Top Stories
ప్రధాన వార్తలు

తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు.

ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం. 👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. 👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?. వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?. 👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్ సాబ్గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్సాబ్ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్ కళ్యాణ్ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది. 👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.చంద్రబాబు, లోకేశ్ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
సీనియర్ ఆటగాళ్లతో సఖ్యత లేకపోవడమే టీమిండియా కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar)పై వేటుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్రెసింగ్రూమ్లో నాయర్ వ్యవహారశైలి పట్ల జట్టులోని కీలక సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని.. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే బీసీసీఐ (BCCI)అతడిని తప్పించిందని తెలుస్తోంది. కాగా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందికి సంబంధించి బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీమ్ అసిస్టెంట్ కోచ్గా ఉన్న అభిషేక్ నాయర్పై వేటు వేసింది. ఎనిమిది నెలల క్రితమే బాధ్యతలు తీసుకున్న నాయర్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బోర్డు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల తర్వాతస్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 0–3తో ఓటమి, ఆపై ఆస్ట్రేలియా గడ్డపై 1–3తో సిరీస్ కోల్పోయిన తర్వాత జనవరిలో బీసీసీఐ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించింది.ఇందులో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్తో పాటు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే కోచింగ్ బృందంలో ఎవరి పైనైనా చర్యలు ఉండవచ్చని అర్థమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అభిషేక్ నాయర్ను బోర్డు తప్పించింది. హెడ్ కోచ్గా గంభీర్ కాంట్రాక్ట్ను 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఖాయం చేసిన బీసీసీఐ... నాయర్ను నియమించినప్పుడు అతని పదవీ కాలం విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు.కొటక్ ఎంపికతోనే... 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు కోసం గంభీర్, అభిషేక్ నాయర్ కలిసి పని చేశారు. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. గంభీర్ హెడ్ కోచ్గా ఎంపికయ్యాక ఎలాంటి దరఖాస్తులు, ఇంటర్వ్యూలు లేకుండా తనకు నచ్చిన వారిని ఎంచుకునేందుకు బోర్డు అవకాశం ఇచ్చింది. రోహిత్ శర్మకు మంచి స్నేహితుడుఈ క్రమంలో నాయర్ను అతను అసిస్టెంట్ కోచ్గా తీసుకున్నాడు. రోహిత్ శర్మకు మంచి స్నేహితుడైన నాయర్... అటు కెప్టెన్, ఇటు కోచ్గా మధ్య మంచి సంధానకర్తగా కూడా పని చేయగలడని భావించడం కూడా అతని ఎంపికకు మరో కారణం.భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన ముంబై ఆల్రౌండర్ నాయర్కు దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డుంది. అధికారికంగా ఏ జట్టుకు కోచ్గా పని చేయకపోయినా కూడా వ్యక్తిగతంగా ఎంతో మంది బ్యాటర్ల ఆటను మెరుగుపర్చడంలో అతని పాత్ర చాలా ఉంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వెంకటేశ్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రఘువంశీ ఇదే మాట చెప్పారు.అపుడే నాయర్ భవిష్యత్తుపై సందేహాలునిజానికి చాంపియన్స్ ట్రోఫీకి అప్పటికే ఉన్న సహాయక సిబ్బందితో పాటు అదనంగా మరో అసిస్టెంట్ కోచ్ సితాన్షు కొటక్ను పంపడంతోనే నాయర్ భవిష్యత్తుపై సందేహాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. మరోవైపు ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్కు చెందిన టి.దిలీప్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్లను కూడా తప్పిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. పని తీరు గురించి కాకుండా వీరి పదవీకాలం ముగియడమే కారణమని తెలుస్తోంది. బోర్డు కొత్త నిబంధనల (ఎస్ఓపీ) ప్రకారం సహాయక సిబ్బంది పదవీకాలం గరిష్టంగా మూడేళ్లే ఉండాలి. గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదుఇదిలా ఉంటే.. పట్టుబట్టి మరీ అభిషేక్ నాయర్ను తన సహాయక సిబ్బందిలో చేర్చుకున్న గంభీర్.. అతడిని తప్పించే సమయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘నాయర్పై వేటు వేయడాన్ని గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదు.డష్కాటే, మోర్నీ మోర్కెల్ను తన సిబ్బందిలో చేర్చుకునేందుకు గంభీర్ బోర్డుతో ఎన్నో సంప్రదింపులు జరిపాడు. అనేక చర్చల తర్వాతే వారిని సిబ్బందిలో చేర్చుకునే అవకాశం వచ్చింది. వారిని వదులుకునేందుకు మాత్రం అతడు సిద్ధంగా లేడు. అయితే, అభిషేక్ నాయర్ విషయం మాత్రం వేరు’’ అని పేర్కొన్నాయి.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్!

40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
లేఆఫ్లలో అమెరికన్ ఉద్యోగుల పట్ల వివిక్ష చూపుతోందంటూ వచ్చిన ఆరోపణలను భారత్కు చెందిన ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఖండించింది. ఈ ఆరోపణలు సంస్థ "నిరాధారమైనవి, తప్పుడు అభిప్రాయాలు" అని పేర్కొంది. తమది అందరికీ సమాన అవకాశాలు కల్పించే సంస్థ అని, సమగ్రతలో గొప్ప రికార్డ్ను కలిగి ఉందని టీసీఎస్ వివరించింది.40 ఏళ్లకు పైబడిన, దక్షిణ ఆసియన్లు కాని తమను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల నుంచి టీసీఎస్ తొలగించిందని, కానీ H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగులను మాత్రం కొనసాగించిందని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 2023 చివర నుండి ఇలాంటి ఆరోపణలు వస్తుండటంతో యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ (EEOC) దీనిపై విచారణ చేపట్టింది. యుకేలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ, టీసీఎస్ దానిని కూడా ఖండించింది.టీసీఎస్పై వచ్చిన ఆరోపణలు ఇతర ఐటీ సంస్థల ఉద్యోగ విధానాలపైనా ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీసీఎస్పై వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నా నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారని బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే కూడా ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్పాండే ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు.

అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇన్నాళ్లు వంటలు చేయగా మిగిలిన నూనెని తిరిగి వాడొద్దని హెచ్చరించేవారు. ఇప్పుడు ఏకంగా అసలు వంటనూనెలే వాడొద్దని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. పైగా అవి కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటూ.. విస్తుపోయే విషయాలు చెబుతున్నారు. ఇదేంటి ఇంకేం వాడాలి వంటకు అన్న అనుమానం రావడం సహజమే. కానీ తాజా పరిశోధనలు వంట నూనెలు కేన్సర్ ప్రమాదాన్ని ప్రోత్సహిత్సాయని చెబుతున్నాయి. అంతేగాదు అదెలా జరుగుతుందో కూడా సవివరంగా వివరించారు పరిశోధకులు.వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనల్లో వంట నూనెలు, కూరగాయల నూనెలు అతిగా వాడకూడదని తేలింది. ఆ నూనెల్లో ఉండే లినోలెయిక్ కేన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందట. ముఖ్యంగా రొమ్మ కేన్సర్(Breast Cancer)లోని కణాల్లో పెరుగుదల అనూహ్యంగా ఉంటుందని తెలిపాయి. అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని ఈ లినోయిక్ ఆమ్లం వేగవంతం చేస్తుందట. అంటే సాధారణ రొమ్ము కేన్సర్లో కంటే ఈ ట్రిపుల్ నెగటివ్లో కేన్సర్ కణాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. ఇక మనం వాడే ఈ నూనెలు ఆ కేన్సర్ కణాలను మరింత అభివృద్ధి చేస్తాయని గుర్తించామని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సోయాబీన్, కుసుమ నూనె వంటి సీడ్స్ ఆయిల్స్, పందిమాంసం, గుడ్లు వంటి జంతువుల్లో కనిపించే ఒమేగా 6 కొవ్వు ఆమ్లం లినోలెయిక్ చికిత్స చేయడానికే కష్టతరమైన ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము కేన్సర్ పెరుగదలను ప్రత్యేకంగా పెంచగలదని పరిశోధనలో నిరూపితమైందన్నారు. లినోలెయిక్ ఆమ్లం FABP5 అనే ప్రోటీన్తో బంధించడం ద్వారా కేన్సర్ కణితి కణాలను మరింత వేగంగా అభివృద్ధి చెందేలా సక్రియం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కానీ ఇతర హార్మోన్ సెన్సిటివ్ ఉప రకాల్లో అలా జరగడం లేదు. అంటే ఇక్కడ లినోలెయిక్ ఆమ్లం అధికంగా ఉన్న ఆహారం కేన్సర్ కణితి పెరుగుదల మెరుగ్గా ఉంచుతుందని క్లియర్గా నిరూపితమైందన్నారు. ఈ పరిశోధన ఆహార కొవ్వులు, కేన్సర్ మధ్య సంబంధాన్ని వివరించడంలో సహాయపడటటేమ గాక నిర్దిష్ట పోషక సిఫార్సులు ఏ రోగులకు ఎక్కువ ప్రయోజనం అనేది క్లియర్ నిర్వచించగలమని అంటున్నారు పరిశోధకులు. (చదవండి: నలుగురిలో కలవనివ్వకుండా చేసే వ్యాధి.. ! గంటల్లోనే నయం అయిపోతుందట..)

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) నేడు (ఏప్రిల్ 18) విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్లో బొమ్మ పడింది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మాస్ చిత్రంతో డైరెక్టర్గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చాటి చెప్పేలా అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఉందంటూ అభిమానులు చెబుతున్నారు.ఓవర్సీస్లో ఇప్పటికే అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫస్టాఫ్ పూర్తి అయిందని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్టింగ్ పోటీపడి నటించారని చెబుతున్నారు. చాలారోజుల తర్వాత విజయశాంతిని మళ్లీ ఇలా పోలీస్ ఆఫీసర్గా చూడటం చాలా సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ స్టోరీగా సినిమా ఉందంటున్నారు.. అయితే, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయంటున్నారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆ సన్నివేశాలకు మరింత బలాన్ని అందించాయని తెలుపుతున్నారు. ఫస్టాఫ్ వరకు కథాంశంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన మలుపులు వంటివి లేవని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. ఇలాంటి స్టోరీస్తో చాలా సినిమాలు వచ్చాయని అంటున్నారు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రానికి దగ్గరగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి స్టోరీ ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్ బ్లాక్స్లో కల్యాణ్రామ్, విలన్ల మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్ అదుర్స్లా ఉంటుందని ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు అయితే, ఫస్టాఫ్ పూర్తి అయింద పెద్దగా కొత్తదనం ఏమీ లేదంటున్నారు. కానీ, యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని ఈ చిత్రం ఎంతమాత్రం నిరాశపరచదని ఎక్కువమంది చెప్పడం విశేషం.ఇక ఇంటర్వెల్ తర్వాత ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. కొడుకు కోసం తల్లి పడే ఆరాటం ఎలా ఉంటుంది ఈ చిత్రంలో చూడొచ్చన్నారు. అదే సమయంలో అమ్మ కోసం కొడుకు చేసే పోరాటాన్ని కూడా ఇందులో చూస్తారని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ రొటీన్గా సాగడం.. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు మరీ ఎక్కువగా సాగదీసినట్లు ఉండడం ఈ చిత్రంలో మైనస్ అని పేర్కొంటున్నారు. పెద్దగా ట్విస్ట్లు ఏమీ లేకున్నా తల్లి కొడుకుల సెంటిమెంట్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్తో మెప్పించారని నెటిజన్లు తెలుపుతున్నారు. సినిమా ప్రమోషన్స్ సమయంలో చెప్పినట్లు క్లైమాక్స్ సీన్కు చాలామంది ఎమోషనల్ అవుతారని తెలుపుతున్నారు. సినిమా తప్పకుండా భారీ విజయం అందుకుంటుందని చెబుతున్నారు. పూర్తి రివ్యూ కోసం ఇంకాస్త సమయం పడుతుంది. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమేBlockbuster reports for overseas Plus: pointsBest emotional 👍mass action 👌👌Peak climax💯🔥🔥Excellent bgm score💥💥Kalyanram come back 💯#ArjunSonOfVyjayanthi pic.twitter.com/V0W2IV0Bk3— Tarak cults 👑🐯🐅 (@gopiraju1993) April 18, 2025Just done with first half of #ArjunSonOfVyjayanthiUsual Formula or just an extended Janata Garage concept. Works fine in places. Visuals and Music are decent though songs didn’t catch on. Camera work is patchy, doesn’t look great with actors close up shots.Good to see… pic.twitter.com/7wJX8mtIxr— Majid (@iammajidzz) April 18, 2025Blockbuster talk from early shows 🔥@NANDAMURIKALYAN nailed it. Peak performance.Congratulations #ArjunSonOfVyjayanthi whole teampic.twitter.com/y3bxQSbEC3— Amaravati_Techie (@Amaravati_IT) April 18, 2025Just now watched the movies first half good and second half is excellent emotions worked very well Blockbuster movie 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #ArjunSonOfVyjayanthi pic.twitter.com/YjO96lB3bW— CMTarakMainFanPage🌐 (@tarakdevote9998) April 18, 2025#ArjunSonOfVyjayanthi Strictly Average 1st Half! Starts off with an interesting mother-son setup and has a few engaging sequences but quickly turns into a run of the mill and template commercial film. Music/BGM is a big drawback and fails to elevate the proceedings. Needs a…— Venky Reviews (@venkyreviews) April 18, 2025

ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, డియర్ ఉమ తదితర తెలుగు చిత్రాలు రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీల్లో ఏకంగా ఒక్కరోజే 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే శివంగి, టుక్ టుక్, దావీద్ చిత్రాలు కాస్త చూడదగ్గ కేటగిరీలో ఉంటాయి. మిగతావన్నీ మీ ఆసక్తి బట్టి చూడొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల జాబితా (ఏప్రిల్ 18)అమెజాన్ ప్రైమ్టుక్ టుక్ - తెలుగు మూవీమిథ్య - కన్నడ సినిమాకౌఫ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్విష్ణుప్రియ - కన్నడ మూవీద నాట్ వెరీ గ్రాండ్ టూర్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్మిక్కీ 17 - ఇంగ్లీష్ సినిమా (రెంట్ విధానం)చికిచికి బూమ్ బూమ్ - మరాఠీ సినిమాజెంటిల్ ఉమన్ - తమిళ మూవీఆహాశివంగి - తెలుగు సినిమాహాట్ స్టార్మేరే హస్బెండ్ కీ బీవీ - హిందీ సినిమాలా అండ్ ఆర్డర్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్ద వే ఐ సీ ఇట్ - ఇంగ్లీష్ మూవీనెట్ ఫ్లిక్స్ఐ హోస్టేజ్ - డచ్ సినిమాఒక్లామా సిటీ బాంబింగ్ - ఇంగ్లీష్ మూవీహెవెన్లీ ఎవర్ ఆఫ్టర్ - కొరియన్ సిరీస్ (ఏప్రిల్ 19)జీ5లాగౌట్ - హిందీ సినిమాదావీద్ - మలయాళ మూవీసన్ నెక్స్ట్కత్తీస్ గ్యాంగ్ - మలయాళ మూవీఅం అః - మలయాళ సినిమాముబీగ్రాండ్ టూర్ - పోర్చుగీస్ మూవీ(ఇదీ చదవండి: ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్)

ఖబడ్దార్ రేవంత్.. ‘సీఎం పదవి నుంచి దించేస్తాం’
మహబూబ్నగర్,సాక్షి: మహబూబ్ నగర్లో లేఖ కలకలం సృష్టించాయి. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్పేట్ జిల్లా మక్తల్లో వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో ‘మేం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం. సీఎం రేవంత్రెడ్డికి ఇదే మా హెచ్చరిక. ఖబడ్దార్. మీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకి(మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి) మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించడం’ అని హెచ్చరిస్తూ లేఖలో రాశారు.ముదిరాజు సామాజిక వర్గం పేరుతో ఆ లేఖలు వెలుగులోకి రావడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆ లేఖలు ఎవరు రాశారా? అని ఆరా తీస్తున్నారు.ఆ లేఖలపై సమాచారం అందుకున్న ముదిరాజు సంఘం నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ లేఖలతో తమకు సంబంధం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Bhagavad Gita: గర్వించ దగ్గ క్షణం.. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు
సాక్షి,న్యూఢిల్లీ: భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత,భరతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది.ఈ ఘనతపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గీత, నాట్యశాస్త్రం చేర్చబడటం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవత్ గీత,నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. A proud moment for every Indian across the world! The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture. The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT— Narendra Modi (@narendramodi) April 18, 2025
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
తమిళనాడులో అమిత్ షా రూల్ చెల్లదు: స్టాలిన్
బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్ వీడియో
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
MI vs SRH: వాళ్లిద్దరి తప్పేమీ లేదు!.. క్లాసెన్ కొంపముంచాడు!
టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం
ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
పాకిస్తాన్ సూపర్ లీగ్లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్తో పోలిస్తే..!
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
చల్లటి కబురు!
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
ఈ రాశి వారికి భూలాభాలు.. వ్యాపారాలు విస్తరిస్తారు
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
రాజ్తరుణ్ పేరెంట్స్ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్కు జాక్ పాట్..?
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
PSLతో పోలికా?.. ఐపీఎల్కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
భారత్లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పెరుగుతున్న మత సమ్మతి
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
డ్రైవర్గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
జిమ్లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
భారత్లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్లైన్
ట్రైన్ రిజర్వేషన్: టికెట్పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
త్వరలో ఆర్థిక మాంద్యం!
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
IPL 2025: కలిసి కట్టుగా రాణించిన ముంబై.. చిత్తుగా ఓడిన సన్రైజర్స్
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
ఇన్ఫోసిస్ డీలా
జిడ్డు బ్యాటింగ్!.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా విమర్శలు
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
తార్నాక జంక్షన్..రీ ఓపెన్!
వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
రూ.50 కోట్ల కుక్క..ఈడీ సోదాల ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్!
Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం?.. ప్రశ్నిస్తే కేసులే!
మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్.. సపోర్ట్ చేసిన డైరెక్టర్?
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
తమిళనాడులో అమిత్ షా రూల్ చెల్లదు: స్టాలిన్
బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్ వీడియో
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
MI vs SRH: వాళ్లిద్దరి తప్పేమీ లేదు!.. క్లాసెన్ కొంపముంచాడు!
టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం
ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
పాకిస్తాన్ సూపర్ లీగ్లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్తో పోలిస్తే..!
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
చల్లటి కబురు!
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
ఈ రాశి వారికి భూలాభాలు.. వ్యాపారాలు విస్తరిస్తారు
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
రాజ్తరుణ్ పేరెంట్స్ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్కు జాక్ పాట్..?
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
PSLతో పోలికా?.. ఐపీఎల్కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
భారత్లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పెరుగుతున్న మత సమ్మతి
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
డ్రైవర్గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
జిమ్లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
భారత్లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్లైన్
ట్రైన్ రిజర్వేషన్: టికెట్పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
త్వరలో ఆర్థిక మాంద్యం!
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
IPL 2025: కలిసి కట్టుగా రాణించిన ముంబై.. చిత్తుగా ఓడిన సన్రైజర్స్
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
ఇన్ఫోసిస్ డీలా
జిడ్డు బ్యాటింగ్!.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా విమర్శలు
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
తార్నాక జంక్షన్..రీ ఓపెన్!
వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
రూ.50 కోట్ల కుక్క..ఈడీ సోదాల ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్!
Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం?.. ప్రశ్నిస్తే కేసులే!
మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్.. సపోర్ట్ చేసిన డైరెక్టర్?
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
సినిమా

ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా రెండు లేదా మూడు భాగాలుగా సినిమా తీయడానికి, అదేవిధంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. పైగా సీక్వెల్స్ చిత్రాలకు అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో ఫుల్ క్రేజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఫుల్గా ఉంటున్నాయి.దీంతో సీక్వెల్స్ తీయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు మూడో భాగంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా, మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అదే విధంగా ఇంకొన్ని సినిమాలకు మూడో భాగం ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ‘ట్రిపుల్ ట్రీట్’ అంటూ ముచ్చటగా మూడో భాగంతో రానున్న ఆ సీక్వెల్స్ విశేషాలేంటో చూద్దాం. పుష్పరాజ్... తగ్గేదే లే హీరో అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్లది హిట్ కాంబినేషన్ . వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య’ (2004) సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం సాధించింది. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్ ఇండియా హిట్గా నిలిచింది. పుష్పరాజ్గా తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్గా ఇదే కాంబోలో వచ్చిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు తారస్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటూ బ్లాక్బస్టర్ అందుకుంది ‘పుష్ప 2: ది రూల్’. 2024 డిసెంబరు 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ సీక్వెల్లో మూడో భాగం ఉంటుందని ‘పుష్ప 2: ది రూల్’ ప్రమోషన్స్లో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.మూడో భాగానికి ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్ని కూడా ఖరారు చేశారనే వార్తలు వినిపించాయి. అదేవిధంగా అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలకు సీక్వెల్గా ‘ఆర్య 3’ మూవీ ఉంటుందట. ఈ విషయాన్ని కూడా సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకులు త్రివిక్రమ్, అట్లీ సినిమాలు కమిట్ అయ్యారు. ఆ రెండు సినిమాల తర్వాతే సుకుమార్ కాంబినేషన్లో మూవీ ఉంటుందని ఊహించవచ్చు. మరి ‘పుష్ప’ మూడో భాగం, ‘ఆర్య 3’.. ఈ రెండిట్లో ఏది ముందుగా సెట్స్పైకి వెళుతుందనేది తెలియాలంటే చాలా సమయం పట్టవచ్చని ఫిల్మ్నగర్ టాక్. అర్జున్ సర్కార్ వస్తున్నాడు‘క్రిమినల్స్ ఉంటే భూమ్మీద పదడుగుల సెల్లో ఉండాలి... లేకుంటే భూమిలో ఆరడుగుల గుంతలో ఉండాలి’, ‘జనాల మధ్య ఉంటే అర్జున్... మృగాల మధ్య ఉంటే సర్కార్’ అంటున్నారు నాని (Nani). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్: ది సెకండ్ కేస్’ (2022) వంటి హిట్ చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను (Sailesh Kolanu) మూడో భాగాన్ని కూడా తెరకెక్కించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించిన నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించడం విశేషం. ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి వాల్పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నాని కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో తొలి, మలి భాగాల్లానే మూడో భాగంతోనూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటామనే బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కాగా ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం ఏడు భాగాలు ఉంటాయని డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగురెట్ల నవ్వులు హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 14న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి వెంకటేశ్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2019 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 2’ కాంబినేషన్లోనే ఆ మూవీకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన తొలి, ద్వితీయ భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్–4’ మూవీ ఉంటుందని ‘ఎఫ్ 3’ చిత్రం ఎండింగ్లో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, ఈ గ్యాప్లో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్కి వెళ్లే అవకాశాలున్నాయని ఫిల్మ్నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’లతో పోలిస్తే ‘ఎఫ్ –4’లో నవ్వులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్తో పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని సమాచారం. మరి... ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వేచి చూడాలి. ఓదెల 3 హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ ద్వితీయ భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి.మధు నిర్మించిన ఈ మూవీ గురువారం (ఏప్రిల్ 17న) విడుదలైంది. తొలిసారి నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా నటించారు. ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ఠ నటించారు. ఈ మూవీలో తమన్నా నటన హైలైట్గా నిలిచింది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఓటీటీలో విడుదలైనా మంచి హిట్గా నిలవడంతో ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ఓదెల 3’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించడం విశేషం.తొలి, మలి భాగాలకు మించి... హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ‘కార్తికేయ 2’ 2022 ఆగస్టు 13న విడుదలై పాన్ ఇండియా హిట్ అందుకుంది. అంతేకాదు... రూ. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం విశేషం. ఈ కోవలోనే ‘కార్తికేయ 3’ ఉంటుందని దర్శకుడు చందు మొండేటి, నిఖిల్ సిద్ధార్థ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో ‘కార్తికేయ 3’పై అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్ నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీ తొలి, ద్వితీయ భాగాలకు మించి అద్భుతంగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్న చందు మొండేటి ప్రస్తుతం ‘కార్తికేయ 3’కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై పని చేస్తున్నారు. అదేవిధంగా నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నారు. మరి ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే సమయం ఎప్పుడు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. టిల్లు క్యూబ్‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాలతో ప్రేక్షకులను తనదైన యాటిట్యూడ్, మేనరిజమ్తో నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ ఫ్రాంచైజీలో రూపొందనున్న మూడో చిత్రం ‘టిల్లు క్యూబ్’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్గా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. 2024 మార్చి 29న రిలీజైన ఈ మూవీ తొలి భాగం మంచి హిట్గా నిలిచింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్నట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి తొలి, మలి భాగాలకు దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ, మల్లిక్ రామ్ కాకుండా కల్యాణ్ శంకర్(మ్యాడ్ ఫేమ్) దర్శకత్వం వహించనుండటం విశేషం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు... ‘టిల్లు క్యూబ్’లో హీరో పాత్రను సూపర్ హీరోగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘టిల్లు క్యూబ్’ చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడో పొలిమేరలో... ‘సత్యం’ రాజేశ్ కీలక పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు మంచి విజయం సాధించాయి. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో 'పొలిమేర 3’ (Polimera 3 Movie) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తొలి, మలి భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. చిత్రయూనిట్ విడుదల చేసిన ‘పొలిమేర 3’ వీడియో గ్లింప్స్ చూస్తే మొదటి, ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు మరిన్ని ఉంటాయని తెలుస్తోంది.మూడోసారి మత్తు వదలరా... ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల ఫ్రాంచైజీలో రూపొందనున్న చిత్రం ‘మత్తు వదలరా 3’. శ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో విడుదలై హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. తొలి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 13న విడుదలై హిట్గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. అయితే వెంటనే షూటింగ్ ఉండదని దర్శకుడు రితేష్ రానా ప్రకటించారు. మరి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవ్వులు మూడింతలు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 2023 అక్టోబరు 6న రిలీజై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మ్యాడ్’ కాంబినేషన్లోనే ఈ మూవీకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. తొలి భాగం హిట్తో ద్వితీయ భాగంపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్మీట్కి హీరో ఎన్టీఆర్ రావడం విశేషం. కాగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు సీక్వెల్గా ‘మ్యాడ్ 3’ కచ్చితంగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లేందుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. పై సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా మూడో భాగం రానున్నాయి.చదవండి: నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా!

నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా!
బాలీవుడ్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్లో తమన్నా (Tamannaah Bhatia)కు ఎంట్రీ లభించిందని సమాచారం. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న హిందీ చిత్రం ‘నో ఎంట్రీ 2’. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్, బిపాసా బసు, ఈషా డియోల్ ప్రధాన పాత్రధారులుగా అనీస్ బాజ్మి దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన హిందీ బడ్డీ రొమాంటిక్ కామెడీ మూవీ ‘నో ఎంట్రీ’. కాగా ఈ సినిమాకు సీక్వెల్గా ‘నో ఎంట్రీ 2’ సినిమా తీస్తున్నారు అనీస్ బాజ్మీ, బోనీ కపూర్. నలుగురికి పైగా హీరోయిన్లు..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలకు పైగా నటిస్తారని టాక్. వీరిలో ఇప్పటికి తమన్నా, అదితీ రావ్ హైదరీలను సంప్రదించారని, కథ నచ్చడంతో ఈ కథానాయికలు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వీలైతే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని బీటౌన్ టాక్. ఈ విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.చదవండి: నేనే అమ్మాయినైతే.. శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

నేనే అమ్మాయినైతే.. శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్( Shiva Rajkumar), రియల్ స్టార్ ఉపేంద్ర కలిసి నటించిన తాజా చిత్రం 45. ఎస్పీ స్వరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుమతి ఉమా రమేష్రెడ్డి, ఎం. రమేష్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జాన్య దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర తమిళ్ వెర్షన్ టీజర్ను చెన్నైలో విడుదల చేశారు. స్థానిక రాయపేటలోని పీవీఆర్ సత్యం థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నిర్మాత రమేష్ రెడ్డి, చిత్ర దర్శకుడు అర్జున్ జన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తాను చెన్నైకి ఎప్పుడు వచ్చినా సంతోషం కలుగుతుందన్నారు తాను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే అన్నారు. తనకు నటుడుగా తొలి అవకాశం వచ్చింది కూడా ఇక్కడే అని పేర్కొన్నారు. అలా పలు మధురమైన జ్ఞాపకాలు తనకు చెన్నైతో ముడిపడి ఉన్నాయని అన్నారు. కాగా తాను ఎప్పుడు హీరో కావాలని కోరుకోలేదని హీరో అంటే కమలహాసన్ ,అమితాబచ్చన్లో మాదిరి ఉండాలని అనుకునేవాడినని అన్నారు. వారే తన ఫేవరెట్స్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్ తనకు స్ఫూర్తి అని ,తానే గనుక అమ్మాయినైతే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే దానినని ఆయనది అంత అందం అని పేర్కొన్నారు. తాను నటుడుగా మారిన తర్వాత చాలా జయాపజయాలను చవి చూశానన్నారు. అయినప్పటికీ వాటిని ఎప్పుడు తలకెక్కించుకోలేదని చెప్పారు. అదేవిధంగా జీవితంలో పలు మరణాలను, దుఃఖాలను ఎదుర్కొన్నానని, తనకు తలలో సర్జరీ జరిగిందని, అదేవిధంగా ఇటీవల క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. ఇకపోతే 45 చిత్రంలో నటించడం సంతోషకరమన్నారు. దర్శకుడు అర్జున్ జాన్య కథ చెప్పగానే నచ్చిందన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం 45 అని, ఇది ఏ ఒక్క భాషకు చెందింది కాదని ఇండియన్ సినిమా అని నిర్మాత ఎం. రమేష్ రెడ్డి పేర్కొన్నారు.

పీరియడ్స్.. ఆ సమయంలో చాలా బాధపడ్డాను: సమంత
‘‘మహిళలు ఎంతో సాధిస్తున్నారు. కానీ పీరియడ్స్ గురించి మాట్లాడటానికి ఇప్పటికీ ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. ఈ విషయం గురించి మాట్లాడాలంటే మౌనం... బిడియం... గుసగుసలు... ఇలాంటి పరిస్థితే ఉంది’’ అని పేర్కొన్నారు సమంత. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటారామె. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్లో ఉంటారు.ఇందులో భాగంగా తాజాగా తన పాడ్ కాస్ట్లో ఆరోగ్య నిపుణురాలు రాశీ చౌదరితో రుతుక్రమ ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు సమంత. అలాగే ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం లోపలి పొర) వంటి దీర్ఘకాలిక రుతుక్రమ రుగ్మతలపై తన అబీప్రాయాలను పంచుకున్నారామె. ‘‘ఎండోమెట్రియోసిస్తో ఒక సెలబ్రిటీగా నేను ఇబ్బందులు పడ్డాను. షూటింగ్, పని తాలూకు ఒత్తిడి... ఇలాంటి వాటితో చాలా బాధపడ్డాను. రుతుక్రమ సమస్యల గురించి అమ్మాయిలు మాట్లాడాలి... అవగాహన పెంచుకోవాలి. పురుషులు కూడా తెలుసుకోవాలి’’ అని తెలిపారు సమంత. ఇక సినిమాల విషయానికి వస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) తర్వాత మరో చిత్రంలో నటించలేదు సమంత. అయితే గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారామె. అలాగే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో కమిన్స్ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో సమిష్టి వైఫల్యం కారణంగా ఈ సీజన్లో ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతేకాదు.. ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు సొంత మైదానం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.ఇలాంటి వికెట్ మీద కష్టమే..‘‘వాంఖడే వికెట్పై పరుగులు రాబట్టడానికి కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్కు వచ్చినప్పుడు సులువుగానే రన్స్ చేయొచ్చనే అనిపించింది. కానీ అనూహ్యంగా పిచ్ పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఎక్కడిక్కడ మమ్మల్ని కట్టడి చేశారు. మేము కూడా బాగానే బ్యాటింగ్ చేశాం. ఇలాంటి వికెట్ మీద 160 అనేది మెరుగైన స్కోరే. కానీ మేము ఇంకాస్త బెటర్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఈరోజు మా వాళ్లు పవర్ప్లేలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పోలేదు.మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీనిర్లక్ష్య రీతిలో హిట్టింగ్ కూడా ఆడలేదు. కానీ ఇలా జరిగిపోయింది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. ఇక మా బౌలింగ్ విషయానికొస్తే డెత్ ఓవర్లలో మా ప్రదర్శన పర్వాలేదనిపించింది.ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన బౌలర్తో 1-2 ఓవర్లు మాత్రమే వేయించగలము అనిపించింది. అందుకే రాహుల్ చహర్ను తీసుకువచ్చాం. ఫైనల్కు చేరుకోవాలంటే హోం గ్రౌండ్ వెలుపల ఎక్కువగా మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది.కానీ దురదృష్టవశాత్తూ ఈ సీజన్లో మేము ఇంత వరకు ఇతర వేదికలపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకుని సానుకూలంగా ముందుకు వెళ్తాం. తదుపరి మా సొంత మైదానంలో మ్యాచ్ ఆడబోతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. అనుకున్న ఫలితం రాబట్టగలమని నమ్ముతున్నాం’’ అని ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.శైలికి భిన్నంగాకాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. దూకుడైన తమ శైలికి భిన్నంగా రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28) నెమ్మదిగా ఆడారు. ఇషాన్ కిషన్ (2), నితీశ్ రెడ్డి (21 బంతుల్లో 19) పూర్తిగా విఫలం కాగా.. క్లాసెన్ (28 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించాడు.ఆఖర్లో అనికేత్ వర్మ (8 బంతుల్లో 18 నాటౌట్), కమిన్స్ (4 బంతుల్లో 8 నాటౌట్) కాస్త వేగంగా ఆడగా.. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి రైజర్స్ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ విల్ జాక్స్ రెండు వికెట్లు కూల్చాడు.పాండ్యా మెరుపులుఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (31), రోహిత్ శర్మ (26) ఫర్వాలేదనిపించగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్) రాణించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ (9 బంతుల్లో 21)తొ మెరిసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైజర్స్ కెప్టెన్ కమిన్స్కు మూడు, ఇషాన్ మలింగకు రెండు, హర్షల్ పటేల్కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్కు జాక్ పాట్..?Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025

