Top Stories
ప్రధాన వార్తలు

ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ‘‘ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. సీనియర్ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైఎస్ జగన్(YS Jagan) అన్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్టీవీడీసీ ఛైర్మన్గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: పోసాని అరెస్ట్.. అసలు జరిగింది ఇదే!

వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం- పొన్నవోలు సుధాకర్ రెడ్డి
పోసాని అరెస్ట్ అప్డేట్స్.. 👉ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి హైదరాబాద్లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుతంత్రంలో తాజా పర్వం. ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. గతంలో కుట్రపూరితంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి.అన్నమయ్య జిల్లా:మరికాసేపట్లో రైల్వే కోడూరు కోర్టుకు పోసాని కృష్ణమురళిని హాజరుపరచనున్న పోలీసులుపోసాని కృష్ణమురళి తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డికక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోసాని కృష్ణమురళి పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారుపోసాని కృష్ణమురళి పై 111 సెక్షన్ నమోదు చేయడం దుర్మార్గంఆర్గనైజ్డ్ క్రైం చేసిన వారిపై మాత్రమే 111 సెక్షన్ నమోదు చేయాలిఉన్నత న్యాయస్థానాలు చంద్రబాబు ప్రభుత్వానికి పదేపదే చివాట్లు పెట్టినా పద్ధతి మార్చుకోలేదువైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో పోస్టింగ్స్ పెట్టినా ఒక్క కేసు నమోదు చేయలేదురాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదువైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం- పొన్నవోలు సుధాకర్ రెడ్డి పీఎస్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులున్యాయవాదులను పీఎస్లోకి అనుమతించడం ేలేదుపోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు:న్యాయవాదులుహైకోర్టులో రిట్ పిటిషన్వేస్తాం: వైఎస్సార్సీపీ ప్రస్తుతం పోసాని ఆరోగ్యంగానే ఉన్నారు: డాక్టర్ గురుమహేష్బీపీ, షుగర్ అన్నీ నార్మల్గానే ఉన్నాయిగతంలో పోసాని గుండె నొప్కికి ట్రీట్మెంట్ తీసుకున్నారుపోలీసుల విచారణకు పోసాని సహకరిస్తున్నారుపోసాని స్ట్రెస్ ఫీలయితే ఇబ్బందులు ఎదురవుతాయి ఓబులవారిపల్లి పీఎస్కు పోసాని..ఎట్టకేలకు పోసానిని ఓబులవారిపల్లి పీఎస్కు పోసాని పోలీసులు తీసుకువచ్చారు.ఈ సందర్బంగా ఓబులవారిపల్లి పీఎస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పీఎస్లోనే పోసానికి వైద్య పరీక్షలు చేసే అవకాశం.వైద్య పరిక్షల అనంతరం పోసానిని అనంతపురం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. 👉పోసాని అరెస్ట్ విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడారు. అరెస్ట్ నోటీసుల్లో 27వ తేదీ(ఈరోజు తేదీ) వేశారు పోలీసులు. పోసాని కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్ట్ సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్గా పోలీసులు పేర్కొన్నారు. కానీ, పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్లో ఓబులాపల్లి పీఎస్ అంటూ చెప్పుకొచ్చారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోసాని ఎక్కడ?పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.బుధవారం రాత్రి 8:25 గంటలకు పోసాని అరెస్ట్.13 గంటలుగా పోలీసుల అదుపులోనే పోసాని.ఇప్పటికీ పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై కచ్చితమైన సమాచారం ఇవ్వని పోలీసులు.పోసానిని రాజంపేట పీఎస్కు తరలిస్తారని సమాచారం.పోసాని ఆరోగ్య పరిస్థితిపై భార్య, కుమారుడు ఆందోళన.ఆయన తరఫు న్యాయవాదులకు సమాచారం ఇవ్వని పోలీసులు.వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లోని ఏ పీఎస్కు తీసుకెళ్తారనే దానిపై రాని స్పష్టత. పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్ట్తో బట్టబయలైన పోలీసుల కుట్ర బుధవారం రాత్రి పోసానిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ.. అతని కుటుంబ సభ్యులకి ఇచ్చిన నోటీసుల్లో మాత్రం గురువారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు ఇది నిబంధనల్ని ఉల్లఘించడం కాదా చంద్రబాబూ? ఇలాంటి పోలీసుల్ని ఏం చేయాలి?… pic.twitter.com/iFcfOCBNU7— YSR Congress Party (@YSRCParty) February 27, 2025👉అన్నమయ్య జిల్లా..పోసానితో ఫోన్లో మాట్లాడిన హైకోర్టు న్యాయవాది బాలన్యాయవాది బాల కామెంట్స్..సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్టు చేయడం చట్ట విరుద్ధంనోటీసులు ముందుగా ఇవ్వకుండా, వయసు రీత్యా ఇబ్బందులు పోలీసులు ఇబ్బందులు పెట్టారుబెయిల్ పిటిషన్, రిజెక్షన్ ఆఫ్ అరెస్టు పిటిషన్ను రైల్వే కోడూరు కోర్టులో దాఖలు చేస్తున్నాంకాసేపట్లో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చే అవకాశం ఉంది.అనంతరం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా..పోసాని అరెస్టును ఖండించిన తిరువూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామి దాస్స్వామి దాస్ కామెంట్స్..రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేయటం కక్షపూరిత చర్యలే అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసులు రాత్రి వేళ తరలించడం అన్యాయంకూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో భవిష్యత్తులో అదే గతి వారికీ పడుతుంది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అన్యాయంబేషరతుగా పోసానిని విడుదల చేయాలి కృష్ణాజిల్లా..పోసాని అక్రమ అరెస్ట్ను ఖండించిన మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ పేర్ని కిట్టుపేర్ని కిట్టు కామెంట్స్..ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోంది ఇలాంటి ఘటనలు ఇంతకుముందెన్నడూ ఎక్కడా జరగలేదుసోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేస్తున్నారుమరి మీరు పెట్టిన పోస్టుల సంగతేంటి?.ఇప్పుడు జరుగుతున్న అరెస్టులకు పర్యవసానం కచ్చితంగా అనుభవిస్తారురూల్స్ దాటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులను గుర్తు పెట్టుకుంటాం కర్నూలు జిల్లా..ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..రాష్ట్రంలో అరాచక పాలన తప్ప ప్రజాపరిపాలన లేదురోజుకు ఒకరిని అక్రమ అరెస్ట్ చేస్తున్నారుపోసానిని అరెస్ట్ చెయ్యడం అక్రమంఏ కేసులో ఆయనను అరెస్ట్ చేస్తూన్నారో కుటుంబ సభ్యులకు తెలియ చెయ్యాలి కాని ఏమాత్రం చెప్పడం లేదు.చంద్రబాబు.. రానున్న కాలంలో మీకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిక.విశాఖ..పోసాని అరెస్ట్పై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫైర్..పవన్, లోకేష్ ఇద్దరి దగ్గర రెడ్ బుక్స్ ఉన్నాయి..ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టులేక అక్రమ కేసులు పెడుతున్నారు..పోసాని అరెస్ట్ పవన్ కళ్యాణ్ ఆలోచనే..ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తగిన గుణపాఠం చెప్తారు..భవిష్యత్ లో ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి..ప్రభుత్వం కేసులు పెడితే.. ఎదురించి నిలబడతాం..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు? ఓబులవారిపల్లి పీఎస్లో పోసానిపై కేసు నమోదు..ఓబులవారిపల్లి పీఎస్లో పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదుజనసేన నాయకుడు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుజనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు నేపథ్యంలో అరెస్టుచెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జోగినేని మణిపవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుహైదరాబాద్లోని తన స్వగృహంలో నిన్న రాత్రి పోసాని అరెస్టురాజంపేట కోర్టులో ప్రవేశపెడతామని తెలిపిన పోలీసులువ్యవస్థీకృత నేరమంటూ ఆఘమేఘాలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు24వ తేదీన ఫిర్యాదు చేస్తే పూర్తి విచారణ జరగకుండానే నిన్న రాత్రి అరెస్టుతన ఆరోగ్యం బాగా లేదని, చికిత్స అనంతరం వస్తానని పోసాని కోరినా వినని పోలీసులు 111, ఇతర సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.శివరాత్రి పూట రెడ్ బుక్ రాజ్యాంగంలో రెచ్చిపోతున్న @ncbn ప్రభుత్వం. రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా అక్రమ అరెస్టులుపోసాని కృష్ణమురళిని హైదారాబాద్ లోని ఆయన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పటికే రాజయికీయాలకి దూరంగా ఉన్న పోసాని.. ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి… pic.twitter.com/ZnjBhYmwvJ— YSR Congress Party (@YSRCParty) February 26, 2025

రాజమౌళిపై సంచలన ఆరోపణలు.. ఆమె కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు: శ్రీనివాస్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్పై ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి తనను భరించలేనంతగా టార్చర్ చేస్తున్నాడని ఒక సెల్ఫీ వీడియోను సోషల్మీడియాలో షేర్ చేశారు. తమ మధ్య 34 ఏళ్ల స్నేహ బంధం ఉందని ఆయన చెప్పారు. కానీ, రాజమౌళి చేస్తున్న టార్చర్ వల్ల తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.'భారతదేశంలోనే టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. నేను పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎమ్ ఎమ్ కీరవాణి, గుణ్ణం గంగరాజు, చంద్ర శేఖర్ యేలేటి, హను రాఘవపూడి, మైత్రీ మూవీస్ చెర్రీ ఇలా చాలామందితో కలిసి నేను పనిచేశాను. వీళ్లందరికీ కూడా రాజమౌళితో నా స్నేహం గురించి తెలుసు. 1990 నుంచి మేమిద్దరం స్నేహితులం. రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నాం. కానీ, ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించుకోలేదు. అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్లోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం.. ఆ తర్వాత నాతో కూడా స్నేహం. 'ఆర్య2' సినిమా మాదిరే మా జీవితాల్లోకి ఒక మహిళఆర్య2 సినిమా కథ మాదిరే మా స్టోరీ ఉంటుంది. మేము ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దాం అంటూ నేనే రాజమౌళిని అడిగాను. ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళినే నన్ను కోరాడు. దానికి నేను ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. అప్పుడు ఆమెను నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నలుగురం కలిసే ఉందామని కోరాను. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు. కాలం అన్నీ మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు. ఈ విషయం నుంచి తప్పుకోవాలని నన్ను కోరడంతో అందుకు ఓకే చెప్పాను. ఇదంతా జరిగింది మా కెరీర్ ప్రారంభం శాంతినివాసం సీరియల్ సమయంలో జరిగింది. అప్పుడు మా అందరి పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి నేను సైలెంట్గా ఉండిపోయాను. కొద్దిరోజుల పాటు నాతో రాజమోళి బాగానే ఉన్నాడు. అయితే, స్టార్ డైరెక్టర్గా రాజమౌళికి ఎప్పుడైతే స్టార్డమ్ వచ్చిందో గొడవలు మొదలుపెట్టాడు. వాడి కోసం నా 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నాను. మన ట్రైయాంగిల్ స్టోరీని ఒక సినిమా తీస్తానని వాడితో ఒకరోజు అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. వాడి పిల్లలను కూడా నేను దగ్గరుండే పెంచాను. నంబర్ వన్ డైరెక్టర్ కావడంతో నన్ను అడ్డుతొలిగించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 54 ఏళ్లు .. పెళ్లి కూడా చేసుకోలేదు. సింగిల్గానే ఉంటున్నాను. వాడి వల్ల నా జీవితం నాశనం అయింది. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. వాడిని నేను ఏ విషయంలోను డిస్ట్రబ్ చేయలేదు. కానీ, ఈ రహస్యాలన్నీ అందరికీ చెప్పాననుకొని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇదంతా మా ముగ్గురి మధ్య జరిగింది. నేను చనిపోతున్నాను. ఆ తర్వాత అయినా సరే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. అసలు విషయం తెలుస్తుంది. ఇవన్నీ నా మరణ వాగ్మూలంగా తీసుకోవాలని కోరుతున్నాను.' అంటూ వీడియోలో శ్రీనివాసరావు చెప్పాడు. అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. కేవలం అతను చెబుతున్న ప్రకారం మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో గురించి దర్శకులు రాజమౌళి రెస్పాండ్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, యమదొంగ సినిమా టైటిల్ కార్డ్లో తన పేరు కూడా ఉంటుందని శ్రీనివాసరావు చెప్పడం గమనార్హం . వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు. సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా… pic.twitter.com/VKQT3AlfY3— ChotaNews App (@ChotaNewsApp) February 27, 2025

