగులు చేసిన కమిందు మెండిస్, హ్యారీ బ్రూక్ ఐసీసీ అవార్డుకు నామినేట్ కావడం విశేషం.రూట్: టెస్ట్ల్లో ఈ ఏడాది రూట్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రూట్ ఈ ఏడాది 31 ఇన్నింగ్స్ల్లో 1556 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. రూట్ ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు దాటడం ఇది ఐదో సారి. రూట్ ఈ ఏడాది ఆరు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. రూట్ బౌలింగ్లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రూట్ ఈ ఏడాదే తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ను సాధించాడు. ముల్తాన్ టెస్ట్లో రూట్ పాక్పై డబుల్ సెంచరీ (262) చేశాడు. బుమ్రా: బుమ్రా ఈ ఏడాది ఏ ఇతర బౌలర్ చేయనటువంటి అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా ఈ ఏడాది 13 టెస్ట్ల్లో 14.92 సగటున 71 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో బుమ్రా టాప్లో ఉండగా.. అతని దరిదాపుల్లో ఏ బౌలర్ లేడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బుమ్రా తర్వాత అత్యధికంగా 52 వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాతి స్థానాల్లో సిరాజ్ (35), కమిన్స్ (37), సౌధీ (17) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 4 మ్యాచ్ల్లో 30 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.బ్రూక్: బ్రూక్ ఈ ఏడాది అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. బ్రూక్ ఈ ఏడాది 20 ఇన్నింగ్స్ల్లో నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 1100 పరుగులు చేశాడు. బ్రూక్ ముల్తాన్ టెస్ట్లో పాక్పై ట్రిపుల్ సెంచరీ (317) చేశాడు. బ్రూక్ ఈ ఏడాది చేసిన పరుగుల్లో అత్యధిక శాతం విదేశాల్లో చేసినవే కావడం విశేషం. బ్రూక్ ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో కొద్ది కాలం పాటు నంబర్ వన్ బ్యాటర్గానూ కొనసాగాడు.కమిందు మెండిస్: శ్రీలంక యువ ఆటగాడు కమిందు మెండిస్ ఈ ఏడాది టెస్ట్ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కమిందు ఐదో స్థానంలో నిలిచాడు. కమిందు ఈ ఏడాది 16 ఇన్నింగ్స్ల్లో 74.92 సగటున 1049 పరుగులు చేశాడు. -
మెల్బోర్న్ టెస్టులో 184పరుగుల తేడాతో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
జైస్వాల్ అవుటా? నాటౌటా?.. అంపైర్ కళ్లకు ఏమైంది?
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్నీకో మీటర్లో స్పైక్ రాకున్నా జైసూను అవుట్గా ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో భారత బ్యాటర్కు అన్యాయం(Yashasvi Jaiswal’s controversial dismissal) జరిగిందంటూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా.. మూడు టెస్టులు పూర్తి చేసుకుని ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టు భారత్కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఆది నుంచే తడ‘బ్యా’టు.. ‘స్టార్లు’ దారుణంగా విఫలంఇంతటి కీలక టెస్టులో ఆది నుంచే తడబడ్డ టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్(82) అద్భుత ఇన్నింగ్స్.. నితీశ్ కుమార్ రెడ్డి(114) శతకం వల్ల మ్యాచ్లో నిలవగలిగింది. ఇక ఆసీస్ను రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకే కట్టడి చేసి భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు సజీవం చేశారు.ఈ క్రమంలో ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. మళ్లీ పాత కథే పునరావృతమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(9), కేఎల్ రాహుల్(0), విరాట్ కోహ్లి(5) పూర్తిగా విఫలమయ్యారు. అయితే, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆది నుంచి క్రీజులో పాతుకుపోయి.. ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.పంత్ కాసేపురిషభ్ పంత్(Rishabh Pant- 30)తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు జైస్వాల్. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి మాత్రం అతడికి పెద్దగా సహకారం అందలేదు. అయినప్పటికీ పట్టుదలగా నిలబడ్డ జైసూ.. అనూహ్య రీతిలో పెవిలియన్ చేరాల్సి వచ్చింది.నాటౌట్ ఇచ్చిన ఫీల్డ్ అంపైర్ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో షార్ట్ బాల్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైన జైసూ.. షాట్ కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. అయితే, ఆస్ట్రేలియా అప్పీలు చేసినా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.స్పైక్ రాలేదు.. అయినాదీంతో ఆసీస్ రివ్యూకు వెళ్లగా.. థర్డ్ అంపైర్ నిర్ణయం కీలకంగా మారింది. అయితే, బంతి బ్యాట్ను లేదంటే గ్లౌవ్ను తాకిందా అన్న విషయం స్పష్టంగా కనబడలేదు. అంతేకాదు.. శబ్దాన్ని సూచించే స్నీకో మీటర్లోనూ స్పైక్ రాలేదు. అయినప్పటికీ తనకు బంతి గ్లౌవ్ను తాకినట్లుగా కనిపించిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు.ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేసి.. జైస్వాల్ను అవుట్గా ప్రకటించాలని సూచించాడు. దీంతో టీమిండియా కీలక వికెట్ కోల్పోయింది. 208 బంతులు ఎదుర్కొని 84 పరుగులు చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఏడో వికెట్గా అతడు వెనుదిరిగాడు.అయితే, తనను అవుట్గా ప్రకటించడం పట్ల జైసూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు అతడిని మైదానం వీడాల్సిందిగా సూచించడంతో నిరాశగా వెనుదిరిగాడు.అంపైర్కు కళ్లు కనిపించడం లేదా?ఈ నేపథ్యంలో జైస్వాల్ అవుటైన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెక్నికల్ ఎవిడెన్స్ కాకుండా.. కేవలం విజువల్ ఎవిడెన్స్ ద్వారా.. అది కూడా క్లారిటీ లేకుండా బ్యాటర్ను ఎలా అవుట్గా పరిగణిస్తారని టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంపైర్కు కళ్లు కనిపించడం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్లో 1-2తో వెనుకబడి ఉంది.చదవండి: వారి మాటలు తప్పని నిరూపించా.. ఇక మిగిలింది అదే: నితీశ్ రెడ్డిThird Umpire giving the decision on Yashasvi Jaiswal. pic.twitter.com/HVYzaNkLlf— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2024 -
బెయిల్స్ మార్చిన స్టార్క్.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్! వీడియో వైరల్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 340 పరుగుల లక్ష్య చేధనలో భారత్ పోరాడుతోంది. ఆఖరి రోజు తొలి సెషన్లో ఆస్ట్రేలియా బౌలర్లు పైచేయి సాధించగా.. రెండో సెషన్లో మాత్రం టీమిండియా అద్బుతంగా తిరిగి పుంజుకుంది.యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆఖరి రోజు ఆటలో యశస్వి జైశ్వాల్, ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.ఏమి జరిగిందంటే?అద్భుతంగా ఆడుతున్న జైశ్వాల్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు స్టార్క్ నాన్-స్ట్రైకర్ ఎండ్లో వికెట్లపై ఉన్న బెయిల్స్ను మార్చాడు. ఈ క్రమంలో జైస్వాల్ అసంతృప్తికి గురయ్యాడు. స్టార్క్ తన రన్ ఆప్ను తీసుకునేందుకు వెళ్లిన వెంటనే యశస్వి బెయిల్స్ను తిరిగి మార్చాడు.దీంతో బంతి వేసిన తర్వాత జైశ్వాల్ను స్టార్క్ ఏదో అన్నాడు. జైశ్వాల్ కూడా అందుకు ధీటుగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.క్రీజులో జైశ్వాల్(61 నాటౌట్), పంత్(22) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 236 పరుగులు అవసరమవ్వగా.. ఆసీస్కు 7 వికెట్లు కావాలి.అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత్ డ్రా కోసం ఆడుతున్నట్లు అన్పిస్తోంది.చదవండి: IND vs AUS: 'ఇక ఆడింది చాలు.. రిటైర్ అయిపో రోహిత్'..Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C— cricket.com.au (@cricketcomau) December 30, 2024 Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C— cricket.com.au (@cricketcomau) December 30, 2024 -
ఈజీ క్యాచ్లు విడిచిపెట్టిన జైశ్వాల్.. కోపంతో ఊగిపోయిన రోహిత్
మెల్బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. నాలుగో రోజు ఆటలో తొలి రెండు సెషన్స్లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తే.. ఆఖరి సెషన్లో ఆసీస్ అద్బుతమైన కమ్బ్యాక్ చేసింది. 173 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ను టెయిలాండర్లు నాథన్ లియోన్(41 నాటౌట్), స్కాట్ బోలాండ్(10 నాటౌట్) విరోచిత పోరాటం కనబరిచారు.ఆఖరి వికెట్కు వీరిద్దరూ 55 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 333 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.జైశ్వాల్పై రోహిత్ ఫైర్..కాగా ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ ఫీల్డింగ్లో తీవ్ర నిరాశపరిచాడు. మూడు క్యాచ్లను జైశ్వాల్ జారవిడిచాడు. తొలుత 2 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన క్యాచ్ను యశస్వి విడిచిపెట్టాడు. అయితే ఆ క్యాచ్ అందుకోవడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాత మాత్రం లబుషేన్, కమ్మిన్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్లను మాత్రం ముంబైకర్ నేలపాలు చేశాడు. ఆసీస్ స్కోర్ 99/6 ఉన్నప్పుడు.. ఆకాష్ దీప్ బౌలింగ్లో ఓ బంతి లబుషేన్ బ్యాట్కు తాకి గల్లీ పొజిషేన్లో ఉన్న జైశ్వాల్ చేతికి వెళ్లింది. అయితే ఆ బంతిని అందుకోవడంలో యువ ఆటగాడు విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ..జైశ్వాల్పై సీరియస్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: WTC 2023-25: పాకిస్తాన్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్కు సౌతాఫ్రికా -
పాపం జైస్వాల్.. కోహ్లి క్షమాపణ చెప్పాలి!.. తప్పు ఎవరిది?
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ దిశగా పయనించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. స్వీయ తప్పిదం కారణంగా రనౌట్(#Yashasvi Jaiswal Run Out) అయ్యాడు. అయితే, కొంత మంది మాత్రం జైస్వాల్ పెవిలియన్ చేరడానికి విరాట్ కోహ్లి(#Virat Kohli)నే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఆసీస్ భారీ స్కోరుబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. ఇప్పటికి మూడు మ్యాచ్లు ముగియగా.. 1-1తో సమంగా ఉన్న ఇరుజట్ల మధ్య.. గురువారం నాలుగో టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ రెండు, వాషింగ్టన్ సుందర్కు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్కు శుభారంభం లభించినా.. ఆఖర్లో మాత్రం గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి.రోహిత్ మరోసారి విఫలంకెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma Fails Again- 3) మరోసారి నిరాశపరచగా.. మూడో స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్(24) కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(82), విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జైస్వాల్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు.పరుగు కోసం యత్నించిన జైస్వాల్టీమిండియా ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బంతితో బరిలోకి దిగగా.. ఆఖరి బంతికి జైస్వాల్ మిడాన్దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో మరో ఎండ్లో ఉన్న కోహ్లి.. ఫీల్డర్ల వైపు చూస్తూ ఉండగా.. అప్పటికే జైస్వాల్ క్రీజును వీడాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్వైపు దూసుకురాగా.. అప్పటికి కోహ్లి కూడా తన ప్లేస్లోకి తిరిగి వచ్చేశాడు.జైస్వాల్ రనౌట్.. శతక భాగస్వామ్యానికి తెరఅప్పటికి బంతిని అందుకున్న ఫీల్డర్ కమిన్స్ స్టంప్స్ వైపు బంతిని విసరగా.. మిస్ అయింది. అయితే, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వేగంగా స్పందించి స్టంప్స్ను గిరాటేయడంతో జైస్వాల్ రనౌటయ్యాడు. ఫలితంగా జైస్వాల్- కోహ్లి శతక భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 102 పరుగులు జోడించారు.అంతా తలకిందులుఅయితే, జైస్వాల్ అవుటైన కాసేపటికే కోహ్లి కూడా పెవిలియన్ చేరాడు. బోలాండ్ బౌలింగ్లో క్యారీకి క్యాచ్ ఇచ్చి 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ రెండు, స్కాట్ బోలాండ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.కాగా జైస్వాల్కు రనౌట్కు కోహ్లినే కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. యువ బ్యాటర్కు కోహ్లి క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించాడు. అయితే, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం.. రనౌట్ విషయంలో జైస్వాల్దే తప్పని.. అందుకు కోహ్లిని నిందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.చదవండి: IND Vs AUS 4th Test: ‘జట్టుకు భారంగా మారావు.. మర్యాదగా తప్పుకుంటే మంచిది’A massive mix-up between Virat Kohli and Yashasvi Jaiswal sees Jaiswal run out for 82! #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/a9G4uZwYIk— cricket.com.au (@cricketcomau) December 27, 2024 -
గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియాకు శుభారంభం లభించలేదు. తొలిరోజు అద్భుత ఆట తీరు కనబరిచిన ఆతిథ్య ఆసీస్ పైచేయి సాధించింది. ఆది నుంచి భారత జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తూ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడానికి టీమిండియా బౌలర్లు కష్టపడాల్సి వచ్చింది.భారత బౌలర్ల సహనానికి పరీక్షముఖ్యంగా అరంగేట్ర ఓపెనర్, 19 ఏళ్ల సామ్ కొన్స్టాస్(Sam Konstas) కొరకరాని కొయ్యగా మారి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ అనుభవజ్ఞుడిలా దూకుడు ప్రదర్శించాడు. అయితే, ఎట్టకేలకు రవీంద్ర జడేజా కొన్స్టాస్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది.మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) కూడా అర్ధ శతకాలతో రాణించగా.. ట్రవిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(4) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(31) కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక స్టీవ్ స్మిత్ సైతం బ్యాట్ ఝులిపించాడు. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి స్మిత్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అజేయంగా నిలిచాడు.సహనం కోల్పోయిన రోహిత్ఈ నేపథ్యంలో చిరాకెత్తిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మైదానంలోనే చాలాసార్లు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఫీల్డింగ్ విషయంలో నిర్లక్ష్యంగా కనిపించిన యశస్వి జైస్వాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డూ బౌలింగ్లో స్మిత్ డిఫెన్సివ్ షాట్ ఆడగా.. సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్(Yashasvi Jaiswal) బంతిని ఆపాల్సింది పోయి.. జంప్ చేశాడు.ఏయ్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?అంతేకాదు.. అక్కడి నుంచి కొంచెం కూడా కదలకుండా అలాగే నిల్చుండిపోయాడు. ఇక జడ్డూ అప్పటికే బంతిని ఆపేందుకు పరుగెత్తాడు. ఈ ఘటన నేపథ్యంలో అసహనానికి గురైన రోహిత్ శర్మ.. ‘‘ఏయ్ జైసూ.. ఇక్కడ ఏమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? బ్యాటర్ బంతిని టచ్ చేసేంత వరకు నీ పొజిషన్లోనే ఉండు. కింద కూర్చున్నట్లుగానే ఉండు. అంతేగానీ.. నిలబడేందుకు ప్రయత్నించకు’’ అంటూ చివాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.తొలిరోజు కంగారూలదేకాగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మొదటిరోజే మెరుగైన స్కోరు సాధించింది. బాక్సింగ్ డే(క్రిస్మస్ తెల్లవారి) మ్యాచ్లో టాపార్డర్ దంచికొట్టడంతో మూడు వందల పైచిలుకు స్కోరు సాధించింది. 86 ఓవర్ల ఆటలో ఆరు వికెట్లు నష్టపోయి 311 రన్స్ చేసింది. ఇక స్టీవ్ స్మిత్ 68, ప్యాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి: IND vs AUS: బుమ్రా సూపర్ బాల్..హెడ్ మైండ్ బ్లాంక్! వీడియోStump Mic Gold ft. THE BEST, @ImRo45! 🎙️😂The Indian skipper never fails to entertain when he’s near the mic! 😁#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a— Star Sports (@StarSportsIndia) December 26, 2024 -
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్లో నంబర్వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్వన్గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ను కొనియాడాడు.ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.మనోళ్ల పరిస్థితి ఏంటి?ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (890) తన నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. చదవండి: యశస్వి జైస్వాల్పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
యశస్వి జైస్వాల్పై రోహిత్ శర్మ ఫైర్
టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్పై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా అతడి తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.మూడో టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్కుఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్లో జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా.. ఆసీస్ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా భారత జట్టుకు భంగపాటు తప్పలేదు. అడిలైడ్లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.ఫలితంగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్- భారత్ మధ్య శనివారం(డిసెంబరు 14) నుంచి మూడో టెస్టు జరుగనుంది. ఇందుకోసం టీమిండియా అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ చేరుకునే క్రమంలో జైస్వాల్ చేసిన పొరపాటు రోహిత్ ఆగ్రహానికి కారణమైనట్లు వార్తలు వచ్చాయి.అతడు లేకుండానే వెళ్లిపోయిన బస్!అడిలైడ్లో తాము బస చేసిన హోటల్ నుంచి ఎయిర్పోర్టుకు బయల్దేరేటపుడు యశస్వి జైస్వాల్ ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. సహచర ఆటగాళ్లు, హెడ్ కోచ్ గౌతం గంభీర్ తదితరులు అతడి కోసం సుమారు 20 నిమిషాల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందట. అయినప్పటికీ యశస్వి రాకపోవడంతో టీమ్ బస్ అతడు లేకుండానే నిష్క్రమించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో టీమిండియా భద్రతా అధికారి.. హోటల్కు చెందిన కారులో యశస్వి జైస్వాల్ ఒక్కడిని ప్రత్యేకంగా ఎయిర్పోర్టుకు తీసుకువెళ్లినట్లు సమాచారం. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు కోపమొచ్చినట్లు తెలుస్తోంది.కోహ్లి, బుమ్రా కుటుంబాలు ప్రత్యేక విమానంలోఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తమ కుటుంబాలను కూడా ఆస్ట్రేలియాకు తీసుకువచ్చారు. కోహ్లి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్లతో పాటు బుమ్రా సతీమణి సంజనా గణేషన్, కుమారుడు అంగద్.. అంతా కలిసి చార్టెడ్ ఫ్లైట్లో బ్రిస్బేన్ చేరుకున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో జైస్వాల్ది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. భారీ శతకం(161) బాది అతడు జట్టు గెలుపులో భాగమయ్యాడు.చదవండి: IND vs AUS: 'రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ ఉన్నాడు.. టెస్టు క్రికెట్కు పనికిరాడు'Adelaide ✅Hello Brisbane 👋#TeamIndia | #AUSvIND pic.twitter.com/V3QJc3fgfL— BCCI (@BCCI) December 11, 2024 -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్ను అందుకున్నాడు. అద్బుతమైన క్యాచ్తో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ను యశస్వి పెవిలియన్కు పంపాడు.గత కొంత కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న లబుషేన్ ఈ మ్యాచ్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లు సైతం సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. మరో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు నితీశ్ రెడ్డిని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎటాక్లో తీసుకువచ్చాడు. అయితే రోహిత్ ప్లాన్ సఫలమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ 55వ ఓవర్ వేసిన నితీష్ మూడో బంతిని షార్ట్ అండ్ వైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జైశ్వాల్ అద్బుతం చేశాడు. తన పొజిషన్కు కుడివైపునకు కదులుతూ సంచలన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన లబుషేన్(64) బిత్తరపోయాడు.కోహ్లి రియాక్షన్ వైరల్..ఇక జైశ్వాల్ క్యాచ్ అందుకోగానే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కోహ్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆసీస్ ప్రేక్షకుల వైపు చూస్తూ సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్లో చిక్కుకున్న స్మిత్! వీడియో pic.twitter.com/e9HmixGbG2— Sunil Gavaskar (@gavaskar_theman) December 7, 2024 -
తొలి బంతికే ఔట్.. జైశ్వాల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో మొదటి బంతికే జైశ్వాల్ పెవిలియన్కు చేరాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన జైశ్వాల్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా గడ్డపై తొలి బంతికే ఔటైన నాలుగో ప్లేయర్గా జైశ్వాల్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జాబితాలో యశస్వి కంటే ముందు ఆర్చీ మాక్లారెన్ (ఇంగ్లండ్), స్టాన్ వర్తింగ్టన్ (ఇంగ్లండ్), రోరీ బర్న్స్ (ఇంగ్లండ్) ఉన్నారు.ఓవరాల్గా ఓ టెస్టు మ్యాచ్లో తొలి బంతికే ఔటైన ఏడో భారత బ్యాటర్గా జైస్వాల్ నిలిచాడు. చివరగా జైశ్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ 2017లో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా జైశ్వాల్ తొలి టెస్టులో కూడా మొదటి ఇన్నింగ్స్లో డకౌటయ్యాడు. కానీ తర్వాత రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్భుమైన సెంచరీతో చెలరేగాడు.టెస్టుల్లో గోల్డెన్ డకౌటైన భారత ఆటగాళ్లు వీరే..సునీల్ గవాస్కర్, 1974 vs ఇంగ్లండ్ఎస్ నాయక్, 1974 vs ఇంగ్లండ్సునీల్ గవాస్కర్, 1983 vs వెస్టిండీస్సునీల్గవాస్కర్, 1987 vs పాకిస్తాన్వి రామన్, 1990 vs న్యూజిలాండ్ఎస్ దాస్, 2002, వెస్టిండీస్వసీం జాఫర్, 2007 vs బంగ్లాదేశ్కేఎల్ రాహుల్, 2017 vs శ్రీలంకచదవండి: IND vs AUS: ఏంటి రాహుల్ ఇది?.. ఒకే ఓవర్లో రెండు ఛాన్స్లు వచ్చినా! వీడియో -
ఆ రోజు జైశ్వాల్ ఏమన్నాడో వినలేదు.. కానీ అతడికి అస్సలు భయం లేదు: స్టార్క్
పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆసీస్ స్టార్ పేసర్ మిచిల్ స్టార్క్ను భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా "నువ్వు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నావు" అని స్టార్క్ అన్నాడు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయింది. అయితే ఆ సమయంలో స్టార్క్ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఇదే విషయంపై మిచిల్ స్టార్క్ స్పందించాడు. ఆ సమయంలో యశస్వి అన్న మాటలను తను వినలేదని స్టార్క్ చెప్పుకొచ్చాడు.వాస్తవానికి ఆ రోజు నేను చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తానని జైశ్వాల్ చెప్పడం నేను వినలేదు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలనుకోవడం లేదు. కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. మూడో రోజు ఆటలో ఓ షార్ట్ పిచ్ డెలివరీని జైశ్వాల్ ప్లిక్ షాట్ ఆడాడు.ఆ బంతిని అతడు సిక్సర్గా మలిచాడు. మరోసారి దాదాపుగా అలాంటి బంతినే వేశాను. కానీ ఈసారి అతడు డిఫెన్స్ ఆడాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఫ్లిక్ షాట్ ఎక్కడ? అని అడిగాను. అతడు నన్ను చూసి నవ్వాడు. దీంతో ఆ విషయాన్ని ఇద్దరం అక్కడితో వదిలేశామని" స్టార్క్ క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా జైశ్వాల్పై స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో భయంలేని బ్యాటర్లలో జైశ్వాల్ ఒకడిని, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాడని స్టార్క్ కొనియాడాడు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ఆసీస్తో రెండో టెస్టు.. టీమిండియా ఓపెనర్లుగా వారే: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘పింక్ బాల్’ టెస్టులో భారత ఓపెనింగ్ జోడీపై స్పష్టతనిచ్చాడు. యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారని హిట్మ్యాన్ పేర్కొన్నాడు.ఇక.. తాను మిడిలార్డర్లో బరిలోకి దిగుతానని చెప్పిన రోహిత్ శర్మ.. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తనకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమేనని.. అయినా జట్టు కోసం ఓపెనింగ్ స్థానం త్యాగం చేయక తప్పలేదని పేర్కొన్నాడు.పితృత్వ సెలవులుకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. తన భార్య రితికా సజ్దే కుమారుడు అహాన్కు జన్మనివ్వడంతో పితృత్వ సెలవులు తీసుకున్నాడు. అయితే, మొదటి టెస్టు మధ్యలోనే ముంబై నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు హిట్మ్యాన్.జైస్వాల్తో కలిసి రాణించిన రాహుల్ఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులో రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించగా.. యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్లో భారీ శతకం(161) బాదాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్(26, 77) సైతం మెరుగ్గా రాణించాడు.అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనింగ్ జోడీని మారుస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. రాహుల్ను మిడిలార్డర్లోకి పంపి రోహిత్ ఓపెనర్గా వస్తాడేమోనని అంతా భావించారు. అయితే, తానే మిడిలార్డర్లో వస్తానని రోహిత్ శర్మ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పింక్ బాల్తోకాగా అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్. దీనిని పింక్ బాల్తో నిర్వహిస్తారు. ఇక ఇందుకోసం రోహిత్ సేన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో మిడిలార్డర్లో వచ్చిన రోహిత్ శర్మ(3) విఫలం కాగా.. ఓపెనర్లు జైస్వాల్ 45, రాహుల్ 27(రిటైర్డ్ హర్ట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
జైస్వాల్ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి ఎగబాకాడు. బ్రూక్.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వెనక్కు నెట్టి ఈ స్థానానికి చేరుకున్నాడు. గడిచిన వారంలో బ్రూక్, జైస్వాల్ ఇద్దరూ మంచి ప్రదర్శనలే చేసినప్పటికీ.. ర్యాంకింగ్స్లో మాత్రం బ్రూక్ ముందుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో యశస్వి 161 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా.. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బ్రూక్ 171 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ర్యాంకింగ్స్లో యశస్వి ర్యాంక్ దిగజారినప్పటికీ అతని రేటింగ్ పాయింట్లు మాత్రం మెరుగుపడ్డాయి.మరోవైపు ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లి సైతం సెంచరీ చేసినప్పటికీ ఓ ర్యాంక్ కోల్పోయి 14వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా ఏకంగా 14 స్థానాలు మెరుగపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక ఆటగాడు కమిందు మెండిస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత్ తరఫున రిషబ్ పంత్ ఆరో నంబర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్వుడ్, అశ్విన్ టాప్-4లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్లో కమిన్స్, రవీంద్ర జడేజా, నాథన్ లయోన్ తలో స్థానం మెరుగుపర్చుకుని 5, 6, 7 స్థానాలకు చేరుకోగా.. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జన్సెన్ ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. జన్సెన్ ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్ ఆల్రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్లో కొనసాగుతుండగా.. జన్సెన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. -
రోహిత్ వచ్చాడు!.. మరి మీ పరిస్థితి ఏంటి?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న పింక్ బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్లో తలమునకలైంది. ఇక ఈ టెస్టు కోసం రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరడంతో.. భారత తుదిజట్టు కూర్పుపై చర్చలు నడుస్తున్నాయి.రాణించిన రాహుల్కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ గైర్హాజరైన నేపథ్యంలో.. పెర్త్లో ఆసీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు. ఈ పేస్ బౌలర్ కెప్టెన్సీల్లో భారత్ కంగారూలను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ విజయంలో.. బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(161), కేఎల్ రాహుల్(77)లతో పాటు విరాట్ కోహ్లి(100 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఓపెనర్గా వస్తాడా? లేదంటే ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రాకతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అడిలైడ్ టెస్టులో ఈ కర్ణాటక బ్యాటర్ ఓపెనర్గా వస్తాడా? లేదంటే మిడిలార్డర్లో బరిలోకి దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తుదిజట్టులో చోటు ఉండాలి కదా!‘‘ముందుగా నాకు తుదిజట్టులో చోటు దక్కడమే ముఖ్యం. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడతా. ఓపెనర్గా అయినా.. మిడిలార్డర్ బ్యాటర్గా అయినా జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తా.మొదట్లో కాస్త కష్టంగా ఉండేది..ఇప్పటి వరకు నా కెరీర్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. అయితే, అది కూడా టెక్నిక్ పరంగా కాకుండా.. మానసికంగా కాస్త ఇబ్బందిగా ఉండేది. తొలి 20 -25 బంతుల పాటు కఠినంగా తోచేది.ఇక ఇప్పటికి చాలాసార్లు నేను టెస్టుల్లో, వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో ఆడాను కాబట్టి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ స్థానంలో ఎలా ఆడాలో నాకు స్పష్టత ఉంది. తొలి 30- 40 బంతుల పాటు నిలదొక్కుకోగలిగితే.. ఆ తర్వాత నా రెగ్యులర్ స్టైల్లో ముందుకు సాగడం తేలికవుతుంది’’ అని స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.విదేశీ గడ్డపై ఐదుకాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు తన కెరీర్లో 54 టెస్టులు ఆడి 3084 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది శతకాలు ఉండగా.. వీటిలో రెండు సౌతాఫ్రికా, రెండు ఇంగ్లండ్, ఒకటి ఆస్ట్రేలియాలో సాధించినవి. ఇక పెర్త్ టెస్టులోనూ రాహుల్ తొలి ఇన్నింగ్స్లో 26 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్లో కీలకమైన అర్ధ శతకం(77)తో రాణించాడు.శుబ్మన్ గిల్ కూడా వచ్చేశాడుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మతో పాటు శుబ్మన్ గిల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మారటంతో పాటు.. ధ్రువ్ జురెల్పై వేటు పడే అవకాశం ఉంది. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
వాళ్లు కూడా స్లెడ్జ్ చేశారు.. ఈసారి గనుక ఛాన్స్ ఇస్తే: ఆసీస్ మాజీ క్రికెటర్ వార్నింగ్
ప్యాట్ కమిన్స్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శల వర్షం కురిపించాడు. పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్ల చేతిలోనూ మానసికంగా ఓడిపోయారంటూ ఎద్దేవా చేశాడు. జట్టులో ఏ ఒక్కరిలోనూ పోరాటపటిమ కనబడలేదని.. ఇకనైనా కాస్త ఆటపై దృష్టి పెట్టి విజయాల బాటపట్టాలని సూచించాడు. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాషెస్ సిరీస్ మాదిరేఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ మాదిరే కంగారూ జట్టుకు ఈ సిరీస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఇక టీమిండియాతో టెస్టు అంటే కేవలం ఆటకే పరిమితం కాకుండా ప్లేయర్లు స్లెడ్జింగ్ చేయడంలోనూ ముందే ఉంటారు. అందుకు తగ్గట్లుగా భారత ఆటగాళ్లూ బదులిచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.స్లోగా బౌల్ చేస్తున్నాడుఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులోనూ ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నా.. వాటి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది. అయితే, ఈ టీజింగ్ మూమెంట్లలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ను ఉద్దేశించి చాలా స్లోగా బౌల్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యానించడం హైలైట్గా నిలిచింది.295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిమరోవైపు.. స్టార్క్.. భారత అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాను ఉద్దేశించి.. ‘‘నీకంటే నేనే ఫాస్ట్గా బౌల్ చేస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, రాణా చిరునవ్వుతోనే స్టార్క్కు బదులిచ్చాడు. అయితే, అతడిని అవుట్ చేసి తన సత్తా చాటడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా చేతిలో ఆసీస్ 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?ఈ నేపథ్యంలో మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బయటి నుంచి ప్రేక్షకుడిగా మ్యాచ్ చూస్తున్న నాకు.. ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏమాత్రం పోరాటపటిమ కనిపించలేదు. ముఖ్యంగా ఓ అరంగేట్ర ఆటగాడు.. యువ ఓపెనర్.. మన సొంతగడ్డ మీద.. మిచెల్ స్టార్క్ను స్లెడ్జ్ చేస్తూ.. స్లోగా బౌలింగ్ చేస్తున్నావనడం.. అయినా మనలో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.బ్యాట్తోనూ.. బాల్తోనూ మనం సమాధానం ఇవ్వలేకపోయాం. అసలు ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?’’ అని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్కు రాసిన కాలమ్లో ఆసీస్ జట్టును విమర్శించాడు. ఇక టీమిండియాకు భయపడితే పనులు జరగవని.. అడిలైడ్లో మాత్రం తప్పక విజృంభించాలని కమిన్స్ బృందానికి మిచెల్ జాన్సన్ సూచించాడు.ఈసారి గనుక ఛాన్స్ ఇస్తేలేనిపక్షంలో వాళ్లను ఎదుర్కోవడం మరింత కష్టమవుతుందని టీమిండియా గురించి ఆసీస్కు మిచెల్ జాన్సన్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పింక్ బాల్తో జరిగే ఈ టెస్టులోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉన్న టీమిండియా.. అందుకు తగ్గట్లుగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో గులాబీ బంతితో సాధన చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్లో పీఎం ఎలెవన్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.ఇక తొలి టెస్టుకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుబ్మన్ గిల్ రెండో టెస్టు కోసం భారత జట్టుతో చేరారు. మరోవైపు.. జోష్ హాజిల్వుడ్, మిచెల్ మార్ష్ గాయాల రూపంలో ఆసీస్కు షాక్ తగిలింది. కాగా ఆసీస్- భారత్ మధ్య మొత్తం ఐదు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: వెళ్లు వెళ్లు.. వెనక్కి వెళ్లు: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! ఆఖరికి..
ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్(Prime Ministers XI)తో మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. తద్వారా భారత ఇన్నింగ్స్లో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. పీఎం ఎలెవన్తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్కు కోపమొచ్చింది.తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన ఆసీస్ పేసర్ జాక్ నిస్బెట్(Jack Nisbet)కు బ్యాట్తో పాటు.. నోటితోనూ గట్టిగానే సమాధానమిచ్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్లో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్లో రెండో టెస్టు ఆడనుంది.తొలిరోజు ఆట టాస్ పడకుంగానే అయితే, పింక్ బాల్తో నిర్వహించే ఈ మ్యాచ్కు సన్నద్ధమయ్యే క్రమంలో.. ఆసీస్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. రెండురోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా శనివారం నాటి తొలిరోజు ఆట టాస్ పడకుంగానే ముగిసిపోగా.. రెండో రోజు సవ్యంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్ను 46 ఓవర్లకు కుదించారు.కాన్స్టాస్ శతకంకాన్బెర్రా వేదికగా ఆదివారం టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పీఎం ఎలెవన్ జట్టు ఓపెనర్ సామ్ కాన్స్టాస్ శతకం(107)తో చెలరేగగా.. మిగతా వాళ్లలో హనో జాకబ్స్(61), జాక్ క్లేటన్(40) మెరుగ్గా రాణించారు. మిగతా వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పీఎం జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో పేసర్లు హర్షిత్ రాణా నాలుగు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ రెండు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజకు తలా ఒక వికెట్ దక్కింది. 42.5 ఓవర్లలోనే ఛేదించినాఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ శుభారంభం అందించగా.. కేఎల్ రాహుల్(27 రిటైర్డ్ హర్ట్), శుబ్మన్ గిల్(50- రిటైర్డ్ హర్ట్) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ(3) మాత్రం విఫలం కాగా.. నితీశ్ రెడ్డి(42), వాషింగ్టన్ సుందర్(42 నాటౌట్) అదరగొట్టారు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా(27) ఫర్వాలేదనిపించగా.. సర్ఫరాజ్ ఖాన్(1) పూర్తిగా విఫలమయ్యాడు. దేవ్పడిక్కల్ నాలుగు పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నిజానికి రోహిత్ సేన 42.5 ఓవర్లలోనే 241 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించినా... ప్రాక్టీస్ కోసం పూర్తి ఓవర్లు ఆడటం గమనార్హం.ఇదిలా ఉంటే.. టీమిండియా ఇన్నింగ్స్లో ఆరో ఓవర్ను పీఎం ఎలెవన్ పేసర్ జాక్ నిస్బెట్ వేశాడు. అతడి బౌలింగ్లో తొలి రెండు బంతులను యశస్వి జైస్వాల్ బౌండరీకి తరలించగా.. నిస్బెట్ జైస్వాల్ను చూస్తూ ఏదో అన్నాడు. వెనక్కి వెళ్లు..ఇందుకు బదులుగా.. ‘‘వెనక్కి వెళ్లు.. వెళ్లి బౌలింగ్ చెయ్’’ అని జైస్వాల్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో చిరునవ్వుతోనే వెనక్కి వెళ్లిన నిస్బెట్ ఆఖరి వరకు రాకాసి బౌన్సర్లతో జైస్వాల్ను తిప్పలు పెట్టాడు.దీంతో ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఆఖరి వరకు తగ్గేదేలే అన్నట్లు తలపడ్డారు. ఇక నిస్బెట్ ఓవర్లో జైస్వాల్ ఎనిమిది పరుగులు రాబట్టగా.. అతడు మాత్రం వికెట్లెస్గా వెనుదిరిగాడు. జైస్వాల్ను అవుట్ చేయాలన్న అతడి కల నెరవేరలేదు. అంతే కాదు మ్యాచ్ మొత్తంలో ఆరు ఓవర్లు వేసిన 21 ఏళ్ల నిస్బెట్ 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, ఎనిమిదో ఓవర్లో మరోసారి బరిలోకి దిగిన నిస్బెట్ జైస్వాల్ను పరుగులు రాబట్టకుండా అడ్డుకోగలిగాడు.చదవండి: బీసీసీఐ మ్యాచ్.. 10కి 10 వికెట్లు సాధించిన 18 ఏళ్ల యువ కెరటం Yashasvi Jaiswal took it up to Jack Nisbet in Canberra but the fiery NSW quick wasn't backing down! 👀 #PMXIvIND pic.twitter.com/tX3O86wEv2— cricket.com.au (@cricketcomau) December 1, 2024 -
కోహ్లి అద్భుతం.. జైస్వాల్ దూసుకుపోతున్నాడు.. ఇంకా: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి తిరిగి ఫామ్లోకి రావడం శుభసూచకమని.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతమని కొనియాడాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లి మరింత చెలరేగడం ఖాయమని ద్రవిడ్ పేర్కొన్నాడు.కోహ్లి శతకాలు@81 కాగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోహ్లి టెస్టుల్లో శతకం బాదిన విషయం తెలిసిందే. దాదాపు 491 రోజుల తర్వాత అతడు ఓ ఇన్నింగ్స్లో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 81కి పెంచుకున్నాడు. ఆసీస్తో పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భాగంగా కోహ్లి ఈ ఘనత సాధించాడు.కోహ్లి అద్భుతంకఠిన పరిస్థితుల్లో తన అనుభవాన్ని రంగరించి జట్టు భారీ విజయం సాధించడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. తద్వారా విమర్శకులకు బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరు నెలల క్రితం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.సఫారీ గడ్డపై కఠినమైన పిచ్లపై కూడా బ్యాట్తో అదరగొట్టాడు. తను మళ్లీ టచ్లోకి రావడం సంతోషంగా ఉంది. సిరీస్ ఆరంభంలోనే శతకం బాదడం శుభసూచకం. ఈ సిరీస్లో మరోసారి కోహ్లి తనదైన మార్కు వేయబోతున్నాడని అనిపిస్తోంది’’ అని కోహ్లిని ప్రశంసించాడు.అందరికీ సాధ్యం కాదుఇక ఇదే మ్యాచ్లో 161 పరుగులతో దుమ్ములేపిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్పై కూడా ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోజురోజుకూ అతడు ఊహించనిరీతిలో ఆటను మెరుగుపరచుకుంటున్నాడని కొనియాడాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదని.. జైస్వాల్ మాత్రం పక్కా ప్రణాళికతో తన వ్యూహాలను అమలు చేసిన తీరు ఆకట్టుకుందని ద్రవిడ్ కితాబులిచ్చాడు.బుమ్రా ఆటగాడిగా, సారథిగా సూపర్ హిట్అదే విధంగా.. పెర్త్ టెస్టులో కెప్టెన్గా వ్యవహరించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ద్రవిడ్ ఈ సందర్భంగా అభినందించాడు. తన అసాధారణ బౌలింగ్ నైపుణ్యాలతో జట్టును ఎన్నోసార్లు ఒంటిచేత్తో గెలిపించాడని కొనియాడాడు. కెప్టెన్గానూ విజయవంతంగా జట్టును ముందుకు నడిపించాడంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు.భారీ విజయంతో మొదలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఎడిషన్లో ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరు కాగా.. బుమ్రా టీమిండియాకు సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్లో జైస్వాల్, కోహ్లి సెంచరీలతో రాణించగా.. బుమ్రా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో టీమిండియా ఆసీస్ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య కాన్బెర్రా వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. టీమిండియా రైజింగ్ స్టార్ ‘భారీ’ రికార్డు -
జైశ్వాల్ ఒక అద్భుతం.. 40కి పైగా టెస్టు సెంచరీలు చేస్తాడు: మాక్స్వెల్
టెస్టు క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై సత్తాచాటిన జైశ్వాల్.. ఇప్పుడు ఆస్ట్రేలియాపై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై తను ఆడిన తొలి టెస్టు మ్యాచ్లోనే సెంచరీ సాధించి సత్తాచాటాడు. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో యశస్వీ అద్బుతమైన సెంచరీ సాధించాడు. మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అలోవకగా ఎదుర్కొంటూ దిగ్గజాలను సైతం జైశ్వాల్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్లతో 161 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో జైశ్వాల్పై ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ 40కి పైగా టెస్టు సెంచరీలు సాధిస్తాడని మాక్సీ జోస్యం చెప్పాడు."జైశ్వాల్ ఒక అద్బుతమైన ఆటగాడు. టెస్టు క్రికెట్లో నలభై కంటే ఎక్కువ సెంచరీలు చేసే సత్తా అతడికి ఉంది. విభిన్న రికార్డులను తిరిగి రాస్తాడని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడే టాలెంట్ జైశ్వాల్ దగ్గర ఉంది.ఈ సిరీస్లో రాబోయే మ్యాచ్ల్లో అతడిని మా బౌలర్లు అడ్డుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. జైశ్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుంది. అన్ని రకాల షాట్లు ఆడగలడు. స్పిన్ కూడా బాగా ఆడగలడు. అతడొక ఫుల్ ప్యాకెజ్ ప్లేయర్" అని గ్రేడ్ క్రికెటర్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్స్వెల్ పేర్కొన్నాడు. -
సత్తాచాటిన జైశ్వాల్.. నెం1 ర్యాంక్కు ఒక్క అడుగు దూరంలో
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ సత్తాచాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో జైశ్వాల్ రెండో స్ధానానికి చేరుకున్నాడు. యశస్వి జైశ్వాల్కు కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు జైశ్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్లో నాలుగో స్ధానంలో ఉన్నాడు. అయితే పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 297 బంతుల్లో 161 పరుగులు చేసిన జైశ్వాల్.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే యశస్వీ రెండు స్ధానాలు ఎగబాకి సెకెండ్ ర్యాంక్కు చేరుకున్నాడు. అతడి ఖాతాలో 825 పాయింట్లు ఉన్నాయి.మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 9 స్ధానాలు ఎగబాకి 13వ ర్యాంక్కు వచ్చాడు. ఈ మ్యాచ్లో కోహ్లి కూడా ఆజేయ శతకంతో మెరిశాడు. ఇక టాప్ ర్యాంక్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(903) పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నాడు.టెస్టు ర్యాంకింగ్స్లో టాప్-10 బ్యాటర్లు వీరే..1.జో రూట్- 903 పాయింట్లు2. యశస్వి జైస్వాల్ 8253.కేన్ విలియమ్సన్ 8044. హ్యారీ బ్రూక్ 7785. డారిల్ మిచెల్ 7436. రిషబ్ పంత్ 7367. స్టీవెన్ స్మిత్ 7268. సౌద్ షకీల్ 7249. కమిందు మెండిస్ 71610. ట్రావిస్ హెడ్ 713 -
వాళ్లిద్దరు అద్భుతం... గర్వంగా ఉంది.. ఇంతకంటే ఏం కావాలి: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్గా తొలి టెస్టులోనే విజయం సాధించడం పట్ల జస్ప్రీత్ బుమ్రా హర్షం వ్యక్తం చేశాడు. పెర్త్లో తమ జట్టు ప్రదర్శనతో పూర్తి సంతృప్తిగా.. గర్వంగా ఉన్నానని చెప్పాడు. ఆత్మవిశ్వాసం ఉంటే అనుభవంతో పనిలేదని భారత యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపించారని కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. పేసర్ బుమ్రా భారత జట్టు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఆడిన టీమిండియా.. ఆసీస్ను ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా కంగారూ గడ్డపై అతిపెద్ద విజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో విజయానంతరం తాత్కాలిక కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా మాట్లాడుతూ.. ‘‘విజయంతో సిరీస్ ఆరంభించడం సంతోషంగా ఉంది. తొలి ఇన్నింగ్స్లో మేము బాగా ఒత్తిడికి లోనయ్యాం. అయితే, ఆ తర్వాత తిరిగి పుంజుకున్న తీరు పట్ల నాకెంతో గర్వంగా ఉంది.2018లో ఇక్కడ ఆడాను. ఇక ఈ పిచ్ మాకు సవాళ్లు విసిరింది. అయితే, అనుభవం కంటే.. సామర్థ్యాన్నే మేము ఎక్కువగా నమ్ముకున్నాం. పూర్తిస్థాయిలో మ్యాచ్ కోసం సిద్ధమయ్యాం. ఆత్మవిశ్వాసం ఉంటే.. ప్రత్యేకంగా ఏదైనా సాధించగలమని విశ్వసించాం. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి’’ అని బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు.ఇక సెంచరీ వీరులు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిల గురించి ప్రస్తావన రాగా.. ‘‘జైస్వాల్ టెస్టు కెరీర్ అద్భుతంగా సాగుతోంది. టెస్టుల్లో ఇదే అతడికి మొదటి అత్యుత్తమ ఇన్నింగ్స్ అనుకుంటున్నా. బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ అతడు అటాక్ చేసిన విధానం అద్భుతం.ఇక విరాట్.. అతడు ఫామ్లో లేడని నేనెప్పుడూ అనుకోను. ఇలాంటి కఠినమైన పిచ్లపైనే కదా.. బ్యాటర్ అసలైన ఫామ్ తెలిసేది’’ అంటూ బుమ్రా వారిద్దరిపై ప్రశంసలు కురిపించాడు. కాగా పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్, కోహ్లి నిరాశపరిచిని విషయం తెలిసిందే. జైస్వాల్ డకౌట్ కాగా.. కోహ్లి 5 పరుగులే చేశాడు.అయితే, రెండో ఇన్నింగ్స్లో లెఫ్టాండ్ బ్యాటర్ జైస్వాల్.. 161 పరుగులతో దుమ్ములేపగా.. కోహ్లి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు బుమ్రా రెండు ఇన్నింగ్స్లో కలిపి ఎనిమిది వికెట్లు కూల్చాడు.ఇక తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆసీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక పెర్త్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియగా.. ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు అడిలైడ్లో రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పెర్తు టెస్టు స్కోర్లు👉భారత్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 104 ఆలౌట్👉భారత్ రెండో ఇన్నింగ్స్:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 238 ఆలౌట్👉ఫలితం: ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో బుమ్రా సేన భారీ విజయం -
ఆసీస్ను మట్టికరిపించిన టీమిండియా.. బుమ్రాకు చిరస్మరణీయం
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందేప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా టీమిండియా ఆసీస్తో తమ ఆఖరి సిరీస్ ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్కు చేరాలంటే ఆసీస్పై కచ్చితంగా నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్టుకు దూరమయ్యాడు.బాధ్యతలు తీసుకున్న బుమ్రాఅయితే, సారథిగా ఉంటానంటూ బాధ్యతలు తీసుకున్న వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. తన పనిని సమర్థవంతంగా నెరవేర్చాడు. కెప్టెన్సీతో పాటు, ఆటగాడిగానూ అదరగొట్టిన ఈ పేస్ దళ నాయకుడు ఆసీస్ గడ్డపై కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు.అప్పుడు ఆదుకున్న పంత్, నితీశ్ రెడ్డిపెర్త్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పూర్తిగా సీమర్లకే అనుకూలించిన పిచ్పై భారత బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డారు. టాపార్డర్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్(0) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు.అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26) పట్టుదలగా నిలబడినా.. వివాదాస్పద రీతిలో థర్డ్ అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి(5) సైతం నిరాశపరచగా.. రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించడం కలిసి వచ్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 150 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్. మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.చెలరేగిన బుమ్రా.. కుప్పకూలిన ఆసీస్అనంతరం తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా తన పేస్ పదునుతో చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా రాణించడంతో మొదటిరోజు కేవలం 67 పరుగులే చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 104 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌట్ అయింది. బుమ్రాకు ఐదు, రాణాకు మూడు, సిరాజ్కు రెండు వికెట్లు దక్కాయి.జైస్వాల్ భారీ సెంచరీ.. శతక్కొట్టిన కోహ్లిఫలితంగా 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్కు మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో యశస్వి భారీ శతకం(161) పూర్తి చేసుకోగా.. రాహుల్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో పెర్త్లో పట్టు బిగించిన టీమిండియా.. కోహ్లి అజేయ సెంచరీ(100)కి తోడు నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 38 నాటౌట్)కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచింది.534 పరుగుల భారీ లక్ష్యం.. చేతులెత్తేసిన ఆసీస్ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఉండగా.. రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తద్వారా ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. అయితే, ఆది నుంచే మరోసారి అటాక్ ఆరంభించిన భారత బౌలర్లు ఆసీస్ను 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా జయభేరి మోగించి ఆసీస్కు సొంతగడ్డపై భారీ షాకిచ్చింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లు కూల్చగా.. వాషింగ్టన్ సుందర్ రెండు, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం నమోదు చేసింది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు👉వేదిక: పెర్త్ స్టేడియం, పెర్త్👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్👉టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 104 ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 238 ఆలౌట్👉ఫలితం: ఆసీస్పై 295 పరుగుల తేడాతో టీమిండియా భారీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(8 వికెట్లు)👉నాలుగురోజుల్లోనే ముగిసిన మ్యాచ్.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి!Big wicket for India! Siraj with a beauty! #AUSvIND pic.twitter.com/NEJykx9Avj— cricket.com.au (@cricketcomau) November 25, 2024History Made Down Under! 🇮🇳✨Team India seals a memorable victory, becoming the FIRST team to defeat Australia at the Optus Stadium, Perth! 🏟💥A moment of pride, determination, and unmatched brilliance as #TeamIndia conquers new heights in the 1st Test & secures No.1 Spot in… pic.twitter.com/B61Ic9qLuO— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి... కోహ్లి సమయోచిత శతకం తోడవడంతో ఆ్రస్టేలియా ముందు టీమిండియా 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్పై ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ ఆటగాళ్లు నాలుగో రోజు ఎంత సమయం క్రీజులో నిలుస్తారో వేచి చూడాలి!పెర్త్: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో ఆ్రస్టేలియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... విరాట్ కోహ్లి (143 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక శతకంతో విజృంభించాడు. ఓవర్నైట్ స్కోరు 172/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 134.3 ఓవర్లలో 487/6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (176 బంతుల్లో 77; 5 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కోహ్లి సెంచరీ పూర్తి కాగానే భారత కెపె్టన్ బుమ్రా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా ఆ్రస్టేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లయన్ 2... స్టార్క్, హాజల్వుడ్, కమిన్స్, మార్ష్తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా (2/1), సిరాజ్ (1/7) ఆసీస్ను దెబ్బ కొట్టారు. మెక్స్వీనీ (0), కమిన్స్ (2), లబుషేన్ (3) అవుట్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్... విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్లోనే ఆసీస్ ఆట ముగిసే అవకాశాలున్నాయి. ‘జై’స్వాల్ గర్జన సుదీర్ఘ ఫార్మాట్లో భారీ సెంచరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యశస్వి జైస్వాల్... ఆ్రస్టేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే సత్తా చాటాడు. బౌన్సీ పిచ్పై రాణించేందుకు ప్రత్యేకంగా సాధన చేసి బరిలోకి దిగిన 22 ఏళ్ల జైస్వాల్... నాణ్యమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రాహుల్తో కలిసి రికార్డుల్లోకెక్కిన జైస్వాల్.. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ వేసిన బౌన్సర్ను అప్పర్ కట్తో జైస్వాల్ సిక్సర్గా మలిచిన తీరు హైలైట్. తొలి ఇన్నింగ్స్లో చెత్త షాట్కు పెవిలియన్ చేరిన జైస్వాల్... ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాడు. క్లిష్టమైన పిచ్పై మెరుగైన డిఫెన్స్తో ఆకట్టుకున్న రాహుల్ను స్టార్క్ అవుట్ చేయగా... దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.రెండో కొత్త బంతి తీసుకున్న అనంతరం పడిక్కల్ పెవిలియన్ చేరగా... జైస్వాల్ 275 బంతుల్లో 150 మార్క్ దాటాడు. 23 ఏళ్లలోపు వయసులో నాలుగుసార్లు 150 పైచిలుకు పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన జైస్వాల్ చివరకు మార్ష్బౌలింగ్లో వెనుదిరిగాడు. ‘కోహ్లి’నూర్ ఇన్నింగ్స్... చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్ కోహ్లి... ‘క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికం’ అని నిరూపించాడు. పిచ్ బౌన్స్కు సహకరిస్తున్న సమయంలో సంయమనం చూపి... కుదురుకున్నాక ట్రేడ్మార్క్ కవర్ డ్రైవ్లతో కట్టి పడేశాడు. స్వల్ప వ్యవధిలో జైస్వాల్తో పాటు పంత్ (1), జురేల్ (1) అవుట్ అయిన దశలో కోహ్లి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (29; ఒక సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అనూహ్య బౌన్స్తో కంగారూలు పరీక్షించినా... కోహ్లి ఏమాత్రం తడబడలేదు. పదే పదే వికెట్ పక్క నుంచి షాట్లు ఆడుతూ చకచకా పరుగులు రాబట్టాడు. సుందర్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టి20ల తరహాలో రెచి్చపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్లో బౌండరీతో కోహ్లి టెస్టుల్లో 30వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (29)ను అధిగమించిన కోహ్లి... ఆసీస్ గడ్డపై ఏడో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 104; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) మార్ష్161; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 77; పడిక్కల్ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 25; కోహ్లి (నాటౌట్) 100; పంత్ (స్టంప్డ్) కేరీ (బి) లయన్ 1; జురేల్ (ఎల్బీ) (బి) కమిన్స్ 1; సుందర్ (బి) లయన్ 29; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 55; మొత్తం (134.3 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 487. వికెట్ల పతనం: 1–201, 2–275, 3–313, 4–320, 5–321, 6–410. బౌలింగ్: స్టార్క్ 26–2–111–1; హాజల్వుడ్ 21–9–28–1; కమిన్స్ 25–5–86–1; మార్ష్12–0–65–1; లయన్ 39–5–96–2; లబుషేన్ 6.3–0–38–0; హెడ్ 5–0–26–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖ్వాజా (బ్యాటింగ్) 3; కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2; లబుషేన్ (ఎల్బీ) (బి) బుమ్రా 3; ఎక్స్ట్రాలు 4; మొత్తం (4.2 ఓవర్లలో 3 వికెట్లకు ) 12. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–12, బౌలింగ్: బుమ్రా 2.2–1–1–2; సిరాజ్ 2–0–7–1.201 ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ తొలి వికెట్కు జోడించిన పరుగులు. ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986 సిడ్నీ టెస్టులో గావస్కర్–శ్రీకాంత్ నమోదు చేసిన 191 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానానికి చేరింది. 3 ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. 1968లో జయసింహ, 1977లో గావస్కర్ ఈ ఘనత సాధించారు. -
‘కోహ్లి.. జైస్వాల్ను చూసి ఎలా ఆడాలో నేర్చుకో’
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సత్తాచాటాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన మొదటి టెస్టు మ్యాచ్లోనే జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటైనా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం కంగారులను కంగరెత్తించాడు.స్టార్క్, హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను ఆలోవకగా ఎదుర్కొని శెభాష్ అన్పించుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్హగ్ను గుర్తు చేసేలా సిక్సర్తో తన సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్గా జైశ్వాల్కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం.ఓవరాల్గా 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో జైశ్వాల్పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని మంజ్రేకర్ కొనియాడాడు. అదేవిధంగా బ్యాక్ ఫుట్లో జైశ్వాల్ అద్బుతంగా ఆడుతున్నాడని అతడు మెచ్చుకున్నాడు."జైశ్వాల్ ఒక సంచలనం. అతడు షాట్ సెలక్షన్ చాలా బాగుంది. ఈ మ్యాచ్లో అతడు కట్ షాట్ వైట్బాల్ క్రికెట్లో ఆడినట్లు ఆడాడు. సాధారణంగా ఆటగాళ్ళు కట్షాట్ ఆడేందుకు ముందుగానే పొజిషన్లోకి వస్తారు. కానీ జైశ్వాల్ మాత్రం చాలా ఆలస్యంగా ఆడుతున్నాడు.అదే అతడి స్పెషల్. బ్యాక్ఫుట్లో నుంచి అద్బుతంగా కట్ షాట్ ఆడుతున్నాడు. బ్యాక్ఫుట్ నుంచి షాట్ ఆడి స్క్వేర్ వెనక దిశగా పరుగులు రాబడుతున్నాడు. విరాట్ కోహ్లి కంటే జైశ్వాల్ బాగా కట్ షాట్ ఆడుతున్నాడు.విరాట్ కోహ్లి మాత్రం ఫ్రంట్ ఫుట్లో ఉండి ఆడేందుకు ఇష్టపడతాడు. అందువల్ల పెద్దగా పరుగులు సాధించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో బ్యాక్ఫుట్లో ఎలా ఆడాలన్నది యశస్వి నుంచి కోహ్లి నేర్చుకోవాలి" అని స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో సంజయ్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. టీమిండియా తొలి క్రికెటర్గా అరుదైన రికార్డు!
పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపాడు. సిక్సర్తో వంద పరుగుల మార్కు అందుకున్న జైస్వాల్.. ఆస్ట్రేలియా గడ్డ మీద తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్గా టెస్టుల్లో తనకిది నాలుగో శతకం.What a way to bring up the ton! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/okMDAno5tE— cricket.com.au (@cricketcomau) November 24, 2024 ఈ క్రమంలో ఎన్నెన్నో అరుదైన రికార్డులను యశస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పెర్త్ టెస్టులో శతకం బాది టీమిండియా దిగ్గజాలుగా ఎదిగిన సునిల్ గావస్కర్, విరాట్ కోహ్లి మాదిరి జైస్వాల్ కూడా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్)గా పేరొందుతాడంటూ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభం కాగా.. మూడో రోజు ఆటలో భాగంగా యశస్వి జైస్వాల్ భారీ శతకం సాధించాడు. 205 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్.. మరో 92 బంతులు ఎదుర్కొని ఓవరాల్గా 161 రన్స్ సాధించాడు.జైస్వాల్ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, మిచెల్ మార్ష్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇవ్వడంతో జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్కు తెరపడింది. కాగా పెర్త్ టెస్టులో టీమిండియా ఇప్పటికే నాలుగు వందలకు పైగా ఆధిక్యం సంపాదించి పట్టు బిగించింది.పెర్త్ టెస్టులో సెంచరీ చేసి యశస్వి జైస్వాల్ సాధించిన రికార్డులు👉23 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో.. సునిల్ గావస్కర్(4), వినోద్ కాంబ్లీ(4)ల సరసన యశస్వి నిలిచాడు. ఈ లిస్టులో సచిన్ టెండుల్కర్ 8 శతకాలతో మొదటి స్థానంలో ఉండగా.. రవిశాస్త్రి(5) రెండో స్థానంలో ఉన్నాడు.👉అదే విధంగా.. 23 ఏళ్ల వయసులోపే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలోనూ జైస్వాల్ చోటు సంపాదించాడు. ఈ ఏడాది జైస్వాల్ ఇప్పటికి మూడు శతకాలు బాదాడు.👉ఆస్ట్రేలియా గడ్డమీద తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన మూడో బ్యాటర్ జైస్వాల్. అతడి కంటే ముందు ఎంఎల్ జైసింహా(101- బ్రిస్బేన్- 1967-68), సునిల్ గావస్కర్(113- బ్రిస్బేన్-1977-78)లో ఈ ఘనత సాధించారు.మరో అరుదైన ఘనత.. భారత తొలి క్రికెటర్గాపెర్త్ టెస్టులో భారీ శతకంతో యశస్వి జైస్వాల్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఆడిన మొదటి పదిహేను టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్గా యశస్వి జైస్వాల్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో విజయ్ హజారే(1420)ను అతడు వెనక్కినెట్టాడు. కాగా 2023లో వెస్టిండీస్ గడ్డ మీద జైస్వాల్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అతడి ఖాతాలో నాలుగు శతకాలు. రెండు డబుల్ సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఫోర్ల సంఖ్య 178, సిక్సర్లు 38.ఆడిన తొలి 15 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు👉డాన్ బ్రాడ్మన్- 2115👉మార్క్ టేలర్- 1618👉ఎవర్టన్ వీక్స్- 1576👉యశస్వి జైస్వాల్- 1568👉మైకేల్ హస్సీ- 1560.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా పెర్త్ టెస్టు👉టాస్: టీమిండియా.. తొలుత బ్యాటింగ్👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 104 ఆలౌట్.చదవండి: IPL 2025 Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి -
యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. తొలి ఆసియా బ్యాటర్గా రికార్డు
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 161 పరుగులు చేసి ఔటైన జైస్వాల్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి నాలుగు సెంచరీలను 150 ప్లస్ స్కోర్లుగా మలిచిన తొలి ఆసియా బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. అలాగే 23 ఏళ్లు రాక ముందే నాలుగు 150 ప్లస్ స్కోర్లు చేసిన మూడో ఏషియన్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి ముందు సచిన్, జావిద్ మియాందాద్ 23 ఏళ్లు రాక ముందే నాలుగు 150 ప్లస్ స్కోర్లు చేశారు.టెస్ట్ల్లో యశస్వి జైస్వాల్ 150 ప్లస్ స్కోర్లు..ఇంగ్లండ్పై 214 (2024లో రాజ్కోట్ టెస్ట్లో)ఇంగ్లండ్పై 209 (2024లో వైజాగ్ టెస్ట్లో)వెస్టిండీస్పై 171 (2023లో డోమినికా టెస్ట్లో)ఆస్ట్రేలియాపై 161 (2024లో పెర్త్ టెస్ట్లో)మ్యాచ్ విషయానికొస్తే.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 201 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం రాహుల్ (77) తొలి వికెట్గా వెనుదిరిగాడు. రాహుల్ ఔటైన అనంతరం దేవ్దత్ పడిక్కల్ (25) కాసేపు నిలకడగా ఆడాడు. ఆతర్వాత అతను కూడా ఔటయ్యాడు. 161 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ అనవసరమైన షాట్ ఆడి డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం భారత్ పరుగు వ్యవధిలో రిషబ్ పంత్ (1), ధృవ్ జురెల్ (1) వికెట్లు కోల్పోయింది. 100 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 326/5గా ఉంది. విరాట్ కోహ్లి (20), వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 372 పరుగులుగా ఉంది. భారత్ మరో 100 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్వుడ్, కమిన్స్, మార్ష్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా (5/30), హర్షిత్ రాణా (3/48), సిరాజ్ (2/20) చెలరేగిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్లో నాథన్ మెక్స్వీని (10), ట్రవిస్ హెడ్ (11), అలెక్స్ క్యారి (21), మిచెల్ స్టార్క్ (26) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (26), రిషబ్ పంత్ (37), ధృవ్ జురెల్ (11), నితీశ్ రెడ్డి (41) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మిచ్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
పెర్త్ టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీ
-
IND VS AUS 1st Test: చరిత్ర సృష్టించిన జైస్వాల్-రాహుల్ జోడీ
పెర్త్ టెస్ట్లో భారత ఓపెనింగ్ జోడీ (యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై 200 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ తొలి వికెట్కు 201 పరుగులు జోడించారు. ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన రికార్డు గతంలో సునీల్ గవాస్కర్-క్రిస్ శ్రీకాంత్ జోడీ పేరిట ఉండేది. వీరిద్దరు 1986 సిడ్నీ టెస్ట్లో తొలి వికెట్కు 191 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన భారత ఓపెనింగ్ జోడీలు..కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ (201 పరుగులు)సునీల్ గవాస్కర్-కృష్ణమాచారి శ్రీకాంత్ (191)సునీల్ గవాస్కర్-చేతర్ చౌహాన్ (165)కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు తొలి సెషన్లో భారత స్కోర్ 267/1గా ఉంది. కేఎల్ రాహుల్ (77) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (141), దేవ్దత్ పడిక్కల్ (17) క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ మిచెల్ స్టార్క్కు దక్కింది. ప్రస్తుతం టీమిండియా 313 పరుగల ఆధిక్యంలో కొనసాగుతుంది.భారత్ తొలి ఇన్నింగ్స్-150 ఆలౌట్ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్-104 ఆలౌట్సిక్సర్తో సెంచరీ పూర్తి చేసిన యశస్విఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేశాడు. యశస్వికి ఆసీస్ గడ్డపై ఇది తొలి టెస్ట్ సెంచరీ. ఈ సెంచరీతో యశస్వి దిగ్గజాల సరసన చేరాడు. తొలి ఆస్ట్రేలియా పర్యటనలోనే సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లి తమ తొలి ఆసీస్ పర్యటనలోనే సెంచరీలు సాధించారు. -
జైశ్వాల్ అరుదైన ఫీట్.. 16 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం సెంచరీ దిశగా సాగుతున్నాడు.తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న జైశ్వాల్.. స్టార్క్, హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం అలోవకగా ఎదుర్కొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 90 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి తొలి వికెట్కు 172 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్లో ఆసాదరణ ఇన్నింగ్స్ ఆడుతున్న జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్లో టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన జైశ్వాల్..1170* పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పేరిట ఉండేది. 2008లో గంభీర్ ఒక క్యాలెండర్ ఈయర్లో 8 టెస్టులు ఆడి 1,134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో గంభీర్ ఆల్టైమ్ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. 2024లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాటర్గా యశస్వి కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్ లెజెండ్ జోరూట్(1,338*) ఉన్నాడు.చదవండి: IND vs AUS: జైశ్వాల్, రాహుల్కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్ -
జైశ్వాల్, రాహుల్కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో కూడా ఆతిథ్య జట్టుపై భారత్ పై చేయి సాధించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్) అద్బుతమైన ఆరంభం ఇచ్చారు.వీరిద్దరూ తొలి వికెట్కు 172 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మొదటి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపరిచిన జైశ్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. తొలిసారి ఆసీస్ గడ్డపై ఆడుతున్నప్పటకి తన అద్భుత ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియాతో తన తొలి టెస్టు సెంచరీకి ఈ ముంబైకర్ చేరువయ్యాడు. మరోవైపు రాహుల్ సైతం తన క్లాస్ను చూపిస్తున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో ఓపెనర్గా వచ్చిన కేఎల్.. తనను తను మరోసారి నిరూపించుకున్నాడు. మూడో రోజు ఆటలో వీరిద్దరూ లంచ్ సెషన్ వరకు క్రీజులో ఉంటే భారత్ భారీ స్కోర్ సాధించడం ఖాయం.సెల్యూట్ చేసిన కోహ్లి.. ఇక ఈ ఓపెనింగ్ జోడీ ప్రదర్శనకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఫిదా అయిపోయాడు. రెండో రోజు ఆట అనంతరం ప్రాక్టీస్ కోసం మైదానంలో వచ్చిన కోహ్లి.. రాహుల్, యశస్వీలకు సెల్యూట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆసీస్ గడ్డపై భారత ఓపెనర్లు 100 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నెలకొల్పడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.చదవండి: IPL 2025: రిషబ్ పంత్కు రూ.33 కోట్లు.. సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్!? Virat Kohli immediately came out for practice after the day's play and appreciated Jaiswal and KL Rahul #INDvAUS pic.twitter.com/kvG1caIUXp— Robin 𝕏 (@SledgeVK18) November 23, 2024 -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో డకౌటైన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఆసీస్ గడ్డపై తొలిసారి ఆడుతున్న జైశ్వాల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.జైశ్వాల్ ప్రస్తుతం 90 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను జైశ్వాల్ అద్భుతంగా ముందుకు నడపిస్తున్నాడు. జైశ్వాల్ వరల్డ్ రికార్డు..ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో జైశ్వాల్ ఇప్పటివరకు 34 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉండేది. మెక్కల్లమ్ 2014 ఏడాదిలో టెస్టుల్లో 33 సిక్స్లు బాదాడు. తాజా మ్యాచ్లో నాథన్ లియోన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన జైశ్వాల్.. మెకల్లమ్ అల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(26) ఉన్నారు.ఇక రెండో రోజు ఆటలో కూడా ఆసీస్పై భారత్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్(90), కేఎల్ రాహుల్(62) నాటౌట్గా ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: కేఎల్ రాహుల్ అవుట్పై రగడ.. స్పందించిన స్టార్క్ -
Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా
టెస్టుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. స్వదేశంలో సొంతగడ్డపై న్యూజిలాండ్తో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియాలోనూ శుభారంభం అందుకోలేకపోయాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం ఐదు పరుగులకే కోహ్లి అవుటయ్యాడు.ఫలితంగా మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా తమ ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడుతోంది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సీమర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్పై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తేలిపోయాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.మరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ సైతం డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి క్రీజులోకి రాగానే ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ.. భారత ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్ రెండో బంతికి కోహ్లి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు.ఐదు పరుగులకే అవుట్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లి.. ఫ్రంట్ఫుట్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా చేతిలో పడింది. అలా షార్ట్ లెంగ్త్తో వచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసి కోహ్లి వికెట్ పారేసుకున్నాడు. మండిపడుతున్న ఫ్యాన్స్మొత్తంగా పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న కారణంగా తనకు వరుస అవకాశాలు ఇస్తున్నా బాధ్యతాయుతంగా ఆడకపోతే ఎలా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారుకష్టాల్లో టీమిండియాఇదిలా ఉంటే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(0) విఫలం కాగా.. కేఎల్ రాహుల్(26) ఫర్వాలేదనిపించాడు. పడిక్కల్(0), కోహ్లి(5) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. తొలిరోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25).చదవండి: IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..! తుదిజట్లు ఇవేవిధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకుExtra bounce from Josh Hazlewood to dismiss Virat Kohli. pic.twitter.com/dQEG1rJSKA— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024We need to start a serious discussion now on kohli pic.twitter.com/WMmAlfdZ8h— Div🦁 (@div_yumm) November 22, 2024 -
ఇదంతా విరాట్ భాయ్ వల్లే.. అతడే నాకు ఆదర్శం: యశస్వీ జైశ్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్దమయ్యాడు. గత కొంత కాలంగా భారత టెస్టు జట్టులో కీలక సభ్యునిగా ఉన్న జైశ్వాల్ ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్లలో ఎలా రాణిస్తాడో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టులో సత్తా చాటేందుకు యశస్వీ సైతం ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ఈ ముంబైకర్ ప్రారంభించే అవకాశముంది.అయితే ఈ మ్యాచ్కు ముందు అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ జైశ్వాల్ మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇచ్చిన సలహా తన కెరీర్ ఎదుగుదలలో ఎలా సహాయపడిందో జైశ్వాల్ చెప్పుకొచ్చాడు."విరాట్ కోహ్లితో నాకు మంచి అనుబంధం ఉంది. క్రికెట్ను కెరీర్గా ఎక్కువ కాలం కొనసాగించాలంటే క్రమశిక్షణతో ఉండాలని, ఆటను గౌరవించడం చాలా ముఖ్యమని కోహ్లి నాతో చెప్పాడు. విరాట్ భాయ్ సలహా నా కెరీర్ ఎదుగుదలలో ఎంతగానో సహాయపడింది. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడిలా కష్టపడి పనిచేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాను అని యశస్వీ పేర్కొన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన జైశ్వాల్.. 56.28 సగటుతో 1407 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు డబుల్ సెంచరీలతో పాటు 3 శతకాలు, 8 హాఫ్ సెంచరీల ఉన్నాయి. తన తొలి టెస్టు సిరీస్లోనే యశస్వీ డబుల్ సెంచరీ సాధించడం గమనార్హం.చదవండి: బాబాకీ జై! : మంజ్రేకర్పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్ -
ఆసీస్తో తొలి టెస్ట్.. టీమిండియా ఆటగాళ్ల ముందున్న భారీ రికార్డులు ఇవే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంటుంది.మూడో స్థానానికి చేరనున్న విరాట్ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సిరీస్లో విరాట్ మరో 350 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకతాడు. ప్రస్తుతం సచిన్, సంగక్కర, పాంటింగ్ విరాట్ కంటే ముందున్నారు. ఈ సిరీస్లో విరాట్ 350 పరుగులు చేస్తే పాంటింగ్ అధిగమించి మూడో స్థానాన్ని ఆక్రమిస్తాడు.బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే..!బీజీటీలో బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత్ పేసర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం భారత్ తరఫున కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ 200 వికెట్ల క్లబ్లో ఉన్నారు.బుమ్రా ఈ సిరీస్లో 27 వికెట్లు తీస్తే వేగంగా 200 వికెట్ల మైలురాయిని తాకిన భారత పేసర్గానూ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 50 టెస్ట్ల్లో 200 వికెట్లు తీయగా.. బుమ్రా ప్రస్తుతం 40 టెస్ట్లు మాత్రమే ఆడాడు.కోచ్ రికార్డునే గురి పెట్టిన జైస్వాల్టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుకే గురి పెట్టాడు. బీజీటీలో జైస్వాల్ మరో 15 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు గంభీర్ (1134 పరుగులు) పేరిట ఉంది.బీజీటీలో యశస్వి మరో 444 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 2010లో 1562 పరుగులు చేశాడు. -
కోహ్లి ‘కీ’లకం!
జట్టుకు దూకుడు నేర్పిన సారథి... విదేశీ పిచ్లపై సైతం అలవోకగా పరుగులు చేయగల నేర్పరి... టెక్నిక్, టెంపర్మెంట్లో అతడికెవరూ రారు సాటి! కంగారూ గడ్డపై పరుగులు చేసేందుకు సహచరలంతా తీవ్రంగా తడబడుతుంటే... ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో నిరూపించిన అసలు సిసలు నాయకుడు అతడు. అందుకే ప్రస్తుతం అతడు పెద్దగా ఫామ్లో లేకపోయినా... కీలక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్కు ముందు ఎవరినోట విన్నా అతడి గురించే చర్చ. ‘బాడీలైన్’ బౌలింగ్తో ఇబ్బంది పట్టాలని ఒకరు... రెచ్చగొట్టకుండా వదిలేయాలని మరొకరు... ఇలా ఆ్రస్టేలియా మాజీ ఆటగాళ్లంతా తీవ్రంగా చర్చిస్తున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు... టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ కు గురైన టీమిండియా... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకోవాలంటే అతడు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది! సుదీర్ఘ ఫార్మాట్ను అమితంగా ఇష్టపడే విరాట్ కోహ్లికి ఆ్రస్టేలియాపై మెరుగైన రికార్డు ఉంది. క్రీజులో కుదురుకుంటే మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టే విరాట్... ఆసీస్లో ఆసీస్పై అదరగొట్టాడు. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడిన కోహ్లి 1352 పరుగులు చేశాడు. 54.08 సగటు నమోదు చేసిన విరాట్... 6 సెంచరీలు, 4 అర్ధశతకాలు కొట్టాడు. పేస్కు అనుకూలించే పిచ్లపై యాభైకి పైగా సగటుతో పరుగులు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా సాగుతున్న విరాట్ తన కెరీర్లో దాదాపు చివరి ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్లో అందరి దృష్టి కోహ్లిపైనే నిలవనుంది. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం... మరో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమవడం... గత పర్యటనలో అదరగొట్టిన సీనియర్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇప్పుడు జట్టులోనే లేకపోవడం... ఇవన్నీ వెరసి విరాట్ కోహ్లీ విలువను మరింత పెంచాయి. పెద్దగా అనుభవం లేని యశస్వి జైస్వాల్, ఇప్పటి వరకు అరంగేట్రమే చేయని అభిమన్యు ఈశ్వరన్, నిలకడ లోపించిన కేఎల్ రాహుల్, తొలిసారి ఆసీస్లో పర్యటిస్తున్న ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ వంటి వాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్లో కోహ్లీ ఒక్కడే శిఖరంలా కనిపిస్తున్నాడు. పరీక్ష పెట్టే పేస్ పిచ్లు, సవాలు విసిరే బౌన్సీ వికెట్లు స్వాగతం పలుకుతున్న సమయంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలంటే బ్యాటింగ్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిదే. ఫామ్ అందుకుంటాడా... గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ను ఒడిసి పట్టింది. ముచ్చటగా మూడోసారి అదే జోరు కొనసాగాలంటే బ్యాటింగ్ బలగం రాణించాల్సిన అవసరముంది. అయితే సహనానికి పరీక్ష పెట్టే ఆసీస్ పిచ్లపై మెరుగైన ప్రదర్శన చేయాలంటే మొక్కవోని దీక్ష ముఖ్యం. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన కోహ్లి... మూడు మ్యాచ్ల్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేదు. మరి ఇలాంటి స్థితిలో పెద్దగా అనుభవం లేని బ్యాటింగ్ ఆర్డర్తో భారత జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే కోహ్లి సత్తా చాటాల్సిన అవసరముంది. భారత జట్టు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలంటే టీమిండియా ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా... 4–0తో ట్రోఫీ చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇది సాధ్యపడాలంటే కోహ్లి తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టి లేపాల్సిన అవసరముంది. గతంతో ఫార్మాట్తో సంబంధం లేకుండా చెలరేగిపోయిన కోహ్లీ... కొంతకాలంగా నెమ్మదించాడు. మునుపటి మెరుపులు మెరిపించ లేకపోతున్నాడు. ఈ ఏడాది 6 టెస్టులు ఆడిన కోహ్లి... అందులో 22.72 సగటుతో కేవలం 250 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తాడనే నమ్మకం సాధించిన కోహ్లి... ఆసీస్ పర్యటనలో అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లిని వదిలేయండి: వాట్సన్ కీలక సిరీస్కు ముందు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు... ఆ దేశ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ కీలక సూచన చేశాడు. మైదానంలో కోహ్లి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని తమ ప్లేయర్లకు చెప్పాడు. రెచ్చగొడితే కోహ్లిలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడని హితవు పలికాడు. ‘విరాట్ను దగ్గర నుంచి గమనించా. అతడిలో మెరుగైన ప్రదర్శన చేయాలనే కసి ఎక్కువ. అది లోలోపల ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టి బయటకు తీయకపోవడమే మేలు. అందుకే ఆసీస్ ఆటగాళ్లు అతడిని వదిలేయాలి. లేకుంటే అతడు చాలా ప్రమాదకరం’ అని వాట్సన్ అన్నాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఆసీస్లో పర్యటించిన కోహ్లి... 2014–15 పర్యటనలో 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ‘ఆసీస్లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబర్చాడో అందరికీ తెలుసు. అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు అతడు ప్రతి బంతిని మెరుగ్గా అర్థం చేసుకుంటాడు. అది జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నా’ అని వాట్సన్ అన్నాడు. కోహ్లికి బాడీలైన్ బౌలింగ్ చేయాలి: హీలీ భారత ప్రధాన ఆటగాడు కోహ్లిని అడ్డుకోవాలంటే బాడీలైన్ బౌలింగ్తో ఇబ్బంది పెట్టాలని ఆసీస్ ఆటగాళ్లకు ఆ దేశ మాజీ ప్లేయర్ ఇయాన్ హీలీ సూచించాడు. పదే పదే ముందరి ప్యాడ్ను లక్ష్యంగా చేసుకొని బంతులేయడం ద్వారా అతడిని బ్యాక్ఫుట్కు పరిమితం చేసి త్వరగా అవుట్ చేయవచ్చని సూచించాడు. ‘తొలి టెస్టులో ఆ్రస్టేలియా పేసర్లు కోహ్లికి ఎలా బౌలింగ్ చేస్తారో చూసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. క్రీజులో కోహ్లీ మెరుగైన కాళ్ల కదలికలు కనబర్చితే అతడు త్వరగా కుదురుకుంటాడు. అందుకే ముందరి ప్యాడ్ లక్ష్యంగా ప్రయతి్నంచాలి. అప్పుడే అతడిని నియంత్రించవచ్చు. ఒకవేళ అది ఫలితాన్ని ఇవ్వకపోతే. బాడీలైన్ బౌలింగ్ చేయడం మంచిది’ అని హీలీ ఆసీస్ పేసర్లకు హితవు పలికాడు. విరాట్ ఒక చాంపియన్: లయన్ భారత సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ఆ్రస్టేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ అసలు సిసలు చాంపియన్ అని అన్నాడు. గత 60 టెస్టు ఇన్నింగ్స్ల్లో కోహ్లి కేవలం 2 సెంచరీలు, 11 అర్ధశతకాలు మాత్రమే చేసినా... అతడిని తక్కువ అంచనా వేయడం లేదని లయన్ పేర్కొన్నాడు. ‘ఫామ్లో ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే... అతడి రికార్డులు నమ్మశక్యం కానివి. అతడి పట్ల నాకు గౌరవం ఉంది. అతడిని అవుట్ చేయాలని తప్పక ప్రయతి్నస్తా. కానీ అది ఎంత కష్టమో నాకు తెలుసు. చాన్నాళ్లుగా మా మధ్య రసవత్తర సమరం జరుగుతుంది. కోహ్లి, స్మిత్ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు’ అని లయన్ అన్నాడు. -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు మరో షాక్..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాను గాయాల సమస్య వేధిస్తుంది. చేతి వేలి గాయం కారణంగా శుభ్మన్ గిల్ ఇదివరకే తొలి టెస్ట్కు దూరంగా కాగా.. తాజాగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ గాయం బారిన పడినట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సందర్భంగా యశస్వి మెడ పట్టేసినట్లు సమాచారం. యశస్వి నొప్పితో విలవిలలాడుతున్న దృష్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. టీమ్ ఫిజియో యశస్వి మెడకు మసాజ్ చేస్తూ కనిపించాడు. యశస్వి గాయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఈ విషయం మాత్రం టీమిండియా అభిమానులను తెగ కలవరపెడుతుంది.ఇప్పటికే రోహిత్ దూరమయ్యాడు..!తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలోనే ఉండిపోయాడు. తొలి టెస్ట్కు అతను అందుబాటులో ఉండడం లేదు. రోహిత్కు ప్రత్యామ్నాయ ఓపెనర్గా కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ పేర్లను పరిశీలుస్తున్నారు. ఇప్పుడు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా గాయం బారిన పడితే తొలి టెస్ట్కు భారత్ రెగ్యులర్ ఓపెనర్లు లేకుండా బరిలోకి దిగినట్లవుతుంది.2020-21లోనూ ఇదే సీన్బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సిరీస్లోనూ టీమిండియా ఇదే తరహాలో గాయల బారిన పడింది. నాటి సిరీస్లోనూ భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సందర్భంగా గాయాల బారిన పడ్డారు. దీంతో టీమిండియా ఆ సిరీస్లో ప్రత్యామ్నాయ ఆటగాళ్లతో బరిలోకి దిగింది.అనుభవం లేని ఆటగాళ్లతో టీమిండియా..!పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్లో టీమిండియా పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్పై ఆధారపడాల్సి ఉంది. శుభ్మన్ గిల్ గాయం కారణంగా తప్పుకోవడంతో సర్ఫరాజ్ ఖాన్కు ఛాన్స్ దక్కవచ్చు. ఈ సిరీస్లో భారత పేస్ అటాక్ అత్యంత బలహీనంగా కనిపిస్తుంది. బుమ్రా మినహా జట్టులో పెద్దగా అనుభవజ్ఞులు లేరు. సిరాజ్కు పదుల సంఖ్యలో టెస్ట్లు ఆడిన అనుభవమున్నా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ టెస్ట్ మ్యాచ్లే ఆడారు. ఈ సిరీస్లో టీమిండియా ప్రధాన బలం స్పిన్నర్లు. అయితే తొలి టెస్ట్కు వేదిక అయిన పెర్త్ స్పిన్నర్లకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. -
ఇంతకంటే ఇంకేం కావాలి?.. యశస్వి జైస్వాల్ భావోద్వేగం(ఫొటోలు)
-
BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా!