స్వర్ణంతో శుభారంభం
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2025 సీజన్ను స్వర్ణ పతకంతో శుభారంభం చేశాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన పాచెఫ్్రస్టూమ్ ఇన్విటేషనల్ ట్రాక్ ఈవెంట్లో 27 ఏళ్ల నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. ఆరుగురు పోటీపడ్డ ఈ ఈవెంట్లో నీరజ్ జావెలిన్ను 84.52 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డూ స్మిట్ (దక్షిణాఫ్రికా; 82.44 మీటర్లు) రజతం, డంకన్ రాబర్ట్సన్ (దక్షిణాఫ్రికా; 71.22 మీటర్లు) కాంస్యం సాధించారు. నీరజ్ పాల్గొన్న ఈ మీట్కు వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజర్ ఈవెంట్గా గుర్తింపు ఉంది. దిగ్గజం జాన్ జెలెజ్నిను కొత్త కోచ్గా నియమించుకున్నాక నీరజ్ పోటీపడ్డ తొలి టోర్నీలో టాప్ ర్యాంక్లో నిలువడం విశేషం. నీరజ్ తదుపరి మే 16వ తేదీన జరిగే దోహా డైమండ్ లీగ్ మీట్లో, ఆ తర్వాత మే 24న పంచ్కులాలో జరిగే నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో టోర్నీలో పోటీపడతాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్... 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. 2022 ప్రపంచ చాంపియన్షిప్లో రజతం సొంతం చేసుకున్న నీరజ్... 2023 ప్రపంచ చాంపియన్షిప్లో విశ్వవిజేతగా అవతరించాడు.

హంపి, దివ్య విజయం
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో నాలుగో రోజు భారత స్టార్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ మెరిశారు. హంపి వరుసగా రెండో విజయం నమోదు చేసుకోగా... దివ్య ఖాతాలో మూడో గెలుపు చేరింది. భారత్కే చెందిన ఇద్దరు గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్బాబుల మధ్య జరిగిన ముఖాముఖి పోరు ‘డ్రా’గా ముగిసింది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలిచింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో ఆడిన మహారాష్ట్ర అమ్మాయి దివ్య 77 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. హారిక, వైశాలి మధ్య జరిగిన గేమ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) 55 ఎత్తుల్లో... జు జినెర్ (చైనా) 39 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. 10 మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్ తర్వాత జు జినెర్ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హంపి, దివ్య 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. హారిక, పొలీనా, మున్గున్తుల్ 2 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందగా... జు జినెర్ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.

వన్డే వరల్డ్కప్ టోర్నీకి పాక్ అర్హత
లాహోర్: ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్కప్ క్రికెట్ టోర్నమెంట్కు పాకిస్తాన్ జట్టు అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో టాప్–2లో నిలిచిన జట్లకు ప్రపంచకప్ బెర్త్లు లభిస్తాయి. గురువారం థాయ్లాండ్తో జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 87 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 205 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (80; 9 ఫోర్లు), కెపె్టన్ సనా ఫాతిమా (62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం థాయ్లాండ్ జట్టు 34.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో సనా ఫాతిమా, నష్రా సంధూ, రమీన్ షమీమ్ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకుంది. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో పాకిస్తాన్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయినా ఆ జట్టుకు వచ్చిన ఢోకా లేదు.బంగ్లాదేశ్ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందుతుంది. బంగ్లాదేశ్ ఓడిపోయి... వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ల్లో గెలిస్తే ఈ మూడు జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. రన్రేట్ పరంగా బంగ్లాదేశ్కే మరో బెర్త్ దక్కే అవకాశం ఉంది.
బిజినెస్

ఇన్ఫోసిస్ డివిడెండ్.. 17 నెలల బుడ్డోడికి రూ. 3.3 కోట్లు
దేశంలో అగ్రగామి ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ను ప్రకటించింది. ఈ డివిడెండ్ల నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఎకాగ్రహ్ రోహన్ మూర్తి రూ. 3.3 కోట్లు అందుకోనున్నాడు. ఈ బుడ్డోడికి ఇన్ఫోసిస్లో 15 లక్షల షేర్లు (0.04% వాటా) ఉన్నాయి. ఎకాగ్రహ్ నాలుగు నెలల వయసున్నప్పుడు నారాయణ మూర్తి బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో ఈ షేర్ల విలువ రూ. 240 కోట్లకు పైగా ఉండేది.ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో షేరుకు రూ. 22 డివిడెండ్ను ప్రకటించింది. దీని ద్వారా ఎకాగ్రహ్కు రూ. 3.3 కోట్ల డివిడెండ్ లభించనుంది. ఈ చిన్నారి ఇప్పటివరకు మొత్తం రూ. 10.65 కోట్ల డివిడెండ్ను సంపాదించాడు. చిన్న వయసులోనే ఎకాగ్రహ్కు రూ.కోట్లలో ఆదాయం లభించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఇన్ఫోసిస్, భారత ఐటీ రంగంలో అగ్రగామిగా ఉంటూ, తన వాటాదారులకు స్థిరమైన డివిడెండ్లను అందిస్తోంది. నారాయణ మూర్తి తన మనవడికి ఇచ్చిన ఈ బహుమతి, ఎకాగ్రహ్ భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, కుటుంబ ఆస్తుల పంపిణీలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది. రాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమారుడు రోహన్ మూర్తి, అపర్ణా కృష్ణన్ల ముద్దుల కొడుకే ఈ ఎకాగ్రహ్.ఇక నారాయణ మూర్తి కుమార్తె, యూకే మాజీ ప్రధాని సతీమణి అక్షతా మూర్తికి ఇన్ఫోసస్లో 3.89 లక్షల షేర్లు (1.04% వాటా) ఉన్నాయి. దీంతో ఆమె రూ.85.71 కోట్లు అందుకోబోతున్నారు. అలాగే నారాయణ మూర్తి రూ.93.33 కోట్లు, ఆయన భార్య సుధా మూర్తి రూ.76 కోట్లు ఈ డివిడెండ్ల ద్వారా ఆర్జించనున్నారు. ఈ డివిడెండ్లకు మే 30వ తేదీని రికార్డ్ డేట్గా ప్రకటించగా జూన్ 30న ఆయా మొత్తాలు వాటాదారుల చేతికి అందనున్నాయి.

రైతన్నపై ప్రకృతి ప్రకోపం
ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగానికి చాలాకాలంగా సవాలుగా మారుతున్నాయి. ఉత్పత్తి, సరఫరా గొలుసులు, మార్కెట్ స్థిరత్వానికి విఘాతం కలిగిస్తున్నాయి. వరదలు, తుపానులు, ఈదురుగాలులు, కరువులు, హారికేన్లు, కార్చిచ్చులు.. వంటి సంఘటనలు అన్నదాతలపాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవల తీవ్ర ఈదురుగాలులు, ఆకాల వర్షాలతో తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భారీగా పంటనష్టం వాటిల్లింది. నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడోచోట ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దేశ జీడీపీలో సింహభాగాన్ని ఆక్రమించిన వ్యవసాయంలో అనిశ్చితుల వల్ల ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు ఆర్థికంగా వ్యవసాయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఉత్పాదకత తగ్గుదలవ్యవసాయం స్థిరమైన వాతావరణ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఏదైనా అంతరాయం కలిగినప్పుడు గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. పంట వైఫల్యాలు, పశువుల మరణాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం.. వంటివి ఉత్పాదకతను తగ్గిస్తాయి. ఇది రైతులు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాల ఆదాయ మార్గాలను నేరుగా ప్రభావితం చేస్తుంది.సరఫరా గొలుసు అంతరాయాలుప్రకృతి వైపరీత్యాలు రవాణా నెట్వర్క్లను నిర్వీర్యం చేస్తాయి. ఈదురుగాలులు, తుపానులు.. వంటివి సంభవించినప్పుడు వ్యవసాయ రవాణా కష్టతరమవుతుంది. దాంతో పంట ఉత్పత్తులను పొలాల నుంచి మార్కెట్లకు తరలించడం సాధ్యం కాదు. నీట మునిగిన రోడ్లు, దెబ్బతిన్న ఓడరేవులు, లాజిస్టిక్స్ నష్టపోవడం వల్ల జాప్యం జరుగుతుంది. ఫలితంగా మార్కెట్లో కొరత ఏర్పడే అవకాశం ఉంది.మార్కెట్ అస్థిరత.. ధరల హెచ్చుతగ్గులువ్యవసాయ ఉత్పత్తుల్లో సరఫరా అంతరాయాలు తరచుగా ధరల హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. నిత్యావసర పంటల ఆకస్మిక కొరత ధరలను పెంచుతుంది. ఇది వినియోగదారులు, వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడిన వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది.దీర్ఘకాలిక ఆర్థిక పరిణామాలుతక్షణ నష్టాలకు మించి ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి. నేల క్షీణత, వ్యవసాయ యోగ్యమైన భూమి కోల్పోవడం, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గడం ప్రధాన సమస్యలుగా మారుతాయి. తిరిగి ఈ వ్యవస్థ రికవరీకి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘ఐటీ’ ఫలితాలు నేలచూపులు.. అందుకు కారణాలు..ఏం చేయాలంటే..ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడానికి క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్(వాతావరణ అనుకూల వ్యవసాయం), సుస్థిర పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలి. ఎలివేటెడ్ షెడ్ల నిర్మాణం వల్ల ఇలాంటి వైపరీత్యాలను కొంతవరకు కట్టడి చేయవచ్చు. కానీ ఇది పరిమితమైన కమతాలకే ఉపయోగపడుతుంది. దీనిపై మరింత పరిశోధనలు జరిగాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా సప్లై-చెయిన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. విపత్తును ముందుగానే గుర్తించేందుకు, తగిన ప్రతిస్పందన చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి.

అమెరికా టారిఫ్లతో డిఫాల్ట్ రిస్కులు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల వల్ల రుణాలకు సంబంధించిన పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని, తక్కువ రేటింగ్, స్పెక్యులేటివ్ రేటింగ్ ఉన్న కార్పొరేట్లు డిఫాల్ట్ అయ్యే రిస్కులు పెరగవచ్చని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. గ్లోబల్ వృద్ధి నెమ్మదించి, మాంద్యం వచ్చే అవకాశాలు పెరగవచ్చని ఓ నివేదికలో వివరించింది.‘ఫైనాన్షియల్ మార్కెట్లను టారిఫ్లు షాక్కు గురిచేశాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వచ్చే రిస్కులు పెరుగుతున్నాయి. అనిశ్చితి కొనసాగడం వల్ల వ్యాపార ప్రణాళికలకు అవరోధంగా మారుతుంది. పెట్టుబడులు నిల్చిపోతాయి. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతుంది‘ అని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.టారిఫ్ల అమలుకు తాత్కాలికంగా విరామం ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తి, కొనుగోళ్లను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం లభించినప్పటికీ, 90 రోజుల తర్వాత టారిఫ్ల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో వ్యాపార ప్రణాళికలకు సమస్యలు తలెత్తవచ్చని వివరించింది. గత నెల రోజులుగా రుణ సంబంధ పరిస్థితులు (రుణాల లభ్యత, వడ్డీ రేట్లు, రుణ గ్రహీతలు చెల్లించే సామర్థ్యాలు మొదలైనవి) గణనీయంగా దిగజారినట్లు మూడీస్ రేటింగ్స్ వివరించింది. అమెరికా జీడీపీపైనా ప్రభావం.. ఇక అమెరికా ఎకానమీ మీద కూడా టారిఫ్ల ప్రభావం ఉంటుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. అగ్రరాజ్యం జీడీపీ వృద్ధి కనీసం ఒక పర్సెంటేజీ పాయింట్ మేర తగ్గొచ్చని, అమెరికన్ వినియోగదారులు.. వ్యాపార సంస్థలకు ధరలు గణనీయంగా పెరిగిపోవచ్చని మూడీస్ తెలిపింది. టారిఫ్ల భారాన్ని నెమ్మదిగా బదలాయించినా, అంతిమంగా దాన్ని మోయాల్సింది అమెరికన్ వినియోగదారులేనని తెలిపింది.సుంకాల వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుందని, పలు సంస్థల లాభాల మార్జిన్లు పడిపోతాయని వివరించింది. అటు చైనా విషయానికొస్తే వాణిజ్య యుద్ధంపరమైన ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ మందగమనం వల్ల ఎగుమతుల రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది.ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికా–చైనా సంబంధాలు వివాదాస్పదంగానే కొనసాగవచ్చని, దీనితో వ్యాపారవర్గాలు.. వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. ఫలితంగా దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఏర్పడొచ్చని తెలిపింది.