ఓటుకు 3000.. పిఠాపురంలో ప్రలోభాల పర్వం!
సాక్షి, పిఠాపురం: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు 2000-3000 ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.కాకినాడ నియోజకవర్గంలో కూటమి నేతలు రెచ్చిపోయి ఓటుకు నోటుకు పాల్పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేస్తే 3000 అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాగే, మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు 3000 రూపాయలను ఓట్లరకు పంచుతున్నారు. ఓట్లరకు డబ్బు పంపిణీ చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కృష్ణా జిల్లాలో సైతం ఇలాగే జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ఓట్లరను ప్రలోభాలు గురిచేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే టీడీపీ నేతల బరితెగిస్తున్నారు. ఓట్లుకు 2000 అంటూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బులు ఇచ్చారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ నగదును ఓటర్లు అందిస్తున్నారు.విశాఖలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈసీ ఆంక్షలు లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలలో నాయకులతో కలిసి హడావిడి చేస్తున్నారు. చంద్రపాలెం స్కూల్లోకి నేరుగా వాహనంతో వెళ్లిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కానీ, అధికారులు మాత్రం ఆయనకు అడ్డుచెప్పకపోవడం గమనార్హం.ఎన్టీఆర్ జిల్లాలో ఇలా..ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గుంటూర్ ఆక్స్ ఫర్డ్ స్కూల్ యాజమాన్యం. జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యం. 144 సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోని వైనం. ఓటు వేయకుండా ఉపాధ్యాయులను నిర్బంధించిన యాజమాన్యం. ఇదేమిటని ప్రశ్నించిన మీడియాకు పొంతలేని సమాధానం చెప్పిన సిబ్బంది. పుట్టినరోజు వేడుకలు కోసమే ఉపాధ్యాయులను పిలిచినట్లు సమాధానం. చివరకు మీడియా అక్కడికి చేరుకోవడంతో ఉపాధ్యాయులను వదిలిపెట్టారు.

Ind vs NZ: కివీస్తో మ్యాచ్లో ఓపెనర్గా అతడు.. పంత్కి ఛాన్స్!
న్యూజిలాండ్(India vs New Zealand)తో వన్డే నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీ మారవచ్చని.. అదే విధంగా.. కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో దక్కవచ్చని అంచనా వేశాడు. అయితే, తాను మాత్రం ఇలాంటి మార్పులు వద్దనే సూచిస్తానని పేర్కొన్నాడు.సెమీస్లో భారత్, కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్ను ఓడించిన రోహిత్ సేన.. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కూడా జయభేరి మోగించింది. మరోవైపు.. న్యూజిలాండ్ కూడా ఈ రెండు జట్లపై గెలిచి భారత్తో పాటు సెమీస్ చేరింది.రోహిత్ శర్మ దూరం?ఈ క్రమంలో లీగ్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్లో భారత్- కివీస్ ఆదివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు సెమీస్కు సన్నాహకంగా మారనుంది. ఇందులో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని భారత్- న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పాక్తో మ్యాచ్ సందర్భంగా పిక్కల్లో నొప్పితో బాధపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం.అదే విధంగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా మార్పులు చేయబోతోందా? రోహిత్ శర్మ ఇందులో ఆడకపోవచ్చు. మహ్మద్ షమీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు అవకాశంకేఎల్ రాహుల్ ఓపెనర్గా రాబోతున్నాడు. రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు ఈసారి తుదిజట్టులో చోటు దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇలా జరగొచ్చు. లేదంటే జరగకపోవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం భారత్ గత రెండు మ్యాచ్లలో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి.గెలుపు మనకు ఓ అలవాటుగా మారినప్పుడు.. అదే జట్టును కొనసాగిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి. చాంపియన్స్ ట్రోఫీలో జడ్డూ గత మ్యాచ్లలో పెద్దగా వికెట్లు తీయలేదు. అయినా సరే అతడిని కొనసాగించాల్సిందే. జడ్డూను కాదని వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చే ఆలోచన కూడా యాజమాన్యానికి ఉండి ఉండవచ్చు.జడ్డూనే ఆడించాలిలేదా.. కివీస్ జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఎక్కువ కాబట్టి వాషింగ్టన్ సుందర్ను ఆడించే యోచనలో ఉండొచ్చు. కానీ జడ్డూనే ఆడించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే.. అతడు తదుపరి సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో విశ్రాంతి పేరిట పక్కనపెట్టకూడదు’’ అని అభిప్రాయపడ్డాడు.ఒకవేళ తుదిజట్టులో మార్పు చేయాలని భావిస్తే షమీని తప్పించి అర్ష్దీప్ను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో తొమ్మిది ఓవర్ల కోటా వేసిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 37 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఏడు ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చిన జడ్డూ ఒక వికెట్ తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్కు మాత్రం తుదిజట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు. అయితే, కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరంగా ఉంటే మాత్రం.. రాహుల్ ఓపెనర్గా వస్తే.. పంత్కు చోటు దక్కవచ్చు.బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్లలో ఆడిన భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్

‘‘అయ్యా ట్రంప్.. ఇలాంటి బతుకులెందుకు?’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. తాజా ‘ట్రంప్ గాజా’ అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహాజనితమైన గాజా.. వాస్తవాలను ఏమాత్రం దాచిపెట్టలేదని.. అక్కడి ప్రజలు కోరుకునేది అలాంటి బ్రతుకులు కానేకాదని పలువురు మండిపడుతున్నారు.ఆకాశన్నంటే భవనాలు, లగ్జరీ ఓడలు, రాత్రిపూట బంగారు వర్ణంలో మెరిసి పోయే గాజా, నియంతృత్వ ధోరణిని ప్రతిబింబించేలా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బంగారు విగ్రహాలు, మధ్యలో ఏదో తింటూ కనిపించే ఇలాన్ మస్క్, డబ్బులు వెదజల్లే పిల్లలు, అటు పబ్లో డ్యాన్సర్లతో.. ఇటుపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహూతో ట్రంప్ చొక్కాల్లేకుండా సేదతీరుతున్న దృశ్యాలను.. వెరసి విలాసవంతమైన ప్రాంతంగా ఉన్న గాజా వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో షేర్ చేశారు.Holy Shlit. President Trump just posted Trump Gaza on his Truth Social account. 🤣🤣🤣 pic.twitter.com/o44mmbtyk8— Based DK (@Back_2TheMiddle) February 26, 2025అయితే ట్రంప్ గాజా పేరుతో విడుదలైన ఆ ఏఐ జనరేటెడ్(AI Generated Video) వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గాజా ప్రజలను ప్రతిబింబించేలా ఎంతమాత్రం లేదని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసీమ్ నయీమ్ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ట్రంప్ మరోసారి గాజా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. గాజా ప్రజలు కోరుకుంటోంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్మిర్మాణం. అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని. అంతేగానీ బంధీఖానాల్లో ఉండాలని కాదు. మేం పోరాడేది బంధీఖానాల్లో పరిస్థితులు మెరుగుపడాలని కాదు. అసలు జైలు, జైలర్ లేకుండా చూడాలని’’ అని నయీమ్ అంటున్నారు.మరోవైపు ఈ వీడియోలో మస్క్, నెతన్యాహూ ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్ పక్కనపెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 👉2023 అక్టోబర్ 07వ తేదీన హమాస్(Hamas) సంస్థను ఇజ్రాయెల్పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1,200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా.. ఇందులో పిల్లల సంఖ్యే అధికంగా ఉంది. మరోవైపు.. ఈ యుద్ధ వాతావరణంతో 90 శాతం గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా.. ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం.👉ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పలు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బంధీలను హమాస్.. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తైతే హమాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. 👉మరోవైపు.. గాజా పునర్మిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి(వెలేసి).. గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారాయన. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్ధతు ప్రకటించగా.. అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: సారీ.. ఆయన కింద పని చేయలేం!

కెరీర్లో పీక్లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!
బాలీవుడ్ హీరో గోవింద -సునీత దంపతుల విడాకుల పుకార్లు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టారన్నవార్తల్లో వాస్తవం లేదంటూ నటుడు ఈ ఊహగానాలను కొట్టిపడేశారు. అయితే, గోవిందతోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా మంది గ్లామర్ ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని మీకు తెలుసా? స్టాండ్-అప్ కమెడియన్ కృష్ణ అభిషేక్ , టీవీ టెలివిజన్ నటి రాగిణి ఖన్నా చాలామంది నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా టెలివిజన్లో తన తొలి సీరియల్తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నటి సౌమ్య సేథ్ గోవిందాకు మేనకోడలు. ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నప్పటికీ, ఏ అభిమాని ఆమెను మరచిపోలేరు. వైవాహిక జీవితంలోకి అడుగపెట్టాక అంతులేని కష్టాలు మొదలయ్యాయి. భరించలేని గృహహింస, విడాకులు ఇన్ని కష్టాల మధ్య తనను తాను నిలబెట్టుకుని రాణిస్తోంది? అయితే ఎందుకు గ్లామర్ ప్రపంచానికి దూరమైంది? సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.సౌమ్య సేథ్ 1989 అక్టోబర్ 17న బనారస్లో జన్మించింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ పొందింది. గోవింద మేనకోడలిగా సినీ ఇండస్ట్రీలో పరిచయాలు పెరిగాయి. భాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంలో ఆమె ఒక అతిధి పాత్రలో నటించింది. ఆ తరువాత 2011లో ‘నవ్య… నయే ధడ్కన్ నయే సవాల్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్ను ప్రారంభించి, నవ్య పేరుతో పాపులర్ అయింది. మహిళా విభాగంలో ఆమె బిగ్ టెలివిజన్ అవార్డులను అందుకుంది. ఆమె తరువాత దిల్ కీ నజర్ సే ఖూబ్సూరత్ అనే షోలో టైటిల్ రోల్లో నటించింది. 2013లో MTV వెబ్బెడ్ను కూడా నిర్వహించింది, తరువాత చక్రవర్తి అశోక సామ్రాట్ అనే షోలో 'కరువాకి' పాత్రను పోషించింది. ఇలా కెరీర్లో పీక్లో ఉండగానే2017లో అమెరికాకు చెందిన నటుడు అరుణ్ కపూర్ను వెస్టిన్ ఫోర్ట్ లాడర్డేల్ బీచ్ రిసార్ట్లో వివాహం చేసుకుంది తరువాత అమెరికాలో స్థిరపడింది. వీరికి ఒక కొడుకు ఐడెన్ పుట్టాడు.ఇదీ చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?“నేను అద్దం ముందు నిలబడినపుడు నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. ఒళ్లంతా గాయాలు.క డుపుతో ఉన్నా కూడా చాలా రోజులు తినలేదు. అసలు కొన్ని రోజులు అద్దం వైపు చూసే ధైర్యం చేయలేకపోయాను. ఒక దశలో చచ్చిపోదామనుకున్నా. కానీ నేను చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి? తల్లి లేకుండా ఎలా బతుకుతుంది? నేను నన్ను నేను చంపుకోగలను కానీ.. బిడ్డ ఎలా? ఈ ఆలోచనే నాకొడుకు ఐడెన్, నా ప్రాణాన్ని కాపాడింది." అని తెలిపింది. చివరికి పెళ్లైన రెండేళ్లకు 2019లో విడాకులు తీసుకుని ఆ కష్టాల నుంచి బైటపడింది. మరోవైపు ఈ కష్టకాలంలో సౌమ్య సేథ్కు తల్లిదండ్రులు వర్జీనియాకు వెళ్లి అండగా నిలిచారు. అలా 2023లో, సౌమ్య ప్రేమకు మరో అవకాశం ఇచ్చి ఆర్కిటెక్ట్ , డిజైనర్ శుభం చుహాడియాను వివాహం చేసుకుంది. తరువాత 33 ఏళ్ల వయసులో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. వర్జీనియాలో లైసెన్స్ పొందిన రియల్టర్గా రాణిస్తోంది. తన తండ్రి, తాత వ్యాపార దక్షతను చూసి తాను కూడా వ్యాపారవేత్త కావాలనే కలలు కనేదాన్నని, చివరికి తన కల నెరవేరిందని ఒక సోషల్మీడియా పోస్ట్ ద్వారా చెప్పింది సౌమ్య.సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ ఆమె ధైర్యానికి, దృఢత్వానికి చక్కటి నిదర్శనం. కెరీర్ కోల్పోయినా, జీవితంలో ఎన్ని కష్టాలొచ్చిన తలొగ్గక, తనను తాను ఉన్నతంగా నిలబెట్టుకుంది.తద్వారా లక్షలాది మందికి ప్రేరణగానిలిచింది.