టీమిండియా క్రికెటర్, రన్మెషీన్ విరాట్ కోహ్లికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరెన్నో అరుదైన ఘనతలతో రికార్డుల రారాజుగా గుర్తింపు పొందాడు.సొంతగడ్డపై పూర్తిగా విఫలమైఅయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్లో కలిపి ఒకే అర్ధ శతకం నమోదు చేయడం అతడి ఫామ్లేమి నిదర్శనం.ఆసీస్ మీడియా దృష్టి మొత్తం అతడి మీదే! ఇలాంటి తరుణంలో టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు వెళ్లనుండటంతో.. అందరి దృష్టి కోహ్లిపైనే నిలిచింది. ఆసీస్పై మంచి రికార్డు ఉన్న ఈ ఢిల్లీ బ్యాటర్ అంటే కంగారూ బౌలర్లకూ వణుకే! అందుకే ప్రస్తుతం కోహ్లి ఫామ్ సంగతి ఎలా ఉన్నా ఆస్ట్రేలియా మీడియాలో మాత్రం అతడే హైలైట్గా నిలుస్తున్నాడు.తరతరాల పోరాటంప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆస్ట్రేలియా వార్త పత్రికలు కోహ్లి గణాంకాలను విశ్లేషిస్తూ.. అతడి చిత్రాలను కవర్పేజీలపై ప్రముఖంగా ప్రచురించడం విశేషం. అంతేకాదు.. ఆసీస్- భారత్ టెస్టు పోరును హైలైట్ చేస్తూ హిందీ, పంజాబీ భాషల్లో.. ‘‘తరతరాల పోరాటం’’ అంటూ హెడ్లైన్స్ ఇచ్చాయి.ఇక కోహ్లికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆసీస్ మీడియా అతడిని ఇలా హైలైట్ చేయడంలో ఆశ్చర్యమేమీలేదు. అయితే, ఈసారి కోహ్లితో పాటు మరో యువ క్రికెటర్ నిలువెత్తు ఫొటోను సైతం ఆసీస్ పత్రికలు ప్రచురించడం విశేషం. అతడు మరెవరో కాదు.. యశస్వి జైస్వాల్.‘నవం రాజా’గా యశస్విఅవును.. టెస్టు క్రికెట్లో అరంగేట్రం నుంచే సంచలన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న ఈ ముంబై బ్యాటర్కు కూడా ఆస్ట్రేలియా మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. ‘నవం రాజా’(కొత్త రాజు) అంటూ యశస్వికి కితాబులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ అభిమానులు మాత్రం వీటిని చూసి చిన్నబుచ్చుకుంటున్నారు.హర్ట్ అవుతున్న పంత్ అభిమానులుఆస్ట్రేలియాలో టీమిండియా గత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంలో కీలకమైన ఈ వికెట్ కీపర్కు మాత్రం సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా 2020-21 పర్యటనలో గాబా టెస్టులో అద్భుత ఇన్నింగ్స్(89 నాటౌట్)తో ఆకట్టుకున్న పంత్.. భారత్ 2-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. జైస్వాల్ ఇప్పటి వరకు14 టెస్టులు ఆడి 1407 రన్స్ చేశాడు. ఇందులో మూడు శతకాలు, రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం.చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!?A lot of @imVkohli in the Australian papers this morning as is the norm whenever India are in town but never expected to see Hindi and Punjabi appearing in the Adelaide Advertiser. Tells you about the magnitude of the #AusvInd series for Australia & cricket in this country pic.twitter.com/I5B2ogPvEJ— Bharat Sundaresan (@beastieboy07) November 12, 2024 -
జైస్వాల్ సొంత అన్న.. తొలి హాఫ్ సెంచరీ! టీమిండియా ఓపెనర్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సోదరుడు తేజస్వి జైస్వాల్పై ప్రశంసలు కురిపించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి అర్ధ శతకం బాదినందుకు అతడిని అభినందించాడు. కాగా ఉత్తరప్రదేశ్లో జన్మించిన యశస్వి జైస్వాల్కు ముగ్గురు తోబుట్టువులు.. ఇద్దరక్కలు, ఓ అన్న ఉన్నారు.ఇటీవలే అరంగేట్రంయశస్వి సోదరుడు తేజస్వి కూడా క్రికెటర్గా రాణించాలనే ఆశయంతో ఉన్నాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో ఇటీవలే అరంగే ట్రం చేవాడు. త్రిపుర జట్టుకు ఆడుతూ.. తాజా రంజీ ట్రోఫీ సీజన్లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. బరోడాతో మ్యాచ్లో 159 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 82 పరుగులు రాబట్టాడు.అంతేకాదు.. ఈ మ్యాచ్లో ఒక వికెట్ను కూడా తేజస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రిపుర- బరోడా మ్యాచ్కు సంబంధించిన స్కోరు కార్డును యశస్వి జైస్వాల్ ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. అన్న తేజస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను హైలైట్ చేసి అతడిని అభినందించాడు.డ్రాగా ముగిసిన మ్యాచ్కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా అగర్తల వేదికగా త్రిపుర- బరోడా జట్ల మధ్య నవంబరు 6న మ్యాచ్ మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన త్రిపుర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బరోడా జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందుకు బదులుగా ఆతిథ్య త్రిపుర తమ మొదటి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 482 పరుగుల వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. అయితే, ఈ నాలుగు రోజుల మ్యాచ్లో శనివారమే చివరి రోజు. ఈ క్రమంలో వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డ బరోడా.. ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఫలితం తేలక మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఒకే ఒక్క విజయంకాగా తేజస్వి జైస్వాల్ తమ్ముడు యశస్వి మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్. అయితే, ఆల్రౌండర్ అయిన తేజస్వి రైటార్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. ఇక ఈ సీజన్లో త్రిపుర తొలుత ఒడిశాతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. తర్వాతి మ్యాచ్లో మేఘాలయపై ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో గెలిచింది.టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయిన యశస్విఅనంతరం.. ముంబైతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. తాజాగా బరోడా జట్టుతో మ్యాచ్లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లోనూ సత్తా చాటిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ప్రస్తుతం టీమిండియాలో టెస్టు, టీ20 ఓపెనర్గా పాతుకుపోయాడు.ముఖ్యంగా టెస్టు అరంగేట్రం(2023)లోనే 23 ఏళ్ల యశస్వి భారీ శతకం(171) బాదాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు ఆడి 1407 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక భారత్ తరఫున 23 టీ20లు ఆడిన యశస్వి ఓ శతకం సాయంతో 723 రన్స్ చేశాడు. తదుపరి అతడు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీకానున్నాడు.చదవండి: స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్! -
BGT 2024: రోహిత్ ఓపెనర్గా వద్దు.. వాళ్లిద్దరే ఆడాలి: పాక్ మాజీ క్రికెటర్
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో మ్యాచ్లు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది.ఇదే తొలిసారి..కాగా ఇటీవలే సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో ఆడిన మూడు టెస్టుల్లో ఓడి 0-3తో క్లీన్స్వీప్నకు గురైంది. స్వదేశంలో భారత జట్టు ఇలా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అన్ని మ్యాచ్లలో ఓడిపోవడం ఇదే తొలిసారి.ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతగడ్డపైనే రాణించలేనివాళ్లు.. ఆసీస్ పిచ్లపై ఆడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ ఓపెనర్గా వద్దుఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా కాకుండా వన్డౌన్లో బరిలోకి దిగాలని సూచించాడు. కివీస్తో సిరీస్లో పేసర్ టిమ్ సౌతీని ఎదుర్కొనేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడన్న కనేరియా.. ఆస్ట్రేలియాలో బంతి మరింత స్వింగ్ అవుతుంది కాబట్టి.. వన్డౌన్లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియలో సౌతీ బౌలింగ్లో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడు. రెండుసార్లు అతడి బౌలింగ్లోనే అవుటయ్యాడు. కాబట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారిస్తే బాగుంటుంది.జైస్వాల్కు జోడీగా అతడు రావాలిటాపార్డర్లో యశస్వి జైస్వాల్తో కలిసి శుబ్మన్ గిల్ ఓపెనర్గా రావాలి. రోహిత్ వన్డౌన్లో, కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ లైనప్ విషయంలో గౌతం గంభీర్ తప్పక మార్పులు చేయాలి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా బ్యాట్తో వీలైనంత ఎక్కువగా రాణిస్తేనే ఫలితం ఉంటుంది’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. కాగా ఆసీస్- టీమిండియా మధ్య నవంబరు 22 నుంచి జనవరి 3 వరకు మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. మరి ఆ టెక్నాలజీ ఎందుకు వాడదంటే? -
చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ కూడా అతడే! అంతేకాదు.. మాతృదేశంలో.. విదేశీ జట్టుకు ఆడుతూ ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన రికార్డునూ అజాజ్ పటేల్ సొంతం చేసుకున్నాడు.కాగా ముంబైలో జన్మించాడు అజాజ్ పటేల్. ఆ తర్వాత అతడి కుటుంబం న్యూజిలాండ్కు మకాం మార్చింది. అయితే, బాల్యం నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న అజాజ్ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్తో ఒక్కసారిగా అతడు భారత్లో ఫేమస్ అయ్యాడు.నాడు 10 వికెట్ల హాల్ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాడు టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 10 వికెట్లు కూల్చాడు. జన్మనిచ్చిన గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ నాలుగు వికెట్లు అజాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు.ఈసారి ఐదేసిన అజాజ్ఇక తాజాగా టీమిండియాతో మ్యాచ్లో మరోసారి అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లతో మెరిశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)తో పాటు శుబ్మన్ గిల్(90), మహ్మద్ సిరాజ్(0), సర్ఫరాజ్ ఖాన్(0), రవిచంద్రన్ అశ్విన్(6)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత్ ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్ల జాబితాలో అజాజ్ పటేల్ చోటు సంపాదించాడు. వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు అజాజ్ 19 వికెట్లు(10+4+5) పడగొట్టాడు.భారత్లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లుఇయాన్ బోతమ్(ఇంగ్లండ్)- వాంఖడేలో 22 వికెట్లుఅజాజ్ పటేల్(న్యూజిలాండ్)- వాంఖడేలో 19 వికెట్లురిచీ బెనాడ్(ఆస్ట్రేలియా)- ఈడెన్ గార్డెన్స్లో 18 వికెట్లుకర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్)- వాంఖడేలో 17 వికెట్లు.భారత్ 263 ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలైన మూడో టెస్టులో ఇరుజట్ల బౌలర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ను భారత్ 235 పరుగులకు తొలిరోజే ఆలౌట్ చేసింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత భారత్ బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో 86/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్గా పంత్ రికార్డు -
ఆసక్తికరంగా భారత-న్యూజిలాండ్ల మూడో టెస్టు.. పడగొట్టి... ఆపై తడబడి!
వాంఖెడే మైదానంలో తొలి రోజు 84.4 ఓవర్లు పడ్డాయి. 82.5 ఓవర్ల వరకు భారత్దే పైచేయి... కానీ తర్వాతి 8 బంతుల వ్యవధిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీమిండియా అనూహ్యంగా 3 వికెట్లు చేజార్చుకొని వెనుకంజ వేసింది. అప్పటి వరకు చక్కగా ఆడిన యశస్వి జైస్వాల్తో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లి రనౌట్ ఇందులో ఉండగా, ఒక కీలక రివ్యూ కూడా కోల్పోవడంతో భారత్ నిరాశగా ఆటను ముగించింది. అంతకుముందు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ధాటికి 235 పరుగులకే పరిమితమై నిరాశ చెందిన న్యూజిలాండ్ ఆ తర్వాత 4 వికెట్లు కూడా పడగొట్టి పైచేయి సాధించింది. రెండో రోజు మన బ్యాటర్లు ఎంత వరకు స్కోరును తీసుకెళ్లి ఆధిక్యం అందించగలరనే అంశంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. బౌలర్లు తొలి రోజు నేలకూల్చిన 14 వికెట్లు మ్యాచ్లో తర్వాతి రోజులు ఎలా సాగనున్నాయనే దానికి సంకేతంగా నిలిచింది. మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 65.4 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. డరైల్ మిచెల్ (129 బంతుల్లో 82; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ యంగ్ (138 బంతుల్లో 71; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలు సాధించారు.మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (5/65) ఐదు వికెట్లతో సత్తా చాటగా... వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (38 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ మరో 149 పరుగులు వెనుకబడి ఉంది. తుది జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. బుమ్రాకు విశ్రాంతినిచ్చి సిరాజ్ను ఆడించగా... న్యూజిలాండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్ హీరో సాంట్నర్ పక్కటెముకల గాయంతో టెస్టుకు దూరం కాగా... అతని స్థానంలో సోధి వచ్చాడు. పేసర్ టీమ్ సౌతీకి బదులుగా హెన్రీని కివీస్ ఎంచుకుంది. భారీ భాగస్వామ్యం... కివీస్ ఇన్నింగ్స్ మూడు భిన్న దశలుగా సాగింది. ఫామ్లో ఉన్న కాన్వే (4) ఆరంభంలోనే వెనుదిరగ్గా... కెపె్టన్ టామ్ లాథమ్ (44 బంతుల్లో 28; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే లాథమ్తో పాటు రచిన్ రవీంద్ర (5)లను సుందర్ క్లీన్»ౌల్డ్ చేయడంతో 72/3 వద్ద కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్, మిచెల్ భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. వీరిద్దరు తర్వాతి 25 ఓవర్ల పాటు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 87 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యంతో స్కోరును 159/3 వరకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే ఆట మళ్లీ మలుపు తిరిగింది. జడేజా వేసిన ఈ ఓవర్లో యంగ్, బ్లన్డెల్ (0) వెనుదిరిగారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు వికెట్లు కూడా అతని ఖాతాలోనే చేరాయి. సుందర్ మూడు ఓవర్లలో ఒక్కో సిక్సర్ చొప్పున బాది జోరు ప్రదర్శించిన మిచెల్ ఎట్టకేలకు సుందర్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరగా... మరో మూడు బంతుల తర్వాత కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి రనౌట్... రోహిత్ శర్మ (18) ఎప్పటిలాగే ధాటిగా మొదలు పెట్టినా, మరోసారి అతను తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 30; 4 ఫోర్లు), గిల్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. 6 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ బ్లన్డెల్ అందుకోలేకపోయాడు. వీరిద్దరి భాగస్వామ్యం 53 పరుగులకు చేరింది. మరో రెండు ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో అంతా మారిపోయింది. ఎజాజ్ బౌలింగ్లో అనవసరపు రివర్స్ స్వీప్నకు ప్రయత్నించి జైస్వాల్ బౌల్డ్ కాగా... నైట్ వాచ్మన్గా వచ్చిన సిరాజ్ (0) తర్వాతి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. అయితే దీనికి కూడా అతని ‘రివ్యూ’ తీసుకొని దానిని వృథా చేశాడు! భారత్కు మరో షాక్ చివరి ఓవర్లో తగిలింది. డిఫెన్స్ ఆడి రోజును ముగించాల్సిన సమయంలో కోహ్లి (4) సాహసం చేశాడు. రచిన్ బౌలింగ్లో మిడాన్ దిశగా ఆడిన అతను అతి విశ్వాసంతో సింగిల్కు ప్రయత్నించాడు. హెన్రీ డైరెక్ట్ త్రో వికెట్లను పడగొట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బి) సుందర్ 28; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్దీప్ 4; యంగ్ (సి) రోహిత్ (బి) జడేజా 71; రచిన్ (బి) సుందర్ 5; మిచెల్ (సి) రోహిత్ (బి) సుందర్ 82; బ్లన్డెల్ (బి) జడేజా 0; ఫిలిప్స్ (బి) జడేజా 17; సోధి (ఎల్బీ) (బి) జడేజా 7; హెన్రీ (బి) జడేజా 0; ఎజాజ్ (ఎల్బీ) (బి) సుందర్ 7; రూర్కే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (65.4 ఓవర్లలో ఆలౌట్) 235. వికెట్ల పతనం: 1–15, 2–59, 3–72, 4–159, 5–159, 6–187, 7–210, 8–210, 9–228, 10–235. బౌలింగ్: సిరాజ్ 6–0–16–0, ఆకాశ్దీప్ 5–0–22–1, అశ్విన్ 14–0–47–0, వాషింగ్టన్ సుందర్ 18.4–2– 81–4, జడేజా 22–1–65–5. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (బ్యాటింగ్) 31; సిరాజ్ (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; కోహ్లి (రనౌట్) 4; పంత్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 86. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84. బౌలింగ్: హెన్రీ 5–1–15–1, రూర్కే 2–1–5–0, ఎజాజ్ 7–1–33–2, ఫిలిప్స్ 4–0–25–0, రచిన్ 1–0–8–0. -
బుమ్రా చేజారిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు.. అగ్రస్థానంలో అతడు
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. అతడి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఆక్రమించాడు. ఇక బుమ్రా మూడోస్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో ఈ మేర మార్పులు చోటుచేసుకున్నాయి.మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లోకాగా బంగ్లాదేశ్ పర్యటనలో రబాడ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మిర్పూర్ టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అంతేకాదు.. ఈ టూర్ సందర్భంగా రబాడ మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ క్రమంలో రెండు ర్యాంకులు మెరుగుపరచుకున్న 29 ఏళ్ల రబాడ.. బుమ్రాను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ వన్గా అవతరించాడు.మరోవైపు.. బుమ్రా స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. దీంతో కివీస్తో తొలి రెండు రెండు టెస్టుల్లో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు.సత్తా చాటిన పాక్ స్పిన్నర్లుసొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పాకిస్తాన్ స్పిన్నర్లు నౌమన్ అలీ, సాజిద్ ఖాన్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో నౌమన్ కెరీర్ బెస్ట్ సాధించాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి.. తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు.సాంట్నర్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకిమరోవైపు.. సాజిద్ ఖాన్ సైతం 12 స్థానాలు మెరుగుపరచుకుని కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించాడు. ఇక టీమిండియాతో పుణె వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం ముందుకు దూసుకువచ్చాడు. రెండో టెస్టులో 13 వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ బౌలర్ 30 స్థానాలు ఎగబాకి 44వ ర్యాంకుకు చేరుకున్నాడు.ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకులు టాప్-51. కగిసో రబాడ(సౌతాఫ్రికా)- 860 రేటింగ్ పాయింట్లు2. జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా)- 847 రేటింగ్ పాయింట్లు3. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 846 రేటింగ్ పాయింట్లు4. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 831 రేటింగ్ పాయింట్లు4. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 820 రేటింగ్ పాయింట్లు.జైస్వాల్కు మూడో ర్యాంకుఇదిలా ఉంటే.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ రెండో ర్యాంకు నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ర్యాంకు మెరుగపరుచుకుని మూడో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ ఆ తర్వాతి ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
యశస్విపై నాలుగు మ్యాచ్ల నిషేధం పడి ఉండేది..!
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి అందరికీ తెలుసు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను ఏరకంగా భారత జట్టును గెలిపించాడో అందరం చూశాం. ప్రస్తుతం రహానే టీమిండియాలో భాగం కానప్పటికీ.. దేశవాలీ టోర్నీల్లో ముంబై జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. రహానేకు మంచి నాయకుడిగా పేరుండటంతో పాటు నిఖార్సైన జెంటిల్మెన్గానూ గుర్తింపు ఉంది. దేశవాలీ క్రికెట్లో రహానే యువ ఆటగాళ్లకు అత్యుత్తమ గైడ్లా ఉంటాడు.కెప్టెన్గా వారికి అమూల్యమైన సలహాలు అందిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో రహానే ఆటగాళ్ల శ్రేయస్సు కొరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రస్తుత టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ విషయంలో రహానే ఓ సందర్భంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా యశస్వికి (వెస్ట్ జోన్), సౌత్ జోన్ ఆటగాడు రవితేజకు మధ్య మాటల యుద్దం జరిగింది. ఆ సమయంలో రహానే జైస్వాల్ను మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు.For those who trolled him for sending Jaiswal out of the field, this is for you!Ajinkya Rahane reveals the reason why he sent Jaiswal out of the field. pic.twitter.com/nMzobNkwwc— Riddhima (@RiddhimaVarsh17) October 26, 2024ఒకవేళ ఆ సమయంలో రహానే అలా చేయకపోయుంటే యశస్విపై నాలుగు మ్యాచ్ల నిషేధం పడి ఉండేది. యశస్వి శ్రేయస్సు కోసమే తాను అలా చేశానని రహానే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మ్యాచ్లో రహానే వెస్ట్ జోన్కు కెప్టెన్గా వ్యవహరించగా.. యశస్వి జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో యశస్వి భారీ డబుల్ సెంచరీ (264) చేశాడు. ఇదిలా ఉంటే, యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. యశస్వి ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి రెండో స్థానంలో ఉన్నాడు. యశస్వి ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 1300 పైచిలుకు పరుగులు చేశాడు. తాజాగా న్యూజిలాండ్తో ముగిసిన రెండో టెస్ట్లో (సెకెండ్ ఇన్నింగ్స్లో) యశస్వి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: జేడీయూలో చేరిన క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. పుణే వేదికగా కివీస్తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత జట్టు..ఈ ఘెర పరాభవాన్ని మూటకట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్పై భారత్ టెస్టు సిరీస్ను ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే పుణే టెస్టులో రోహిత్ సేన పరాజయం పాలైంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 245 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వీ జైశ్వాల్ మినహా కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోలేకపోయారు. లక్ష్య చేధనలో యశస్వీ దూకుడుగా ఆడి అభిమానుల్లో గెలుపుపై ఆశలను పెంచాడు. కానీ మిగితా బ్యాటర్లు చేతులేత్తేయడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. జైశ్వాల్ 65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో యశస్వీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.జైశ్వాల్ అరుదైన ఘనత.. టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 30 కంటే ఎక్కువ సిక్స్లు బాదిన తొలి భారత ప్లేయర్గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. 2024 ఏడాదిలో జైశ్వాల్ ఇప్పటివరకు 32 సిక్స్లు కొట్టాడు.ఓవరాల్గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ (33 సిక్స్లు) పేరిట ఉంది. ఈ కివీ దిగ్గజం 2014లో 33 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు యశస్వీ మరో రెండు సిక్స్లు బాదితే మెక్కల్లమ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. కివీస్తో జరిగే మూడో టెస్టులో ఈ రికార్డు బద్దులు అయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs NZ: ‘కివీ’ చేతుల్లో ఖేల్ ఖతం! -
దంచికొట్టిన జైస్వాల్.. సొంతగడ్డపై అరుదైన రికార్డు
న్యూజిలాండ్తో రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. అవసరమైనపుడు దూకుడుగా ఆడుతూనే నిలకడ ప్రదర్శించాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(8) తక్కువ స్కోరుకే అవుటైనా.. తాను మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు.41 బంతుల్లోనే హాఫ్ సెంచరీకివీస్ జట్టు విధించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. యశస్వి జైస్వాల్ 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా.. ఏమాత్రం తొణక్కుండా ధనాధన్ ఇన్నింగ్స్తో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో మూడుసార్లు లైఫ్ పొందిన యశస్వి 65 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు సాధించాడు.సెంచరీ చేయకుండానే..అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 22వ ఓవర్ వేసిన కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ యశస్విని అద్భుత బంతితో అవుట్ చేశాడు. సాంట్నర్ వేసిన టాప్క్లాస్ బాల్ను బాగానే టాకిల్ చేసినా.. దురదృష్టవశాత్తూ పూర్తిస్థాయిలో షాట్ కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో బంతి వెళ్లి ఫీల్డర్ డారిల్ మిచెల్ చేతుల్లో పడింది. ఫలితంగా సెంచరీ చేయకుండానే యశస్వి జైస్వాల్(77) నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(8), శుబ్మన్ గిల్(23), రిషభ్ పంత్(0- రనౌట్), యశస్వి జైస్వాల్ రూపంలో కివీస్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టింది. లక్ష్య ఛేదనలో శనివారం నాటి మూడోరోజు ఆటలో 25 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా విజయానికి 225 పరుగుల దూరంలో ఉంది.క్యాలెండర్ ఇయర్లో సొంతగడ్డపై ఇలాకాగా శనివారం నాటి ఆటలో యశస్వి జైస్వాల్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. క్యాలెండర్ ఇయర్లో సొంతగడ్డపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏడో బ్యాటర్(మూడో భారత క్రికెటర్)గా నిలిచాడు.అంతకు ముందు ఈ ఘనత సాధించిన క్రికెటర్లుగుండప్ప విశ్వనాథ్(1979)- 1047 పరుగులుసునిల్ గావస్కర్(1979)- 1013 పరుగులుగ్రాహం గూచ్(1990)- 1058 పరుగులుజస్టిన్ లాంగర్(2004)-1012 పరుగులుమహ్మద్ యూసఫ్(2006)- 1126 పరుగులుమైఖేల్ క్లార్క్(2012)- 1407 పరుగులుయశస్వి జైస్వాల్(2024)- 1055* పరుగులు.చదవండి: Ind vs Aus: నాలుగు వరుస శతకాలు.. టీమిండియాలో చోటు! ఓపెనర్గా ఫిక్స్! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
IND vs NZ Day 3 Lunch: రోహిత్ ఔటైనా దూకుడుగా ఆడుతున్న భారత్
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్.. టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్ లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. 34 పరుగుల వద్దే కెప్టెన్ రోహిత్ శర్మ (8) వికెట్ కోల్పోయినప్పటికీ.. టీమిండియా దూకుడు తగ్గలేదు. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టీ20 తరహాలో రెచ్చిపోతుండగా.. శుభ్మన్ గిల్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) అడపాదడపా షాట్లతో అలరిస్తున్నాడు. టీమిండియా లక్ష్యానికి మరో 278 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ వికెట్ మిచెల్ సాంట్నర్కు దక్కింది.అంతకుముందు న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. 198/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్నైట్ స్కోర్కు మరో 57 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. -
అరుదైన మైలురాయిని అధిగమించిన యశస్వి జైస్వాల్
పూణే వేదికగా న్యూజిలాండ్తో జరుగతున్న రెండో టెస్ట్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన జైస్వాల్ ఈ ఏడాది టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్గా, ఓవరాల్గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. జైస్వాల్కు ముందు ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ మాత్రమే ఈ ఏడాది 1000 పరుగుల మార్కును క్రాస్ అయ్యాడు. రూట్ ఈ ఏడాది 14 టెస్ట్ల్లో 59.31 సగటున 1305 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇటీవల పాక్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రూట్ డబుల్ సెంచరీ (262) చేశాడు.న్యూజిలాండ్తో మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ కష్టాల్లో పడింది. 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు రెచ్చిపోతుండటంతో భారత ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. యశస్వి జైస్వాల్ (30), రోహిత్ శర్మ (0), శుభ్మన్ గిల్ (30), విరాట్ కోహ్లి (1), రిషబ్ పంత్ (18), సర్ఫరాజ్ ఖాన్ (11) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (5), అశ్విన్ క్రీజ్లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 3, ఫిలిప్స్ 2, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు న్యూజిలాండ్ను తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలం చేశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో డెవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలు చేయగా.. మిగిలిన వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.చదవండి: IND vs NZ 2nd Test: చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లి -
అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్న యశస్వి
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా కష్టాల ఊబిలో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలిన భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గట్టెక్కాలంటే మరో రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు టార్గెట్ను న్యూజిలాండ్ ముందుంచాలి. భారత్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 282 పరుగులు వెనుకపడి ఉంది. చేతిలో మరో తొమ్మిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. రోహిత్ శర్మ (37), విరాట్ కోహ్లి (0) క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. రచిన్ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్ కాన్వే (91), టిమ్ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.pic.twitter.com/2qmdnkyZmK— ViratKingdom (@kingdom_virat1) October 18, 2024అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్న యశస్వితొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలి మ్యాచ్పై పట్టు కోల్పోయిన భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో అయినా జాగ్రత్తగా ఆడాలని అభిమానులు కోరుకున్నారు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (35) అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకుని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. యశస్వి అజాజ్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు క్రీజ్ వదిలి ముందుకు వచ్చి స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి షాట్ ఆడాల్సిన అవసరం లేదు. అయినా యశస్వి ఓవరాక్షన్ చేసి చేజేతులా వికెట్ను సమర్పించుకున్నాడు.కుప్పకూలిన భారత్మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలింది. భారత్ ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. చదవండి: PAK VS ENG 2nd Test: 52 ఏళ్లలో తొలిసారి ఇలా..! -
IND Vs NZ: ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను? షాక్లో రోహిత్ శర్మ
న్యూజిలాండ్తో తొలి టెస్టులో రోహిత్ శర్మకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హిట్మ్యాన్ నిర్ణయం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(2) సహా స్టార్ బ్యాటర్లంతా విఫలం కావడంతో 46 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది.టీమిండియా శుభారంభంఅనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 402 రన్స్ చేసి.. ఏకంగా 356 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుభారంభమే అందుకుంది.రోహిత్ హాఫ్ సెంచరీఓపెనర్లు యశస్వి జైస్వాల్ 52 బంతులు ఎదుర్కొని 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రోహిత్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. అయితే, నిలకడగా ఆడుతున్న సమయంలో రోహిత్ దురదృష్టకరరీతిలో అవుట్ అయ్యాడు.ఊహించని రీతిలో బౌల్డ్భారత రెండో ఇన్నింగ్స్ 22వ ఓవర్ను కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వేశాడు. అతడి బౌలింగ్లో ఐదో బంతికి రోహిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, ఊహించని విధంగా బంతి బ్యాట్ను తాకి.. బౌన్స్ అయి వికెట్లను తాకగా.. స్టంప్స్ ఎగిరిపడ్డాయి. నిజంగా ఇది రోహిత్ దురదృష్టమనే చెప్పవచ్చు.ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను?.. దురదృష్టం భయ్యా!ఒకవేళ ప్రమాదాన్ని పసిగట్టి కాస్త జాగ్రత్త పడి ఉంటే వికెట్ నిలిచేదే! ఏదేమైనా.. తాను అవుటైన తీరుపై రోహిత్ శర్మ సైతం తీవ్ర నిరాశకు గురయ్యాడు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ అతడు.. ‘‘ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను?’’ అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘ఈ మ్యాచ్లో నువ్వు నిజంగా అన్లక్కీ భయ్యా’’ అంటూ నెటిజన్లు రోహిత్పై సానుభూతి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 25 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు కాగా.. రెండో రోజు టాస్ పడింది👉బెంగళూరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్👉పిచ్ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్ 👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema)What a terrible test match for Rohit Sharma to remember in all senses.#INDvNZ pic.twitter.com/f0d3gtrGvZ— iNaveenVijayakumar (@iNaveentalks) October 18, 2024 -
బెంగళూరులో వర్షం.. భారత్ - కివీస్ తొలి టెస్టు మొదటి సెషన్ ఆట కష్టమే! (ఫొటోలు)
-
కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించి రూ. 6. 4 లక్షల ప్రశ్న
ప్రముఖ టీవీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తాజా ఎపిసోడ్లో ఏకంగా రూ. 6.4 లక్షల ప్రశ్న జెంటిల్మెన్ గేమ్కు సంబంధించింది ఎదురైంది. ఇంతకి ప్రశ్న ఏంటంటే.. 2024లో సునీల్ గవాస్కర్ తర్వాత ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్లో 700కు పైగా పరుగులు స్కోర్ చేసింది ఎవరు..? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్లో మొదటిది విరాట్ కోహ్లి కాగా.. రెండోది యశస్వి జైస్వాల్, మూడోది శుభ్మన్ గిల్, నాలుగోది రోహిత్ శర్మ. ఈ ప్రశ్న ఎదురైనప్పుడు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్కు వెళ్లాడు. ఆడియన్స్ పోల్లో మెజార్టీ శాతం 'బి' యశస్వి జైస్వాల్కు ఓటు వేశారు. ఈ నాలుగు ఆప్షన్స్లో మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.కాగా, 1978-79లో వెస్టిండీస్తో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ సునీల్ గవాస్కరే. ఈ సిరీస్లో గవాస్కర్ రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్లో గవాస్కర్ తర్వాత 700 పరుగుల మార్కును తాకింది యశస్వి జైస్వాల్ ఒక్కడే. 2024లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో యశస్వి 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
అగ్రపీఠాన్ని అధిరోహించిన బుమ్రా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకే చెందిన రవిచంద్రన్ అశ్విన్ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ పలు పాయింట్లు కోల్పోయి 9, 15, 16 స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, లబూషేన్, డారిల్ మిచెల్ 2, 4, 5, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు.ఈ వారం ర్యాంకింగ్స్లో భారీగా లబ్ది పొందిన బ్యాటర్లలో దినేశ్ చండీమల్ (20వ స్థానం), ఏంజెలో మాథ్యూస్ (23వ స్థానం), మొమినుల్ హక్ (42వ స్థానం), కుసాల్ మెండిస్ (43వ స్థానం), కేఎల్ రాహుల్ (49వ స్థానం), షద్మాన్ ఇస్లాం (79), మిచెల్ సాంట్నర్ (88) టాప్-100లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్ నుంచి బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా 1, 2, 6 స్థానాల్లో ఉండగా.. హాజిల్వుడ్, కమిన్స్, రబాడ, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, కైల్ జేమీసన్, షాహీన్ అఫ్రిది టాప్-10లో ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్దీప్ ఈ వారం ర్యాంకింగ్స్లో 12 స్థానాలు మెరుగపర్చుకుని 76వ స్థానానికి చేరాడు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2గా కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ ఓ స్థానం కోల్పోయి ఏడో ప్లేస్కు పడిపోయాడు. చదవండి: శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్ -
Ind vs Ban: అంచనాలు తలకిందులు చేసి.. ఫలితం తేల్చేశారు!