‘ఐటీ’ ఫలితాలు నేలచూపులు.. అందుకు కారణాలు..
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు వరుసగా 2024-25 చివరి త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజాలుగా ఉన్న విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు వాటి పనితీరు నివేదికలను ప్రకటించాయి. అయితే ఇవి ఇన్వెస్టర్లు ఆశించిన రీతిలో లేకపోవడంతో నిరాసక్తత నెలకొంటుంది. ఒకప్పుడు స్థిరత్వానికి, వృద్ధికి దిక్సూచిగా నిలిచిన ఐటీ రంగం ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. టెక్ కంపెనీల లాభాలు నేలచూపులు చూస్తుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిట్రంప్ సుంకాలు ప్రధానంగా భారత టెక్ కంపెనీలకు అవాంతరంగా తోస్తున్నాయి. ఎందుకంటే భారత్లోని టెక్నాలజీ సర్వీసులను యూఎస్లోకి ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్ దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధిస్తుండడంతో ఈ రంగం కుదేలవుతుందని భావిస్తున్నారు. దాంతోపాటు ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. భారత ఐటీ సేవలకు కీలక మార్కెట్ అయిన అమెరికా ద్రవ్యోల్బణం, విధాన మార్పులతో సతమతమవుతుండటంతో ఔట్ సోర్సింగ్ టెక్ సేవలపై ఖర్చు తగ్గింది.బలహీనమైన ఆదాయ అంచనాలుప్రధాన ఐటీ కంపెనీలు ఊహించిన దానికంటే బలహీనమైన రాబడులను నమోదు చేస్తున్నాయి. ఉదాహరణకు, విప్రో భవిష్యత్తులో రెవెన్యూ క్షీణిస్తుందని ముందుగానే అంచనా వేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా వృద్ధిని కొనసాగించడానికి కష్టపడుతున్నాయి.ఐటీ సేవలకు తగ్గుతున్న డిమాండ్చాలా కంపెనీలు తమ బడ్జెట్లను కఠినతరం చేస్తున్నాయి. దాంతో అవసరమైన ఐటీ సేవల కోసం వ్యయాలు(డిసిక్రీషినరీ స్పెండింగ్) తగ్గాయి. కంపెనీలు కొత్త టెక్నాలజీ పెట్టుబడుల కంటే వ్యయ తగ్గింపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు కాంట్రాక్టులు తగ్గేందుకు దారితీస్తోంది.స్టాక్ మార్కెట్ అస్థిరతవివిధ రేటింగ్ ఏజెన్సీలు భవిష్యత్తు వృద్ధి అంచనాలను తగ్గిస్తుండడంతో ఇన్వెస్టర్ల ఆందోళనల కారణంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పతనమవుతుంది. గత కొన్ని నెలలుగా ఇండెక్స్ భారీగా పడిపోయింది. ఇది గ్లోబల్ టెక్ సెంటిమెంట్ను అద్దం పడుతుంది. ఇది ఐటీ రంగంపై మరింత విశ్వాసాన్ని దెబ్బతీసింది.ఇదీ చదవండి: త్వరలో ఆర్థిక మాంద్యం!భౌగోళిక, వాణిజ్య సవాళ్లుముఖ్యంగా అమెరికాలో కొత్త వాణిజ్య విధానాలు, టారిఫ్ నిబంధనలు ఐటీ కంపెనీల కష్టాలను మరింత పెంచాయి. ఈ మార్పులు నిర్వహణ వ్యయాలను అధికం చేస్తున్నాయి. భవిష్యత్తు ఒప్పందాలపై అనిశ్చితి సృష్టించాయి.
ఫ్యామిలీ

హెరిటేజ్ వాక్..ఎక్స్పర్ట్స్ టాక్..!
సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో సందడి నెలకొంది. విద్యార్థుల కోలాహలంతో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడింది.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి 1,628 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశంలోని మూడు రాష్ట్రపతి నిలయాల చరిత్ర, ప్రాముఖ్యతను వివరించే వీడియోను వీక్షించారు. అనంతరం విద్యార్థులు హెరిటేజ్ వాక్లో భాగంగా రాష్ట్రపతి నిలయంలోని పురాతన భవనాలను సందర్శించి వాటి చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వారసత్వ పరిరక్షణకు సంబంధించిన నిపుణులు విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు. ఈ సెషన్లలో ఇంజినీర్ వేదకుమార్ మణికొండ (డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్), మధు వొటెరి (సీనియర్ ఫెలో – కేంద్ర సాంస్కతిక మంత్రిత్వ శాఖ, తెలంగాణ టూరిజం వాక్ కోఆర్డినేటర్), కల్పనా రమేష్ (కావా డిజైన్ స్టూడియో – ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు) పాల్గొన్నారు. (చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!)

వేసవి ఉక్కపోతల్లో డ్రెస్సింగ్ స్టైల్స్ అదిరిపోవాలంటే..!
వేసవిలో వివాహ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కాలానికి తగినట్టు డ్రెస్సింగ్ ఉండాలి. అలాగని లుక్లో రిచ్నెస్ ఏ మాత్రం తగ్గకూడదు. ఎంపిక పెద్ద టాస్క్. సీజన్కి తగినట్టు సౌకర్యంగా ఉండేలా, అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా ఉండాలంటే మనదైన స్టైల్ స్టేట్మెంట్ను చూపించాలి. వేసవిలో ఉక్కపోతలో డ్రెస్సింగ్ స్టైల్స్ ఆహ్లాదంగా... ఆకట్టుకునేలా ఉండాలి. మిగతా సీజన్లో ఎంత బ్రైట్ కలర్స్ని ఎంపిక చేసుకున్నా,.. సమ్మర్లో మాత్రం పేస్టల్ కలర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. వీటికే కాంట్రాస్ట్ బ్లౌజ్లు, లైట్షేడ్స్ ఉన్నవి, అవి కూడా హెవీ వర్క్తో కాకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. ఫ్లోరల్స్... ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలకు లెహంగా అయినా, వివాహ వేడుకకు శారీ అయినా ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నవి ఎంపిక చేసుకోవడం వల్ల అకేషన్ కాస్తా ఆహ్లాదంగా మారిపోతుంది. పేస్టల్, గోల్డ్, సిల్వర్ కలర్స్లో ఉన్నా ఫ్లోరల్స్తో ఉన్న లైట్ వెయిట్ పట్టు చీరలకు, మరో డిజైనర్ పల్లూని జత చేసి వధువు, ఆమె తరపు స్నేహితులు.. మహారాణీ స్టైల్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇండో వెస్ట్రన్... మన హ్యాండ్లూమ్ పట్టు చీరల్లోనూ లైట్ వెయిట్వి ఎంపిక చేసుకోవాలి. వాటికి పూర్తి కాంట్రాస్ట్ బెలూన్ స్లీవ్స్, స్లీవ్లెస్, యునిక్గా ఉండే బ్లౌజ్ డిజైన్స్ సరైన ఎంపిక అవుతుంది. శారీ గ్రాండ్నెస్ అంతా బ్లౌజ్ డిజైన్లో చూపించవచ్చు హెవీ ఎంబ్రాయిడరీ అవసరం లేకుండానే. లినెన్ అండ్ కాటన్ స్టైల్... వొవెన్ బార్డర్ ఉన్నవి, లినెన్స్, కాటన్స్ని ఉపయోగించి కూడా తమదైన స్టైల్ స్టేట్మెంట్తో ఈ సీజన్ వేడుకలో పాల్గొనవచ్చు. కాంట్రాస్ట్ స్టైలిష్ బ్లౌజులు, మనవైన సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న ప్లెయిన్ శారీస్ను కూడా ఈ వేడుకలకు ఎంచుకోవచ్చు. వీటితోపాటు చందేరీ స్టైల్స్తోనూ గ్రాండ్లుక్ను తీసుకురావచ్చు. ఆభరణాల ఎంపిక... ముత్యాలు, పచ్చలు, ఇతర బీడ్స్తో చేసిన లేయర్డ్ జ్యువెలరీ ఈ వేసవికి సరైన ఎంపిక అవుతుంది. వీటి వల్ల చెమటతో పెద్ద ఇబ్బంది ఉండదు. పైగా, ధరించిన డ్రెస్కు హైలైట్గా నిలుస్తాయి.(చదవండి: ఏ క్షణమైనా గుండెపోటు తప్పదనుకున్నా..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ)