SLBC లోపలి దృశ్యాలు: సౌండ్లు చేస్తూ ముందుకు..
నాగర్ కర్నూల్, సాక్షి: SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన.. కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. ‘‘ఎవరైనా ఉన్నారా?’’ అంటూ శబ్ధాలు చేస్తూ కార్మికుల జాడ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ నెల 22వ తేదీన ప్రమాదం జరిగింది. టన్నెల్ బోరింగ్ మెషీన్తో పనులు ప్రారంభించగానే.. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు సొరంగమంతా ఊగిపోయింది. పైభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా.. మరో ఎనిమిది మంది లోపలే చిక్కుపోయారు. అప్పటి నుంచి సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. ఉబికి వచ్చిన నీటితో మట్టి తడిసి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఐదు రోజులు గడిచినా.. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. నీరుందని, పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయిందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలో సొరంగంలో పేరుకుపోయిన మట్టిని, నీటిని తొలగిస్తూ వచ్చారు. సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న బోరింగ్ మెషిన్, ఇతర పరికరాలను ఢ్రిల్లింగ్ చేసి తొలగించి ముందుకు సాగారు. అయితే భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు.. టన్నెల్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలను సహాయక బృందాలు విరమించుకున్నాయి. ఈ క్రమంలో..మంగళవారం రాత్రి ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు సహాయక బృందాలు(Rescue Teams) చేరుకున్నాయి. అక్కడంతా బురద, మట్టి పెల్లలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ, ఎన్డీఎఫ్, ఎస్డీఎఫ్ టీమ్లతో పాటు వెళ్లిన కార్మికులు ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చేశారు. ఈ ఉదయం ఆక్సిజన్ సాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువగా వెళ్లారు. దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి జీరో పాయింట్కు చేరుకోగలిగారు. అయితే కార్మికుల ఇంకా తెలియకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రసుత్తం ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు కొనసాగిస్తున్నారు.

బాబు, పవన్తో పోటీ పడుతున్న లోకేష్?
కాకి లెక్కలు చెప్పడంలో తండ్రిని మించిపోవాలని ఆంధ్రప్రదేశ్ షాడో సీఎం, విద్యాశాఖ మంత్రి లోకేష్ తహతహలాడుతున్నట్లు అనిపిస్తోంది. సర్వ మంత్రిత్వ శాఖలపై పెత్తనం చెలాయిస్తున్న ఈయన ఇటీవలే ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్ ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఏమిటా ట్వీట్ అంటే.. ‘వైఎస్ జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీనే రూ. 24,944 కోట్లు’ అని!. దీంతో, అవకాశం దొరికిందనుకుందేమో.. ‘ఈనాడు’ మరింత రెచ్చిపోయింది. తప్పుడు కథనాల వండి వార్చేసింది. నిజానిజాలను నిర్ధారించుకుని మరీ వార్తలు రాయాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని గాలికి వదిగేసింది. యాభై ఏళ్లపాటు మనుగడలో ఉన్న ఈనాడు ఈ స్థాయికి దిగజారుతుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి?.లోకేష్ ట్వీట్కు సంబంధించిన కథనానికి ఈనాడు పెట్టిన శీర్షిక చదివితే జగన్ హయాంలో తెచ్చిన అప్పులకే రూ.24,944 కోట్ల వడ్డీ కట్టాలనేమో కదా! అయితే వాస్తవం ఇది కాదు. 1953 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ ఇది. అంత మొత్తాన్నీ వైఎస్ జగన్ ఖాతాలోకి వేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది ఈనాడు కుత్సిత వ్యూహం!.లోకేష్ తన ట్వీట్లో 2019 వరకు ఉన్న అప్పులపై వడ్డీని, జగన్ హయాంలో తెచ్చిన అప్పులపై వడ్డీని పోల్చుతూ కొంత మిస్ లీడ్ చేసే యత్నం చేస్తే.. ఈనాడు మీడియా అబద్ధపు హెడ్డింగ్ పెట్టి మొదటి లైన్లో ఇలా రాసింది. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన అప్పులపై కడుతున్న వడ్డీ రూ.24,944 కోట్లకు చేరుకుందని మంత్రి లోకేష్ తెలిపారు’ అని! ఆ వెంటనే ‘2019 నాటికి మొత్తం అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీ రూ.14,155 కోట్లు. దీని కంటే జగన్ పాలనలో చేసిన అప్పులపై కడుతున్న వడ్డీనే అధికం అని లోకేష్ పేర్కొన్నారు’ అని రాసింది. మొదటి వాక్యంలో మొత్తం వడ్డీ అంతా జగన్ ఖాతాలో వేసేసింది?. అదంతే.. ఈనాడు బుద్దే అలా చెడిపోయిందని అనుకోవాలి.ఇక లోకేష్ విషయానికి వద్దాం. ఆయన ఏమంటున్నారంటే 2019 వరకు అందరు ముఖ్యమంత్రులు కలిసి తెచ్చిన అప్పులపై రూ.14,155 కోట్ల వడ్డీ చెల్లిస్తుండగా, జగన్ హయాంలో రూ.24 వేల కోట్లకు చేరిందీ అని చెప్పారు. అదే టైమ్లో ఆయన పోల్చవలసింది చంద్రబాబు ఉమ్మడి ఏపీతోపాటు విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పులెంత? అన్నది విభజిత ఏపీలో 2014-19 మధ్య ఎంత అప్పు తీసుకు వచ్చారన్నది కదా!. అదేమీ చెప్పకుండా లోకేష్ అతి తెలివిని ప్రదర్శించారు.ఈ అంశంపై నెటిజన్లు లోకేష్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్ బాబూ.. అసలు నిజం చెబుదామా? అంటూ వాయిస్ ఆంధ్ర పేరుతో ఒక ట్వీట్ వచ్చింది. అందులో ఇలా ప్రస్తావించారు. 2014-19 చంద్రబాబు హయాంలో అప్పుల భారం ₹97,000 కోట్ల నుంచి ₹3,46,529 కోట్లకు పెరిగింది! (సోర్స్: CAG & RBI).అప్పుల భారం మూడింతలు చేసిన చంద్రబాబు, వడ్డీ పెరిగింది అని జగన్పై బురదజల్లడం కామెడీ కాదా?. 2019 నాటికి అప్పులపై కట్టిన వడ్డీ ₹14,154 కోట్లు. అదే 2024 నాటికి ₹24,944 కోట్లు. వడ్డీ పెరగడానికి కారణం 2014-19 మధ్య టీడీపీ చేసిన భారీ అప్పులే కదా?. జగన్ పాలనలో అప్పులు వచ్చాయి కానీ, సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. కానీ టీడీపీ హయాంలో అప్పు చేసి.. కమీషన్లు, కాంట్రాక్టర్లు, సింగపూర్ ట్రిప్పులకే ఖర్చు పెట్టారు. అని ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.జగన్ హయాంలో 'అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చారు.. మరి మీ సూపర్ సిక్స్ ఏది మరి? అని ఇంకొకరు ప్రశ్నించారు. వాస్తవాలు చెబితే మైండ్ బ్లాంక్ అవుతుందా బాబూ? అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నలు సంధించింది. 'YSRCP హయాంలో ప్రజల జీవితం మెరుగుపడింది. కానీ టీడీపీ హయాంలో మాత్రం అప్పులూ, అవినీతీ తప్ప మిగలలేదు! అని ఆ పోస్టులో వ్యాఖ్యానించింది.ఉమ్మడి ఏపీ విడిపోయేనాటికి విభజిత ఏపీ అప్పు పై ఏడాదికి రూ.7488 కోట్లు చెల్లిస్తుండగా, 2019 నాటికి చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు కూడా కలిపి కట్టవలసిన వడ్డీ రూ.15,342 కోట్లు. అంటే అంతకుముందు ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పుకన్నా మూడు రెట్లు అధికంగా రుణాన్ని తీసుకురావడమే కాకుండా, డబుల్ మొత్తాన్ని వడ్డీగా చెల్లించవలసి వచ్చిన లెక్కలను వైఎస్సార్సీపీ నేతలు తమ సమాధానాలలో వివరించారు. 2019లో అప్పును మూడున్నర లక్షల కోట్లకు తీసుకువెళ్లి కూడా చివరకు జగన్ పదవిలోకి వచ్చే నాటికి వంద కోట్లు మిగిల్చి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.అప్పుడు జగన్ జీతాలు కూడా ఇవ్వలేరని టీడీపీ నేతలు భావించి ప్రకటనలు కూడా చేశారు. దానిని కదా ఆర్థిక విధ్వంసం అనాల్సింది? ఆ తర్వాత రెండేళ్ల పాటు కరోనా ఉన్నా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు అమలు చేసిన చరిత్ర జగన్ది. అంతేకాదు.. జగన్ దిగిపోయే నాటికి ఏడువేల కోట్లు ఖజానాలో ఉంచి వెళ్లారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్క హామీ అమలు చేయకుండా, అప్పులు మాత్రం రూ.1.30 లక్షల కోట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు సర్కార్ది అని వైఎస్సార్సీపీ నేతలు వాదించారు. ఇది నిజమే.జగన్ టైమ్లో అన్ని పథకాలు అమలై, పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఊరూరా భవనాలు నిర్మించినా ఆర్థిక విధ్వంసం అని టీడీపీ కూటమి దుష్ప్రచారం చేస్తుంటుంది. మరి ఈ ఎనిమిది నెలల కాలంలో కాని, అంతకుముందు 2014 టర్మ్లో ఐదేళ్లలో కాని నిర్దిష్టంగా ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోలేని పరిస్థితి టీడీపీది. అప్పుడు రుణమాఫీతో సహా వందల హామీలు అమలు చేయకుండా కాలం గడిపారు. ఇప్పుడు సూపర్ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం గల్లాపెట్టె ఖాళీ అంటూ కథలు చెబుతూ, మరోవైపు ధారాళంగా అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోంది.2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రచారం చేశారు. తీరా చూస్తే అది రూ.ఏడు లక్షల కోట్లు కూడా లేదు. అందులో చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో వచ్చిందే సుమారు రూ.మూడు లక్షల కోట్లు ఉంది. అయినా దాని గురించి చెప్పకుండా మొత్తం జగన్ అకౌంట్లోవేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తుంటారు. అదేకాదు. ఇటీవలి కాలంలో కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం జగన్ టైమ్లో జీఎస్డీపీ, జీఎస్టీలలో ఏపీలో వృద్దిలో ఉంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో మైనస్లోకి వెళ్లింది.జగన్ టైమ్ లో మైనింగ్ శాఖలో 2023-24లో ఆదాయం రూ.4800 కోట్లు కాగా, అది చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.మూడు వేల కోట్ల వరకే ఉందట. చంద్రబాబు 2014 టర్మ్లో మైనింగ్ శాఖ ఆదాయం రూ.8161 కోట్లు ఉంటే, జగన్ ఐదేళ్లలో రూ.17,732 కోట్ల ఆదాయం సాధించింది. అయినా కూటమి నేతలు జగన్ టైమ్ లో ఆర్థిక విధ్వంసం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తారు. దానివల్లే తాము సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక పోతున్నామని ప్రజలను ఏమార్చే యత్నం చేస్తున్నారు.అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మొనగాడు అని దేశవ్యాప్తంగా ఆయా పార్టీల వారు భావిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అచ్చంగా అదే బాటలో నడుస్తున్నారు. వారిద్దరితో పోటీ పడి లోకేష్ కూడా తనకు తోచిన అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలలో ఉండాలని తలపెట్టినట్లు అనిపిస్తుంది. ఒకవైపు కుంభమేళాలో పుణ్యస్నానాలకు కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చిన లోకేష్ ఇలాంటి అసత్యాలను చెబితే పాపం అనిపించదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