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.కాన్పూర్లో వెంటాడిన వరణుడు డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆడింది. చెన్నై మ్యాచ్లో 280 పరుగులతో బంగ్లాను మట్టికరిపించి శుభారంభం అందుకున్న టీమిండియాను.. కాన్పూర్లో వరణుడు వెంటాడాడు. వర్షం కారణంగా ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలిరోజు కేవలం 35 ఓవర్ల ఆటే సాగగా.. రెండు, మూడో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దైపోయింది.డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా రెండో టెస్టు డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, టీమిండియా మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ‘బజ్బాల్’ క్రికెట్ను తలదన్నే ఫార్ములాతో అద్భుతం చేసింది. వర్షం లేకపోవడం.. మైదానం పొడిగా ఉండటంతో నాలుగో రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.భారత బౌలర్ల విజృంభణబంగ్లాదేశ్ సోమవారం... తమ తొలి ఇన్నింగ్స్ స్కోరు 107/3ను మొదలుపెట్టగా.. ఆది నుంచే భారత బౌలర్లు విజృంభించారు. బంగ్లాను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లా ఓపెనర్లను అవుట్ చేయగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు కూల్చారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.‘బజ్బాల్’ క్రికెట్కే వణుకుపుట్టించే వేగంతోఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన ఆకాశమే హద్దుగా బంగ్లా బౌలింగ్ను చితక్కొట్టింది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా.. ‘బజ్బాల్’ క్రికెట్కే వణుకుపుట్టించే వేగంతో 50, 100. 200 పరుగుల మైలురాళ్లను దాటింది. వచ్చిన ప్రతి బ్యాటరూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచి వీలైనన్ని పరుగులు పిండుకున్నారు.ఈ క్రమంలో 34.4 ఓవర్లలోనే తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 285 పరుగులు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ మీద 52 పరుగుల ఆధిక్యం సంపాదించి. ఈ క్రమంలో బంగ్లా నాలుగో రోజే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి సోమవారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసంఇక ఆఖరి రోజు ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన రోహిత్ సేన.. ఆది నుంచే వికెట్ల వేట మొదలుపెట్టింది. నైట్ వాచ్మన్ మొమినుల్ హక్(2) వికెట్ తీసి శుభారంభం అందించగా.. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(50)ను ఆకాశ్ దీప్ పెవిలియన్కు పంపాడు. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ముష్ఫికర్ రహీం(37)ను బుమ్రా అవుట్ చేశాడు.చకచకా పడగొట్టేశారుమొత్తంగా బుమ్రా, అశూ, జడ్డూ మూడేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతా కలిసి రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ మీద బంగ్లాదేశ్ ఆధిక్యం 94 పరుగులు కాగా.. రోహిత్ సేన విజయ లక్ష్యంగా 95 పరుగులుగా మారింది.ఫోర్తో విజయం ఖరారు చేసిన పంత్ఇక త్వరగా మ్యాచ్ ముగించేయాలని భావించిన టీమిండియా దూకుడుగానే ఛేజింగ్ మొదలుపెట్టింది. దీంతో రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. యశస్వి జైస్వాల్(51) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. శుబ్మన్ గిల్ 6 పరుగులకే పరిమితం కాగా.. కోహ్లి 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషభ్ పంత్ ఫోర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. డ్రా అవుతుందని ఊహించిన ఈ మ్యాచ్లో టీమిండియా పక్కా ప్రణాళికతో గెలుపొందడం అభిమానులను ఖుషీ చేసింది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టువేదిక: గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 233 పరుగులు ఆలౌట్టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 285/9 డిక్లేర్డ్బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 146 పరుగుల ఆలౌట్టీమిండియా రెండో ఇన్నింగ్స్: 98/3ఫలితం: ఏడు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంచదవండి: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్.. Rishabh Pant hits the winning runs 💥He finishes off in style as #TeamIndia complete a 7-wicket win in Kanpur 👏👏Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Nl2EdZS9VF— BCCI (@BCCI) October 1, 2024 -
1877 నుంచి ఇదే తొలిసారి: అసలైన మజానిచ్చే రికార్డు!
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా వీరబాదుడును క్రికెట్ ప్రేమికులు అంత తేలికగా మర్చిపోలేరు. కాన్పూర్లో పొట్టి ఫార్మాట్ తరహాలో ఒక్కో భారత బ్యాటర్ చెలరేగుతూ ఉంటే అభిమానులు పండుగ చేసుకున్నారు. అంతకు ముందు వర్షం వల్ల రెండు రోజుల ఆట రద్దైన కారణంగా ఉసూరుమన్న ఫ్యాన్స్కు.. రోహిత్ సేన పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చి లెక్క సరిచేసింది.50, 100, 200, 250 పరుగుల రికార్డుటెస్టు ఫార్మాట్లో అత్యంత వేగంగా 50, 100, 200, 250 పరుగుల రికార్డును సాధించి.. ప్రపంచంలో ఈ ఘనతలు నమోదు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 11 బంతుల్లోనే 23 పరుగులు చేస్తే.. అతడి జోడీ యశస్వి జైస్వాల్(72) కేవలం 32 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.1877 నుంచి ఇదే తొలిసారివిరాట్ కోహ్లి 35 బంతుల్లో 47 పరుగులు చేస్తే.. కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ నలుగురు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ నేపథ్యంలో భారత జట్టు ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు ఒకటి నమోదైంది.ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. తద్వారా ఇంగ్లండ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 1877 నుంచి ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టెస్టుల్లో 90 సిక్సర్లు నమోదు చేసిన టీమ్గా చరిత్రకెక్కింది.కాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ మూడు, యశస్వి జైస్వాల్ రెండు, శుబ్మన్ గిల్ ఒకటి, విరాట్ కోహ్లి ఒకటి,. కేఎల్ రాహుల్ రెండు, ఆకాశ్ దీప్ రెండు సిక్సర్లు బాదారు. ఇక నవంబరులో టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడనుంది. కాబట్టి తన సిక్సర్ల రికార్డును రోహిత్ సేన తానే బద్దలు కొట్టే అవకాశం ఉంది.టెస్టుల్లో ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లుటీమిండియా- 90 సిక్స్లు(2024లో ఇప్పటి వరకు)ఇంగ్లండ్- 89 సిక్స్లు(2022లో)టీమిండియా- 87 సిక్స్లు(2021లో)న్యూజిలాండ్- 81 సిక్స్లు(2014లో)న్యూజిలాండ్- 71 సిక్స్లు(2013లో).చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
India vs Bangladesh, 2nd Test: విజయం వేటలో... మెరుపు వేగంతో...
తొలి మూడు రోజుల ఆటలో రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. మొదటి రోజు కూడా 35 ఓవర్లకే ఆట పరిమితమైంది. ఇలాంటి స్థితిలో మిగిలిన రెండు రోజుల్లో ‘డ్రా’కే అవకాశం తప్ప మరో ఫలితం వస్తుందా అని సోమవారం ఉదయం అంతా ఊహించారు. కానీ భారత జట్టు మాత్రం భిన్నంగా ఆలోచించింది. మ్యాచ్లో ఆధిక్యం ప్రదర్శించి విజయంపై గురి పెట్టాలంటే అసాధారణంగా ఆడాలని నిశ్చయించుకుంది. బ్యాటర్లంతా ఒక్కసారిగా టి20 ఫార్మాట్కు మారిపోయారు. అంతే... 50, 100, 150, 200, 250... ఇలా అన్ని పరుగుల మైలురాళ్లను వేగంగా, తక్కువ బంతుల్లో అధిగమించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. రోహిత్తో మొదలు పెట్టి జైస్వాల్, గిల్, కోహ్లి, రాహుల్ ధాటిగా ఆడటంతో ఏకంగా 8.22 రన్రేట్తో భారీగా పరుగులు, ఆపై ఆధిక్యం కూడా వచ్చేశాయి. అనంతరం 45 నిమిషాల్లోనే బంగ్లాదేశ్ను ఒత్తిడిలోకి నెట్టి రెండు వికెట్లతో పైచేయి సాధించింది. చివరి రోజు బంగ్లా పోరాడుతుందా లేక భారత్ ఇదే ఊపులో మ్యాచ్ గెలిచేస్తుందా చూడాలి. కాన్పూర్: వర్షంతో వృథా అయిన సమయాన్ని మర్చిపోయేలా గ్రీన్పార్క్ స్టేడియంలో భారత జట్టు అభిమానులకు ఒక్క రోజులో పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో మెరుపు బ్యాటింగ్తో జట్టు సత్తా చాటింది. సోమవారం భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్కు 52 పరుగుల ఆధిక్యం లభించింది. యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 72; 12 ఫోర్లు, 2 సిక్స్లు), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్స్లు) విరాట్ కోహ్లి (35 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (36 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించగా... షకీబ్, మిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 11 ఓవర్లలో 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 26 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఉదయం 107/3తో ఆట కొనసాగించిన బంగ్లా తమ తొలి ఇన్నింగ్స్లో 74.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) కీలక సెంచరీ సాధించారు. సోమవారం ఒక్కరోజే 18 వికెట్లు నేలకూలడం విశేషం. మోమినుల్ మినహా... రెండు రోజుల పాటు మైదానానికి దూరంగా ఉన్న తర్వాత ఎట్టకేలకు 107/3 స్కోరుతో బంగ్లాదేశ్ తమ ఇన్నింగ్స్ను కొనసాగించింది. సోమవారం మరో 39.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 126 పరుగులు జోడించి మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఆరంభం నుంచే ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ముష్ఫికర్ (11)ను బౌల్డ్ చేసి బంగ్లా పతనానికి బుమ్రా శ్రీకారం చుట్టాడు. బుమ్రా తర్వాతి ఓవర్లో దాస్ మూడు ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించినా... రోహిత్ అద్భుత క్యాచ్తో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్లో మోమినుల్ మాత్రం పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. కొద్ది సేపటికే సిరాజ్ అసాధారణ క్యాచ్ షకీబ్ (9)ను పెవిలియన్ పంపించింది. 93, 95 పరుగుల వద్ద పంత్, కోహ్లి క్యాచ్లు వదిలేయడంతో బతికిపోయిన మోమినుల్ ఆ తర్వాత కెరీర్లో 13వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత మిగిలిన 4 వికెట్లను పడగొట్టేందుకు భారత్ కు ఎక్కువ సమయం పట్టలేదు. ఖాలెద్ను అవుట్ చేసి జడేజా తన ఖాతాలో 300వ వికెట్ను వేసుకున్నాడు. ధనాధన్... దూకుడే మంత్రంగా భారత్ ఇన్నింగ్స్ సాగింది. మహమూద్ వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 3 వరుస ఫోర్లు బాదగా... ఖాలెద్ వేసిన తర్వాతి ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను రోహిత్ శర్మ (11 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్లు) సిక్సర్లుగా మలిచాడు. అనంతరం మహమూద్ ఓవర్లో వీరిద్దరు 2 సిక్స్లు, 2 ఫోర్లతో 22 పరుగులు రాబట్టారు. అయితే నాలుగో ఓవర్లోనే స్పిన్నర్ మిరాజ్ బౌలింగ్ కు దిగి రోహిత్ను వెనక్కి పంపాడు. 31 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. మరో వైపు గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో 32 పరుగుల వ్యవధిలో జైస్వాల్, గిల్, పంత్ (9) అవుటయ్యారు. ఈ దశలో కోహ్లి, రాహుల్ జోరు తగ్గకుండా బంగ్లా బౌలర్లపై ఆధిక్యం ప్రదర్శించారు. వీరిద్దరు ఐదో వికెట్కు 59 బంతుల్లోనే 87 పరుగులు జోడించడం విశేషం. 33 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకోగా, కోహ్లి ఆ అవకాశం చేజార్చుకున్నాడు. షకీబ్ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో ఆకాశ్దీప్ కూడా తానూ ఓ చేయి వేశాడు. 16 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం 11 ఓవర్లపాటు క్రీజ్లో బంగ్లా బ్యాటర్లు తడబడుతూనే ఆడారు. 7 ఓవర్లలో జట్టు 18 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్ తొలి బంతికే జాకీర్ (10)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్... తన తర్వాతి ఓవర్లో నైట్వాచ్మన్ మహమూద్ (4)ను బౌల్డ్ చేసి బంగ్లా ఆందోళనను మరింత పెంచాడు. అంతకుముందు 3 పరుగుల వద్ద షాద్మన్ ఇచి్చన క్యాచ్ను స్లిప్లో రాహుల్ వదిలేశాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: జాకీర్ (సి) జైస్వాల్ (బి) ఆకాశ్దీప్ 0; షాద్మన్ (ఎల్బీ) (బి) ఆకాశ్దీప్ 24; మోమినుల్ (నాటౌట్) 107; నజ్ముల్ (ఎల్బీ) (బి) అశి్వన్ 31; ముష్ఫికర్ (బి) బుమ్రా 11; లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; షకీబ్ (సి) సిరాజ్ (బి) అశి్వన్ 9; మిరాజ్ (సి) గిల్ (బి) బుమ్రా 20; తైజుల్ (బి) బుమ్రా 5; మహమూద్ (ఎల్బీ) (బి) సిరాజ్ 1; ఖాలెద్ (సి అండ్ బి) జడేజా 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 233. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–80, 4–112, 5–148, 6–170, 7–224, 8–230, 9–231, 10–233. బౌలింగ్: బుమ్రా 18–7–50–3, సిరాజ్ 17–2–57–2, అశి్వన్ 15–1–45–2, ఆకాశ్దీప్ 15–6–43–2, జడేజా 9.2–0–28–1. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) మహమూద్ 72; రోహిత్ (బి) మిరాజ్ 23; గిల్ (సి) మహమూద్ (బి) షకీబ్ 39; పంత్ (సి) మహమూద్ (బి) షకీబ్ 9; కోహ్లి (బి) షకీబ్ 47; రాహుల్ (స్టంప్డ్) దాస్ (బి) మిరాజ్ 68; జడేజా (సి) నజు్మల్ (బి) మిరాజ్ 8; అశ్విన్ (బి) షకీబ్ 1; ఆకాశ్దీప్ (సి) ఖాలెద్ (బి) మిరాజ్ 12; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (34.4 ఓవర్లలో 9 వికెట్లకు డిక్లేర్డ్) 285. వికెట్ల పతనం: 1–55, 2–127, 3–141, 4–159, 5–246, 6–269, 7–272, 8–284, 9–285. బౌలింగ్: మహమూద్ 6–0–66–1, ఖాలెద్ 4–0–43–0, మిరాజ్ 6.4–0–41–4, తైజుల్ 7–0–54–0, షకీబ్ 11–0–78–4. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మన్ (బ్యాటింగ్) 7; జాకీర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; మహమూద్ (బి) అశ్విన్ 4; మోమినుల్ (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (11 ఓవర్లలో 2 వికెట్లకు) 26. వికెట్ల పతనం: 1–18, 2–26. బౌలింగ్: బుమ్రా 3–1–3–0, అశి్వన్ 5–2–14–2, ఆకాశ్దీప్ 3–2–4–0.4: మూడు ఫార్మాట్లో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ (34,357), సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483) ఈ జాబితాలో అతనికంటే ముందున్నారు. కోహ్లి ప్రస్తుతం 27,012 పరుగులు చేశాడు. -
సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. సంప్రదాయ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఈ లెఫ్టాండర్.. తాజాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టు సందర్భంగా మరో రికార్డు నమోదు చేశాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ను జైస్వాల్ అధిగమించాడు. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చెన్నై టెస్టులో 280 పరుగులతో గెలిచిన టీమిండియా.. కాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్ ఆడుతోంది. గ్రీన్పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్కు తొలిరోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో రెండు, మూడో రోజు ఆట రద్దు కాగా.. సోమవారం మ్యాచ్ మళ్లీ మొదలైంది.ఆది నుంచే దూకుడుగాఈ నేపథ్యంలో 107/3 స్కోరుతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 11 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. 209కి పైగా స్ట్రైక్రేటుతో ఆకట్టుకున్నాడు.టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం ‘బజ్బాల్’ తరహా ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై బ్యాటర్.. 12 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 72 పరుగులు రాబట్టాడు.టీమిండియా తరఫున టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం సాధించినది వీరే👉రిషభ్ పంత్- బెంగళూరులో 2022 నాటి శ్రీలంకతో మ్యాచ్లో 28 బంతుల్లోనే 50 రన్స్👉కపిల్ దేవ్- కరాచిలో 1982 నాటి మ్యాచ్లో పాకిస్తాన్తో మ్యాచ్లో 30 బంతుల్లోనే 50 రన్స్👉శార్దూల్ ఠాకూర్- ఓవల్లో 2021 నాటి మ్యాచ్లో ఇంగ్లండ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉యశస్వి జైస్వాల్- కాన్పూర్లో 2024 నాటి మ్యాచ్లో బంగ్లాదేశ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉వీరేంద్ర సెహ్వాగ్- చెన్నైలో 2008 నాటి మ్యాచ్లో ఇంగ్లండ్ మీద 32 బంతుల్లో 50 రన్స్.ప్రపంచ రికార్డుఇక ధనాధన ఇన్నింగ్స్తో అలరించిన రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ జోడి టెస్టుల్లో హయ్యస్ట్ స్కోరింగ్ రేటు(14.34) పార్ట్నర్షిప్ సాధించిన తొలి జంటగా అరుదైన ఘనత సాధించింది. ఇద్దరూ కలిసి 23 బంతుల్లోనే 55 పరుగులు సాధించి ఈ ఫీట్ నమోదు చేశారు. వీరి తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ జోడీ బెన్ స్టోక్స్- బెన్ డకెట్(44 బంతుల్లో 87 నాటౌట్), వాగ్నర్- ట్రెంట్ బౌల్ట్(27 బంతుల్లో 52) ఉన్నారు. చదవండి: రాహుల్ ద్రవిడ్ కుమారుడికి షాక్.. ఇకపై ఆ జట్టుకు ఆడలేడు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
టీమిండియా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే
కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగారు.107/3 ఓవర్ నైట్స్కోర్తో నాలుగో రోజును ప్రారంభించిన బంగ్లాదేశ్.. అదనంగా 126 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్ను ముగించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్,అశ్విన్,ఆకాష్ దీప్ తలా రెండు వికెట్లు సాధించారు.టీమిండియా వరల్డ్ రికార్డు..అనంతరం మొదటి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి దూకుడు ధాటికి భారత్ స్కోర్ కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ను అందుకుంది. తద్వారా ఓ వరల్డ్ రికార్డును టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి ఈ రికార్డు సాధించింది. తాజా మ్యాచ్తో ఇంగ్లండ్ ఆల్టైమ్ రికార్డును రోహిత్ సేన బ్రేక్ చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(37), రిషబ్ పంత్(4) పరుగులతో ఉన్నారు. అదేవిధంగా యశస్వీ జైశ్వాల్(51 బంతుల్లో 72, 12 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ 23 పరుగులు చేశాడు. -
Ind vs Ban: గిల్, జైస్వాల్లకు రెస్ట్.. వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!
టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 6, 9, 12వ తేదీల్లో మూడు మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలోనే జట్టును ప్రకటించనుంది.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ పొట్టి సిరీస్కు శుబ్మన్ గిల్తో పాటు యశస్వి జైస్వాల్కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. కాగా సొంతగడ్డపై నవంబరులో టీమిండియా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే భారత్కు ఈ సిరీస్ కీలకం.గిల్, జైస్వాల్పై పనిభారం పడకుండాఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్పై పనిభారం పడకుండా చూసుకునేందుకు.. మేనేజ్మెంట్ ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. గిల్- జైస్వాల్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా ప్రధాన ఓపెనింగ్ జోడీగా మారారు.వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!అయితే, కివీస్తో సిరీస్ కారణంగా వీరిద్దరు గనుక దూరమైతే.. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లే! వీరిద్దరు బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. అయితే, రుతురాజ్ ఇరానీ కప్-2024 మ్యాచ్ కారణంగా తొలి టీ20కి దూరం కానున్నాడని.. అందుకే జైస్వాల్ ఆ ఒక్కమ్యాచ్కి అందుబాటులో ఉంటాడనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘సి’ కెప్టెన్గా ఉన్న రుతురాజ్.. ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ అక్టోబరు 1-5 వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్గా ఎంపిక కానుండగా.. జితేశ్ శర్మను అతడికి బ్యాకప్గా సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.విధ్వంసకర సెంచరీ హీరో అభిషేక్ శర్మటీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో స్థానం దక్కించుకున్న పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తొలిటీ20 సందర్భంగా అరంగేట్రం చేశాడు.అయితే, తొలి మ్యాచ్లోనే డకౌట్ అయి విమర్శపాలైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టీ20లో శతకంతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకుని.. ఆ తర్వాత అవుటయ్యాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు అతడికి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ఇక టీమిండియా విషయానిస్తే.. బంగ్లాతో తొలి టెస్టు గెలిచి.. శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్ -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. షాకైన గిల్( వీడియో)
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ముందు భారత్ ఏకంగా 515 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు మూడో రోజు ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. బంగ్లా జట్టు విజయం సాధించాలంటే ఇంకా 357 పరుగులు అవసరం. భారత్ విజయానికి మరో 6 వికెట్లు కావాలి. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లో యువ క్రికెటర్లు రిషబ్ పంత్(109), శుబ్మన్ గిల్(119) సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ 287/4 వద్ద తమ సెకెండ్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.యశస్వీ కళ్లు చెదిరే క్యాచ్..ఇక మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత యువ కెరటం యశస్వీ జైశ్వాల్ సంచలన క్యాచ్తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్తో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ను పెవిలియన్కు పంపాడు. బంగ్లా ఇన్నింగ్స్ 15 ఓవర్లో బుమ్రా.. రెండో బంతిని జకీర్ హసన్కు ఆఫ్ స్టంప్ వెలుపల సంధించాడు. దీంతో జకీర్ కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం థిక్ ఎడ్జ్ తీసుకుని గల్లీ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో గల్లీలో ఉన్న జైశ్వాల్ ఎడమవైపు డైవ్ చేసి ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.ఇది చూసిన భారత ఆటగాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. శుబ్మన్ గిల్ అయితే తన రెండు చేతులను తలపై ఉంచి షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.. టీమిండియాదే విజయం? Jasprit Bumrah with the first breakthrough as Yashasvi Jaiswal takes a brilliant catch to dismiss Zakir Hasan.Watch 👇👇Live - https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/KdWyAW1yIN— BCCI (@BCCI) September 21, 2024 -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. భారత తొలి బ్యాటర్గా
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అరంగేట్రంలోనే శతకంతో అలరించిన ఈ ముంబై బ్యాటర్.. పట్టుమని పది టెస్టుల్లోనే వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.అరంగేట్రంలోనే 171 పరుగులుగతేడాది వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి.. తొలి టెస్టులోనే 171 పరుగులతో చెలరేగాడు. ఆ తర్వాత యశస్వి అద్బుత ఇన్నింగ్స్తో అలరిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.విలువైన అర్ధ శతకంఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఖాతాలో ఇప్పటి వరకు టెస్టుల్లో మూడు శతకాలు, రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇక తాజాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లోనూ జైస్వాల్ తన హవా కొనసాగిస్తున్నాడు. చెన్నై వేదికగా గురువారం మొదలైన మొదటి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(6), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(6) విఫలమైన వేళ జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో విలువైన అర్ధ శతకం(56) బాదాడు.గావస్కర్ రికార్డు బ్రేక్ఇక రెండో ఇన్నింగ్స్లో పది పరుగులకే పరిమితమైనా.. జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్లోని తొలి పది టెస్టు మ్యాచ్లలో అత్యధిక పరుగులు సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. తద్వారా సునిల్ గావస్కర్(978) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. ఓవరాల్గా తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు.తమ కెరీర్లో మొదటి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు1.డాన్ బ్రాడ్మన్(ఆస్ట్రేలియా)- 1446 పరుగులు2.ఎవర్టన్ వీక్స్(వెస్టిండీస్)- 1125 పరుగులు3.జార్జ్ హెడ్లీ(వెస్టిండీస్)- 1102 పరుగులు4. యశస్వి జైస్వాల్(ఇండియా)- 1094 పరుగులు5. మార్క్ టేలర్(ఆస్ట్రేలియా)- 1088 పరుగులు.చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియాపంత్పై సిరాజ్ ఆగ్రహం.. రోహిత్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
జైశ్వాల్ వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే?