నాటక సమాహార
‘‘పురుషోత్తం– హి, ది విక్టిమ్ ఆఫ్ స్పైడర్స్ అండ్ ప్రెజర్ కుకర్స్’ నాటకం తెలియని నాటక ప్రియులు ఉండరేమో! ఒక నేరస్థుడు ఏమాత్రం అపరాధ భావన, పశ్చాత్తాపం లేకుండా తను చేసిన నేరం గురించి చెప్పేదే ఆ నాటకం. ఇది న్యూజర్సీ, రట్గర్స్ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, ఎమ్ఎఫ్ఏప్రోగ్రామ్లో భాగమైంది. దీనికోసం అయిదు ఖండాల నుంచి ఒక్కో నాటకాన్ని తీసుకున్నారు. ఆసియా నుంచి ఆ గౌరవం ఈ నాటకానికి దక్కింది. రచయిత.. అంజలి పార్వతి కోడా! ఆమె తన పద్దెనిమిదో ఏట ఆ నాటకాన్ని రాశారు. సాధారణంగా మనది సినిమాలే ప్రధానమైన సమాజం కాబట్టి నాటకాల గురించి, నాటక రచయితల గురించి అంతగా తెలియదు. అందుకే ప్లే రైట్, స్టాండప్ కమెడియన్, రైటర్, డైరెక్టర్, ‘సమాహార’ థియేటర్ కోఫౌండర్ అంజలి పార్వతి కోడాను పరిచయం చేస్తున్నాం. సందర్భం.. ఏప్రిల్ 16 తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సమాహార’ థియేటర్ గ్రూప్ నాటినుంచి నేటి వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్, రవీంద్రభారతిలో నాటకాలను ప్రదర్శించనుంది.అంజలి పుట్టి, పెరిగింది హైదరాబాద్లోనే! సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో మాస్ కమ్యూనికేషన్ చదివారు. వాళ్ల నాన్న మోహన్ కోడా (ఇప్పుడు లేరు) యాడ్ అండ్ ఫిల్మ్ మేకర్. ఆమె మీద తండ్రి ప్రభావం చాలా ఉంది. అంజలి చిన్నప్పుడు వాళ్ల కుటుంబం.. తమ కోసమే ఒక మ్యాగజీన్ నడిపేది. అందులో ఆమె కామిక్ స్ట్రిప్స్ రాసేవారు. తండ్రి పుస్తక పఠనాన్నిప్రోత్సహించేవారు. అందులో రోజుకో బుక్తో అంజలిది ట్రాక్ రికార్డ్. ఇంటర్ నుంచే ఆమె సీరియల్స్, టెలీఫిల్మ్స్కు పనిచేయడం మెదలుపెట్టారు. డిగ్రీకి వచ్చేసరికి ఒక వెబ్సైట్లో ఉద్యోగంలో చేరారు. సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేసేవారు. దాంతో ఆమెకు సినిమా మీద ఆసక్తి ఏర్పడింది.సమాహార... అంజలి ఒకసారి వాళ్ల నాన్నను ‘యాక్టర్స్ని ఎలా డైరెక్ట్ చేయాలో నేర్పించండి’ అని అడిగారు. ‘అది తెలుసుకోవాలంటే ముందు నువ్వు రంగస్థలం మీద పనిచేయాలి’ అని చె΄్పారాయన. అప్పుడే రత్న శేఖర్ రెడ్డి (అంజలి భర్త, సమాహార కోఫౌండర్) న్యూయార్క్లో థియేటర్, ఫిల్మ్ స్టడీస్ చేసి వచ్చారు. అతను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కొంతమంది కలిసి నాటకాలు వేస్తున్నారు. అందులో అంజలి కూడా జాయిన్ అయ్యారు. అప్పుడే అంజలి ఒక సోలో ప్లే రాసి రత్న శేఖర్కు ఇచ్చారు. దాంతోనే ‘సమాహార’ స్టార్ట్ అయ్యి.. కొనసాగుతోంది.స్టాండప్ కామెడీ.. సినిమా... అంజలి అమెరికన్ స్టాండప్ కామెడీ షోస్ను బాగా ఫాలో అయ్యేవారు. హాస్య నాటకాలు ఎక్కువగా రాసేవారు. 2013ప్రాంతంలో ‘సమాహార కామెడీ నైట్స్’ని స్టార్ట్ చేశారు. అందులో నాలుగైదు నాటికలు ప్రదర్శించేవారు. నాటకానికి నాటకానికి మధ్య అంజలి కామెడీగా ఒక స్టోరీ చెబుతూ ఆ నాటకాలను పరిచయం చేసేవారు. అలా ఆమె స్టాండప్ కమేడియన్గానూ మారారు. సినిమా డైరెక్షన్ అంటే అంజలికి చాలా ఇష్టం. నాటక రంగానికి వచ్చిందే సినిమా డైరెక్షన్ కోసం. అందుకే సినిమా వైపు అడుగులు వేశారు. ఎక్స్పరిమెంట్స్ జరగాలి..‘ఎన్నో నాటకాలు, నలభై యాభై యాడ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ చేసుంటాను. కార్పొరేట్ నాటకాలు కూడా రాస్తుంటాను. ఈ మొత్తంలో నాకు అర్థమైంది మన లిటరేచర్ అప్డేట్ కావాలని. జెన్ జీకి సరిపోయే కంటెంట్ రావాలి. థియేటర్లో అయితే ఇప్పటికీ 60, 70ల్లో రాసిన నాటకాలనే వేçస్తున్నాం. సినిమా విషయానికి వస్తే తమిళంలోనో.. మలయాళంలోనో వస్తే దాన్ని అప్రిషియేట్ చేసి, ఆ రైట్స్ కొనుక్కుని ఇక్కడ రిలీజ్ చేసుకుంటాం. కానీ తెలుగులో ఆలా రాస్తే మాత్రం ఇష్టపడరు. సినిమా రంగంలో మహిళల అవకాశాల గురించి మాట్లాడాల్సి వస్తే.. మగవాళ్ల కన్నా రెండింతలు కష్టపడితే కానీ గుర్తింపు రాదు. అదీగాక ఇది అనార్గనైజ్డ్ సెక్టార్. సేఫ్టీ, ఇమేజ్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి నేనొక అబ్బాయిలా బిహేవ్ చేశాను. వర్కవుట్ అవలేదు. ఒకటి మాత్రం గ్రహించాను.. సబ్జెక్ట్, మేకింగ్ మీద క్లారిటీ ఉంటే అమ్మాౖయెనా.. అబ్బాౖయెనా రెస్పెక్ట్ ఇస్తారు. సో నాకు ఆ క్లారిటీ ఉంది. కాబట్టి నా ఐడెంటిటీతోనే చాన్సెస్ తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. టాలెంట్కు బోలెడంత స్కోప్ ఉంది. యంగ్స్టర్స్ రావాలి. ఎక్స్పరిమెంట్స్ జరగాలి. ఏ క్రియేటివ్ మీడియ్లోకైనా అన్ని క్రాఫ్ట్స్లో అమ్మాయిల ప్రవాహం ఉండాలి. యు కాంట్ అలో మెన్ టు రైట్ ఫర్ విమెన్.. అబౌట్ విమెన్.. హౌ విమెన్ షుడ్ బీ!’– అంజలి పార్వతి కోడా

ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువుకి చెక్పెట్టడం ఓ సవాలు. ఎంతోమంది సెలబ్రెటీలు దీన్ని ఛాలెంజింగ్ తీసుకుని బరువు తగ్గి చూపించారు. అయితే అది అందరికీ సాధ్యం కాలేదు. కేవలం తగ్గాలన్న లక్ష్యంతో, కృతనిశ్చయంతో ఉన్నవారికే సాధ్యమైంది. అమ్మబాబోయ్ అనుకుని చేతులెత్తేయకుండా పట్టుపట్టి..ఆరోగ్యం కావాలనుకునే వారికే సుసాధ్యమైంది. ఇప్పుడు తాజాగా ఆ కోవలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్ట్ శోభా డే కుమార్తె ఆనందితా చేరారు. ఆమె కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే బరువు తగ్గేందుకు దారితీసిందని చెబుతున్నారు. ఇప్పుడామె ఎంత స్లిమ్గా మారారంటే..చూసేవాళ్లకే అసూయ కలిగేంతగా తగ్గిపోయారు. ఎందుకంటే జస్ట్ ఏడు నెలల్లోనే 40 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారామె. మరీ ఆమెకు అదెలా సాధ్యమైందో తెలుసుకుందామా..!.గత ఆగస్టు 23, 2024 వరకు అధిక బరువుతో ఉండేది. అప్పటి నుంచి తన వెల్నెస్ జర్నీ ప్రారంభించానని తన ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చారు ఫ్రీలాన్స్ రచయిత ఆనందిత. ఆ పోస్ట్లో '40 కిలోల తగ్గుదల' అనే శీర్షికతో తన వెయిట్లాస్ జర్నీ గురించి రాసుకొచ్చారామె. అసలు నమ్మలేకపోతున్నా.. ఇంతలా బరువు తగ్గానా..? అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తాను ఏవిధంగా బరువు తగ్గిందో వివరించింది. ముందుగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు గురించి తెలిపారామె. తన అధిక బరువు కారణంతో కనీసం కొద్ది దూరం నడిచేటప్పటికే ఆయాసం వచ్చేసిందని, కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని అంటూ మాట్లాడారామె. శరరీంలో చెడు కొలస్ట్రాల్ లెవెల్స్ ఏ స్థాయిలో పెరిగాయంటే ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కేటప్పటికే గుండెపోటు వచ్చేస్తుందేమోన్న భయం కలిగిందట. అలాగే చర్మం రంగు మారిపోయి తన ఆకృతే ఒకలా అయిపోందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు స్లీప్ ఆప్నియా, నిద్రలేమి, నిరంతర దగ్గు, డయాబెటిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేదాన్ని అన్నారు. ఇక ఇలాగైతే ఎన్నోనాళ్లు ఉండనన్న ఫీల్ కలిగి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టానన్నారామె. ముఖ్యంగా షుగర్ లేని ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక తగిన వ్యాయామం చేయడం వంటివి చేసినట్లు తెలిపారు. ఈ విధానంతో బరువు తగ్గడమే కాకుండా సులభంగా మెట్లు ఎక్కేయగలనని, పైగా మెట్లు లేని హోటల్లో స్టే చేయగలనని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు ఆనందిత బరువు తగ్గడం అంటే శరీరాకృతి మారడంగా భావించొద్దు అది మన వెల్నెస్ ప్రయాణంగా భావిస్తేనే..బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగానూ ఉంటామని చెబుతోంది ఆనందిత. View this post on Instagram A post shared by Anandita De (@ananditade) (చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?)
ఫొటోలు
అంతర్జాతీయం

టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్.

భారత సంతతి వైద్యురాలు ముంతాజ్ పటేల్కి అరుదైన గౌరవం
లండన్: ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్(ఆర్సీపీ) 124వ ప్రెసిడెంట్గా భారత సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు. యూకే వైద్య నిపుణుల సంఘంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులుగా పేరున్న 40 వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు.ఇక, ఇంగ్లండ్లోని లంకాషైర్లో డాక్టర్ పటేల్ జన్మించారు. ఈమె తల్లిదండ్రులు భారత్కు చెందిన వారు. మాంచెస్టర్లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా డాక్టర్ ముంతాజ్ పనిచేస్తున్నారు. ఆర్సీపీకు మొట్టమొదటి ఇండో–ఆసియన్ ముస్లిం ప్రెసిడెంట్గా ఆమె చరిత్ర సృష్టించారు. 16వ శతాబ్దంలో ఆర్సీపీ ఏర్పాటయ్యాక ఐదో మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ పటేల్ నిలిచారు. సోమవారం ముగిసిన ఎన్నికలో డాక్టర్ ముంతాజ్ గెలుపొందారు. నాలుగేళ్ల పదవీకాలం ప్రారంభం ఖరారు కావాల్సి ఉంది. ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్(ఎడ్యుకేషన్–ట్రెయినింగ్)గా, తాత్కాలిక ప్రెసిడెంట్గా 2024 జూన్ నుంచి కొనసాగుతున్నారు. ఆర్సీపీ ప్రెసిడెంట్గా కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలుగా ఉంటారు.

భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ప్రాణి ఏదైనా పిల్లల పట్ల చూపించే ప్రేమ, తీసుకునే జాగ్రత్తలు ఒకేతీరుగా ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ ఈ ఘటన. సోమవారం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఒక్కసారిగా కదలికలను గమనించిన శాన్డియాగో జంతు ప్రదర్శనశాలలోని ఏనుగులు అప్రమత్తమయ్యాయి. జూ సఫారీ పార్కులో ఉన్న ఆఫ్రికన్ ఏనుగుల గుంపు ఒకేచోట చేరింది. తమ పిల్లలను రక్షించుకోవడానికి వలయం ఏర్పాటు చేసింది. మధ్యలో పిల్లలను ఉంచిన ఏనుగులు ఏ పక్క నుంచి ఏ ముప్పు ఉందోనని చుట్టుపక్కల పరిశీలించడం మొదలుపెట్టాయి. చెవులు చాచి, కళ్లు పరిసరాలను పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్టుగా నిలబడి ఉన్నాయి. గుంపులో ఉన్న మగ ఏనుగు పిల్ల కూడా రక్షణ వలయంలోకి వచ్చి నిలబడింది. దానికి తల్లి ఏనుగు తొండంసాయంతో నేనున్నా అనే భరోసాను సైతం ఇచ్చింది. భూమి కంపించడం ప్రారంభించిన క్షణాల్లోనే ఏనుగులు చర్యకు దిగాయి. ఎన్క్లోజర్లోని నిఘా కెమెరాలు ఈ దృశ్యాలను బంధించాయి. ‘అలర్ట్ సర్కిల్’అనిపిలిచే ఈ సహజ రక్షణ వలయం. బలహీనమైన సభ్యులు భయపడకుండా ఉండేందుకు ఏనుగులు ఈ విలక్షణమైన పవర్తనను కలిగి ఉంటాయి. ఇది వాటి తెలివితేటలకు, సామాజిక బంధానికి నిదర్శనమని జంతుప్రదర్శనశాల క్షీరదాల క్యూరేటర్ మిండీ ఆల్బ్రైట్ తెలిపారు. ఏనుగులు తమ పాదాల ద్వారా భూకంప కార్యకలాపాలను గ్రహించగలవని, ఆయా జంతువులకు ముందుగానే తెలిసిపోతుందని వెల్లడించారు. సుమారు గంట తర్వాత భూప్రకంపనలు రావడంతో ఆ గుంపు మరోసారి రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. ముప్పేమీ లేదని నిర్ణయించుకున్నాకే విశ్రాంతి తీసుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్

జర్మనీలో కిల్లర్ డాక్టర్
బెర్లిన్: తన వద్ద చికిత్స పొందుతున్న రోగులను కంటికి రెప్పలా సంరక్షించాల్సిన ఓ వైద్యుడు వారిని కిరాతకంగా హత్య చేశాడు. వైద్య వృత్తికే మచ్చ తెచ్చాడు. ఏకంగా 15 మంది రోగుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. హంతక డాక్టర్పై దర్యాప్తు కొనసాగుతోంది. 40 ఏళ్ల ఆ డాక్టర్ 2021 సెపె్టంబర్ నుంచి 2024 జూలై వరకు 15 హత్యలు చేశాడు. బాధితుల్లో 12 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వారి వయసు 25 నుంచి 94 ఏళ్ల దాకా ఉంది. చాలామంది వారి సొంత ఇళ్లల్లోనే హత్యకు గురయ్యారు. చికిత్స పేరిట రోగుల ఇళ్లకు చేరుకొని ప్రమాదకరమైన డ్రగ్స్ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో శ్వాస ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే రోగులు ప్రాణాలు విడిచారు. బాధితుల ఇళ్లకు నిప్పు పెట్టడం ద్వారా సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు కిల్లర్ డాక్టర్ ప్రయత్నించినట్లు తేలింది. తొలుత నలుగురి మృతిపై అనుమానం రాగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కానీ, డాక్టర్ చేతిలో 15 మంది హత్యకు గురైనట్లు వెల్లడయ్యింది. అయితే, అతడు ఈ హత్యలు ఎందుకు చేశాడన్నది తెలియరాలేదు. హంతకుడు తన నేరం ఒప్పుకోవడం లేదని సమాచారం. నిబంధనల ప్రకారం గోప్యత దృష్ట్యా అతడి పేరును ఇంకా బయటపెట్టలేదు. గత ఏడాది ఆగస్టు 6వ తేదీ నుంచి కస్టడీలో ఉన్నాడని, విచారణ కొనసాగుతోందని అధికారులు బుధవారం వెల్లడించారు. జర్మనీలో హత్య కేసుల్లో సాధారణంగా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.
జాతీయం

ఆధునిక టెక్నాలజీతో యమునా నది ప్రక్షాళన
న్యూఢిల్లీ: కాలుష్యమయంగా మారిన యమునా నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై ఆయన గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నది ప్రక్షాళన కోసం చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రక్షాళన క్రతువులో ఢిల్లీ ప్రజలను తప్పనిసరిగా భాగస్వా ములను చేయాలని ప్రధానమంత్రి సూచించారు. రియల్–టైమ్ డేటా, స్పేస్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతల సాయంతో నదిని పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలుష్యానికి తావులేకుండా యమునా నదిలో ఛాత్ పూజలు నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని అన్నారు. నది పట్ల మరింత గౌరవం పెంచేలా చూడాలన్నారు. పవిత్ర యుమునతో ప్రజల అనుబంధం మరింత పెరగాలని ఆకాంక్షించారు.

వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోం
న్యూఢిల్లీ: ఇప్పటికే వక్ఫ్ ఆస్తులుగా పరిగణనలో ఉన్న ఆస్తులను డీనోటిఫై చేయబోమని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మే 5వ తేదీదాకా సెంట్రల్ వక్ఫ్ బోర్డులు, మండళ్లలో నియామకాలు చేపట్టబోమని పేర్కొంది. అయితే వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామంటూ సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనపై మాత్రం కేంద్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం గురువారం సైతం కొనసాగించింది. ఈ సందర్భంగా వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏడు రోజుల్లోపు స్పందన తెలియజేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం కోర్టుకు తెలిపారు. చట్టంలోని సెక్షన్ 9, సెక్షన్ 14 ప్రకారం వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో ఎలాంటి నియామ కాలను కేసు తదుపరి విచారణ తేదీదాకా చేపట్ట బోమని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ‘వక్ఫ్ బై యూజర్’ విధానం ద్వారా వక్ఫ్ ఆస్తులుగా రిజిస్ట్రర్ అయిన, ధృవీకరించబడిన ఆస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ను డీనోటిఫై చేసి గందరగోళం చేయబోమని ఆయన మాటిచ్చారు. ‘‘ ఎంతో విస్తృతస్థాయి చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని చట్టంగా తీసుకొచ్చాక ప్రభుత్వ వాదన వినకుండానే ధర్మాసనం ఆ చట్టాన్ని నిలుపుదలచేయడం సహేతుకం అనిపించుకోదు. ప్రభుత్వంలో భాగమైన మేము పార్లమెంట్కు, ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధనపై తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి?’’ అని మెహతా ప్రశ్నించారు. దీనిపై సీజేఐ ఖన్నా స్పందించారు. ‘‘ 1995నాటి వక్ఫ్ చట్టం ప్రకారం గతంలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న వక్ఫ్ ఆస్తులను ఈ కేసుల తదుపరి విచారణదాకా డీనోటిఫై చేయకూడదు’’ అని కేంద్రాన్ని ఆదేశించారు. గతంలో వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన ఆస్తుల డీనోటిఫైకు వీలుకల్పించే నూతన చట్టంలోని సెక్షన్లను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులకు ప్రతిపాదిస్తామని బుధవారం కోర్టు వ్యాఖ్యానించడం తెల్సిందే.ప్రైవేట్ ఆస్తులనూ వశపర్చుకున్నారుసెక్షన్ల నిలుపుదల ప్రతిపాదనను తుషార్ మెహతా తప్పుబట్టారు. ‘‘ చట్టంలోని సుదీర్ఘ సెక్షన్లను జడ్జీలు హడావిడిగా, యథాలాపంగా చదివి ఉండొచ్చు. చట్టబద్ధ్దమైన సెక్షన్ను నిలుపుదలచేయడం నిజంగా అరుదైన విషయం. ఈ విషయంలో ఈ చట్టం పూర్వాపరాలను జడ్జీలు మరోసారి పరిశీలించాలని వేడుకుంటున్నా. అన్ని వర్గాల నుంచి వినతులను స్వీకరించాకే ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తెచ్చింది. వక్ఫ్ పేరిట ప్రైవేట్ ఆస్తులనూ తమ వశం చేసుకున్నారు. కొన్ని చోట్ల గ్రామాల్లోని భూములు మొత్తం వక్ఫ్ పేరిట నమోదై ఉన్నాయి. లెక్కలేనన్ని ప్లాట్లు వక్ఫ్ ఆక్రమణలో ఉన్నాయి’’ అని మెహతా వాదించారు. ‘‘ప్రభుత్వం నుంచి ప్రాథమికస్థాయి స్పందనను అనుమతించకుండానే చట్టంలోని నిబంధనలను నిలుపుదలచేయడమంటే ధర్మాసనం అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోందని అర్థమవుతోంది’’ అని మెహతా అసహనం వ్యక్తంచేశారు. ‘‘ మా వాదనలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లు, పాత శాసనాలను మీ ముందు ఉంచుతాం. మాకు ఒక వారం గడువు ఇవ్వండి. ఈలోపు ఏమీ జరిగిపోదుగా’’ అని మెహతా వ్యాఖ్యానించారు. ‘‘ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వకుండా వారం రోజులు ఆగినంత మాత్రాన ఆకాశం విరిగిపడదుగా’’ అని ఒక రాష్ట్రం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ మీరు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి యతాతథ స్థితిని మార్చకుండా ఉంటే చాలు’’ అని అన్నారు. వక్ఫ్ చట్టం అమలుకాకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే చట్టం మొత్తం పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదని కోర్టు స్పష్టంచేసింది. ‘‘ నూతన చట్టంలోని కొన్ని సెక్షన్లు సమతుల్యతతో ఉన్నాయి. అందుకే మొత్తం చట్టాన్ని నిలుపుల చేయడం అస్సలు కుదరదు. అలా చేయడం సహేతుకం కూడా కాదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున డీనోటిఫై లాంటి వాటి జోలికి పోవద్దు’’ అని ధర్మాసనం సూచించింది.ముగ్గురే వాదించాలి‘‘ఎన్నో పిటిషన్లు వచ్చినా ప్రస్తుతానికి మేం ఐదు పిటిషన్లనే స్వీకరిస్తాం. మీ అందరిలో కేవలం ముగ్గురు న్యాయవాదులనే అన్ని పిటిషన్ల తరఫున వాదించేందుకు అనుమతిస్తాం. ఏ ముగ్గురు వాదించాలో మీరే నిర్ణయించుకోండి’’ అని పలు పిటిషన్ల తరఫు లాయర్లకు సీజేఐ సూచించారు. ఏడు రోజుల తర్వాత కేంద్రప్రభుత్వం స్పందన తెలిపాక ఐదురోజుల్లోపు రీజాయిండర్లను సమర్పించేందుకు పిటిషన్లకు ధర్మాసనం గడువు ఇచ్చింది. మే ఐదో తేదీన ప్రాథమిక స్థాయి అభ్యంతరాలను ఆలకించాక తాత్కాలిక ఉత్తర్వులిస్తామని బెంచ్ తెలిపింది. 1995 వక్ఫ్ చట్టాన్ని, ఆ చట్టానికి 2013లో చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లనూ వేరుగా విచారిస్తామని కోర్టు పేర్కొంది. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, డీఎంకే, ఆకాఫ్ కర్ణాటక రాష్ట్ర బోర్డు మాజీ ఛైర్మన్ అన్వర్ బాషా, సమçస్త కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్గఢీ, మొహమ్మద్ జావేద్, ఢిల్లీ ఆప్ ఎంపీ అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ తదితరులు మొత్తంగా దాదాపు 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్చేస్తూ దాఖలు చేయడం తెల్సిందే.

రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఏదైనా గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. గొప్పగా బ్రతకొచ్చు.. నీ గొప్పను అవతలి వాడు చెప్పుకోవాలి.. అంతేకానీ మనకు అవకాశం దొరికింది కదాని లేనిపోని గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. ఓ వ్యక్తి గొప్పలకు పోయాడు. తాను ఓ కుక్కును పెంచుకుంటున్నాడు. అది సహజమే. కాకపోతే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు అంటూ గొప్పలకు పోయాడు. నిజంగానే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు ఉంటుందో లేదో తెలీదు కానీ, ఇక్కడ ఆ మనిషి నోరు జారిన ‘గొప్ప’ ఈడీ రైడ్స్ వరకూ వెళ్లింది.విషయంలోకి వెళితే.. తాను అత్యంత ఖరీదు అని చెప్పుకునే కుక్కను తీసుకుని గత ఫిబ్రవరిలో ఓ షోకు వెళ్లాడు సతీష్ అనే వ్యక్తి. అక్కడ తన కుక్క విలువ రూ. 50 కోట్లంటూ ఏవో గొప్పలు చెప్పుకున్నాడు. ఇదొక అరుదైన జాతి కుక్క అని, దీని విలువ లక్షరాల రూ. 50 కోట్లని బహిరంగంగా ప్రకటించాడు. ఇది ఆనోట ఈనోట మారి ఈడీ వరకూ వెళ్లింది. ఫిబ్రవరిలో ఏదో చెప్పుకున్నాడు.. కానీ ఈడీ ఓ కన్నేసి ఉంచింది. అతనికి రెండు నెలల తర్వాత సోదాల పేరుతో వెళ్లింది. కుక్కనే అంత పెట్టి కొన్నాడంటే ఇంక ఎంత ఉంటుందో అని ఈడీ లెక్కలు వేసుకుంది. అంతే అతనికి ఇంటికి గురువారం వెళ్లి సోదాలు చేపట్టింది.ఈ క్రమంలోనే అతనికి సంబంధించి అన్నీ ఆరాలు తీసింది. అతని బ్యాంకు అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పెద్ద మొత్తంలో ఏమీ లావాదేవీలను జరగలేదని విషయాన్ని గుర్తించింది. కుక్కను రూ. 50 కోట్లను పెట్టి కొనుగోలు చేసినట్లు అతను చెప్పిన కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేసింది. అయితే అతను లావాదేవీల్లో అంత పెద్ద మొత్తాన్ని ఈడీ గుర్తించలేదు. హవాలా రూట్ లో ఏమైనా చేశాడా.. అనే కోణాన్ని ఈడీ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది.

మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
షెగావ్: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలకు కొత్త చిక్కొచ్చిపడింది. ఆ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన వింత పరిస్థితి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.. అప్పుడు జుట్టు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడగా, ఇప్పుడు గోళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు.గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి బట్టతల కూడా వచ్చేసింది. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోయింది. జిల్లాలోని షెగావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా జుట్టు సమస్య కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, మరో సమస్యతో ఆ గ్రామాలు భయపడుతున్నాయి.ఇప్పుడు నాలుగు గ్రామాల్లోని ప్రజలు గోళ్లు రాలిపోవడం, ముడతలు పడటం వంటి కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తదుపరి పరీక్షల కోసం షెగావ్ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సమస్యకు కారణం సెలీనియం స్థాయిలు పెరగడమే కారణంగా భావిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.ఇక్కడి గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోవడం, గోళ్లు రాలిపోవడానికా కారణం.. వారు తింటున్న గోధుములకు సంబంధముందని కొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ గోధుమల్లో సెలీనియం అధిక మోతాదులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. గతంలో విపరీతంగా జుట్టు కోల్పోయిన వారిలో అనేక మంది ఇప్పుడు గోళ్ల సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఎన్ఆర్ఐ

హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
మహబూబాబాద్: ఇంటి అవసరాల కోసం అప్పు ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త పరువు పోయిందని భావించి భార్యను నిలదీశాడు. దీంతో తాము కలిసి ఉండాని నిర్ణయించుకుని లొంగదీసుకున్న వ్యక్తిని పథకం ప్రకారం భార్యాభర్తలు హత్యచేశారు. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నర్సంపేటలోని దుగ్గొండి సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సాయిరమణ.. ఎస్సై గోవర్ధన్తో కలిసి హత్య వివరా లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇంటి ని ర్మాణ పనులు చేపట్టారు. ఈక్రమంలో బానోత్ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజ యను కొమ్మాలు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషులను ఆశ్రయించగా కొమ్మాలుకు రూ.70 వేలు జరి మానా విధించారు. ఈ క్రమంలో కొమ్మాలు వ్యవహరశైలితో తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. కొమ్మాలును చంపాలని అనుకున్నాడు. కాగా, జంపయ్య తన భర్య విజయతో గొడవపడ్డాడు. కొమ్మాలును అయినా, నిన్ను అయినా చంపుతానని చెప్పాడు. దీంతో భయపడిన విజయ మనం కలిసే ఉందామని భర్తకు తెలిపింది. అనంతరం కొమ్మాలును హత్య చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొమ్మాలు ఫోన్ చేసిన ప్రతీసారి అతడితో మాట్లాడడానికి వెళ్లమని జంపయ్య తన భార్య విజయకు చెప్పాడు. దీంతో విజయ పూర్తిగా కొమ్మాలును నమ్మించింది. ఈ క్రమలో పథకం ప్రకారం ఈ నెల 12న విజయ.. కొమ్మాలుకు ఫోన్ చేసి మాట్లాడాలి మొక్కజొన్న చేనువద్దకు రావాలని కోరింది. అనంతరం దంపతులు పథకం ప్రకారం కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. జంపయ్య ఎవరికీ కనిపించకుండా మొక్కజొన్న చేనులో కొంతదూరంగా ఉన్నాడు. ఈ విషయం గమనించకుండా కొమ్మాలు మొక్కజొన్న చేనువద్దకు చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించి జంపయ్య వెనుకవైపు నుంచి కొ మ్మాలును కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం దంపతులిద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, హత్య కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై గోవర్ధన్, సిబ్బందిని సీఐ అభినందించారు.

డ్రైవర్గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
విశాఖపట్నం: ప్రైవేటు వీడియోలతో సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కారు డ్రైవర్ అప్పలరాజును ద్వారకా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేకూరి గిరీష్, భార్య పిల్లలతో కలిసి సీతమ్మధార ప్రాంతంలో నివాసముంటున్నారు. అతనికి అంగవైకల్యం కారణంగా పిల్లలను చూసుకోవడానికి, ఇంటి పనుల కోసం డ్రైవర్గా రామెళ్ల అప్పలరాజును పెట్టుకున్నాడు. అతడు నమ్మకంగా ఉండడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఒక రోజు గిరీష్ను హోటల్కు తీసుకెళ్లి అమ్మాయిని పరిచయం చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అప్పలరాజు మొబైల్లో చిత్రీకరించాడు. కొద్ది రోజుల తరువాత ఆ వీడియోలు సాయంతో గిరీష్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు రూ.లక్ష ఇవ్వాలని లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలోను, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో పరువు పోతుందని భావించిన గిరీష్ తన బంధువు సిబ్బంది ద్వారా ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి ఆరు యూపీఐ లావాదేవీల ద్వారా డ్రైవర్కు బదిలీ చేశారు. చాలా కాలంగా గిరీష్తో పాటు అతని కుటుంబ సభ్యులను డ్రైవర్ అప్పలరాజు వేధిస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు. ఐఫోన్16 ప్లస్ను కూడా కొనుగోలు చేయించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న గిరీష్ను అప్పలరాజు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.5 వేలు బలవంతంగా తీసుకున్నాడు. అలాగే గిరీష్ తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఫ్లాట్ను కూడా కాజేయడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా గిరీష్ వీడియోలు అతని భార్యకు పంపించి ఆమెను సైతం వేధింపులకు గురి చేశాడు. వీరి పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి అక్కడ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారును పార్క్ చేసేవాడు. డ్రైవర్ అప్పలరాజు వేధింపులను భరించలేక గిరీష్ చివరకు ద్వారకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పలరాజును అరెస్టు చేసి గురువారం రిమాండ్కు పంపించారు. అతడి నుంచి నకిలీ పిస్టల్తో పాటు కొంత మొత్తంలో నగదు, కారు, ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు.

బాండ్పేపర్పై సూసైడ్నోట్ రాసి..
సంగారెడ్డి జిల్లా: సమృద్ధి జీవన్ సంస్థలో ఏజెంట్గా చేసి, డిపాజిట్లు చేసిన వారికి తిరిగి చెల్లించేందుకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఓ ఎల్ఐసీ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్.ఐ కాశీనాథ్, మృతుడి భార్య తుల్జమ్మ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన వెంకన్న (48) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న గతంలో సమృద్ధి యోజన సంస్థలో ఏజెంట్గా చేశాడు. ఈ క్రమంలో ప్రజల నుంచి పెద్దమొత్తంలో బాండ్లు (డిపాజిట్లు) కట్టించాడు. సంస్థను అర్ధాంతరంగా ఎత్తివేయడంతో ప్రజల వద్ద నుంచి సేకరించిన డిపాజిట్ డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేశాడు. ఇందుకోసం భూమిని సైతం తాకట్టు పెట్టాడు. చేసిన అప్పుల బాధలు పెరిగిపోవడం, రుణంతీర్చే దారిలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న రాసిన సూసైడ్నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, వెంకన్న పెద్ద కుమార్తె పరమేశ్వరికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమారుడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రూ.100 బాండ్ పేపర్పై సూసైడ్ నోట్ఆత్మహత్యకు పాల్పడే ముందు వెంకన్న బాండ్ పేపర్పై సూసైడ్ నోట్ రాశాడు. ‘టి.వెంకన్న తండ్రి అంజన్న గ్రా: అల్గోల్ అను నేను. అప్పుల బాధ భరించలేకపోతున్నాను. సమృద్ధి జీవన్ ఫౌండేషన్లో ఏజెంట్గా చేశాను. కస్టమర్లకు మొత్తం డబ్బు నేనే చెల్లించాను. దానివల్ల అప్పులు ఎక్కువై.. ఇప్పుడు ఇతరులకు అప్పుకట్టలేక పోతున్నాను. అప్పుల బాధ భరించలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. అప్పు ఇచ్చినవారిని క్షమాపణలు కోరకుంటున్నాను. శివుని దయతో మీకందరికి లాభం జరుగుతుంది. ఓం నమఃశివాయ’ అని రాసిపెట్టిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
హైదరాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారానగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రం, బస్కంది గ్రామానికి చెందిన సుల్తానా బేగం(26) సిద్ధిఖీనగర్లో ఉంటూ గచ్చిబౌలిలోని అంతేరా హోటల్లో సర్వర్గా పని చేస్తోంది. వెస్ట్ బెంగాల్కు చెందిన సైదుల్లా షేక్ గచ్చిబౌలిలోని నావాబ్ హోటల్లో మేనేజర్గా పని చేస్తూనే పెస్ట్ కంట్రోల్ పని చేసేవాడు. సుల్తానా, సైదుల్లా షేక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుల్తానా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సుల్తానా సైదుల్లాపై ఒత్తిడి పెంచింది. బుధవారం సాయత్రం పెళ్లి విషయమై గొడవ జరిగింది. దీంతో పెళ్లికి నిరాకరించిన అతను ఆమె ఫోన్ను బ్లాక్లో పెట్టాడు. దీంతో సుల్తానా మరో యువతికి ఫోన్ చేసి షైదుల్లా ఉంటున్న ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె ఈ విషయాన్ని సైదుల్లాకు చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి లోనైన సుల్తానా గురువారం ఉదయం సైదుల్లా నివాసం ఉండే భవనంపైకి ఎక్కి 6వ అంతస్తు నుంచి దూకడంతో కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్కు తరలించగా ఉదయం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.