హోలీ.. ఉగాది పండుగలు: మార్చిలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..
ఫిబ్రవరి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మార్చిలో బ్యాంక్ హాలిడేస్➤మార్చి 7 (శుక్రవారం): 'చాప్చార్ కుట్' పండుగను సందర్భంగా మిజోరాంలో సెలవు దినం.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤మార్చి 22 (శనివారం): 'బీహార్ దివస్' లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మార్చి 22న బీహార్లో బ్యాంకులకు సెలవు.➤మార్చి 27-28 (గురువారం-శుక్రవారం): ఇస్లామిక్ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు అయిన షబ్-ఎ-ఖదర్ను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ మార్చి 27న సెలవు దినంగా పాటిస్తుంది. రంజాన్ నెల చివరి శుక్రవారం అయిన జుమాత్-ఉల్-విదాను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం మార్చి 28న సెలవు దినంగా పాటిస్తుంది.➤మార్చి 31 (సోమవారం): మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మార్చిలో ఈద్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).
హీరోయిన్తో సెల్ఫీ కోసం ఎగబడ్డ బాబాలు.. వీడియో వైరల్
భారత్లో ఖరీదైన నివాసాలు వీరివే!.. జాబితాలో ఫస్ట్ ఎవరంటే?
‘అతడికి ఉరిశిక్ష సరైందే’.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్
‘పోసాని అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది’
నాగార్జున కుబేర మూవీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!
హైదరాబాద్లో ఫనాటిక్స్ విస్తరణ..
శివజ్ఞానం అంటే...?
Ind vs NZ: కివీస్తో మ్యాచ్లో ఓపెనర్గా అతడు.. పంత్కి ఛాన్స్!
ఈ సైకోల నుంచి రక్షణ లేదా?
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు
అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?
ఇంకెందుకు ఆలస్యం సార్! ఈ ఐడియా నాదేనని.. తొలి లైను అమరావతికేనని చెప్పేయండి!
రాజమౌళిపై సంచలన ఆరోపణలు.. ఆమె కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు: శ్రీనివాస్
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్
పుతిన్ కాదంటే.. మీరేనా సార్!
హీరోయిన్తో సెల్ఫీ కోసం ఎగబడ్డ బాబాలు.. వీడియో వైరల్
భారత్లో ఖరీదైన నివాసాలు వీరివే!.. జాబితాలో ఫస్ట్ ఎవరంటే?
‘అతడికి ఉరిశిక్ష సరైందే’.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్
‘పోసాని అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది’
నాగార్జున కుబేర మూవీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!
హైదరాబాద్లో ఫనాటిక్స్ విస్తరణ..
శివజ్ఞానం అంటే...?
Ind vs NZ: కివీస్తో మ్యాచ్లో ఓపెనర్గా అతడు.. పంత్కి ఛాన్స్!
ఈ సైకోల నుంచి రక్షణ లేదా?
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు
అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?
ఇంకెందుకు ఆలస్యం సార్! ఈ ఐడియా నాదేనని.. తొలి లైను అమరావతికేనని చెప్పేయండి!
రాజమౌళిపై సంచలన ఆరోపణలు.. ఆమె కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు: శ్రీనివాస్
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..
అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్
పుతిన్ కాదంటే.. మీరేనా సార్!
సినిమా

నీ భర్త కంటే విజయ్ నయం.. జ్యోతిక ఏమందో తెలుసా?
ఎవరి టాలెంట్ వారిదే! ఈ పదం సినిమా ఇండస్ట్రీలో అందరికీ వర్తిస్తుంది. ఎవరి స్క్రిప్ట్ సెలక్షన్ వారిదే.. బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా వారిదే! ఒకరితో మరొకరిని పోల్చలేం. కొన్నిసార్లు అపజయాలు ఎదురైనా మరికొన్నిసార్లు కలెక్షన్ల ఊచకోతతో రికార్డులు సృష్టిస్తుంటారు. ఫెయిల్యూర్ అందుకున్నంతమాత్రాన నటులు వెనకబడిపోయినట్లు కాదు! అయితే కంగువా సినిమాతో డిజాస్టర్ అందుకున్న హీరో సూర్య (Suriya)ను పలువురూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా జ్యోతిక (Jyotika) షేర్ చేసిన పోస్ట్ కింద నెగెటివ్ కామెంట్లతో చెలరేగిపోతున్నారు.నీ భర్తను ఆ రేంజ్ కలెక్షన్స్ తెమ్మనుసూర్య కంటే విజయ్ బెటర్ అని ఒకరు, నీ భర్త కంటే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఉత్తమం అని మరొకరు సెటైర్లు వేశారు. సూర్య, కార్తీల కంటే విజయ్ చాలా నయం.. ఇదే నిజం.. ఆ ఇద్దరు హీరోలను డ్రాగన్, లవ్ టుడే కంటే ఎక్కువ కలెక్షన్స్ తీసుకురమ్మనండి అంటూ ఇలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే వీటన్నింటిపై జ్యోతిక చాలా కూల్గా స్పందించింది. నీ భర్త కంటే విజయ్ నయం అన్న కామెంట్కు.. అవునా, నిజమా? అన్నట్లుగా స్మైల్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. స్పందించడం అవసరమా?తర్వాత సదరు కామెంట్లన్నింటినీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జ్యోతిక ఆ ట్రోలర్స్కు రిప్లై ఇవ్వడం అవసరమా? అని పలువురు మండిపడుతున్నారు. పోనీ.. నీ భర్త కంటే వేరొకరు నయం అన్నప్పుడు చెంప చెల్లుమనిపించేలా ఆన్సర్ ఇవ్వొచ్చుగా అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ఇతర నటులు సక్సెస్ అయితే ఈ కుటుంబమంతా ఈర్ష్యతో రగిలిపోతుంది అని పెదవి విరుస్తున్నారు. ఇకపోతే జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: 'నమో నమః శివాయ' వీడియో సాంగ్ వచ్చేసింది

'జిగేలు రాణి' మళ్లీ వచ్చేస్తుంది.. పోస్టర్తో ప్రకటన
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా పూజా హెగ్డేకు ప్రత్యేక స్థానం ఉంది. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే. తాజాగా రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చేసింది. ఈ మేరకు పోస్టర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు.రజనీకాంత్(Rajinikanth ) ‘కూలీ’(Coolie Movie) సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో కనిపించనుంది. ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందని ప్రచారం ఉంది. స్పెషల్ పాటల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేమి కాదు.హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్ని ఉర్రూతలూగించింది. ఆ పాటకి పూజా వేసిన స్టెప్పులు హైలెట్గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్ 3లోనూ పూజా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్తో కలిసి ‘స్పెషల్’ స్టెప్పులేసేందుకు పూజా రెడీ అయిపోయింది. రజనీకాంత్తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్లో ఆమె కనిపించనుంది. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు.

ఓటీటీలో 'షకీలా' బయోపిక్ స్ట్రీమింగ్.. అలాంటి కంటెంట్ కావడంతో..
నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. 2021లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్ లంకేశ్ దర్శకత్వంలో ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.షకీలా సినిమా థియేటర్స్లో రిలీజైన ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా తెలుగు వర్షన్ కోసం ఎక్స్ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. షకీలాకు ఉన్న క్రేజ్ వల్ల ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. ఏకంగా యూట్యూబ్లలో కూడా ఈ చిత్రాన్ని చాలామంది షేర్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు. అయితే, తెలుగు వర్షన్ కూడా మరో రెండురోజుల్లో స్ట్రీమింగ్కు రావచ్చని తెలుస్తోంది.ఈ సినిమాతో షకీలా ప్రయాణం చాలామందిని ఆలోచింప చేస్తుంది. ఇండస్ట్రీలో నటిగా పేరు తెచ్చుకోవాలనుకున్న షకీలా.. శృంగార తారగా ఎలా మారింది అనేది చెప్పడంలో దర్శకుడు కాస్త తడబడటంతో ఈ మూవీకి పెద్ద మైనస్ అయింది. ఆపై ఇందులో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉండటంతో కూడా ఇబ్బందిగా మారింది. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను చూపించారు. బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్ బోర్డు కమిటీ ప్రశంసించింది.

విజయ్ ఇంటిపై చెప్పు విసిరిన యువకుడు
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ఇంటిపై ఒక యువకుడు చెప్పు విసరడంతో అభిమానులు భగ్గుమన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీ ఆవిర్భవించి ఏడాది కాలం పూర్తయిన విషయం తెలిసిందే. బుధవారం 2వ వసంతంలోకి పార్టీ ప్రస్తుతం అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈసీఆర్లోని మహాబలిపురం సమీపంలో ఉన్న పూంజేరి గ్రామంలో ఉన్న రిసార్ట్లో ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు పార్టీ తరపున జిల్లాల కార్యదర్శులు, 2,500 మంది ముఖ్య నిర్వాహకులను మాత్రమే ఆహ్వానించారు. వేదికపై జిల్లాల కార్యదర్శులు, రాష్ట్ర నేతలు ఆశీనులయ్యారు. తమిళ హక్కులు, భాషా అభిమానం, రాజకీయ శాసనాలు, మత సామరస్యం, సహోదరత్వం తదితర అంశాల పరిరక్షణ లక్ష్యంగా గుండెల మీద చేతులు వేసుకుని నేతలందరూ ప్రతిజ్ఞ చేసినానంతరం సమావేశం ప్రారంభమైంది. ఇటీవల వీసీకేను వీడి టీవీకేలో చేరిన ఆదవ అర్జునన్ మాట్లాడుతూ, ప్రస్తుతం బలంగా ఉన్న డీఎంకే కూటమిలో మున్ముందు బీటలు వారనున్నట్టు పేర్కొంటూ, ఇక విజయ్ను దళపతి అని కాకుండా తలైవా అని పిలుద్దామని సూచించారు.తమిళనాడులో 1967, 1977 ఎన్నికల చరిత్రను పునరావృతం చేసే విధంగా 2026లో మార్పు తథ్యం అని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మరో చరిత్రను సృష్టించే విధంగా విజయ బావుటా ఎగుర వేస్తామన్నారు. త్వరలో బూత్ కమిటీ మహానాడు నిర్వహించబోతున్నామని, ఇదే తమిళగ వెట్రికళగం బలాన్ని చాటే వేదిక కానున్నట్టు వ్యాఖ్యలు చేశారు. టీవీకే గెలుపు అన్నది ఇక్కడున్న వారి చేతులలోనే కాదు, ఈ రాష్ట్ర ప్రజల చేతులలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి కార్యకర్త పడే శ్రమ మీదే అది ఆధారపడి ఉందన్నారు.విజయ్ ఇంటిపై చెప్పు విసిరిన యువకుడు మహాబలిపురంలో విజయ్ సభ జరుగుతున్న సమయంలో చాలామంది అభిమానులు టీవీల ముందు కూర్చొన్నారు. తమ అభిమాన హీరో రాజకీయ ప్రసంగం ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తుండగా ఆయన ఇంటిపై ఒక యువకుడు చెప్పు విసరడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంటి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి, అకస్మాత్తుగా చెప్పును ఇంటిలోకి విసిరాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో అతను అక్కడి నుంచి పరారీ అయ్యాడు. అయితే, అతనొక మానసిక రోగి అని కొందరు చెబుతున్నారు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జకీయ దురుద్దేశంతో కావాలనే ఎవరో ఈ పని చేసి ఉంటారని విజయ్ అభిమానులు అనుమానిస్తున్నారు.
క్రీడలు

అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్ ప్రయాణం ముగిసిపోయింది. అఫ్గనిస్తాన్(Afghanistan vs England)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో బట్లర్ బృందానికి చేదు అనుభవమే మిగిలింది. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో అఫ్గన్ గెలుపొంది ఇంగ్లండ్ను టోర్నమెంట్ నుంచి బయటకు పంపింది. తమదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడిస్తామని హష్మతుల్లా బృందం మరోసారి నిరూపించింది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) తీవ్ర నిరాశకు గురికాగా.. అఫ్గనిస్తాన్ సారథి హష్మతుల్లా పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఇక ఓటమిపై స్పందించిన బట్లర్.. తామే చేజేతులా కీలక మ్యాచ్ను చేజార్చుకున్నామని విచారం వ్యక్తం చేశాడు. గెలిచే మ్యాచ్లోనూ ఓడిపోవడం కంటే బాధ మరొకటి ఉండదని అన్నాడు.రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు‘‘టోర్నమెంట్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం నిరాశను మిగిల్చింది. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో గెలిచేందుకు మాకు అన్ని అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈరోజు రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి పది ఓవర్లలో అంతా తారుమారైంది.క్రెడిట్ తనకేఏదేమైనా ఇబ్రహీం జద్రాన్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాలి. ఇక దురదృష్టవశాత్తూ మార్క్ వుడ్ మోకాలికి గాయమైంది. అయినా సరే తను బౌలింగ్ చేయడం ప్రశంసనీయం. డెత్ ఓవర్లలో ఇలా కీలక బౌలర్ గాయపడటం తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఒకడిగా ఉన్నా నా నుంచి ఇలాంటి ప్రదర్శన ఎంతమాత్రం సరికాదు. అయినా ఈ ఉద్వేగ సమయంలో నేను ఎలాంటి నిర్ణయాలు(రిటైర్మెంట్) తీసుకోను’’ అని బట్లర్ పేర్కొన్నాడు.ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడుఇక అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. ‘‘ఇది సమిష్టి విజయం. ఈ గెలుపుతో మా దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. 2023లో ఇంగ్లండ్ను తొలిసారిగా మేము ఓడించాం. అప్పటి నుంచి రోజురోజుకు మరింతగా మా ఆటకు మెరుగులు దిద్దుకుని.. ఇప్పుడు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాం.నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో మాదే పైచేయి కావడం ఆనందంగా ఉంది. ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడు. ఒత్తిడిలోనూ అతడు అద్బుతంగా ఆడాడు. నేను చూసిన వన్డే ఇన్నింగ్స్లో ఇదొక అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పగలను.అజ్మత్ కూడా బాగా ఆడాడు. జట్టులో నైపుణ్యాలు గల సీనియర్లతో పాటు జూనియర్లుకూడా ఉండటం మా అదృష్టం. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు’’ అని తెలిపాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బి లో ఉన్న అఫ్గనిస్తాన్- ఇంగ్లండ్ మధ్య బుధవారం వన్డే మ్యాచ్ జరిగింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(177) భారీ శతకంతో దుమ్ములేపగా.. హష్మతుల్లా(40), అజ్మతుల్లా(41), మహ్మద్ నబీ(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గన్ 325 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 317 పరుగులకే పరిమితమైంది. జో రూట్ శతకం(120) సెంచరీ చేయగా.. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేదు దీంతో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్కు పరాజయం తప్పలేదు. ఇక ఈ ఓటమితో టోర్నీ నుంచి బట్లర్ బృందం నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ రేసులో ఫేవరెట్లుగా ఉండగా.. అఫ్గనిస్తాన్ తానూ పోటీలో ఉన్నానంటూ ముందుకు వచ్చింది.చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు

అఫ్గాన్ ప్లేయర్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అఫ్గానిస్తాన్ సంచలనం సృష్టించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పటిష్టమైన ఇంగ్లండ్ను 8 పరుగుల తేడాతో అఫ్గాన్ మట్టికర్పించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అఫ్గానిస్తాన్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. కాగా ఐసీసీ ఈవెంట్లలలో ఇంగ్లండ్ను అఫ్గానిస్తాన్ ఓడించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం.వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసిన అఫ్గానిస్తాన్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి సెమీఫైన్ల్కు చేరేందుకు అఫ్గానిస్తాన్ అడుగుదూరంలో నిలిచింది. ఫిబ్రవరి 28న లాహోర్లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో షాహిది బృందం తలపడనుంది.ఒమర్జాయ్ సరికొత్త చరిత్ర..కాగా అఫ్గాన్ చారిత్రత్మక విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో 41 పరుగులతో అదరగొట్టిన ఒమర్జాయ్.. ఆ తర్వాత బౌలింగ్లో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో ఒమర్జాయ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకే మ్యాచ్లో 40 ప్లస్ పరుగులతో పాటు 5 వికెట్ల తీసిన తొలి ఆటగాడిగా ఒమర్జాయ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేదు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ చరిత్రలో రన్ ఛేజింగ్లో 5 వికెట్ల హాల్ సాధించిన ఐదో ప్లేయర్గా ఒమర్జాయ్ నిలిచాడు. ఈ జాబితాలో జాక్వెస్ కల్లిస్, మఖాయా ఏంటిని, జాకబ్ ఓరమ్, మెక్గ్రాత్ వంటి దిగ్గజాలు ఉన్నారు.జద్రాన్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 146 బంతులు ఎదుర్కొన్న జద్రాన్.. 12 ఫోర్లు, 6 సిక్స్లతో 177 పరుగులు చేశాడు. అతడితో పాటు నబీ(40), షాహిదీ(40), అజ్మతుల్లా ఓమర్జాయ్(41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. 326 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!

Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచ్లకు దూరమైన భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ తిరిగి జట్టుతో చేరాడు. కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు మోర్కల్ వ్యక్తిగత కారణాల రీత్యా తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బంగ్లాతో మ్యాచ్కు ముందు ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో భారత హెడ్కోచ్ గౌతం గంభీర్ వెల్లడించాడు.మొదటి రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ కోచ్ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. అయితే తన తండ్రి హఠాన్మరణం కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లిన మోర్కల్.. దాదాపు వారం రోజుల తర్వాత తిరిగి దుబాయ్కు చేరుకున్నాడు. న్యూజిలాండ్తో మ్యాచ్కు ముందు అతడి నేతృత్వంలో భారత ఫాస్ట్ బౌలర్లు చెమటోడ్చుతున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 40 ఏళ్ల మోర్నీ గతేడాది సెప్టెంబర్లో భారత పేస్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. మోర్నీ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పేస్ విభాగం మరింత పటిష్టమైంది. ఇక భారత్కు మరో శుభవార్త కూడా అందింది.పంత్ ఫుల్ ఫిట్..నెట్ ప్రాక్టీస్లో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు పంత్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు మూడు రోజుల పాటు ప్రాక్టీస్కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో పంత్ తన ప్రాక్టీస్ను తిరిగి మొదలు పెట్టాడు. కాగా కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా ఉండడంతో పంత్ తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు. కివీస్తో మ్యాచ్కు కూడా పంత్ను పక్కనే పెట్టే అవకాశముంది. ఇక మార్చి 2న భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడతోంది. ఇప్పటి ఈ రెండు జట్లు తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకున్నాయి.చదవండి: #Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం లహోర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఐసీసీ ఈవెంట్లలో అఫ్గాన్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవడం ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లీష్ జట్టును మట్టికర్పించిన అఫ్గాన్స్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఖంగుతిన్పించారు.ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు సీనియర్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 326 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ సెంచరీతో మెరిశాడు. ఓ దశలో ఇంగ్లండ్ను ఈజీగా గెలిపించేలా కన్పించిన రూట్.. ఆఖరి ఓవర్లలో తన వికెట్ను అఫ్గాన్కు సమర్పించుకున్నాడు.దీంతో మ్యాచ్ అఫ్గాన్ సొంతమైంది. రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 120 పరుగులు చేశాడు. రూట్కు ఇది 17వ వన్డే సెంచరీ. అయితే వన్డేల్లో అతడికి ఇది దాదాపు ఆరేళ్ల తర్వాత వచ్చిన శతకం కావడం గమనార్హం. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన రూట్..ఐసీసీ ఈవెంట్లలో 300 ప్లస్ పరుగుల చేజింగ్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. ఐసీసీ టోర్నమెంట్లలో మూడు వందలకు పైగా పరుగుల లక్ష్య చేధనలో రూట్ ఇప్పటివరకు మూడు సెంచరీలు సాధించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై, 2019 వన్డే ప్రపంచ కప్లోనాటింగ్హామ్లో పాకిస్థాన్పై శతకాలు నమోదు చేశాడు. ఈ రెండు సందర్బాలు ఇంగ్లండ్ టార్గెట్ మూడు వందలకు పైగానే ఉంది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. వీరిద్దరూ చెరో రెండు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్తో ఈ దిగ్గజ క్రికెటర్ల రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఛేజింగ్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్, షేన్ వాట్సన్ రికార్డును రూట్ సమం చేశాడు. ఈ ముగ్గురు లెజండరీ క్రికెటర్లు తలా రెండు శతకాలు నమోదు చేశారు. ఇక ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్లో మార్చి1న కరాచీ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడుతోంది.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!
బిజినెస్

భారత్కు గడ్డుకాలం ముగిసినట్టే: డాయిష్ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం ముగిసినట్టేనని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ 5.4 శాతానికి (ఏడు త్రైమాసికాల కనిష్టం) పడిపోవడం తెలిసిందే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6.2 శాతానికి మెరుగుపడుతుందని బ్యాంక్ అంచనా వేసింది. అయినప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధి 7 శాతం లోపే ఉంటుందని పేర్కొంది.క్యూ3 (2024 అక్టోబర్-డిసెంబర్) జీడీపీ గణాంకాలు విడుదల కావడానికి ముందు బ్యాంక్ ఈ నివేదిక విడుదల చేయడం గమనార్హం. కీలక సూచికలు సైతం వృద్ధి రేటు 6.2 శాతానికి పెరుగుతుందని సూచిస్తున్నట్టు తెలిపింది. వృద్ధికి మద్దతుగా ఏప్రిల్ మానిటరీ పాలసీ సమీక్షలోనూ ఆర్బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని అంచనా వేసింది. అనంతరం 0.50 శాతం రేటు బదిలీ దిశగా లిక్విడిటీ చర్యలపై ఆర్బీఐ దృష్టి సారించొచ్చని తెలిపింది.ప్రస్తుత సైకిల్లో మరిన్ని రేట్ల కోతలు ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. లిక్విడిటీ అవసరాల పట్ల ఆర్బీఐ ఇప్పటికే దృష్టి పెట్టిందంటూ.. ఇటీవల 10 బిలియన్ డాలర్ల స్వాప్ ప్రకటన ప్రోత్సాహనీయంగా పేర్కొంది.జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలి: ఈవైభారత్ 6.5 - 7 శాతం మేర జీడీపీ వృద్ధిని నమోదు చేయాలంటే, పన్నుల పరిధిని 1.2 - 1.5 శాతం స్థాయిలో కొనసాగించాలని ఈవై సూచించింది. ఆదాయ వసూళ్లను బలోపేతం చేసుకోవాలంటూ.. జీడీపీలో పన్నుల నిష్పత్తిని 2025 - 26లో 12 శాతం అంచనా స్థాయి నుంచి 2030 - 31 నాటికి 14 శాతానికి పెంచుకోవాలని పేర్కొంది. ద్రవ్య నిర్వహణ, నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించాలని సూచించింది. 2025–26లో భారత జీడీపీ 6.3 - 6.8 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.