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్లు బంగ్లా బౌలర్ల దెబ్బకు పెలివియన్కు క్యూ కట్టినప్పటకి.. జైశ్వాల్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు.రిషబ్ పంత్తో కలిసి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. యశస్వీ 118 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.తన మొదటి 10 ఇన్నింగ్స్లలో(స్వదేశంలో) అత్యధిక పరుగులు చేసిన మొదటి బ్యాటర్గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. యశస్వీ తన సొంత గడ్డపై మొదటి 10 టెస్టు ఇన్నింగ్స్లలో 755* పరుగులు సాధించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం జార్జ్ హెడ్లీ పేరిట ఉండేది. 1935లో హెడ్లీ విండీస్ గడ్డపై 747 పరుగులు చేశాడు. అయితే 750కి పైగా పరుగులు చేయడం మాత్రం 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇదే తొలిసారి.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన అశ్విన్.. ప్రపంచంలోనే క్రికెటర్గా -
Ind vs Ban: కోహ్లి అవుట్.. రోహిత్ రియాక్షన్ వైరల్
టెస్టు పునరాగమనంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఈ ఢిల్లీ క్రికెటర్ పూర్తిగా విఫలమయ్యాడు. చెన్నై టెస్టులో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఫలితంగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరే క్రమంలో టీమిండియా స్వదేశంలో వరుస సిరీస్లు ఆడనుంది. బంగ్లాదేశ్తో రెండు, న్యూజిలాండ్తో మూడు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది.ఆది నుంచే చెలరేగిన బంగ్లా పేసర్చెపాక్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పర్యాటక బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు బంగ్లా యువ క్రికెటర్ హసన్ మహమూద్ చుక్కలు చూపిస్తున్నాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ(6)ను పెవిలియన్కు పంపిన ఈ పేస్ బౌలర్.. తర్వాత శుబ్మన్ గిల్ను డకౌట్ చేశాడు. అనంతరం.. కోహ్లి క్రీజులోకి రాగా.. అభిమానులు కేరింతలు కొట్టారు.చెత్త షాట్ సెలక్షన్ హసన్కు దీటుగా బదులిస్తాడని.. కోహ్లి నామస్మరణతో హోరెత్తించారు. ఆరంభంలో కాస్త బాగానే ఆడినా.. కోహ్లి సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో ఉసూరుమన్నారు. భారత ఇన్నింగ్స్ పదో ఓవర్లో.. హసన్ వేసిన రెండో బంతి అవుట్సైడ్ ఆఫ్ దిశగా వెళ్తుంగా.. కోహ్లి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ను తాకి వికెట్ కీపర్ లిటన దాస్ చేతుల్లో పడింది. అలా చెత్త షాట్ సెలక్షన్ వల్ల కోహ్లి వికెట్ కోల్పోయాడు.Virat Kohli's Dismissal 💔 Edged and gone 😢 King's Rare failure 💯 #IndVsBan#ViratKohlipic.twitter.com/ebQ2OPbWaT— Berzabb (@Berzabb) September 19, 2024కోహ్లి అవుట్.. రోహిత్ రియాక్షన్ వైరల్ఇక మ్యాచ్ మొదలైన తొలి గంటలోనే ఇలా మూడు వికెట్లు కోల్పోవడం.. ముఖ్యంగా కోహ్లి కూడా త్వరగా అవుట్ కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ముఖం మాడ్చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. Virat kohli got out & the crowd is still cheering. 😭Reason : Rishabh pant #CricketUpdatespic.twitter.com/KmFI59xjjO— Rp17 (@HarshadSarode13) September 19, 2024ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 88/3 (23). జైస్వాల్ 37, పంత్ 33 పరుగులతో ఆడుతున్నారు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
రూట్కు పొంచి ఉన్న గండం.. అరుదైన రికార్డుకు ఎసరు!
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాదేశ్తో గురువారం నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్లో 132 పరుగులు చేస్తే.. ఇంత వరకు ఏ భారత క్రికెటర్కూ సాధ్యం కాని ఘనత సాధిస్తాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ను ఐసీసీ రెండేళ్లకొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అజింక్య రహానే పేరిట ఆ రికార్డుఇక 2019-21 నుంచి డబ్ల్యూటీసీ మొదలు కాగా.. ఆ సీజన్లో భారత్ తరఫున టెస్టు స్పెషలిస్టు అజింక్య రహానే 1159 పరుగులు సాధించాడు. తద్వారా ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్గా తన పేరిట రికార్డును పదిలం చేసుకున్నాడు. అయితే, ఆ ఘనతను అధిగమించేందుకు జైస్వాల్కు ఇప్పుడు అవకాశం వచ్చింది. జైస్వాల్ 132 రన్స్ చేస్తే..ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్(2023-25)లో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 1028 పరుగులు సాధించాడు. ఈ 22 ఏళ్ల లెఫ్టాండర్ గనుక మరో 132 రన్స్ చేస్తే.. రహానేను వెనక్కినెట్టి డబ్ల్యూటీసీ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్గా తన పేరును లిఖించుకోగలుగుతాడు.రూట్ రికార్డుకు ఎసరు పెట్టాడుఅంతేకాదు.. మరో 371 పరుగులు చేస్తే ఓవరాల్గా ఈ సైకిల్లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్(1398 రన్స్)ను కూడా జైస్వాల్ అధిగమించగలడు. ప్రస్తుతం జైస్వాల్.. మరో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్(1028 రన్స్)తో కలిసి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా జట్ల విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్లో ఉంది. బంగ్లాదేశ్తో స్వదేశంలో సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు జరుగనున్న రెండు మ్యాచ్ల సిరీస్ గెలిచి.. అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక బంగ్లాదేశ్ తర్వాత రోహిత్ సేన సొంతగడ్డపై న్యూజిలాండ్(మూడు టెస్టులు)తో తలపడనుంది.డబ్ల్యూటీసీ వీరుడిగాఅనంతరం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే బంగ్లాదేశ్తో సిరీస్ సందర్భంగానే డబ్ల్యూటీసీ ఇండియా వీరుడిగా నిలిచే అవకాశం ఉంది. లేదంటే.. మరికొన్నాళ్లు అతడు వేచిచూడకతప్పదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే యశస్వి జైస్వాల్ ఖాతాలో ఇప్పటికే టెస్టుల్లో మూడు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం అతడి సత్తాకు నిదర్శనం.చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్ -
టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్స్ ఆ ఇద్దరే: ఆసీస్ ఆటగాళ్లు
ఆస్ట్రేలియా ఆటగాళ్లకు టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్స్ ఎవరనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆసక్తికర సమాధానలు చెప్పారు. ఆసీస్ స్టార్ ప్లేయర్లంతా ముక్తకంఠంతో ఇద్దరు యువ ఆటగాళ్లకు ఓటు వేశారు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్ యశస్వి జైస్వాల్కు ఓటు వేయగా.. కెమరూన్ గ్రీన్, ట్రవిస్ హెడ్ శుభ్మన్ గిల్వైపు మొగ్గు చూపారు.Australian players picking the future Superstars of Indian Cricket. 🇮🇳- Gill 🤝 Jaiswal...!!!!! pic.twitter.com/RSOzYQOA2k— Johns. (@CricCrazyJohns) September 16, 2024కాగా, టీమిండియా త్వరలో (నవంబర్ 22 నుంచి) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్లు జరుగనున్నాయి. టీమిండియా గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఆ జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో ఈసారి ఎలాగైనా టీమిండియాకు ఓటమి రుచి చూపించాలని ఆసీస్ ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. మరోవైపు భారత్ జట్టు గతంలో కంటే ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. ఈసారి టీమిండియాను ఓడించడం అంత సులువైన పని కాదు. సీనియర్లు, జూనియర్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆస్ట్రేలియా, టీమిండియా వేర్వేరు జట్లతో సిరీస్లలో బిజీగా ఉన్నాయి. త్వరలో భారత్.. బంగ్లాదేశ్ను ఎదుర్కోనుండగా.. ఆసీస్ ప్రస్తుతం ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతుంది. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న మొదలవుతుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: గిల్, పంత్, బుమ్రాలకు విశ్రాంతి..? -
తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి తలో స్థానం మెరుగుపర్చుకున్నారు. ఈ ముగ్గురు తాజా ర్యాంకింగ్స్లో ఐదు, ఆరు, ఏడు స్థానాలకు ఎగబాకారు. గత కొంతకాలంగా భారత్ టెస్ట్ క్రికెట్ ఆడనప్పటికీ ఈ ముగ్గురి ర్యాంకింగ్స్ మెరుగుపడటం గమనార్హం. వీరితో పాటు టాప్-10లో ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, మార్నస్ లబూషేన్ కూడా తలో స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలకు చేరారు. జో రూట్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్ టాప్-4 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.లంక ఆటగాళ్ల హవాఈ వారం ర్యాంకింగ్స్లో శ్రీలంక ఆటగాళ్లు భారీగా ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నారు. ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో సత్తా చాటిన ధనంజయ డిసిల్వ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి.. అదే టెస్ట్లో రాణించిన కమిందు మెండిస్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి ఎగబాకారు. తాజా ర్యాంకింగ్స్లో భారీ లబ్ది పొందిన లంక ఆటగాళ్లలో పథుమ్ నిసాంక ముందువరుసగా ఉన్నాడు. ఇంగ్లండ్తో మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన నిసాంక ఏకంగా 42 స్థానాలు మెరుగుపర్చుకుని 39వ స్థానానికి ఎగబాకాడు. ఇది మినహా టాప్-100 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.బౌలర్ల ర్యాంకింగ్స్లోనూ..!టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లోనూ లంక ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. మిలన్ రత్నాయకే 26, విశ్వ ఫెర్నాండో 13, లహీరు కుమార 10 స్థానాలు మెరుగపర్చుకుని 85, 31, 32 స్థానాలకు ఎగబాకారు. ఈ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, జోష్ హాజిల్వుడ్, జస్ప్రీత్ బుమ్రా టాప్-3లో కొనసాగుతున్నారు. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.జడ్డూ@1.. అశ్విన్@2టెస్ట్ ఆల్రౌండర్ల విషయానికొస్తే.. తాజా ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పులేమీ లేవు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ 1, 2, 6 స్థానాలను నిలబెట్టుకున్నారు. లంక ఆటగాడు మిలన్ రత్నాయకే 22 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు. చదవండి: ’ముంబై ఇండియన్స్తో రోహిత్ ప్రయాణం ముగిసినట్టే’ -
పంత్, జైస్వాల్ స్థానాలను భర్తీ చేసేది వీరే..!
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఎంపిక జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత ఆటగా శిక్షణా శిబిరం సెప్టెంబర్ 12న నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టుకు ఎంపికైన మెజార్టీ శాతం ఆటగాళ్లు ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నారు. వీరి స్థానాలను బీసీసీఐ వేరే ఆటగాళ్లతో భర్తీ చేసింది.శుభ్మన్, కుల్దీప్ ప్రత్యామ్నాయాలు వీరే..!ఇండియా-ఏ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్ టీమిండియాకు ఎంపిక కాగా.. వీరి స్థానాలను ప్రథమ్ సింగ్, అక్షయ్ వాద్కర్, షేక్ రషీద్, షమ్స్ ములానీ భరీ చేయనున్నారు. సీమర్ విధ్వత్ కావేరప్ప ఇండియా-ఏ నుంచి ఇండియా-డికి బదిలీ కానున్నాడు. గిల్ స్థానంలో ఇండియా-ఏ కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ వ్యవహరించనున్నాడు.పంత్, జైస్వాల్ స్థానాలను భర్తీ చేసేది వీరే..!ఇండియా-బి విషయానికొస్తే.. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాల్ టీమిండియాకు ఎంపికయ్యారు. వీరి స్థానాల్లో సుయాశ్ ప్రభుదేశాయ్, హిమాన్షు మంత్రి, రింకూ సింగ్ ఇండియా-బిలో చేరతారు. ఇండియా-బి నుంచి సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాకు ఎంపికైనప్పటికీ.. అతను దులీప్ ట్రోఫీ రెండో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ బంగ్లాతో తొలి టెస్ట్కు మూడు రోజుల ముందు ముగుస్తుంది.ఇండియా-సి విషయానికొస్తే.. ఈ జట్టు నుంచి ఎవరూ టీమిండియాకు ఎంపిక కాలేదు. కాబట్టి ఈ జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు.ఇండియా-డి నుంచి అక్షర్ పటేల్ టీమిండియాకు ఎంపిక కాగా.. అతని స్థానాన్ని విధ్వత్ కావేరప్ప భర్తీ చేయనున్నాడు. ఇండియా-డి ఆటగాడు తుషార్ దేశ్పాండే గాయపడగా.. అతని స్థానంలో నిషాంత్ సంధు జట్టులోకి వచ్చాడు.కాగా, దులీప్ ట్రోఫీ సెకెండ్ రౌండ్ మ్యాచ్లు సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు జరుగనుండగా.. టీమిండియా, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి మొదలవుతుంది. -
నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్
దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా అనంతరపురం, బెంగళూరు వేదికలుగా దేశవాళీ రెడ్బాల్ టోర్నీ గురువారం ఆరంభమైంది.ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్విఇందులో భాగంగా ఇండియా-‘ఏ’ - ఇండియా- ‘బి’ జట్ల మధ్య తొలి మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ఇండియా- ‘ఏ’ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ తమ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్తో కలిసి ఇండియా- ‘బి’ ఇన్నింగ్స్ ఆరంభించాడు.అనుభవజ్ఞుడైన అభిమన్యు ఈశ్వరన్కు ఇండియా- ‘ఏ’ పేసర్ ఆవేశ్ ఖాన్ అద్భుత బంతిని సంధించగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిమన్యు నిష్క్రమించగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. హాట్ ఫేవరెట్గా దిగి.. విఫలంఖలీల్ అహ్మద్ బౌలింగ్లో శశ్వత్ రావత్(సబ్స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా తరఫున ఇప్పటికే మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు బాదిన యశస్వి జైస్వాల్ హాట్ ఫేవరెట్గా దులిప్ ట్రోఫీ బరిలో దిగాడు. అయితే, ఆరంభంలోనే ఇలా విఫలమై అభిమానులను నిరాశపరిచాడు. కాగా బంగ్లాదేశ్తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో.. ఈ టోర్నీకి ప్రాధాన్యం ఏర్పడింది. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుంది. ఇదిలా ఉంటే.. తొలిరోజు 30 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇండియా-‘బి’ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. అన్నదమ్ములు ముషీర్ ఖాన్ ఆరు, సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇండియా-‘ఏ’ వర్సెస్ ఇండియా- ‘బి’ తుదిజట్లుఇండియా-‘ఏ’శుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.ఇండియా- ‘బి’అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, ముకేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్.చదవండి: ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్.. వీడియో వైరల్ -
'అతడొక అద్భుతం.. కానీ ఆసీస్ బౌలర్ల నుంచి కఠిన పరీక్ష తప్పదు'
టీమిండియా యవ సంచలనం యశస్వీ జైశ్వాల్పై ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ అద్భుతమైన ఆటగాడని హేడన్ కొనియాడాడు. అయితే రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బౌలర్ల నుంచి యశస్వీ కఠినమైన పరీక్షను ఎదుర్కొంటాడని అతడు అభిప్రాయపడ్డాడు. జైశ్వాల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. భారత్కు క్రికెట్కు దొరికిన విలువైన ఆస్తి. అతడి స్ట్రోక్ప్లే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా యశస్వీ కవర్స్పై నుంచి ఆడే షాట్స్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. అతడు తన బ్యాటింగ్ స్కిల్స్తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే బౌన్సీ పిచ్లపై ఎలా ఆడుతాన్నది చూడాలి. జైశ్వాల్ బంతిని హార్డ్గా హిట్ చేయడం మనం చాలా సార్లు చూశాం. కానీ ఆస్ట్రేలియా పిచ్లలో హార్డ్ హిట్టింగ్ చేయడం అంత ఈజీకాదు. వరల్డ్క్లాస్ బౌలర్ల నుంచి జైశ్వాల్కు బిగ్ ఛాలెంజ్ ఎదురుకానుంది. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్లను ఎదుర్కొనేందుకు యశస్వీ సిద్దంగా ఉండాలి. అదే విధంగా మైదానాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అక్కడ సిక్స్లు కొట్టడం అంత సులభం కాదు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోతే ఫీల్డర్కు ఈజీగా దొరికిపోతారు. కాబట్టి ఆసీస్ కండీషన్స్లో జైశ్వాల్ కాస్త ఆచితూచి ఆడాలని సీఈఏట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్లో హేడన్ పేర్కొన్నాడు. కాగా జైశ్వాల్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. కేవలం తొమ్మిది టెస్టులు మాత్రమే ఆడిన జైశ్వాల్ 70.07 స్ట్రైక్ రేటుతో 1028 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది నవంబర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు భారత జట్టు వెళ్లనుంది. -
‘వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు’
టీమిండియా టీ20 కొత్త ఓపెనింగ్ జోడీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జంటను చూస్తుంటే తనకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తున్నారని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీల్లో రోహిత్- విరాట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఫలితంగా.. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైనా బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు.. భవిష్య కెప్టెన్ శుబ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్లలో ఒకడిగా జట్టుతో ప్రయాణించాడు. అయితే, దిగ్గజ బ్యాటర్లు కోహ్లి- రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పొట్టి ఫార్మాట్లో యశస్వి- గిల్ జోడీ ఓపెనింగ్కు వస్తున్నారు.వరల్డ్కప్ టోర్నీ తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. శుబ్మన్ గిల్ తొలిసారిగా టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో గెలిచాడు. ఈ టూర్లో యశస్వి- గిల్ ఎక్కువసార్లు ఓపెనింగ్ చేశారు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వీరే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు.టీమిండియా లంకతో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. యశస్వి- గిల్ జోడీని గంగూలీ- సచిన్లతో పోల్చాడు.వాళ్లు ఆడుతుంటే గంగూలీ- సచిన్ గుర్తుకువస్తారు‘‘వీళ్లిద్దరిని చూస్తే నాకు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండుల్కర్ గుర్తుకువస్తారు. వాళ్లిద్దరు ఎలా పరస్పరం అవగాహనతో ఆడేవారో.. వీరూ అలాగే చేస్తారు. తమవైన వ్యూహాలు అమలు చేస్తూనే.. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పుతారు. వీళ్లిద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇక జైస్వాల్ గురించి చెప్పాలంటే.. త్వరలోనే అతడు వన్డేల్లో కూడా ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు.టెస్టు, టీ20 క్రికెట్లో ఇప్పటికే టీమిండియా తరఫున తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లోనూ రాణించగలడు. పరుగులు చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్న అతడికి ఇదేమీ అసాధ్యం కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా యశస్వి గంగూలీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా.. గిల్ సచిన్లా రైట్హ్యాండ్ బ్యాటర్. -
భీకర ఫామ్ను కొనసాగిస్తున్న యశస్వి జైస్వాల్.. తొలి బ్యాటర్గా రికార్డు
2024లో టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్ భీకర ఫామ్ కొనసాగుతుంది. యశస్వి ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు దాటిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. కేవలం 13 మ్యాచ్ల్లోనే యశస్వి ఈ మైలురాయిని చేరుకున్నాడు.ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. ఆ సిరీస్లో 79.91 సగటున 712 పరుగులు చేశాడు. అనంతరం జింబాబ్వే టీ20 సిరీస్లో మూడు మ్యాచ్ల్లో 165.88 స్ట్రయిక్రేట్తో 141 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో 70 పరుగులు చేసి (40, 30) ఆకట్టుకున్నాడు. యశస్వి ఈ ఏడాది రెండు డబుల్ సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1023 పరుగులు చేశాడు. ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి తర్వాతి స్థానంలో లంక ఆటగాడు కుశాల్ మెండిస్ ఉన్నారు. మెండిస్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి 888 పరుగులు చేశాడు. మెండిస్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇబ్రహం జద్రాన్ (844), టీమిండియా రోహిత శర్మ (833), శ్రీలంక పథుమ్ నిస్సంక (791), ఆఫ్ఘనిస్తాన్ రహ్మానుల్లా గుర్భాజ్ (773), టీమిండియా శుభ్మన్ గిల్ (725) ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన వారిలో ఉన్నారు.లంకతో రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుశాల్ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.అనంతరం భారత్ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలు కావడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించడంతో భారత్ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది. -
భారీ జంప్ కొట్టిన శుభ్మన్.. ఆరో స్థానానికి ఎగబాకిన యశస్వి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాడు శుభ్మన్ గిల్ భారీ జంప్ కొట్టాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో గిల్ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 37వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్లో గిల్తో పాటు మరో టీమిండియా బ్యాటర్ భారీ లబ్ది పొందాడు. ఇదివరకే టాప్-10లో ఉండిన యశస్వి జైస్వాల్.. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు. గత నెలలో రెండో స్థానానికి పడిపోయిన సూర్యకుమార్.. ఇటీవల జింబాబ్వేతో సిరీస్ ఆడనప్పటికీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. ట్రవిస్ హెడ్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఏడు, టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఎనిమిది, విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్ తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఆదిల్ రషీద్, నోర్జే, హసరంగ, రషీద్ ఖాన్, హాజిల్వుడ్, అకీల్ హొస్సేన్, ఆడమ్ జంపా, ఫజల్ హక్ ఫారూఖీ, మహీశ్ తీక్షణ ఒకటి నుంచి తొమ్మిది స్థానాలను నిలుపుకున్నారు. అల్జరీ జోసఫ్, తబ్రేజ్ షంషి, గుడకేశ్ మోటీ తలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 10, 11, 12 స్థానాలకు ఎగబాకారు. భారత బౌలర్లలో టాప్-10లో ఎవరూ లేకపోగా.. అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు దిగజారి 13కు.. రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు దిగజారి 19కి, జస్ప్రీత్ బుమ్రా ఏడు స్థానాలు దిగజారి 21వ స్థానానికి పడిపోయారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోగా.. హసరంగ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
యశస్వి జైస్వాల్.. మరో 47 పరుగులు చేస్తే..!
ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. యశస్వి.. త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లో మరో 47 పరుగులు చేస్తే.. ఈ ఏడాది 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. యశస్వి ఈ ఏడాది ఇప్పటివరకు 16 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 953 పరుగులు చేశాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఉన్నాడు. జద్రాన్ 27 ఇన్నింగ్స్ల్లో సెంచరీ, 8 అర్దసెంచరీల సాయంతో 844 పరుగులు చేశాడు. ఈ జాబితాలో యశస్వి, జద్రాన్ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 22 ఇన్నింగ్స్లు ఆడి 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 833 పరుగులు చేశాడు. ఈ జాబితా టాప్-10లో యశస్వి, జద్రాన్, రోహిత్ తర్వాత కుశాల్ మెండిస్ (833), రహ్మానుల్లా గుర్బాజ్ (773), బాబర్ ఆజమ్ (709), శుభ్మన్ గిల్ (691), పథుమ్ నిస్సంక (680), మహ్మద్ రిజ్వాన్ (632), చరిత్ అసలంక (596) ఉన్నారు.ఇదిలా ఉంటే, ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో యశస్వి మూడు మ్యాచ్లు ఆడి 70కి పైగా సగటుతో 141 పరుగులు చేశాడు. ఈ సిరీస్ నాలుగో టీ20లో యశస్వి అజేయమైన 93 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ తదుపరి జులై 27 నుంచి శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. -
IND Vs ZIM: చరిత్ర సృష్టించిన యశస్వి.. ఒక్క బంతి 13 పరుగులు
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే రెండు సిక్సర్లు బాదిన యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సికందర్ బౌలింగ్లో తొలి బంతి నో బాల్ కాగా.. ఆ బంతిని యశస్వి సిక్సర్గా మలిచాడు. ఆతర్వాతి బంతి ఫ్రీ హిట్ కావడంతో ఆ బంతిని కూడా స్టాండ్స్లో పంపాడు. నో బాల్తో లభించే అదనపు పరుగుతో కలుపుకుని తొలి బంతికి మొత్తం 13 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలా తొలి బంతికే 13 పరుగులు వచ్చిన దాఖలాలు లేవు.Yashasvi Jaiswal became the first batter in history to score 13 runs on the 1st ball of a T20i. 🌟pic.twitter.com/98j63xmtGu— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి మాంచి జోష్ మీదుండిన యశస్వి.. అదే ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సికందర్ రజా సంధించిన ఇన్ స్వింగర్ను తప్పుగా అంచనా వేసిన యశస్వి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. యశస్వి ఔటైన అనంతరం అభిషేక్ శర్మ (14), శుభ్మన్ గిల్ (13) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టారు. After conceding two sixes, Sikandar Raza took Yashasvi Jaiswal's wicket, and the celebration says it all.📸: SonyLIV pic.twitter.com/XpNkG19AhM— CricTracker (@Cricketracker) July 14, 2024వీరి తర్వాత క్రీజ్లో వచ్చిన సంజూ శాంసన్ (31 బంతుల్లో 38; 3 సిక్సర్లు), రియాన్ పరాగ్ (18 బంతుల్లో 20; సిక్స్) కుదురుగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/3గా ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సికందర్ రజా, నగరవ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్ స్థానాల్లో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్ -
చరిత్ర సృష్టించిన గిల్-జైశ్వాల్ జోడీ.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ ఊదిపడేశారు.జింబాబ్వే బౌలర్లను చొతక్కొట్టారు. యశస్వీ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 93 పరుగులు చేయగా.. గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 156 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పిన గిల్-జైశ్వాల్ జోడీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.టీ20 క్రికెట్లో ఛేజింగ్లో భారత తరపున రెండు సార్లు 150 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడీగా గిల్-జైశ్వాల్ నిలిచారు. వీరిద్దరూ టీ20ల్లో 150 పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే రెండో సారి.ఇంతకుముందు 2023లో వెస్టిండీస్తో జరిగిన టీ20లో జైస్వాల్, గిల్ ఇద్దరూ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రెండు భాగస్వామ్యాలు కూడా ఛేజింగ్లో నెలకొల్పినివే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్ను గిల్, జైశ్వాల్ తమ ఖాతాలో వేసుకున్నారు.టీ20 చరిత్రలో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇవే..165 - రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ శ్రీలంక, ఇండోర్, 2017165 - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్మన్ గిల్ వర్సెస్ వెస్టిండీస్, లాడర్హిల్, 2023160 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ ఐర్లాండ్, డబ్లిన్, 2018158 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ న్యూజిలాండ్, ఢిల్లీ, 2017156* - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్మన్ గిల్ వర్సెస్ జింబాబ్వే, హరారే, 2024 -
సంతోషం.. కానీ ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది: గిల్
జింబాబ్వే పర్యటనలో యువ భారత జట్టు సత్తా చాటింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత ఆడిన తొలి టీ20 ద్వైపాక్షిక సిరీస్లోనే టీమిండియాకు ఘన విజయం అందించింది.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని యువ ఆటగాళ్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. తొలి టీ20లో పరాజయం పాలైనా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలతో జోరు ప్రదర్శించారు.హరారే వేదికగా శనివారం నాటి నాలుగో టీ20లో సమష్టిగా రాణించి జింబాబ్వేను పది వికెట్ల తేడాతో చిత్తు చేశారు. ఈ క్రమంలో కెప్టెన్గా తొలిసారి భారత జట్టు పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్ ఖాతాలో అరంగేట్రంలోనే సిరీస్ విజయం చేరింది.ఈ నేపథ్యంలో గిల్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అనుభూతి ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నాడు. ‘‘మొదటి టీ20లో మేము లక్ష్య ఛేదనలో విఫలమయ్యాం.అయితే, ఈరోజు విజయవంతంగా టార్గెట్ పూర్తి చేశాం. ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. అయినా.. ఇప్పుడే ఇంకా పని పూర్తి కాలేదు. ఇంకొక మ్యాచ్ మిగిలే ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక ప్రస్తుతం ఆడుతున్న జట్టు గొప్పగా ఉందన్న గిల్... తదుపరి మ్యాచ్లో మార్పులు చేర్పుల గురించి కోచ్తో ఇంకా చర్చించలేదని తెలిపాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య నామమాత్రపు ఐదో టీ20 హరారే వేదికగా ఆదివారం జరుగనుంది.టీమిండియా వర్సెస్ జింబాబ్వే నాలుగో టీ20 స్కోర్లు:👉వేదిక: హరారే స్పోర్ట్స్ క్లబ్👉టాస్: టీమిండియా.. బౌలింగ్👉జింబాబ్వే స్కోరు: 152/7 (20)👉టీమిండియా స్కోరు: 156/0 (15.2)👉ఫలితం: పది వికెట్ల తేడాతో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ సొంతం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 పరుగులు నాటౌట్, (13 ఫోర్లు, 2 సిక్సర్లు)).చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్ -
Ind vs Zim: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్
జింబాబ్వేతో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది.రాణించినా రజా ఈ క్రమంలో శనివారం నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హరారే వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు రాణించారు. జింబాబ్వేను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు.ఆతిథ్య జట్టు ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి 152 పరుగులు చేసింది.అరంగేట్ర బౌలర్కు ఒక వికెట్ టీమిండియా బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, అరంగేట్ర ఆటగాడు తుషార్ దేశ్పాండే, శివం దూబే ఒక్కో వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.ఆకాశమే హద్దుగా జైస్వాల్ఇక జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ అజేయ అద్బుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జైస్వాల్ 93 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు) తో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు (ఆరు ఫోర్లు, రెండు సిక్స్లు) సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ తొలి సిరీస్లోనే ట్రోఫీ గెలవడం విశేషం.చదవండి: IND Vs ZIM 4th T20I: సికందర్ రజా వరల్డ్ రికార్డు -
వాళ్లిద్దరికే ఆ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది: లారా
క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా. అద్భుత బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే ఓ ఘనత మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం.టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో ఇంత వరకు 400(నాటౌట్) పరుగులు సాధించిన ఒకే ఒక్క బ్యాటర్ లారా. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా 2004లో లారా ఈ ఫీట్ నమోదు చేశాడు. అదే విధంగా.. ఫస్ట్క్లాస్ క్రికెట్ ఏకంగా 501(నాటౌట్) రన్స్ స్కోరు చేసిన ఘనత కూడా లారాకే దక్కింది. ఈ రెండు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.దూకుడైన ఆటగాళ్లు తక్కువేఈ నేపథ్యంలో బ్రియన్ లారాకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో 400 పరుగుల మార్కు అందుకోగల బ్యాటర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్ల పేర్లు చెప్పాడు లారా.‘‘నేను క్రికెట్ ఆడే సమయంలో కనీసం మూడు వందల పరుగుల మార్కు దాటేందుకు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య వంటి వాళ్లు ఎంతగానో ప్రయత్నించారు.ఇక ఇప్పుడు అలాంటి దూకుడైన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ అగ్రెసివ్గా ఆడుతున్నారు.వీరిద్దరికే ఆ సత్తా ఉందిఇక భారత జట్టులో..?!.. యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ల పేర్లను చెప్పవచ్చు. వీరిద్దరు ఒక్కసారి క్రీజులో కుదురుకుని పరిస్థితులు గనుక అనుకూలిస్తే ఇలాంటి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టగలరు’’ అని బ్రియన్ లారా డైలీ మెయిల్తో వ్యాఖ్యానించాడు.కాగా టీమిండియా భవిష్య కెప్టెన్గా పేరొందిన ఓపెనర్ శుబ్మన్ గిల్కు టెస్టుల్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 128. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఖాతాలో మాత్రం ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అరంగేట్రంలోనే ఈ లెఫ్టాండర్ 171 పరుగులు చేశాడు. అంతేకాదు ఇప్పటిదాకా మూడుసార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించాడు. చదవండి: WCL 2024: యువరాజ్ మళ్లీ ఫెయిల్.. యూసఫ్, ఇర్ఫాన్ మెరుపులు! -
రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి ఈ ఏడాది 14 ఇన్నింగ్స్ల్లో (అన్ని ఫార్మాట్లలో) 65.23 సగటున, 85.82 స్ట్రయిక్రేట్తో 848 పరుగులు చేశాడు. యశస్వి తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) ఉన్నాడు. జద్రాన్ 27 ఇన్నింగ్స్ల్లో 33.76 సగటున, 80.76 స్ట్రయిక్రేట్తో 844 పరుగులు చేశాడు. యశస్వి ఈ ఏడాది హయ్యెస్ట్ రన్ స్కోరర్గా మారే క్రమంలో టీమిండియా సారధి రోహిత్ శర్మను అధిగమించాడు. హిట్మ్యాన్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో 22 ఇన్నింగ్స్లు ఆడి 833 పరుగులు చేశాడు.జింబాబ్వే, భారత్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ సత్తా చాటడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గిల్.. జింబాబ్వే టార్గెట్ 183
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
Ind vs Zim: ఆ ముగ్గురిపై వేటు.. దూబేకూ చోటు
జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్తో ప్రపంచకప్-2024 విజేత జట్టులోని ముగ్గురు స్టార్లు పునరాగమనం చేశారు.ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, పవర్ హిట్టర్ శివం దూబే తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి రాకతో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్లపై వేటు పడింది.అదే విధంగా.. పేసర్ ముకేశ్ కుమార్కు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. వరల్డ్కప్ విన్నర్ల రాకతో తమ జట్టు మరింత పటిష్టమైందని పేర్కొన్నాడు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా. -
Ind vs Zim: యశస్వి, సంజూ ఎంట్రీ.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
జింబాబ్వేతో కీలకమైన మూడో టీ20కి టీమిండియా సన్నద్ధమైంది. హరారే వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే చేరికతో భారత జట్టు మరింత పటిష్టంగా మారింది.అయితే, అదే సమయంలో తుదిజట్టు కూర్పు కూడా తలనొప్పిగా మారింది. ఇప్పటికే కెప్టెన్ శుబ్మన్ గిల్కు ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ కుదురుకున్నాడు. తొలి టీ20లో అభిషేక్ విఫలమైనా.. రెండో టీ20లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు.కాబట్టి ఈ పంజాబీ బ్యాటర్ను తప్పించేందుకు మేనేజ్మెంట్ సుముఖత చూపకపోవచ్చు. ఈ నేపథ్యంలో మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను ఆడించే విషయంలో సందిగ్దం నెలకొంది. ఈ క్రమంలో అతడిని జట్టులో చేర్చాలంటే కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడే అవకాశం కనిపిస్తోంది.వికెట్ కీపర్గా అతడికే ఛాన్స్యశస్వి- అభిషేక్ భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నట్లు సమాచారం. దీంతో బ్యాటర్ సాయి సుదర్శన్పై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు.. సంజూ శాంసన్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ స్థానం ప్రశ్నార్థకమైంది.అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ వైపే మొగ్గుచూపిన యాజమాన్యం.. వికెట్ కీపర్గా అతడికే ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాని యశస్వి, సంజూలను ఈ మ్యాచ్లో తప్పక ఆడించాలనే యోచనలో ఉన్న బీసీసీఐ.. శివం దూబేకు మాత్రం విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.ఒకే ఒక్క మార్పుతోఇదిలా ఉంటే .. జింబాబ్వే ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగన్నుట్లు సమాచారం. లెఫ్టార్మ్ పేసర్ రిచర్డ్ ఎన్గరవా ఫిట్నెస్ సాధిస్తే.. ల్యూక్ జాంగ్వేకు ఉద్వాసన పలుకనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మూడో టీ20 బుధవారం సాయంత్రం గం. 4:30 నుంచి సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.పిచ్ స్వభావం, వాతావరణంహరారే పిచ్ బౌలర్లు, బ్యాటర్లకు సమంగా అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్కు వర్ష సూచన లేదు.జింబాబ్వేతో మూడో టీ20కి భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్.జింబాబ్వే తుదిజట్టు(అంచనా)వెస్లీ మెదవెరె, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియాన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్బెల్, క్లైవ్ మాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకజ్ద, ల్యూక్ జాంగ్వే/ రిచర్డ్ ఎన్గరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చతారా. The #T20WorldCup-winning trio is in the house... 👏 👏... and they are 𝙍𝙖𝙧𝙞𝙣𝙜 𝙏𝙤 𝙂𝙤! 💪 💪#TeamIndia | #ZIMvIND | @IamSanjuSamson | @IamShivamDube | @ybj_19 pic.twitter.com/E0rNOkHmTz— BCCI (@BCCI) July 9, 2024 -
కోహ్లి, రోహిత్ లేని లోటు పూడ్చగలిగేది వాళ్దిద్దరే: మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024తో టీమిండియాలో ఒక శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో.. భారత జట్టులో ఈ ఇద్దరి మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరా అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో జింబాబ్వే మాజీ క్రికెటర్ హామిల్టన్ మసకజ్ద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టీ20లలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారసులు వీరేనంటూ ఇద్దరు యువ తరంగాల పేర్లు చెప్పాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్కప్-2024లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పదకొండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.ఐపీఎల్ వీరులకు లైన్ క్లియర్ఈ క్రమంలో సౌతాఫ్రికాతో ఫైనల్లో విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ వీరులకు జాతీయ జట్టులో ఎంట్రీకి మార్గం సుగమమైంది.ఇందుకు తగ్గట్లుగా మెగా టోర్నీ ముగిసిన వెంటనే జింబాబ్వేతో టీ20 సిరీస్కు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లు తొలిసారిగా ఎంపికయ్యారు. అయితే, అనూహ్య రీతిలో జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన యువ భారత జట్టు... రెండో టీ20లో మాత్రం సత్తా చాటింది.ఆతిథ్య జట్టును ఏకంగా వంద పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్గా తొలిసారి వ్యవహరిస్తున్న శుబ్మన్ గిల్ ఖాతాలో విజయం చేరింది.కోహ్లి, రోహిత్ లేని లోటు పూడ్చగలిగేది వాళ్లిద్దరేఈ నేపథ్యంలో హామిల్టన్ మసకజ్ద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యామ్నాయం శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ అని ఈ జింబాబ్వే మాజీ ఆటగాడు పేర్కొనడం విశేషం.‘‘భారత క్రికెట్ జట్టు పరివర్తన దశలో ఉంది. అందరి కంటే ఎక్కువగా శుబ్మన్ గిల్ నా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో అతడు చాలా కాలంగా తనదైన శైలిలో రాణిస్తున్నాడు.మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సత్తా అతడికి ఉంది.ఇక యశస్వి సైతం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను అద్భుతంగా సాగించలగలడనే నమ్మకం నాకు ఉంది. గిల్, యశస్వి.. వీళ్లిద్దరే వరల్డ్క్లాస్ క్రికెటర్ల నిష్క్రమణ వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూడ్చగలరు’’ అని మసకజ్ద అభిప్రాయపడ్డాడు.చదవండి: BCCI: ద్రవిడ్కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే? -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టులో కీలక మార్పులు! సంజూ, దూబే ఔట్
జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. టీ20 వరల్డ్కప్-2024లో భాగమైన ఆటగాళ్లందరికి దాదాపుగా జింబాబ్వే పర్యటనకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ సిరీస్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేకు పయనమైంది.భారత జట్టులో కీలక మార్పులు..ఇక ఈ సిరీస్కు ముందు భారత జట్టులో పలు కీలక మార్పులు బీసీసీఐ చేసింది. టీ20 వరల్డ్కప్ 2024 భారత జట్టులో భాగమైన సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబేలను జింబాబ్వే సిరీస్కు ఎంపిక చేసిన జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. వారి స్ధానంలో తొలి రెండు టీ20లకు హర్షిత్ రానా, సాయి సుదర్శన్, జితేష్ శర్మలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా హర్షిత్ రానా, సాయిసుదర్శన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా -
అతడొక అద్భుతం.. ఫ్యూచర్ ఇండియన్ స్టార్: గంభీర్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా ఓపెనర్గా విరాట్ కోహ్లి విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన కోహ్లి తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. విరాట్ కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో విరాట్ కోహ్లి స్థానంలో ఓపెనర్గా భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఛాన్స్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మెగా టోర్నీలో జైశ్వాల్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు. ఈ క్రమంలో జైశ్వాల్పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్న గంభీర్కు ప్రస్తుత తరంలో భారత క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. వెంటనే గౌతీ ఏమీ ఆలోచించకుండా టక్కున యశస్వీ జైశ్వాల్ అని బదులిచ్చాడు."ప్రస్తుతం తరంలో నన్ను బాగా ఆకట్టుకున్న క్రికెటర్ యశస్వి జైస్వాల్. జైశ్వాల్ అద్బుతమైన ఆటగాడు. అతడికి దూకుడుగా ఆడే సత్తా ఉంది. అంతేకాకుండా అతడు ఓపెనర్గా కూడా బాగా రాణిస్తున్నాడు. లెఫ్టాండర్ కావడం యశస్వీకి బాగా కలిసొచ్చింది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. జైశ్వాల్కి కష్టపడేతత్వం ఉంది. కచ్చితంగా అతడు ఫ్యూచర్ ఇండియన్ స్టార్గా ఎదుగుతాడని" గంభీర్ పేర్కొన్నాడు. -
బంగ్లాదేశ్తో మ్యాచ్.. టీమిండియాలోకి విధ్వంసకర ఓపెనర్!?
టీ20 వరల్డ్కప్-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. అఫ్గానిస్తాన్పై గెలిచి మంచి జోష్లో ఉన్న టీమిండియా అదే జోరును బంగ్లాపై కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి సూపర్-8 మ్యాచ్లో విఫలమైన ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే వైపు జట్టు మెనెజ్మెంట్ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అంటిగ్వా పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించే ఛాన్స్ ఉన్నందన జడ్డూ స్ధానంలో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్కు బంగ్లాతో మ్యాచ్లో ఆడించాలని మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ జట్టులోకి జైశ్వాల్ వస్తే రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశముంది. అప్పుడు విరాట్ కోహ్లి ఫస్ట్డౌన్లో రానునున్నాడు. ఒకవేళ దూబే స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్కు అవకాశమివ్వాలని మెనెజ్మెంట్ భావిస్తే సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.మనదే పై చేయి...కాగా టీ20ల్లో బంగ్లాదేశ్పై భారత్కు ఘనమైన రికార్డు ఉంది. భారత్ - బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 13 టీ20ల్లో తలపడ్డాయి. ఒక్కసారి మాత్రమే బంగ్లా గెలవగా.. 12 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది.బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా -
ఐర్లాండ్తో మ్యాచ్కు భారత తుది జట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్-2024 ఫీవర్ తారస్థాయికి చేరింది. టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. న్యూయార్క్లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జూన్ 5న ఐర్లాండ్తో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు.ఇక తన జట్టులో మిగిలిన స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు చోటిచ్చాడు గావస్కర్. వికెట్ కీపర్ కోటాలో పంత్కు చోటిచ్చిన గావస్కర్ సంజూ శాంసన్కు మొండిచేయి చూపాడు.కాగా వరల్డ్కప్-2024లో భారత ఓపెనింగ్ జోడీ గురించి చర్చ జరుగుతున్న వేళ.. విరాట్ కోహ్లియే రోహిత్ శర్మకు సరైన జోడీ అని ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా గావస్కర్ కూడా ఇదే మాట అన్నాడు.ఇక కోహ్లి ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ 15 మ్యాచ్లు ఆడి.. 741 పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్గా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.ఐర్లాండ్తో మ్యాచ్కు గావస్కర్ ఎంచుకున్న భారత తుది జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.#SunilGavaskar opts for experience with @imVkohli & @ImRo45 at the 🔝A surprise inclusion at number 3, plenty of batting options and two pacers! 😮What changes would you make to this team?📺 | #INDvIRE | 5th June, 6 PM | #T20WorldCupOnStar pic.twitter.com/6hQx6EJmhD— Star Sports (@StarSportsIndia) June 4, 2024 -
అలా అయితే కోహ్లి జట్టులో ఉండీ దండగ: ఆసీస్ మాజీ స్టార్
టీ20 ప్రపంచకప్-2024లో భారత తుది జట్టు కూర్పు గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఓపెనర్గా పంపాలని.. లేదంటే జట్టులో అతడికి స్థానం ఇవ్వటమే దండగ అని పేర్కొన్నాడు.యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాలని.. కెప్టెన్, రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మను మిడిలార్డర్లో ఆడించాలని హెడెన్ సూచించాడు. కాగా వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.న్యూయార్క్లోని నసావూ కౌంటీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా ప్రాక్టీసు మొదలుపెట్టగా.. కోహ్లి మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓపెనింగ్ జోడీ ఎవరు?ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. యశస్వి- కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ నాలుగో స్థానంలో వస్తే బాగుంటుందని ఇటీవల తన అభిప్రాయం పంచుకున్నాడు. రోహిత్ మిడిలార్డర్లో రావాలితాజాగా ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘ఐదుగురు కుడిచేతి వాటం బ్యాటర్లను వరుసగా పంపలేం. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. కోహ్లి యశస్వితో కలిసి ఓపెనింగ్ చేయాలి. లేదంటే అతడికి నా జట్టులో చోటే ఉండదు. సూపర్ ఫామ్లో ఉన్న అతడు ఓపెనర్గా వస్తేనే బాగుంటుంది.ఇక రోహిత్ శర్మ.. అతడొక విలక్షణమైన ఆటగాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడానికి ఏమాత్రం సంకోచించడు. అంతర్జాతీయ టీ20లలో అతడు నాలుగో స్థానంలో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తే బాగుంటుంది’’ అని హెడెన్ అభిప్రాయపడ్డాడు.నాలుగో నంబర్లో రోహిత్ శర్మ.. గణాంకాలు ఇవీటీమిండియా తరఫున రోహిత్ శర్మ ఇప్పటి వరకు 151 టీ20లు ఆడి.. 3974 పరుగులు చేశాడు. ఇందులో 27 సార్లు అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి.. 481 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.కాగా 2022లో రోహిత్ ఎనిమిది సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి.. రెండు ఫిఫ్టీల సాయంతో 188 పరుగులు(స్ట్రైక్రేటు 122.87) సాధించాడు. ఇక ఐపీఎల్లో 91 ఇన్నింగ్స్లో మిడిలార్డర్లో వచ్చిన హిట్మ్యాన్.. 130కి పైగా స్ట్రైక్రేటుతో 2565 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1న మొదలుకానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ సహా మొదటి బ్యాచ్లోని కీలక ఆటగాళ్లంతా న్యూయార్క్ చేరుకున్నారు.మిగిలిన వాళ్లలో బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లితో పాటు మరికొంత మంది అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాగా జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.రోహిత్కు జోడీగా కోహ్లి వస్తే బెటర్ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. వరల్డ్కప్ టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కాగా మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖరారైపోగా.. రోహిత్కు జోడీగా కోహ్లి వస్తే బాగుంటుందని మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ శర్మ వన్డౌన్లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఓపెనర్గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!‘‘వరల్డ్కప్ ఈవెంట్లో కోహ్లి- జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి ఆరంభం లభిస్తుందన్న అంశం ఆధారంగా.. రోహిత్- స్కై(సూర్యకుమార్ యాదవ్) మూడు, నాలుగు స్థానాల్లో రావాలి. నిజానికి రోహిత్ స్పిన్ అద్బుతంగా ఆడగలడు. కాబట్టి నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే వాళ్లు మిడిల్ ఓవర్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.అయితే, ఐర్లాండ్, పాకిస్తాన్లతో మ్యాచ్లకు మాత్రమే ఈ ఓపెనింగ్ జోడీ బాగుంటుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్Kohli & Jaiswal should open in the World Cup imo. Rohit & SKY should bat 3&4 depending on the start we get. Rohit plays spin really well so batting at 4 shouldn't be a concern. #T20WorldCup #INDvPAK #INDvIRE pic.twitter.com/nMgwwaDNXb— Wasim Jaffer (@WasimJaffer14) May 29, 2024 -
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్-2024లో భారత ఓపెనింగ్ జోడీ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిస్థితులకు తగ్గట్లుగా తమ తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.అదే విధంగా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తాము జట్టును ఎంపిక చేయలేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కాగా జూన్ 1న వరల్డ్కప్ మొదలుకానుండగా.. టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత జట్టు తరఫున కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు తుదిజట్టులో చోటు దక్కదని భావిస్తున్నారు.అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయిఈ విషయంపై స్పందించిన రోహిత్ శర్మ..‘‘ప్రస్తుతం మాకు అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఓపెనింగ్ జోడీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.వెస్టిండీస్కు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితుల ఆధారంగా మా ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేసుకుంటాం. నిజానికి చాలా మంది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు.కానీ మేము ఎప్పటి నుంచో ఈ ఫార్మాట్లో జట్టు కూర్పు గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాం. చాలా కాలం క్రితమే 15 మంది సభ్యుల జట్టు గురించి తుది నిర్ణయం తీసుకున్నాం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా మేము మా ప్రణాళికలు మార్చుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ ప్రదర్శన ఇలాకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్లలో కలిపి 315 పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లి ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగుతూ 10 మ్యాచ్లలో కలిపి 500 పరుగులు రాబట్టాడు. ఇక యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్కు ఆడుతూ 9 మ్యాచ్లలో కలిపి కేవలం 249 పరుగులే చేశాడు.అయితే, ఓపెనింగ్ స్థానం కోసం జరిగిన పోటీలో జైస్వాల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగా.. శుబ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. కానీ.. ఐపీఎల్-2024లో ప్రస్తుతం 509 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు మాత్రం మొండిచేయి చూపారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్ టెండుల్కరే 2007 వరల్డ్కప్ టోర్నీలో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మూడో స్థానంలో ఆడిస్తాను‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా నా ఆప్షన్. కోహ్లి వన్డౌన్లోనే రావాలి.మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడితే కోహ్లి బ్యాటింగ్కు వస్తాడు. కాబట్టి పవర్ ప్లేలో తను ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు.ఒకవేళ వికెట్ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్, కోచ్ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్బజ్ షోలో అతడు వ్యాఖ్యానించాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్కు అస్సలు ఇష్టం లేదుఇందుకు ఉదాహరణగా సచిన్ టెండుల్కర్ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్.. ‘‘2007 ప్రపంచకప్ టోర్నీలో సచిన్ టెండుల్కర్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేశాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.ఓపెనర్లు సెట్ చేసిన మూమెంటమ్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్డౌన్ బ్యాటర్కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.ఓపెనర్లుగా వాళ్లేకాగా ఈసారి పొట్టి ప్రపంచకప్ ఈవెంట్లో కోహ్లి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ లేదంటే.. శుబ్మన్ గిల్పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్ 5న వరల్డ్కప్లో ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
టీ20 వరల్డ్కప్లో ఓపెనర్లుగా రోహిత్, జైశ్వాల్.. గిల్కు నో ఛాన్స్?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ఈ క్యాష్ లీగ్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే మరో మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూన్1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా టీ20 వరల్డ్ కప్-2024 షురూ కానుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి నెల రోజుల పైగా సమయం ఉన్నప్పటికి.. ఐసీసీ నిబంధనల ప్రకారం మే 1లోపు ఆయా జట్లు తమ వివరాలను సమర్పించాల్సిందే. ఈ క్రమంలో ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్లను ఖారారు చేసే పనిలో పడ్డాయి. బీసీసీఐ కూడా తమ జట్టును ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశముంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి వరల్డ్కప్లో భామయ్యే జట్టును వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే భారత టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ను కలిసి ప్రారంభించాలని పఠాన్ అభిప్రాయపడ్డాడు. జైశ్వాల్ ముంబై ఇండియన్స్పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడని, కాబట్టి అతడు కచ్చితంగా ఓపెనర్గా రావాలని పఠాన్ అన్నాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పఠాన్ ఎంపిక చేశాడు. వరల్డ్కప్ జట్టులో కోహ్లి కచ్చితంగా ఉంటాడని ఇర్ఫాన్ థీమా వ్యక్తం చేశాడు. స్ట్రైక్ రేట్ పరంగా క్రిస్ గేల్ కంటే కోహ్లినే మెరుగ్గా ఉన్నాడని, టీ20 వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్లో స్ట్రైక్ రేట్ పెద్ద సమస్య కాదని పఠాన్ ఎక్స్లో రాసుకొచ్చాడు. Now that World Cup is nearing. My top 3 for team India. 1) Rohit Sharma (in form as well as captain) 2) Yashasvi Jaiswal (been saying that he should be there even before his 100 purely cos he was performing well for team India before the ipl) 3) Virat Kohli. (Shouldn’t be… — Irfan Pathan (@IrfanPathan) April 23, 2024 -
రోహిత్తో కలిసి అతడే ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024 కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, అదే సమయంలో యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోద్దని దాదా పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్-2024 ప్రదర్శన కీలకం కానుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 తర్వాత సుదీర్ఘకాలం టీ20 జట్టుకు దూరమైన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఇటీవల స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మెగా టోర్నీలో వీరిద్దరు ఓపెనర్లుగా దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో కోహ్లి ఎనిమిది మ్యాచ్లలో కలిపి 379 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113 నాటౌట్) కూడా ఉంది. మరోవైపు.. రోహిత్ శర్మ కూడా శతకంతో చెలరేగాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి 303 పరుగులతో ప్రస్తుతం టాప్-5లో ఉన్నాడు. వీరిద్దరు ఇలా ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇక రాజస్తాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలో తడబడ్డా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అజేయ సెంచరీ(104)తో దుమ్ములేపి రేసులోకి దూసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు. 40 బంతుల్లోనే సెంచరీ చేయగల సత్తా విరాట్ కోహ్లికి ఉంది. వెళ్లి హిట్టింగ్ ఆడటమే పనిగా పెట్టుకోవాలి. 5-6 ఓవర్ల తర్వాత ఫలితం అదే కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్కప్లో రోహిత్- విరాట్ కలిసి ఓపెనింగ్ చేయాలి. సెలక్టర్ల మనసులో ఏముందో మనం అంచనా వేయలేం. కానీ నేను మాత్రం ఇది బాగుంటుందనే అనుకుంటున్నా. అలా అని యశస్వి జైస్వాల్ పేరును సెలక్టర్లు మర్చిపోతారని భావించడం లేదు. అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఏదేమైనా యువ, అనుభవజ్ఞులైన జట్టుతో టీమిండియా వరల్డ్కప్ బరిలోకి దిగాలి’’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా మే 26న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ముంబై ఇండియన్స్ అంటే చాలు యశస్వికి పూనకం వస్తుంది..!