బంగారం కొనడానికి ఇది మంచి సమయం!.. మళ్ళీ తగ్గిన గోల్డ్ రేటు
బంగారం ధరల పెరుగుదలకు.. మహాశివరాత్రి నుంచి బ్రేకులు పడ్డాయి. ఈ రోజు (ఫిబ్రవరి 27) కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో పసిడి ధరలలో మార్పు జరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే.. వివరాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద నిలిచాయి. నిన్న రూ. 250, రూ. 270 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400 , రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,380 వద్ద ఉంది. చెన్నైలో నిన్న పసిడి రేట్లు స్వల్పంగా తగ్గాయి.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధర మాత్రం ఈ రోజు స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 27) కేజీ సిల్వర్ రేటు రూ. 1,06,000 వద్దనే ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 98,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

ఎఫ్సీఐ చూపు.. రుణాల వైపు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) తన కార్యకలాపాల కోసం రూ.40,000 కోట్ల స్వల్పకాలిక రుణాలు పొందడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి గణనీయంగా రూ.1.26 లక్షల కోట్లు అందుకున్నప్పటికీ ఈ రుణాలు తీసుకునేందుకు సిద్ధపడడం గమనార్హం. ఇప్పటివరకు అందుకున్న కేటాయింపులు 2025 ఆర్థిక సంవత్సరానికి మొత్తం అంచనా వేసిన రూ.1.34 లక్షల కోట్ల ఆహార సబ్సిడీలో 95 శాతంగా ఉన్నాయి.ఆర్థిక సవాళ్లు, కార్యాచరణ అవసరాలుదేశ ఆహార భద్రత, పంపిణీ నిర్వహణకు బాధ్యత వహించే ఎఫ్సీఐ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుత సబ్సిడీ కేటాయింపులకు, కార్పొరేషన్ నిర్వహణ ఖర్చులకు మధ్య అంతరాన్ని పూడ్చడానికి స్వల్పకాలిక రుణాలు దోహదపడతాయి. దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ సజావుగా సాగేందుకు ఈ రుణాలు కీలకం కానున్నాయి.వడ్డీ రేట్లు, రుణ నిబంధనలునిర్దేశిత బ్యాంకులు అందించే ఈ స్వల్పకాలిక రుణాల వార్షిక వడ్డీ రేట్లు 6.79% నుంచి 7.39% మధ్య ఉంటాయి. ఈ రుణాలు సాధారణంగా 90 రోజుల కాలపరిమితికి లభిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన మిగిలిపోయిన సబ్సిడీలు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయింపుల్లో కొంత భాగం విడుదలయ్యే వరకు ఎఫ్సీఐ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన లిక్విడిటీని ఈ రుణాల వల్ల సమకూర్చుకుంటుంది.ఇదీ చదవండి: పెట్రోల్లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపుసబ్సిడీ కేటాయింపు, ఆర్థిక నిర్వహణఆహార సబ్సిడీ ఖర్చుల్లో అధిక భాగాన్ని ఎఫ్సీఐకి విడుదల చేయడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా వ్యవహరించింది. అయితే, ఇప్పటికే 95 శాతం నిధుల కేటాయింపు పూర్తయింది. మిగిలిన 5 శాతం సబ్సిడీ సాధారణంగా అవసరమైన ఖాతాల ఆడిట్ తరువాత పంపిణీ చేస్తారు. దీనికితోడు 2024 ఆర్థిక సంవత్సరం నుంచి ఖర్చుకాని రూ.5,900 కోట్ల సబ్సిడీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఫార్వర్డ్ చేశారు. అయినప్పటికీ ఎఫ్సీఐ 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.10,000 కోట్ల లోటును అంచనా వేసింది. ఇందులో ఖాతాల సిటిల్మెంట్ తర్వాత లభించే రూ.6,000 కోట్లు ఉన్నాయి. కార్పొరేషన్ వద్ద ప్రస్తుతం 3.6 కోట్ల టన్నుల బియ్యం, 1.48 కోట్ల టన్నుల గోధుమలతో సహా 5.08 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. దేశ ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి, బఫర్ స్టాక్స్ నిర్వహించడానికి ఈ నిల్వలు చాలా అవసరం.

స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం అంతకుముందు సెషన్తో పోలిస్తే స్థిరంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 22,556కు చేరింది. సెన్సెక్స్(Sensex) 15 పాయింట్లు పుంజుకొని 74,626 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.6 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం పెరిగింది. నాస్డాక్ 0.26 శాతం లాభపడింది.మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది.ఇదీ చదవండి: పెట్రోల్లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపుఅధికారం చేపట్టాక భారత్సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

రంగరంగ వైభవంగా..
నిన్నా మొన్నటి దాకా సినిమాల ప్రభావంతో కుదేలైపోయిన నాటక రంగం.. ఇప్పుడు ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీలు, ఇంకెన్నో డిజిటల్ వినోదాలూ.. విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వీటన్నింటినీ తట్టుకుంటూ నగరవాసుల్ని తన ప్రదర్శనల వైపు నడిపిస్తోంది. యువతరాన్ని ఆకట్టుకుంటూ కాలేజీ క్యాంపస్లతో పాటు కార్పొరేట్ కంపెనీల ఆడిటోరియమ్స్ దాకా నాటకాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఉత్సాహానికి కారణం.. ఆధునికులకు నచ్చే యూత్ కలర్స్ రంగరించి.. రంగస్థల ఈవెంట్స్ను సిటిజనులకు చేరువ చేయడంలో డ్రామానన్ వంటి సంస్థలు నగరానికి రావడం ఒక కారణంగా చెప్పొచ్చు. ఈశాన్య రాష్ట్రమైన మణిపాల్లో పాతికేళ్ల క్రితం 2000వ సంవత్సరంలో డ్రామనాన్(డ్రామాటిస్ట్ అనామిక) ఏర్పాటైంది. వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్ ఆర్కే షెనాయ్, దివంగత చందన్ శతపతిలు స్థాపించిన ఈ థియేటర్ గ్రూప్.. పాతిక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా 450కి పైగా ప్రదర్శనలతో 70కి పైగా నాటకాలను విజయవంతంగా ప్రదర్శించింది. అనంతరం అర్బన్ ప్లానర్ అయిన ఆర్కే షెనాయ్ మన నగరానికి మకాం మార్చాక 2007లో డ్రామానాన్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి డ్రామనాన్ నగర థియేటర్ రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2007లో భారతీయ విద్యాభవన్లో విలియం సెబ్రింగ్ రచించిన ‘ది ఒరిజినల్ లాస్ట్ విష్ బేబీ’తో ప్రారంభించి, ‘ఫూల్స్, ది గుడ్ డాక్టర్, పిజ్జాజ్ అండ్ డబుల్స్, ది లాస్ట్ రిసార్ట్, లవ్, లాస్ట్, 24 రూబుల్స్ లాస్ట్, అదర్ ఫాస్ట్ ఫుడ్స్.. ఇలా అనేక సొంత నాటకాలను సిటీలో ప్రదర్శించింది. ఆదరణ.. అవార్డ్స్.. 19 సంవత్సరాలుగా డ్రామనాన్ దేశవిదేశాలలో వివిధ ఉత్సవాల్లో ప్రదర్శనలు సమర్పించింది. గత 2015లో, బ్రాడ్వే ఆన్లైన్ మ్యాగజైన్ డ్రామనాన్ను దేశంలోని టాప్–20 థియేటర్ గ్రూపులలో ఒకటిగా పేర్కొంది. డ్రామనాన్ హైదరాబాద్ 2012, 2013లో ఐనా థియేటర్ పోటీల్లో, 2013లో షార్ట్ ప్లస్ స్వీట్ థియేటర్ పోటీల్లో గెలుపొంది సిటీ థియేటర్ సత్తా చాటింది. ప్రముఖ నటులు రజిత్ కపూర్ షెర్నాజ్ పటేల్ నటించిన రేజ్ ప్రొడక్షన్స్ ‘లవ్ లెటర్స్’ వంటి ప్రసిద్ధ నాటకాలను కూడా డ్రామనన్ నిర్మించింది.స్కిట్.. ఫైట్.. షురూ.. థియేటర్ ప్రేమికులు, ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహించేందుకు ‘స్కిట్స్’ అనే 12 నిమిషాల షార్ట్ ప్లే కాంటెస్ట్ని డ్రామనాన్ ప్రారంభించింది. ఇందులో నగరానికి చెందిన వివిధ కార్పొరేట్ సంస్థలు, ఔత్సాహిక అనుభవజ్ఞులైన థియేటర్ గ్రూప్స్ పాల్గొంటున్నాయి. ఒక వార్షిక కార్యక్రమంగా మారిన ఈ పోటీల్లో అతుల్ కుమార్, రజిత్ కపూర్, షెర్నాజ్ పటేల్, అభిక్ మజుందార్ ప్రకాష్ కోవెలమూడి తదితర రంగస్థల ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. 1, 2 తేదీల్లో ప్రిలిమినరీ పోటీలు.. ఈ పోటీల్లో ఈ ఏడాది 24 టీమ్స్ పాల్గొంటున్నాయి. స్కిట్స్ కార్యక్రమం నుంచి ‘ఉత్తమ నటుడు’, ‘ఉత్తమ దర్శకుడు’, ‘ఉత్తమ ప్లే’, ‘ఉత్తమ ఒరిజినల్ స్క్రిప్్ట’, ‘ఉత్తమ పోస్టర్’, ‘ఉత్తమ ప్రచార వీడియో’, ‘ఆడియన్స్ ఛాయిస్ ప్లే’ వంటి పురస్కారాలు అందిస్తున్నారు. మొత్తం ప్రైజ్ మనీ రూ.1,20,000 వరకూ ఉంటుంది. ఈ పోటీలకు సంబంధించి ప్రాథమిక రౌండ్ స్కిట్లు 1, 2వ తేదీల్లో గచి్చ»ౌలిలోని సుప్రీమ్ ట్రాంపోలిన్ పార్క్ సమీపంలో ఉన్న ఎలైన్డ్ ఎంప్లాయీస్ కాలనీలోని రంగభూమి స్పేసెస్లో జరుగుతాయి.

అతడు సత్యవంతుడు
సత్యవంతుడి కోసం సావిత్రి యముడితో పోరాడింది... నేను నా భార్యకోసం సత్యవంతుడిలా పోరాడుతున్నాను... అంటున్నాడు విజయ్ మండల్.గత నాలుగేళ్లుగా ఇతను భార్యకు 24 గంటల్లో కావలసిన 3 ఆక్సిజన్ సిలిండర్లను రోజూ భుజంపై మోస్తున్నాడు. ఇందుకోసం సిలిండర్తో రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తాడు. అలుపు లేదు. ఆగిందీ లేదు. బిహార్ భాగల్పూర్కు చెందిన ఈ భర్తకు భార్య కన్నీటి కృతజ్ఞత తెలుపుతుంటోంది. నేటి ఉలిక్కిపడే వార్తల మధ్య ఈ అనుబంధం ఎంతో ఆదర్శం.భర్త కోసం భార్యలు పోరాడిన గాథలు ఉన్నాయి. కాని భార్య కోసం భర్తలు చేసే త్యాగాలు లోకం దృష్టికి రావడం తక్కువ. కాని విజయ్ మండల్ కథ విస్మరించను వీలు కానిది. ఒక మనిషి నిజమైన హృదయంతో పూనుకుంటే తప్ప ఇలాంటి ఘనకార్యాన్ని, ఘనమైన సేవను చేయలేడు. బిహార్లోనే ఇటువంటి భర్తలు ఉన్నారేమో. గతంలో దశరథ్ మాంఝీ అనే అతను తన భార్యకు సమయానికి వైద్యం అందనివ్వకుండా అడ్డుగా నిలిచిన కొండను ఒక్కడే తొలిచి, దారి వేసి ‘మౌంటెన్ మేన్’ అనిపించుకున్నాడు. కరోనా తర్వాత రోగగ్రస్త అయిన భార్య కోసం నాలుగేళ్లుగా పట్టుదలగా ఆక్సిజన్ సిలిండర్లు మోస్తున్న విజయ్ మండల్ను ‘ఆక్సిజన్ మేన్’ అనొచ్చేమో.భాగల్పూర్ నుంచివిజయ్ మండల్ది బిహార్లోని భాగల్పూర్కు దగ్గరలోని కహల్గావ్. ఇక్కడ అతను చిన్న కిరాణా షాపు నడిపేవాడు. భార్య అనితాదేవికి 2021లో కరోనా సోకింది. పరిస్థితి చాలా సీరియస్ అయ్యింది. భార్యను బతికించుకోవడానికి విజయ్ మండల్ చేయని ప్రయత్నం లేదు. కూతురి పెళ్లి కోసం దాచిన 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. చివరకు ఢిల్లీ ఎయిమ్స్కు కూడా తీసుకెళ్లారు. వాళ్లు ఆమెను చేర్చుకొని అన్ని విధాలా వైద్యం చేసి చివరకు ‘ఈమె ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకోవు. బతికి ఉన్నంత కాలం ఆక్సిజన్ మీద బతకాల్సిందే’ అని చెప్పి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చి పంపారు. అది సంవత్సరంలో చెడిపోయింది. ఇంకోటి కొన్నా దాని పరిస్థితీ అంతే. దాంతో స్థానికంగా దొరికే ఆక్సిజన్ సిలిండర్లే మేలని వాటితో భార్యను బతికించుకోవాలని విజయ్ మండల్ నిశ్చయించుకున్నాడు.ఉదయాన్నే 4 గంటలకు లేచిఒక్కో సిలిండర్ 8 గంటలు వస్తుంది. అందుకే ఖాళీ అయిన దానిని వెంటనే ఇచ్చి నిండింది తెచ్చుకోవాలి. విజయ్ మండల్ దినచర్య ఇలా ఉంటుంది. అతడు తన ఊరు రసల్పూర్ నుంచి తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ‘ఇక్చారి’ రైల్వేస్టేషన్కు సిలిండర్ మోసుకొని బయలుదేరుతాడు. అక్కడ రైలు పట్టుకుని 50 నిమిషాల దూరంలోని భాగల్పూర్ చేరుకుంటాడు. అక్కడి నుంచి ఆక్సిజన్ దొరికే చోటుకు వెళ్లి సిలిండర్ తీసుకుని 9 గంటలకు ఇల్లు చేరుతాడు. మళ్లీ 11కు వెళ్లి ఒంటి గంటకు వస్తాడు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లి 7కు తిరిగి వస్తాడు. అంటే రోజులో భుజాన సిలిండర్తో 30 కిలోమీటర్లు అతడు నడుస్తాడు. అతని భుజం కదుం కట్టి పోయింది. ‘ఎందుకు ఆక్సిజన్ మోస్తూ కనిపిస్తావు’ అని ఎవరైనా అడిగితే ‘ఒక పక్షి దాహంతో ఉంది. దాని కోసం’ అని సమాధానం చెబుతాడు.ఆయుష్మాన్ కార్డు‘ఒకరికొకరు తోడుండటమే వివాహం అంటే. ఆమె మరణించేవరకూ నేనే తోడు’ అంటాడు విజయ్ మండల్. ఇతని గాథ అందరికీ తెలిసినా స్థానిక అధికారులు ఆయుష్మాన్ కార్డు ఇచ్చి సరిపెట్టారు. ఒక మనిషి ఆక్సిజన్ కోసం ఇంతగా ఎందుకు తిరగాలి పర్మినెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించడం లేదు. పిచ్చివాడిలా గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆ భర్తను చూసి భార్య రెండు చేతులూ జోడిస్తుంటుంది. ‘ఉత్త పుణ్యానికి భార్యలను హతమార్చే ఈ రోజుల్లో అనారోగ్యంతో ఉన్న నన్ను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాడు నా భర్త’ అని కన్నీరు కారుస్తుంది. విజయ్ మండల్ ఆ మాటలు పట్టించుకోడు. తనకు మిగిలిన టైమ్లో ఆమె దగ్గర కూచుంటాడు. పాదాలు నొక్కుతాడు. కబుర్లు చెబుతాడు. ఆమెలో జీవితేచ్ఛ నశించకుండా చూసుకుంటాడు. ఒక మనిషి ఇంత గొప్పగా ఉంటాడా? ఉంటాడు. ప్రతి మనిషి ఇలా ఉంటే కనీసం ఇంతలో కొంతగా అయినా ఉంటే ఎంత బాగుణ్ణు. ఇంట్లోని గదినే ఐసియుగా మార్చి...‘నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్యను ఎంత బాగా చూసుకోవాలనే విషయం పై నేను ఒక ఉదాహరణగా నిలవాలి’ అన్నాడు విజయ్ మండల్. అతను తాను నడిపే కిరాణా దుకాణాన్ని కొడుక్కు అప్పజెప్పి జీవితాన్ని ఇక పూర్తిగా భార్యకు అంకితం చేశాడు. మూడు ఆక్సిజన్ సిలిండర్లను పర్మినెంట్గా ఉండేలా కొనేశాడు. వాటిని నింపుకొని రావడమే ఇప్పుడతని కర్తవ్యం.

సినిమాయకు మంత్రం లేదా!
‘హోమ్వర్క్ చేయలేదేంటి?’ టీచర్ ప్రశ్న. ‘చెయ్యలా’... అన్నాడా స్టూడెంట్ తల వంకరగా పెట్టి.‘నిర్లక్ష్యంగా బదులిస్తావేంటి... క్లాసయ్యే వరకు నిలబడు’‘తగ్గేదేలే’ అంటూ విచిత్రంగా అభినయించాడు.భుజం తిప్పుతూ వికారంగా ముఖం పెట్టాడు.ఇది ఇప్పుడు స్కూళ్లను పట్టి పీడిస్తున్న జబ్బు.ఆ జబ్బుకు విరుగుడు కూడా రోగం మొదలైన చోటే ఉంది.‘మా స్కూల్లో సగం మంది విద్యార్థులు ‘ఫలానా’ సినిమా చూసిన తర్వాత చెడిపోయారు. విద్యార్థుల భాష మారిపోయింది, జుట్టు స్టైల్, డ్రెస్సింగ్ విచిత్రంగా ఉంటోంది. టీచర్లుగా వారికి మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఎంత చెప్పినా మా మాట వినడం లేదు. భాష మార్చుకోవాలని చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తోంది? ఇలాంటి సినిమాలకు సెన్సార్బోర్డు సర్టిఫికేట్ ఎలా ఇస్తోంది?’ ఇటీవల విద్యాశాఖ కమిషనర్ మీటింగ్లో ఓ టీచర్ వెలిబుచ్చిన ఆవేదన ఇది. ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఆమె ఒక్కరే కాదు, బయటకు చెప్పలేక ఎందరో టీచర్లు ఇలాగే ఆవేదన చెందుతున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జాతీయోద్యమకాలం సినిమాలు ‘‘సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మాధ్యమం. అది ప్రధానంగా వినోదసాధనమే. కానీ సామాజిక బాధ్యత కూడా ఉండాలి. సామాజిక బాధ్యతతో కూడిన వినోదాన్ని అందించాలి. జాతీయోద్యమకాలంలో సినిమాలు ఈ పాత్ర పోషించాయి. జనంలో స్వాతంత్య్రపోరాట స్ఫూర్తిని రగిలించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన సినిమాలకు ఒక సామాజిక లక్ష్యం అనేది లేకుండా పోయింది. సినిమా ప్రభావం పిల్లల మీద మంచి–చెడు రెండు వైపులా ఉంటుంది. సినిమాలో ప్రధానంగా ఏం ఉందో అదే నేర్చుకుంటారు. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు. సెన్సార్బోర్డు ఒక సినిమాకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ‘ఏ’ సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు శృంగార దృశ్యాలున్న సినిమాలకు మాత్రమే పిల్లలను మినహాయిస్తున్నారు. హింస ఉన్న సినిమాల విషయంలో పట్టింపుగా ఉండడం లేదు. పిల్లలను పక్కదారి పట్టిస్తున్న మాధ్యమాల్లో సినిమాలతోపాటు టీవీ ప్రసారాలు, సోషల్ మీడియాను కూడా ప్రస్తావించాలి. పిల్లల క్షేమం దృష్ట్యా ఆలోచించి నప్పుడు మనదేశాల్లో పటిష్టమైన నియమాలు లేవు.’’ అన్నారు విద్యావేత్త రేఖారావు. పాడైన విద్యార్థుల లెక్క తేలేదెలా? పిల్లల మీద సినిమాల ప్రభావం తీవ్రరూపం దాల్చింది. ఆ దుష్ప్రభావం పిల్లల భవిష్యత్తు మీద కూడా చూపిస్తుందని టీచర్లు ఆందోళనపడుతున్నారు. పిల్లలను సరిచేయడానికి మందలింపుగా ఒక మాట అంటే చాలా హింసాత్మకంగా స్పందిస్తున్నారని, ఇలాగే కొనసాగితే సమాజానికి మంచి పౌరులను అందించలేమని ఆవేదన చెందుతున్నారు. మరి ఇలాంటి సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్లు ఏం చేస్తున్నారు? సదరు సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే లెక్కల గొప్పలు చెప్పడానికి ముందుంటారు. కానీ తమ సినిమా చూసిన తర్వాత ఎంతమంది పిల్లలు పాడయ్యారో లెక్కచెప్పే ధైర్యం వాళ్లకుంటుందా? ఒకప్పుడు సిగరెట్ గాల్లోకి ఎగరేసి పెదవులతో పట్టుకోవడం హీరోయిజంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది. కేవలం స్టయిల్ అనే భావనతో సిగరెట్ అలవాటు చేసుకున్న నాటి యువతరం ఇప్పుడు అరవైలు– డెబ్బైలకు చేరి క్రమం తప్పకుండా లంగ్స్ టెస్ట్లు చేసుకుంటోంది. హీరోలు తమ పిల్లలను కూడా ఈ మత్తులోనే ఉంచుతున్నారా? సమాజంలోని పిల్లల పట్ల వారికి బాధ్యత అక్కర్లేదా? లేజీ పేరెంటింగ్ పరిణామాలివన్నీ ప్రశాంతంగా ఉండాల్సిన పిల్లలు ముఖాలు ఆవేశంగా, అలసటగా, ఆందోళనగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు సినిమాలు చూసి, పగలు క్లాస్రూమ్లో కునికిపాట్లు పడుతుంటారు. దీనికి బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు కథలు చెప్పే ఓపిక లేక వీడియో గేమ్స్కు అలవాటు చేస్తున్నారు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి పిల్లలు తమ మాట వినడం లేదని కంప్లయింట్ చేస్తుంటారు. సినిమాలు చూసి పాడయిపోతున్న మాట నిజమే. పిల్లల ఖాళీసమయాన్ని సద్వినియోగం చేస్తే కదా! పెద్దవాళ్లను, టీచర్లను గౌరవించాలనే బుద్ధి పుట్టించే కథలను వాళ్లకు చెప్పి ఉంటే తల్లిదండ్రులను, టీచర్లను ధిక్కరించే ఆలోచనే రాదు. కథలు చెప్పే ఓపిక చాలామంది పేరెంట్స్కు ఉండడం లేదు. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ సొల్యూషన్స్ ఉన్న కథలు మనకెన్నో ఉన్నాయి. కాకి నీటి కోసం కుండలో రాళ్లు వేసిన కథ. నోటిమాటతో డోర్ ఓపెన్ అయ్యే కథల్లో టెక్నాలజీ దాగి ఉంది. ఎలుకలను అమ్మే కథలో స్టార్టప్ మార్గం ఉంది. పంచతంత్ర కథల్లో లేనిదేమిటి? పిల్లల్లో ఇలాంటి అవాంఛిత ధోరణికి సినిమా అనేది ప్రత్యక్ష కారణం అయితే లేజీ పేరెంటింగ్ పరోక్ష కారణం. – రేఖారావు, విద్యావేత్త – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!
ఐటీ రంగంలో చాలా ఏళ్లు పనిచేసిన 31 ఏళ్ల స్మృతి మిరానీ "భారతీయ మత్స్యకన్య"గా మారతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా రికార్డు సాధించింది. 40 మీటర్ల నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్మృతి మిరానీ. IIT బాంబే ఇంజనీర్ నుంచి భారతదేశపు తొలి మహిళా ఫ్రీ-డైవింగ్ రికార్డ్ హోల్డర్ వరకు ఆమె పయనం చాలా స్ఫూర్తి దాయకం. ఇది కేవలం రికార్డులను బద్దలు కొట్టడం గురించి మాత్రమే కాదు. తనకెదునైన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, అభిరుచి, పట్టుదల ఎవరూ ఊహించని లోతులకు (సముద్రపు) తీసుకెళ్లగలవని నిరూపించిన వైనం గురించి కూడా.ఒక్క శ్వాస ఆమె జీవితాన్ని మార్చగలదు అంటే నమ్ముతారు. అవును స్మృతి మిరానీ విషయంలో అదే జరిగింది. ఒకే ఒక్క శ్వాసతో 40 మీటర్లకు పైగా నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా స్మృతి మిరానీ థాయిలాండ్లో చరిత్ర సృష్టించింది. ఎయిర్ ట్యాంక్ లేకుండా ఊపిరిబిగబట్టి సముద్రం లోతులకు చేరి చరిత్ర సృష్టించింది. నిజంగా ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చింది. ప్రతీ మహిళలకు గర్వకారణమైన క్షణం! View this post on Instagram A post shared by Deepak G Ponoth (@themillenialcomrade) అప్నియా కో ఫంగాన్లో ప్రపంచ ప్రఖ్యాత కోచ్ లుకాస్ గ్రాబోవ్స్కీ ఆధ్వర్యంలో చాలా కఠోరమైన శిక్షణ తీసుకుని తనను తాను తీర్చుకుంది. రికార్డులను బద్దలు కొట్టడానికి తన శారీరక,మానసిక బలాన్ని సాధించింది. ఫ్రీ-డైవింగ్లో ఎయిర్ ట్యాంక్ లేదా శ్వాస ఉపకరణాలు లేకుండా సాధించాలంటే శ్వాసతీసుకోవడం అనే కళను అలవర్చుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని శ్రద్ధగా సాధన చేసే మెంటల్ గేమ్ లాంటిది అంటారామె.తాను నీటి అడుగున ఉన్నప్పుడు తనకు తాను అత్యంత సన్నిహితంగా అనిపిస్తుంది” అని గర్వంగా చెబుతుందామె. ’’ ఇపుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాను, నాకు నేనే సవాళ్లు విసురుకుంటా.. భయాన్ని అధిగమించాను. ఫ్రీ-డైవింగ్ ఆనందాన్ని గుర్తించాను’’ అంటుంది. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్అండమాన్ దీవులలో ఊహించని విధంగా ఆమె ప్రయాణం ప్రారంభమైంది. తొలిసారి ఫ్యామిలీతో వెళ్లినపుడు స్కూబా-డైవింగ్ నేర్చుకోవాలని ప్రయ్నత్నించింది. రెండోసారి విజయం సాధించింది. ఆ తరువాత 2019లో రిమోట్గా పనిచేస్తున్నపుడు స్కూబా-డైవింగ్ను కొనసాగించడానికి వెళ్లినపుడు తాబేలుతో పాటు ఫ్రీ-డైవర్ ఈత కొట్టడం చూడటం జీవితం దృక్పథాన్ని మార్చివేసింది. అప్పటినుంచి సముద్రమే నివాసంగా మారి పోయింది. స్మృతి అప్పటి నుండి మాల్టా, బాలి, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జలాల్లో కొన్నింటిలో డైవ్ చేసింది. సర్టిఫైడ్ ఫ్రీ-డైవింగ్ బోధకురాలిగా ఎదిగింది. అనేక మందికి శిక్షణనిస్తోంది. వారిలో తమ సామర్థ్యాన్ని అన్వేషించి, వారి భయాలను అధిగమించవడానికి శక్తినిచ్చే లక్ష్యంతో ఉంది.
ఫొటోలు
National View all

‘అతడికి ఉరిశిక్ష సరైందే’.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర పూణేలోని ఓ పోలీస్ స్టేషన్కు కూత వే

విఫలమైతే క్షమాపణలు: కుంభమేళా బ్లాగ్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ:‘మహా కుంభమేళా(Maha

Himachal: ఎడతెగని హిమపాతం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్(

పని మాత్రమే కాదు.. నిద్ర కూడా ముఖ్యమే: కర్ణాటక హైకోర్టు
విధి నిర్వహణలో ఒక ఉద్యోగి నిద్రపోవడం తప్పేలా అవుతుందని, సామర్థ్యానికి మ

USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. వీసా కోసం పేరెంట్స్ ఆవేదన
వాషింగ్టన్: అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
International View all

‘‘అయ్యా ట్రంప్.. ఇలాంటి బతుకులెందుకు?’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి.

బందీల విడుదలకు మార్గం సుగమం
జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య బందీల విడుదలకు మార్గం సు

Russia-Ukraine war: మూడేళ్లలో 1,65,000 మంది రష్యా సైనికులు మృతి
మాస్కో: ఉక్రెయిన్తో పోరాడుతూ 165,000 సైనికులు మరణించారని రష

40 ఏళ్ల తరువాత తల్లిని చేరిన కూతురు
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా!

విశ్వం మూలాలపై నాసా అన్వేషణ
వాషింగ్టన్: మనం ఉంటున్న ఈ సువిశాల విశ్వం ఎలా పుట్టింది?
NRI View all

అమెరికా నుంచి భారత్కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. వీసా కోసం పేరెంట్స్ ఆవేదన
వాషింగ్టన్: అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Hong kong: హాంకాంగ్లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం
శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ
క్రైమ్

ఆటోడ్రైవర్ అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్ (40), మమత (33) దంపతులు, అతడు ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సురేశ్ ఈ మధ్య సరిగా పనికి వెళ్లకపోవడంతో మమత గొడవపడేది. బుధవారం పండుగ అని ఇంట్లోనే ఉన్నాడు. మమత ప్రశ్నించడంతో రగడ మొదలైంది. ఆ సమయంలో వారి కొడుకు (6) అక్కడే ఉన్నాడు. సురేశ్ కోపం పట్టలేక మమతను గొంతు నులిమి చంపి, తరువాత తానూ ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సురేశ్ భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని, ఈ విషయాన్ని మమత సురేశ్ తల్లికి చెప్పడంతో సహించలేక హత్య చేసినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తాళి కట్టమంటే పాడె కట్టిండు
వర్గల్(గజ్వేల్): వారిది ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం.. గుట్టుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి జీర్ణించుకోలేక పథకం ప్రకారం హత్య చేసి ఆమెను కాటికి పంపాడు. దర్యాప్తులో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పది రోజుల కిందట జాడ తెలియకుండా పోయిన వర్గల్ మండలం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కోమటిబండ అడవిలో మృతదేహాన్ని గుర్తించి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) 15వ తేదీన బ్యాంక్కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు దార సాయికుమార్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజీలు, లోకేషన్లు, కాల్డేటాలు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య(39)ను మంగళవారం విచారించారు. ఏడాదిన్నర నుంచి అతడికి యాదమ్మతో వివాహేతర సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆరునెలల నుంచి పెండ్లి చేసుకోవాలని యాదమ్మ ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. 15న మధ్యాహ్నం పథకం ప్రకారం యాదమ్మను బైక్ మీద గజ్వేల్ సమీప కోమటిబండ అడవిలోకి తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకు తెలియకుండా పురుగుల మందు కలిపాడు. యాదమ్మ తాగిన తర్వాత కింద పడేసి మెడచుట్టూ చీర బిగించి హతమార్చాడు. నిందితుడిపై హత్య నేరంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తత యాదమ్మ హత్యోదంతం నేపథ్యంలో బుధవారం ఆమె కుటుంబీకులు, బంధువులు ఆగ్రహంతో అనంతగిరిపల్లిలోని నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్సీఐ మహేందర్రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

పుణె బస్టాండ్లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్జంక్షన్లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్లోని ఒక ప్లాట్ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్స్టేషన్కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు.

పుణ్యస్నానాలకు వెళ్లి ఏడుగురి మృతి
కొవ్వూరు/తాళ్లపూడి/శ్రీశైలం ప్రాజెక్ట్/కొళ్లికూళ్ల (పెనుగంచిప్రోలు): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నదీ స్నానాలకు వెళ్లిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకులు కాగా, ఇద్దరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తండ్రి, కుమారుడు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన 12 మంది యువకులు బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మోటారు సైకిళ్లపై సమీపంలోని చింతలపూడి పంప్హౌస్ వద్ద గోదావరి నదిలో స్నానాలకు వెళ్లారు. అక్కడి ఇసుక ర్యాంపు వద్ద నీరు మూడు అడుగులే ఉండటంతో స్నానాలకు దిగారు. కేరింతలు కొడుతూ ఉత్సాహంగా స్నానాలు చేస్తూ నీరు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లేసరికి ప్రవాహం పెరగడంతో తిరుమలశెట్టి సాయిపవన్ (17), పడాల దుర్గాప్రసాద్ (19), అనిశెట్టి పవన్ గణేష్ (18), పడాల దేవదత్త సాయి (19), గర్రే ఆకాశ్ (19) కొట్టుకుపోయారు. వెంటనే స్థానిక జాలర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పడవలతో గాలించారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారే. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం వద్ద తండ్రి, కుమారుడు మృతి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల గ్రామానికి చెందిన పెరుగు చిన్న గురవయ్య (35), ఆయన కుమారుడు వాసు (11) శ్రీశైలం లింగాలగట్టు వద్ద కృష్ణా నదిలో మునిగి మరణించారు. శివ దీక్ష తీసుకున్న గురవయ్య, భార్య తిరుపతమ్మ, కుమారుడు వాసు, ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు మంగళవారం బస్సులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. బుధవారం ఉదయం స్నానాలు చేసేందుకు లింగాలగట్టు వద్దకు వెళ్లారు. కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా వాసు కాలు జారి నీటిలో పడిపోయాడు. కుమారుడిని కాపాడబోయిన చిన్న గురవయ్య కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న తిరుపతమ్మ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని మత్స్యకారులు నదిలో దూకి వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురవయ్య, వాసు మృతదేహాలను పోలీసులు సున్నిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.