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు ముంబై ఇండియన్స్ అంటే చాలు పూనకం వస్తుంది. యశస్వి ఏ జట్టుపై అయినా ఆడతాడో లేదో తెలీదు కానీ ముంబై ప్రత్యర్దిగా ఉంటే మాత్రం రెచ్చిపోతాడు. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో యశస్వి మరోసారి చెలరేగిపోయాడు. విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. రెండేళ్లలో యశస్వికి ముంబైపై ఇది రెండో సెంచరీ. యశస్వి తన కెరీర్లో చేసిన రెండు సెంచరీలు ముంబైపై చేసినవే కావడం విశేషం. గత సీజన్లో ముంబైపై వారి సొంత మైదానమైన వాంఖడేలో శతక్కొట్టిన (124) యశస్వి.. తాజాగా తమ హోం గ్రౌండ్ జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో అజేయ సెంచరీతో ఇరగదీశాడు. యశస్వితో పాటు సందీప్ శర్మ (4-0-18-5) చెలరేగడంతో నిన్నటి మ్యాచ్లో రాయల్స్ ముంబైపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా శతకంతో యశస్వి ఐపీఎల్లో 23 ఏళ్లలోపు రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రాయల్స్ బౌలర్లలో సందీప్తో పాటు బౌల్ట్ (4-0-32-2) కూడా రాణించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి మెరుపు సెంచరీతో రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
IPL 2024 RR vs MI: ఐదేసి అదరగొట్టిన అమ్ముడుపోని ఆటగాడు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వేలంలో అమ్ముడుపోని సందీప్ శర్మ ఈ మ్యాచ్లో రాజస్థాన్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వేరే ఆటగాడికి రీ ప్లేస్మెంట్గా రాయల్స్లోకి వచ్చిన సందీప్ శర్మ ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, తన తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో సందీప్ వేసిన స్పెల్ విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ తీసిన సందీప్.. నాలుగో ఓవర్లో అతి భయంకరుడైన సూర్యకుమార్ వికెట్ను పడగొట్టాడు. ఆ తర్వాత 15వ ఓవర్లో బంతినందుకున్న సందీప్.. ఆ ఓవర్లో వికెట్ లేకుండా 11 పరుగులు సమర్పించుకున్నాడు. - Unsold in the auction. - Came as a replacement in 2023. - Became the end over specialist.- Injured in the start of IPL 2024. - Came back into the team & got his first five wicket haul. Sandeep Sharma is a hero. 🫡pic.twitter.com/JeMHj5vLH9— Johns. (@CricCrazyJohns) April 22, 2024 ఆఖరి ఓవర్లో మరోసారి బంతినందుకు సందీప్ ఈసారి తన అద్భుతమైన స్లో బాల్స్ టెక్నిక్ను ఉపయోగించి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన సందీప్ 18 పరుగులు సమర్పించుకుని 5 వికెట్లు పడగొట్టాడు. సందీప్కు ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్లో సందీప్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో రాయల్స్కు భారీ విజయాన్ని అందించాడు. సందీప్ దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. 179 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. రాయల్స్ బౌలర్లలో సందీప్తో పాటు బౌల్ట్ (4-0-32-2) కూడా రాణించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104 నాటౌట్) మెరుపు సెంచరీతో రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
T20 WC: ఓపెనర్గా అతడు.. రింకూ, సంజూకు నో ఛాన్స్!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. మే 26 ఫైనల్తో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్కు తెరపడనుండగా.. జూన్ 1న టీ20 వరల్డ్కప్-2024కు తెరలేవనుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ ఐసీసీ టోర్నీలో భారత తుదిజట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్తో పాటు ఓపెనర్ అతడే ‘‘రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. విరాట్ కోహ్లి నంబర్ 3, సూర్యకుమార్ యాదవ నంబర్ 4, హార్దిక్ పాండ్యా ఐదో నంబర్లో.. రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ డెప్త్ దృష్ట్యా నా జట్టులో ఆల్రౌండర్లకు కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అక్షర్ పటేల్ ఏడు, రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాతి స్థానంలో నైపుణ్యాలున్న బౌలర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగాలి. పేసర్ల కోటాలో ఆ ఇద్దరు తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లు రావాల్సి ఉంటుంది. ఇలా అయితే తుదిజట్టు కూర్పు సరిగ్గా ఉంటుందని భావిస్తున్నా’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అయితే, అనూహ్యంగా తన ప్లేయింగ్ ఎలెవన్లో నయా ఫినిషర్ రింకూ సింగ్, ఐపీఎల్-2024లో సత్తా చాటుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు కైఫ్ చోటివ్వకపోవడం గమనార్హం. బ్యాట్ ఝులిపించలేకపోతున్న జైస్వాల్ మహ్మద్ కైఫ్ ఎంచుకున్న తుదిజట్టులోని ఆటగాళ్లలో ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు కోహ్లి 319 పరుగులతో టాప్ స్కోరర్గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా 10 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. అయితే, యశస్వి జైస్వాల్ మాత్రం ఇంత వరకు ప్రభావం చూపలేదు. ఈ రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో కలిపి కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రం 255 పరుగులతో దుమ్ములేపుతున్నాడు. ఇక వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ 246 పరుగులతో పంత్ కంటే చాలా ముందున్నాడు. రింకూ సైతం కేకేఆర్పై ఫినిషర్గా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కాగా ప్రపంచకప్ జట్టులో టీమిండియాను రోహిత్ శర్మనే ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే! -
అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?.. మా వాడికేం ఢోకా లేదు
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. కాగా గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి ఏకంగా 625 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండర్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపాడు. టెస్టు, టీ20లలో భారత ఓపెనర్గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో యశస్వి జైస్వాల్పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ.. అందుకు తగ్గట్లుగా ఈ రాజస్తాన్ రాయల్స్ స్టార్ రాణించలేకపోతున్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి యశస్వి జైస్వాల్ కేవలం 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సాధించిన అత్యధిక స్కోరు 24. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే అతడు వెనుదిరిగాడు. ఈసారి పరుగుల ఖాతా కూడా తెరవలేదు జైపూర్లో శనివారం జరిగిన మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రీస్ టోప్లీ బౌలింగ్లో మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(100)తో రాజస్తాన్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 సంజూ శాంసన్(69) సైతం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో వరుసగా నాలుగో గెలుపు చేరింది. ఇక ఇలా జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో గెలుపొందింది కాబట్టి జైస్వాల్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు. నిజానికి ఏ ఒక్క మ్యాచ్లో ఫలితం తారుమారైనా వేళ్లన్నీ జైస్వాల్ వైపు చూపేవనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడైన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇలా విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారీ లెఫ్టార్మ్ పేసర్ల చేతిలో అవుట్ అవుతున్న జైస్వాల్ ఇప్పటికైనా బలహీనతలు అధిగమించేందుకు కృషి చేయాలని సూచించాడు. ‘‘యశస్వి జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో మూడింటిలో లెఫ్టార్మ్ పేసర్ల చేతికే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు. నిజానికి నువ్వు మంచి ఆటగాడివి’’ అంటూ జైస్వాల్ ఆట తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఇప్పటికైనా తిరిగి పుంజుకుంటే వరల్డ్కప్ జట్టులో పోటీ లేకుండా బెర్తు ఖరారు చేసుకోవచ్చని సూచించాడు. చెత్త బ్యాటర్ అయిపోడు ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్కు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర అండగా నిలిచాడు. ఫ్రాంఛైజీ క్రికెట్తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన యశస్వి.. రెండు ఇన్నింగ్స్లో విఫలమైనంత మాత్రాన చెత్త బ్యాటర్ ఏమీ అయిపోడని వెనకేసుకువచ్చాడు. అతడి నైపుణ్యాలేమిటో తమకు తెలుసునని.. కచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MI స్టార్స్తో ‘మిస్టరీ గర్ల్’.. ఇంతకీ ఈ అందాల సుందరి ఎవరంటే? (ఫొటోలు)
-
జైశ్వాల్కు ఏమైంది.. ఇలా అయితే వరల్డ్కప్కు కష్టమే!?
ఐపీఎల్-2024లో టీమిండియా యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన జైశ్వాల్.. ఇప్పుడు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో సైతం అదే తీరును కనబరిచాడు. జైశ్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తొలి ఓవర్ వేసిన యువ పేసర్ మఫాక బౌలింగ్లో రెండు బౌండరీలు కొట్టి మంచి టచ్లో కన్పించిన యశస్వీ.. ఆఖరి బంతికి టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడినే జైశ్వాల్ కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. అయితే టీ20 వరల్డ్కప్కు ముందు జైశ్వాల్ ఈ తరహా ప్రదర్శన చేయడం భారత జట్టు మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శర్మకు బ్యాక్ఆప్ ఓపెనర్గా జైశ్వాల్ను ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉంది. ఈ నేపథ్యంలో జైశ్వాల్ తన ఫామ్ను తిరిగి పొందడం చాలా ముఖ్యం. ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. pic.twitter.com/cmkDG4E8j2 — Sitaraman (@Sitaraman112971) April 1, 2024 -
ముఖేష్ కుమార్ సూపర్ డెలివరీ.. జైశ్వాల్ షాక్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ వరుసగా రెండో మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఈవెంట్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో జైశ్వాల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్ అద్భుతమైన బంతితో జైశ్వాల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 2 ఓవర్ బౌలింగ్ చేసేందుకు డీసీ కెప్టెన్ రిషబ్ పంత్.. ముఖేష్ కుమార్ను ఎటాక్లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఆ ఓవర్లో రెండో బంతిని జైశ్వాల్ ఫోర్గా మలిచాడు. ఆ తర్వాతి రెండు బంతులకు ఎటువంటి పరుగులు రాలేదు. అయితే ఐదో బంతిని అద్భుతమైన ఫుల్-లెంగ్త్ డెలివరీగా ముఖేష్ సంధించాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఫ్లిక్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి మిస్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో ఒక్కసారిగా ముఖేష్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. CASTLED! Early success for Mukesh Kumar & @DelhiCapitals 👏👏#RR lose Yashasvi Jaiswal Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RRvDC pic.twitter.com/sJIAua6ehl — IndianPremierLeague (@IPL) March 28, 2024 -
RR Vs LSG: జైశ్వాల్ సూపర్ షాట్.. సూర్యను గుర్తు చేశాడుగా! వీడియో వైరల్
టీమిండియా యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో దుమ్ము లేపిన యశస్వీ.. ఇప్పుడు ఐపీఎల్ 2024లోనూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో జైశ్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో జైశ్వాల్ అద్భుతమైన స్కూప్ షాట్తో మెరిశాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన మొహ్సిన్ ఖాన్ బౌలింగ్లో జైశ్వాల్ ఆడిన షాట్ మ్యాచ్ మొత్తానికి హైలెట్గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఓవర్లో ఐదో బంతిని మొహ్సిన్ ఖాన్.. జైవ్వాల్ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో జైశ్వాల్ చాలా క్విక్గా ఎడమ వైపున్కి వెళ్లి ఫైన్ లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడి సిక్సర్గా మలిచాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు స్కై(సూర్యకుమార్ యాదవ్)ను గుర్తు చేశావంటా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. శాంసన్తో పాటు రియాన్ పరాగ్ (43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్ తలా వికెట్ పడగొట్టారు. pic.twitter.com/WmUBOGI9ut — Sitaraman (@Sitaraman112971) March 24, 2024 -
సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ టాప్ 10లోకి దూసుకొచ్చారు. హిట్మ్యాన్ ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో ర్యాంక్కు చేరుకోగా..జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వీరిద్దరితో పాటు ధర్మశాల టెస్టులో సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్ సైతం తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్ను పొందాడు. 11 స్ధానాలు ఎగబాకి 20వ ర్యాంక్కు గిల్ చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం వరుసగా రెండు మూడు స్దానాల్లో నిలిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో నిలిచాడు. బుమ్రాను వెనుక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. చదవండి: #David Miller: మూడు మ్యాచ్లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్ -
యశస్వీ జైశ్వాల్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను జైశ్వాల్కు ఈ అవార్డు దక్కింది. స్వదేశలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత నెలలో ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడిన యశస్వీ 112 సగటుతో ఏకంగా 560 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 209 పరుగులు చేసిన జైశ్వాల్.. రాజ్కోట్ టెస్టులో 214 పరుగులతో చెలరేగాడు. ఓవరాల్గా ఇంగ్లండ్ సిరీస్లో జైశ్వాల్ ఏకంగా 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ అవార్డు కోసం జైశ్వాల్తో పాటు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక పోటీపడ్డారు. కానీ ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన జైశ్వాల్నే ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపిక చేసింది. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ఎంపికైంది. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో సదర్లాండ్ అద్భుతంగా రాణించింది. చదవండి: వరల్డ్కప్ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కఠిన నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ Presenting the ICC Player of the Month for February 🙌 Congratulations, Yashasvi Jaiswal 👏👏 🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ — BCCI (@BCCI) March 12, 2024 -
పవర్ హిట్టర్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే!
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ఓపెనర్గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్లలో కలిపి (తొమ్మిది ఇన్నింగ్స్లో) ఏకంగా సగటు 89తో.. 712 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. టీమిండియా 4-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు యశస్వి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. యశస్వి జైస్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైస్వాల్ను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్లోనూ తన ఆట తీరును గమనిస్తూనే ఉన్నాం. అతడో అసాధారణ ఆటగాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలతో రాణించి టీ20లలోనూ అడుగుపెట్టాడు. అయితే, ఇంతవరకు వన్డేల్లో మాత్రం అతడికి అవకాశం రాలేదు. 50 ఓవర్ల ఫార్మాట్ క్రికెట్లోనూ యశస్వితో అరంగేట్రం చేయిస్తే మంచిది. అప్పుడు అతడు.. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్ల ప్లేయర్గా జట్టుకు ఉపయోగపడతాడు. బ్యాటర్గా డిఫెన్సివ్గా.. అదే సమయంలో దూకుడుగా ఎలా ఉండాలో తెలిసిన ఆటగాడు. ఆండర్సన్ బౌలింగ్లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన విధానం అతడి పవర్ హిట్టింగ్ నైపుణ్యాలకు నిదర్శనం’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 26 సిక్సర్లు బాదారు. ముఖ్యంగా రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్స్లు కొట్టడం హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టు, అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. చదవండి: శార్దూల్ ఏమన్నాడో విన్నాను: డొమెస్టిక్ క్రికెట్పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
మాటలు రావడం లేదు.. అతడొక సంచలనం! చాలా సంతోషంగా ఉంది: రోహిత్
సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. గతకొంత కాలంగా బాజ్బాల్ అంటూ సంప్రాదయ క్రికెట్ రూపు రేఖలు మార్చేసిన ఇంగ్లండ్ జట్టుకు.. భారత్ సరైన గుణపాఠం నేర్పింది. వరుసగా మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. ఆఖరి టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ధర్మశాల వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-0 తేడాతో టీమిండియా ఘనంగా ముగించింది. ఇక ఈ అద్భుత విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్ అసాంతం అదరగొట్టిన యువ ఆటగాళ్లపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టుల్లో ఇటువంటి విజయం సాధించాలంటే అన్ని ప్రణాళికలు సరిగ్గా అమలు కావాలి. సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్లో మా కుర్రాళ్లు అదరగొట్టారు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. గానీ దేశీవాళీ క్రికెట్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. అందుకే తీవ్రమైన ఒత్తడిలో సైతం వారు అద్బుతంగా రాణించారు. ఈ సిరీస్ విజయం సాధించేందుకు మా జట్టు మొత్తం తీవ్రంగా శ్రమించింది. కాబట్టి విన్నింగ్ క్రెడిట్ మా జట్టు మొత్తానికి ఇవ్వాలనకుంటున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సిరీస్ విజయం సాధిస్తే అందరూ సెంచరీలు, వ్యక్తిగత రికార్డుల కోసమే మాట్లాడతారు. కానీ ఒక టెస్టులో విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి బౌలర్ల కృషి లేనదే గెలుపొందడం చాలా కష్టం. ఈ మ్యాచ్లో మా బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా స్పిన్నర్లు చాలా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కోసం ఎంతచెప్పుకున్న తక్కువే. మొదటి ఇన్నింగ్స్ ఆరంభంలో ఇంగ్లండ్ బ్యాటర్లు కాస్త దూకుడుగా ఆడుతున్నప్పుడు కుల్దీప్ యాదవ్ను ఎటాక్లో తీసుకురావాలని భావించాను. అందుకు తగ్గట్టే అతడు మాకు తొలి వికెట్ను అందించాడు. గాయం నుంచి కోలుకోని కుల్దీప్ ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. కుల్దీప్ బ్యాటింగ్ చేయడం కూడా మా జట్టుకు బాగా కలిసిచ్చోంది. ఇక జైశ్వాల్ గురించి ఏమి మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. అతడొక సంచలనం. యశస్వీ ఇంకా తన కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిరోహించాలి. జైశ్వాల్కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి జైశ్వాల్ ఎక్కువగా ఇష్టపడతాడు. అతడికి ఇదొక అద్బుతమైన సిరీస్ అని పోస్ట్ మ్యాచ్ ప్రేజంటేషన్లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా జైశ్వాల్ ఈ సిరీస్లో దుమ్మురేపాడు. 712 పరుగులతో ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా జైశ్వాల్ నిలిచాడు. -
ఎందుకంత ఓవరాక్షన్ బాబు.. నీకు రోహిత్ చేతిలో ఉందిలా! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో జైశ్వాల్ చెలరేగాడు. కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఓవరాక్షన్ చేశాడు. ఏమి జరిగిందంటే? తొలి ఇన్నింగ్స్లో భారత ఓపెనర్ల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. స్పిన్నర్ బషీర్ను ఎటాక్లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో బషీర్కు తన తొలి ఓవర్లోనే జైశ్వాల్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్లో యశస్వీ మూడు సిక్స్లు బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. అంతటితో ఆగకుండా తర్వాతి ఓవర్లలో కూడా బషీర్ను జైశ్వాల్ టార్గెట్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ బషీర్ బౌలింగ్లోనే జైశ్వాల్ ఔటయ్యాడు. 20 ఓవర్ వేసిన బషీర్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన జైశ్వాల్ తర్వాతి బంతికి భారీ షాట్కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. బంతిని అంచనా వేయడంలో కాస్త విఫలమైన యశస్వీ తన వికెట్ను సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో బషీర్ సెలబ్రేషన్స్ శృతిమించాయి. జైశ్వాల్ వైపు కళ్లు పెద్దవిగా చేసి చూస్తూ సీరియస్గా ఎదో అన్నాడు. జైశ్వాల్ మాత్రం అతడిని పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. కానీ నాన్ స్ట్రైక్లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం ఎందుకు అంత ఓవరాక్షన్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు అరే బషీర్ నీకు మా రోహిత్ చేతిలో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/Z3RCeCQJ5d — Virat Kohli (@CricUpdates123) March 7, 2024 -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 21వ శతాబ్దంలో తొలి ఆటగాడిగా
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ జైశ్వాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. యశస్వీ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో 712 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లి 692 పరుగులు చేశాడు. అయితే తాజా మ్యాచ్తో కోహ్లి ఆల్టైమ్ రికార్డును ఈ ముంబైకర్(జైశ్వాల్) బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్గా ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1971లో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో గవాస్కర్ 774 పరుగులు చేశాడు. అయితే ధర్మశాల టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో జైశ్వాల్ మరో 63 పరుగులు చేస్తే.. సన్నీని కూడా జైశ్వాల్ అధిగమించే ఛాన్స్ ఉంది. ఇక ఈ రికార్డుతో పలు అరుదైన ఘనతలను కూడా జైశ్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి(655) రికార్డును కూడా ఈ యువ ఓపెనర్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ పేరిట ఉండింది. ఆసీస్పై 74 ఇన్నింగ్స్ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్పై కేవలం 9 ఇన్నింగ్స్ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ను అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్కు 4 వికెట్లు దక్కాయి.అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. క్రీజులో రోహిత్ శర్మ(52 నాటౌట్), గిల్(26) పరుగులతో ఉన్నారు. -
Ind vs Eng: ‘బజ్బాల్’ను కట్టడి చేసి.. బ్యాటింగ్లో అదరగొట్టి!
India vs England, 5th Test Day 1 Highlights: ఇంగ్లండ్తో ఐదో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా పైచేయి సాధించింది. ‘బజ్బాల్’ విధానంతో దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని కట్టడి చేసి.. స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపించింది. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే భారత్ 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ధర్మశాలలో గురువారం నామమాత్రపు ఆఖరి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్లు ఆది నుంచే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ.. ఇంగ్లిష్ జట్టును తిప్పలు పెట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే(79) ఒక్కడే పట్టుదలగా నిలబడగా.. మిగతా వాళ్లలో ఒక్కరి నుంచి కూడా అతడికి సహకారం అందలేదు. కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయ (Kuldeep Yadav- Ravichandran Ashwin Spin Magic) ఈ క్రమంలో 218 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు(4/51) వికెట్లతో రాణించాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్(1/17) దక్కింది. 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙇𝙞𝙠𝙚 𝙏𝙝𝙚𝙨𝙚! R Ashwin 🤝 Kuldeep Yadav Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ashwinravi99 | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/hJyrCS6Hqh — BCCI (@BCCI) March 7, 2024 అర్ధ శతకాలతో చెలరేగి భారత ఓపెనర్లు (Yashasvi Jaiswal- Rohit Sharma) ఇక తొలి రోజే ఇంగ్లండ్ ఆట కట్టించిన టీమిండియా.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫిఫ్టీ(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు)తో ఇరదగీశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్ధ శతకంతో చెలరేగాడు. అయితే, షోయబ్ బషీర్ బౌలింగ్లో అనూహ్య రీతిలో యశస్వి స్టంపౌట్గా వెనుదిరగగా.. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా స్కోరు 135/1 కాగా.. రోహిత్ శర్మ 52, శుబ్మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా ఉన్నారు. Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
Yashasvi Jaiswal: సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును (ఇంగ్లండ్పై టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు, 656) బద్దలు కొట్టిన యశస్వి.. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్లో మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉండింది. సచిన్.. ఆసీస్పై 74 ఇన్నింగ్స్ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్పై కేవలం 9 ఇన్నింగ్స్ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ పేరిట ఉండిన రికార్డును చెరిపేశాడు. ఈ రికార్డుతో పాటు యశస్వి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్లో బౌండరీ బాది టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి.. టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి 1000 పరుగుల మార్కును తాకేందుకు 16 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. వినోద్ కాంబ్లీ ఈ మైలురాయిని కేవలం 14 ఇన్నింగ్స్ల్లోనే చేరుకున్నాడు. ఓవరాల్గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్కు చెందిన సచ్క్లిఫ్ పేరిట ఉంది. ఇతను కేవలం 12 ఇన్నింగ్స్ల్లోనే 1000 పరుగులను పూర్తి చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితా.. సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్పై 774 పరుగులు సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్పై 732 పరుగులు యశస్వి జైస్వాల్ 2024లో ఇంగ్లండ్పై 712 పరుగులు విరాట్ కోహ్లి 2014/15లో ఆస్ట్రేలియాపై 692 పరుగులు డబ్యూటీసీ 2023-25 సైకిల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు జైస్వాల్ -
Ind vs Eng: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్
Ind vs Eng 5th Test- Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పరుగుల వరద పారిస్తున్నాడు. సొంతగడ్డపై ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్.. ధర్మశాలలో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ తనదైన షాట్లతో అలరిస్తున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ బ్యాట్తో వీరవిహారం చేస్తున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో తాజా టెస్టులో.. భారత ఇన్నింగ్స్లో తొమ్మిదవ ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ మూడు సిక్స్లు కొట్టాడు. తద్వారా ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్గా జైస్వాల్ అవతరించాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టి గతంలో సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద 25 సిక్సులు కొట్టగా.. జైస్వాల్ తాజాగా ఇంగ్లండ్పై 26వ సిక్సర్ను బాది.. అతడిని అధిగమించాడు. ఇక సచిన్కు ఇందుకోసం 74 ఇన్నింగ్స్ అవసరం కాగా.. జైస్వాల్ కేవలం 9 ఇన్నింగ్స్లోనే ఈ సిక్సర్ల రికార్డు క్రియేట్ చేయడం విశేషం. కాగా ధర్మశాల మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. షోయబ్ బషీర్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్లు 26* - యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్ మీద(9 ఇన్నింగ్స్) 25- సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద(74 ఇన్నింగ్స్) 22- రోహిత్ శర్మ సౌతాఫ్రికా మీద(20 ఇన్నింగ్స్) 21- కపిల్ దేవ్ ఇంగ్లండ్ మీద(39 ఇన్నింగ్స్) 21- రిషభ్ పంత్ ఇంగ్లండ్ మీద (21 ఇన్నింగ్స్). Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ పేరిట ఉండేది. విరాట్ 2016-17లో స్వదేశంలో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో 8 ఇన్నింగ్స్ల్లో 109.2 సగటున 655 పరుగులు చేశాడు. తాజా ఇంగ్లండ్ సిరీస్లో యశస్వి జైస్వాల్ కోహ్లి పేరిట ఉండిన ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్లో (2023-24) యశస్వి ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్ల్లో 93.71 సగటున 657 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో యశస్వి 2 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు.. యశస్వి జైస్వాల్ 9 ఇన్నింగ్స్ల్లో 657 పరుగులు (స్వదేశంలో 2023-24) విరాట్ కోహ్లి 8 ఇన్నింగ్స్ల్లో 655 (స్వదేశంలో 2016-17) రాహుల్ ద్రవిడ్ 6 ఇన్నింగ్స్ల్లో 602 (ఇంగ్లండ్లో 2002) విరాట్ కోహ్లి 10 ఇన్నింగ్స్ల్లో 593 (ఇంగ్లండ్లో 2018) విజయ్ మంజ్రేకర్ 8 ఇన్నింగ్స్ల్లో 586 (స్వదేశంలో 1961-62) -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్.. 11వ స్థానంలో హిట్మ్యాన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సత్తా చాటారు. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో ఓ మోస్తరు స్కోర్లు చేసిన ఈ ఇద్దరు (రోహిత్ 2&55, యశస్వి 73&37) తాజా ర్యాంకింగ్స్లో రెండ్రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 10, 11 స్థానాలకు ఎగబాకారు. ఇదివరకే టాప్-10లో ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్తో సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిది నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకగా.. భారత్తో నాలుగో టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన జో రూట్.. మూడు నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని పదిలంగా కాపాడుకోగా.. స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో భారీ శతకంతో విరుచుకుపడిన ఆసీస్ ఆటగాడు కెమరూన్ గ్రీన్ ఏకంగా 22 స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. ఇవి మినహా తాజా ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేవీ జరగలేదు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో 10 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన నాథన్ లయోన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్తో టెస్ట్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన గ్లెన్ ఫిలిప్స్ 19 స్థానాలు మెరుగుపర్చుకుని 48వ స్థానానికి చేరాడు. టీమిండియా బౌలర్లు బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్వుడ్, కమిన్స్ 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఓ స్థానం తగ్గి ఏడో ప్లేస్కు పడిపోగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో టాప్-8 ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులు లేవు. రవీంద్ర జడేజా, అశ్విన్, షకీబ్, రూట్, అక్షర్ పటేల్, జేసన్ హోల్డర్, స్టోక్స్, జన్సెన్ టాప్-8లో కొనసాగుతుండగా.. విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు.