Top Stories
ప్రధాన వార్తలు

అమానుషం.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై టీడీపీ దౌర్జన్యం
రాష్ట్రంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. నిరసనకారుల ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షికి ఆపాదిస్తూ సాక్షి కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ముందుగా ప్లాన్ చేసి ‘సాక్షి’పై దాడులకు దిగుతుంది పచ్చపార్టీ. ఆ వ్యాఖ్యలతో సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా అసత్య ఆరోపణలతో దాడులకు పాల్పడుతుంది పచ్చదండు. సాక్షిపై అసత్య ఆరోఫణలు అనేవి కేవలం దాడులు చేసేందుకే అనే విషయం తేటతెల్లమైంది. టీడీపీ గూండాల దాడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర బట్టబయలైంది. విజయవాడ సాక్షి మీడియా కార్యాలయం పై టిడిపి పార్టీ రౌడీల దాడుల పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదుసాక్షి మీడియా కార్యాలయం పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్డీసీపీ సరితకు వినతిపత్రం అందించిన విజయవాడ బ్రాంచి మేనేజర్ యశోధరాజు, సాక్షి పేపర్, టీవీ ప్రతినిధులుకర్నూలు:సాక్షి పత్రిక మీడియా కార్యాలయంపై టీడీపీ రౌడీల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయులురాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి మీడియా పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరిన జర్నలిస్టుల సంఘాల నేతలుకర్నూలు ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీనివాస్ ఆచారికి వినతి పత్రాన్ని అందించిన సాక్షి మీడియా పాత్రికేయులు సాక్షి కార్యాలయాలపై టీడీపీ కుట్రపూరిత దాడులు👉 ఏపీలో అన్ని జిల్లాల్లో సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తల భౌతిక దాడులు 👉టీడీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాడులకు కుట్ర👉రాళ్లు, కర్రలతో దాడులు చేస్తన్న టీడీపీ గూండాలు👉దాడులకోసం ఉదయం నుంచి టీడీపీ మూకల మోహరింపు👉పథకం ప్రకారం ఆర్గనైజ్డ్గా సాక్షి కార్యాలయాలపై దాడులు👉విజయవాడ, మంగళగిరి, వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళంలో దాడులు👉సాక్షి బోర్డులు ధ్వంసం చేసి, ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నం👉అన్ని జిల్లాల్లో సాక్షి ఆఫీసులపై దాడులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు👉రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న అధికార పార్టీ👉రాష్ట్ర చరిత్రలో ఏ మీడియాపైనా జరగని రీతిలో టీడీపీ నేతల దాడులు మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ దౌర్జన్యం👉సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం👉మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు దౌర్జన్యం👉. టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు కలిసి సాక్షి కార్యాలయం బోర్డు ధ్వంసం👉బోర్డున ధ్వంసం చేసిన మాదిగ కార్పోరేషన్ చైర్మన్ శిరీష్👉అడ్డుకునేందుకు పోలీసులు యత్నం, వాగ్వాదంఆందోళన పేరుతో విజయవాడ, మంగళగిరి, తిరుపతి, కడప, శ్రీకాకుళం, అనంతపురంలోని సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. రేణిగుంట సాక్షి ఆఫీస్ వద్ద టీడీపీ గూండాల బీభత్సం సృష్టించారు. రేణిగుంటలోని సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి దిగారు. అదే సమయంలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై సైతం టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. నిరసనకారల ముసుగులో సాక్షి కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు.. సాక్షి బోర్డు తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. శ్రీకాకుళం, కడప సాక్షి కార్యాలయాల వద్ద కూడా పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు.

కొమ్మినేని అరెస్ట్పై వైఎస్ జగన్ స్పందన
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం (జూన్9న) ఉదయం హైదరాబాద్ తన నివాసంలో ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ అరెస్టుపై వైఎస్ జగన్ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా @ncbn గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 9, 2025

‘కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష గట్టారు.. సాక్షి ఆఫీస్పై ఉన్మాదపు చర్య’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సంప్రదాయానికి తెర లేపింది. కిర్రాక్ ఆర్పీ, సీమ రాజాలాంటిళ్లు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఎల్లో చానెల్స్ దారుణంగా మాట్లాడుతున్నాయి. అయినా పట్టించుకోరు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని అరెస్ట్ అప్రజాస్వామికం. చంద్రబాబు ఆయనపై కక్ష గట్టారు. కొమ్మినేనిని దారుణంగా తిడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోగేసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్ మీద జరిపారు. మరి దీనిని ఏమనాలి?. ఇది ఉన్మాదపు చర్య కాదా?.. అని అంబటి ప్రశ్నించారు.కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్(Kommineni Srinivasa Rao Arrest) అక్రమం. డైవర్షన్ పాలిటిక్స్కు ఇదొక ఉదాహరణ. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. లేని అంశాన్ని ఉన్నట్లుగా చూపేందుకు చంద్రబాబు,ఆయన అనుకూల మీడియా ప్రయత్నం చేస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతో సీనియర్ జర్నలిస్ట్. చంద్రబాబు తప్పుల్ని ఖండించే ప్రయత్నం చేసినందుకు ఎన్టీవీ పై ఒత్తిడి తెచ్చి కొమ్మినేని లైవ్ షో ఆపేశారు. కొమ్మినేనిని తీసేస్తేనే ఛానల్ ప్రసారాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్టీవీలో తీసేస్తేనే కొమ్మినేని సాక్షిలో చేరారు. తన డిబేట్లలో కొమ్మినేని నిక్కచ్చిగా మాట్లాడతారు. మా సామాజికవర్గమై మమ్మల్నే విమర్శిస్తావా అని కొమ్మినేని పై చంద్రబాబు కక్ష కట్టాడు. టివి5,ఏబీఎన్ లో జరిగే డిబేట్లకు ఆ ఛానల్ యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయా?. తోటి జర్నలిస్ట్ ఒకడు ‘ఒరేయ్’ అని సంభోదిస్తాడు. ఏ కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నారు టీవీ5,ఏబీఎన్లో?. కృష్ణంరాజు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పు కావొచ్చు. దానికి ఛానల్కి, కొమ్మినేనికి ఏం సంబంధం?. చంద్రబాబు దేశంలోని అన్ని మీడియాలను మభ్యపెట్టినా... సాక్షిని మభ్యపెట్టలేకపోయాడు. అందుకే సాక్షి పై కక్ష కట్టి బురద జల్లుతున్నాడు. చంద్రబాబు ప్రేమ అమరావతి రైతుల మీద కాదు...అమరావతిలో తాను దోచుకునే భూముల మీద. జగన్ మోహన్ రెడ్డి, భారతిపై చాలా దారుణంగా పోస్టులు పెట్టిన వాళ్ల పై చర్యలు లేవు. నేనే స్వయంగా కిరాక్ ఆర్పీ,సీమ రాజా మీద ఫిర్యాదు చేశా.. కనీసం పట్టించుకోలేదు. కానీ కొమ్మినేని వంటి వారిని మాత్రం హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు. ఇదెక్కడి ధర్మం?. బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేని పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. సాక్షి ఛానల్ను ఆపాలని చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నారు. కేసులుపెట్టి ఛానల్ ను ఆపాలని ప్రయత్నించారు...కానీ తట్టుకుని సాక్షి నిలబడింది. టీవీ ఛానల్స్ లో కొన్ని వందల డిబేట్లు నడుస్తాయి...దానికి ఆ ఛానల్ ను బాధ్యుల్ని చేస్తారా?. సాక్షి కార్యాలయాల పై దాడులు చేస్తారా. ఒక పథకం ప్రకారం మొదట టీడీపీ, తర్వాత లోకేష్, ఆ తర్వాత చంద్రబాబు, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తారు. నేనూ అనేక డిబేట్లలో పాల్గొన్నా. డిబేట్లకు వచ్చిన వ్యక్తులు మాట్లాడితే ఆ ఛానల్స్ కు ఆపాదిస్తారా?. రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్. కానీ కొమ్మినేని అరెస్ట్ ఒక్కటే తమకు ముఖ్యమైన పనిలాగా చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు చాలా దారుణమైన కార్యక్రమానికి పూనుకున్నారు.బాధ్యత కలిగిన టీడీపీ నాయకులు కూడా సాక్షి కార్యాలయం పైకి దాడులకు వెళతారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు జనాన్ని పోగేసుకొచ్చారు. సందుదొరికింది కదా అని సాక్షి పైనో మరో కార్యాలయం పైనో దాడులు చేయడం కరెక్టేనా?. ఇలాగైతే సమాజం ఎటుపోతుంది. మాకూ వ్యతిరేకంగా ఉన్న మీడియాలకు కార్యాలయాలున్నాయ్ కదా!. అక్రమ కేసులుపెట్టి అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు అంతకంటే ఏం చేయగలరు?. ఇప్పటికే చాలామందిని జైల్లో పెట్టారు కదా. పరిపాలన చేతకాని వారే ఇలా అరెస్టులతో కాలక్షేపం చేస్తారు. అరెస్టుల పైన పెట్టిన శ్రద్ధ ప్రజల సమస్యల పై పెడితే బాగుంటుంది అని అంబటి రాంబాబు చంద్రబాబుకి హితవు పలికారు.

ఐపీఎల్లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్?
మధ్యప్రదేశ్ లీగ్(MPL) రెండో ఎడిషన్కు సర్వం సిద్దమైంది. ఈ ఏడాది ఎంపీఎల్ సీజన్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి ఎడిషన్లో కేవలం ఐదు జట్లు మాత్రమే పోటీ పడగా.. ఇప్పుడు మరో రెండు ఫ్రాంచైజీలు ఇండోర్ పింక్ పాంథర్స్, చంబల్ ఘరియల్స్ కొత్తగా చేరాయి.ఈ టోర్నీలో ఫ్రాంచైజీ ఇండోర్ పింక్ పాంథర్స్తో కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జతకట్టాడు. గత సీజన్లో గ్వాలియర్ చీతాస్కు ప్రాతినిథ్యం వహించిన అయ్యర్.. ఇప్పుడు పింక్ పాంథర్స్కు ఆడనున్నాడు.అంతేకాకుండా తమ జట్టు కెప్టెన్సీని వెంకటేశ్ అయ్యర్కు అప్పగించాలని పాంథర్స్ యాజమాన్యం భావిస్తోంది. అతడి ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఎంపీఎల్-2024లో 8 మ్యాచ్లలో 58.57 సగటుతో 480 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025లో ఫెయిల్..కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ తీవ్రనిరాశపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన మూడో ఆటగాడిగా నిలిచిన అయ్యర్.. ఏ మాత్రం తన ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో అయ్యర్ను రూ.23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. సీజన్ మొత్తంలో అతడు 11 మ్యాచ్లలో 7 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడి, 142 పరుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు.చదవండి: WTC final: 'చోకర్స్ ట్యాగ్ను చెరిపేయాలి'.. సౌతాఫ్రికాకు బౌచర్ పిలుపు

భర్తలకు స్పాట్.. రాజాలా బలవుతున్న భర్తలెందరో!
‘‘అరె మామా.. పెళ్లంటేనే భయమైతుంది రా’’ అంటూ తన స్నేహితుడు రవికి ఫోన్ చేసి ఆందోళనగా చెబుతున్నాడు విష్ణు. ‘‘సడన్ ఎందుకు మామా అలా అనిపిస్తోంది?’’ అంటూ అవతలి నుంచి రవి వాయిస్ వినిపించింది. ‘‘అరేయ్.. మేఘాలయా హనీమూన్ కోసం వెళ్లిన జంట మిస్ అయ్యిందని మొన్న ఓ వార్త లింకు పంపాను కదరా’’ అంటూ గుర్తు చేశాడు విష్ణు. ‘‘ఆ.. అవును.. పాపం ఆ భార్యకి కూడా ఏమైందో తెల్వదంట కదా!. అయితే ఏమైంది ఇప్పుడు’’ అన్నాడు రవి. ‘‘ఏం లేదురా.. ఆ మొగుడ్ని చంపింది ఆ భార్యేనంట!!’’ అంటూ విష్ణు చెప్పడంతో షాక్ తినడం ఇవతల రవి వంతైంది. మేఘాలయా హనీమూన్ జంట మిస్టరీ మిస్సింగ్ ఎపిసోడ్లో బయటపడ్డ ట్విస్ట్ గురించి రవి-విష్ణులాంటి వాళ్లెందరో చర్చించుకుంటున్నారు. అదీ సోషల్ మీడియా వేదికగా..!. మరో వ్యక్తితో బంధంలో ఉండి కూడా రాజా రఘువంశీని వివాహం చేసుకోవడం, ఆపై అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో స్కెచ్ వేయడం.. హనీమూన్లోనే భర్తకు స్పాట్ పెట్టడం.. ‘‘అసలు ఈ పెళ్లిళ్లు ఎందుకయ్యా?’’ అని చర్చను సోషల్ మీడియాలో తెర మీదకు తెచ్చింది. అయితే ఇందుకు ఈ ఒక్క కేసే కాదు.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలే కారణం. సిమెంట్ డ్రమ్ము అంటేనే.. ప్రాణంగా ప్రేమించి మరీ పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు సౌరభ్ తివారీ. అలాంటిది తన గంజాయి ‘ఛప్రీ’ ప్రియుడు షాహిల్ శుక్లా కోసం భర్తనే కడతేర్చింది ముస్కాన్ రస్తోతి. భర్తకు మత్తు మందు ఇచ్చి, ఆపై చంపి ముక్కలు చేసి.. ఆ బాడీని పెద్ద డ్రమ్ములో కుక్కి సిమెంట్తో ముంచేశారు. ఆపై.. సౌరభ్ కుటుంబాన్ని నమ్మించేందుకు అతని ఫోన్ నుంచి సందేశాలు పంపుతూ ఏకంగా 12 రోజులపాటు ఈ గంజాయి జంట సరదాగా గడిపింది. అయితే తిరిగి వచ్చాక శవాన్ని మాయం చేసే క్రమంలో సీల్డ్ డ్రమ్ము పగిలిపోవడంతో.. భయపడిన ముస్కాన్ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బంగారం లాంటి భర్తను చంపిన ముస్కాన్ను ఆమె తల్లిదండ్రులే దగ్గరుండి పోలీసులకు అప్పగించడం ఈ కేసులో కొసమెరుపు. ప్రస్తుతం ముస్కాన్, షాహిల్ శుక్లా జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. ఇండోర్ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భర్తకు అడ్డంగా దొరికిన యూట్యూబర్ ఆపై.. రవీనా ఓ యూట్యూబర్. అయితే ఆమె చేసే వీడియోలు భర్తకు నచ్చేవి కాదు. దీంతో తనను మందలించడమే తన భర్త పనిగా పెట్టుకున్నాడనుకుని ఆమె రగలిపోయింది. ఈ క్రమంలో ఓరోజు సోషల్ మీడియాలో సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన కంటెంట్ను పొగడ్తలతో ముంచెత్తడంతో సురేష్ ప్రేమలో పీకల లోతుల ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. మార్చి 25వ తేదీన ఇంట్లోనే ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దీనిపై నిలదీసిన భర్తను ఇద్దరూ కలిసి ఊపిరిరాడకుండా చేసి కడతేర్చారు. ఆ కరాళ రాత్రిలో భర్త మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్పై తీసుకెళ్లి నగర శివారులోని పడేశారు. విచారణలో హర్యానా భివానిలో జరిగిన ఈ ఘోరం బయటపడింది. భర్తను కడతేర్చి ఆపై పక్కలో.. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, రాత్రంతా అతని మంచంలోనే ఉంటూ కాటు వేస్తూనే ఉందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని ఆ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఇది భార్య చేసిన కుట్ర అని తెలుసుకోవడానికి పోలీసులకు ఎంతో టైం పట్టలేదు. మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిరిత్యా బయటి ప్రాంతాలకు వెళ్తుండడంతో.. అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అమిత్.. భార్యను మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి స్కెచ్ గీసింది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని ఊపిరాడకుండా చంపేసింది. ఆపై అద్దెకు పామును తెచ్చి భర్త మృతదేహం మీద కాట్లు వేయించి మంచంలో పడేసింది. అప్పటికే ప్రాణం పోవడం విషం శరీరానికి ఎక్కలేదు. బదులుగా.. పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.పెళ్లై పదిరోజులు తిరగకుండానే.. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనమ్తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మే 20వ తేదీన హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది ఈ జంట. అయితే ఈ జంట ఆచూకీ లేకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. ప్రతికూల వాతావరణంలోనూ దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ లోపు.. రాజా రఘువంశీ మృతదేహం దొరకడంతో సోనమ్ ఆచూకీ కోసం అతని కుటుంబం కంగారుపడింది. ఈలోపు విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. సోనమే రాజాను హత్య చేయించిందని!. తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్ కుష్వాహ్తో ఆమె ప్రేమలో ఉందని, ఆ విషయం తెలిసి తండ్రి మందలించాడని, ఆపై బలవంతంగా రాజా రఘువంశీకి ఇచ్చి వివాహం చేయడంతో ఆమె భర్తను వదలించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి సాయంతో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ను సంప్రదించి తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చిందామె. అలా.. మూడు రోజుల తర్వాత రాజా రఘువంశీని వాళ్లు మట్టుపెట్టారు. విచారణలో ఈ షాకింగ్ విషయం బయటపడడంతో అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీమూన్ వెళ్లే ముందు రఘువంశీని ఒత్తిడి చేసి మరీ రూ.10 లక్షల విలువైన బంగారు నగలు అతని ఒంటిపై వేయించిందని, వాటి కోసమే హత్య జరిగిందన్న కోణంలో నమ్మించాలని ప్రయత్నించింది. అయితే ఆమె రిటర్న్ టికెట్స్ బుక్ చేయకపోవడంతో మొదలైన అనుమానం.. చివరకు మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ముంబై, థానే, నవీ ముంబైలో గత నాలుగు నెలల్లో.. ఇలా భర్తలను వివాహేతర సంబంధం కోసం బలిగొన్న భార్యల కేసులు ఆరు దాకా నమోదు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకోవడం. అయితే ఇందులో ఒక కేసులో ప్రియుడు తాను తప్పు చేశానని గ్రహించి దగ్గరుండి ఆమెను మళ్లీ భర్త దగ్గర దిగబెట్టగా.. మరో కేసులో మాత్రం ఆ భర్త చేసిన త్యాగం అలాగే మిగిలిపోయింది.

ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. బస్పాస్ చార్జీలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులపై చార్జీల బాదుడుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక, పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. బస్ పాస్ ఛార్జీలు పెరగడంపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన రేట్ల ప్రకారం.. రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ రూ.1600లకు పెంపురూ.1,150 ఉన్న ఆర్డీనరీ బస్ పాస్ రూ.1400లకు పెంపు. బస్ పాస్ చార్జీలు భారీగా పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కాలేజీలకు ఎలా వెళ్లాలని విద్యార్థులు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి మఫ్టీలో చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మినేని పోలీసులను నిలదీయడం గమనార్హం.ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటికి ఎందుకు వచ్చారని కొమ్మినేని అడిగారు. దీంతో, పోలీసులు.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, కేసు ఏంటని కొమ్మినేని ప్రశ్నించగా.. వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అరెస్టు చేసి వాహనంలో తరలించారు. ఎఫ్ఐఆర్ కాపీని మాత్రమే చూపించి.. ఆయనను వాహనంలో తీసుకువెళ్లారు. అరెస్ట్ సమయంలో లోకల్ పోలీసులు లేకపోవడం విశేషం. మరోవైపు, ఇంటి వద్ద అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఏపీ పోలీసుల్ని కొమ్మినేని శ్రీనివాసరావు పలు ప్రశ్నలు సంధించారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?. ముందస్తు నోటీసులు ఇచ్చారా? లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారా?.. అని అడిగారు. అందుకు ఏపీ పోలీసులు నోరు మెదపలేదు. కానీ అరెస్ట్ అనంతరం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏపీ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు. కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులకు తుళ్లూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం, కొమ్మినేనిని ఏపీకి తరలించారు. ఒక సీనియర్ జర్నలిస్టుకే ఇలాంటి పరిస్థితా? కొమ్మినేనిఏపీ పోలీసుల అక్రమ అరెస్ట్పై కొమ్మినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సీనియర్ సిటిజన్ని.. ఎలా అరెస్ట్ చేస్తారు? సీనియర్ జర్నలిస్ట్ ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటి?. కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదు. సాక్షిలో నా డిబేట్లు రాకుండా చేయాలని చూస్తున్నారేమో. ప్రభుత్వ వ్యతిరేకత వాయిస్ వినిపించకుండా చేసే యత్నం’ జరుగుతోందని అన్నారు.కొమ్మినేనిపై నమోదైన సెక్షన్లుకొమ్మినేని శ్రీనివాసరావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 79,196(1) 353 (2),299,356(2),61(1),bns 67 ఐటీఏ 3(1), ఎస్సీఎస్టీ పీవోఏ యాక్ట్ నమోదైంది.సంబంధం లేదని చెప్పినా పట్టించుకోని ఏపీ ప్రభుత్వంమరోవైపు, ఇటీవల అమరావతి మహిళల విషయమై జర్నలిస్ట్, విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యల్ని సాక్షి యాజమాన్యం ఇప్పటికే ఖండించింది. కొమ్మినేని శ్రీనివాసరావు సైతం ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. అమరావతి మహిళలకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇలా అరెస్ట్ చేయడం గమనార్హం. ఇక, సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు సర్ధి చెప్పారు. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని పదే పదే స్పష్టం చేసినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిన్న, ఇవాళ తన లైవ్ షోలో కృష్ణంరాజు తరుఫున.. కృష్ణంరాజు వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని కొమ్మినేనిపై ఏపీ ప్రభుత్వం రెడ్బుక్ ప్రయోగించింది.జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించిన సాక్షి టీవీగత శుక్రవారం నాటి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి టీవీకి ఆపాందించడం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని.. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను.. సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్ధించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది.ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు: కృష్ణంరాజుఇదిలా ఉండగా, కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైన కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు.

త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?
తెలుగులో టాప్ డైరెక్టర్స్ అనగానే గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్. రైటర్గా కెరీర్ మొదలుపెట్టిన ఈయన.. టాలీవుడ్లో స్టార్ హీరోలతో గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో తీశారు. అలాంటి ఈయన పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదు. పేరుకే స్టార్ డైరెక్టర్ గానీ సరైన కాంబో సెట్ చేసుకోలేక పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో ఎలా ఉండే త్రివిక్రమ్ ఎలా అయిపోయారా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది?త్రివిక్రమ్ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు, పంచ్లు, ప్రాస డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత ఈయన.. దర్శకుడిగా పూర్తిగా గాడి తప్పారా అనిపిస్తుంది. ఎందుకంటే 'అల వైకుంఠపురములో' తర్వాత ఎన్టీఆర్తో ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. దీంతో మహేశ్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. తొలుత ఓ సబ్జెక్ట్తో సినిమా మొదలుపెట్టారు గానీ కొన్నిరోజులకే దాన్ని పక్కనబెట్టి మరో కథతో సినిమా తీసి రిలీజ్ చేశారు. అదే 'గుంటూరు కారం'. మహేశ్ అభిమానులకు ఈ మూవీ నచ్చింది గానీ మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)'గుంటూరు కారం' గతేడాది సంక్రాంతికి వచ్చింది. అప్పటి నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉంటున్నారు. మధ్యలో అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ సెట్ అయింది. భారీ బడ్జెట్తో మైథలాజికల్ కథతో దీన్ని తీస్తున్నామని నిర్మాత నాగవంశీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో గానీ అల్లు అర్జున్.. దీన్ని పక్కనబెట్టి అట్లీతో సినిమా మొదలుపెట్టారు. ఫలితంగా త్రివిక్రమ్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. రామ్ చరణ్, వెంకటేశ్తో సినిమాలు చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి చేసినా సరే టాలీవుడ్కే పరిమితమయ్యే మూవీస్ అవుతాయేమో?త్రివిక్రమ్తో పాటు దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి, సుకుమార్ లాంటి చాలామంది డైరెక్టర్స్.. ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో టాప్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఏ హీరోతో మూవీ చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు దర్శకుడిగా ఎవరితో సినిమా చేయాలా అనే దగ్గర నుంచి బన్నీతో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అనేది తెలియని పరిస్థితి. మరి ప్రస్తుత అడ్డంకులన్నీ దాటుకుని త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)

చంద్రబాబు,పవన్,లోకేష్ కనుసన్నల్లోనే.. కొమ్మినేని అరెస్ట్ ముందు జరిగిన కుట్ర
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్ రేప్, ఇంటర్ విద్యార్థిని హత్యా ఘటనలతో ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నినుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు సర్కారు కేఎస్ఆర్ లైవ్ షోను అడ్డం పెట్టుకుంది. తాను చేయని వ్యాఖ్యలకు.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించింది. అయితే ఈ అరెస్ట్కు ముందుకు కొమ్మినేనిపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రకు తెరతీసింది. ఆ కుట్రంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. అసలేం జరిగిందంటే? ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యలను డిబేట్లో కొమ్మినేని వారించారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత.. ఈ నెల 7న ఆ వ్యాఖ్యలను ఐటీడీపీ వైరల్ చేసింది. కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్కు ఆపాదిస్తూ విషప్రచారం చేయించింది. వెను వెంటనే పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో లోకేష్ అమరావతిలో ప్రదర్శనలు చేయించారు.తాను చేసిన వ్యాఖ్యలపై కృష్ణం రాజు క్షమాపణ చెప్పినా.. వైఎస్ జగన్ కుటుంబసభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, పోస్టింగ్లు పెట్టారు. నిన్న (ఆదివారం) టీడీపీ వారితో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేయించారు.ఇది ఓ వైపు జరుగుతుండగా ప్రణాళికా బద్ధంగా నిన్న మధ్యాహ్నం 1.49కి సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా పవన్ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం 3.40కి ప్రెస్ నోట్ విడుదలైంది. తర్వాత సాయంత్రం 6.45కి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోపే హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇలా చంద్రబాబు అండ్ కో.. ఏపీలో కొనసాగుతున్న దారుణల్ని, అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు కొమ్మినేని అరెస్ట్ చేశారంటూ ఏపీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు సైతం కూటమి ప్రభుత్వం తీరును ఖండిస్తున్నారు.

పసి మనసులకు కావాలి ఆర్థిక పాఠాలు
మనీ మేనేజ్మెంట్ ఒక కళ. జీవితంలో సరైన సమయంలో సరైన ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సబ్జెక్టును పిల్లలకు దురదృష్టవశాత్తు పాఠశాలల్లో చాలా అరుదుగా నేర్పిస్తారు. పిల్లలు కూడా మనకెందుకులే ఇప్పుడే నేర్చుకోవడం అనే ధోరణితో ఉన్నారు. కానీ అది సరికాదు. పాఠశాలల్లో వీలుకాని ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్చుకోవాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కలిగి ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్న వయసులో పిల్లలు నేర్చుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం.డబ్బు సంపాదనపై స్పష్టతజీవితంలో డబ్బు పాత్ర ఎమిటో వివరంగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఎలా ఈ డబ్బు సంపాదిస్తారో స్పష్టత ఏర్పరుచుకోవాలి. అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారో ముందే అవగాహన కల్పించుకోవాలి. ఈ దశలోనే అవసరాలు, సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి.పొదుపుతో లాభాలురూపాయి ఖర్చు చేయడం మానేస్తే.. రూపాయి సంపాదించినట్లే.. ఈ సూత్రం పిల్లలు ఎప్పుడూ గుర్తించుకోవాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకోవాలి. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తున్నప్పుడు అమ్మానాన్నలు వచ్చే మనీని పొదుపు చేసి అత్యవసరమైన వస్తువులను వీరిపై ఆధారపడకుండా కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాంటప్పుడు డబ్బు విలువ అర్థం అవుతుంది.పెట్టుబడులపై అవగాహనపొదుపు, ఖర్చుపై అవగాహన వచ్చాక మెల్లిగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి. పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేసేలా పిల్లల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ పథకాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవరుచుకోవాలి.ఆర్థిక ప్రణాళికఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలన్న సూత్రాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో నేర్చుకోవాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. వంటి విషయాల్ని అవగాహన చేసుకోవాలి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలుఅప్పు గురించి తెలుసుకోవాలి..ఇంట్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాల కోసం తీసుకునే రుణాలకు సంబంధించిన వివరాలను పిల్లలు తెలుసుకోవాలి. ఎలాంటి సమయంలో అప్పు చేయాలి? అప్పు చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి.. అప్పు చేయకుండా ఉండాలంటే ఎలా మెదలాలి.. వంటి అంశాలను తెలుసుకోవాలి.
‘జాబ్స్ టియర్స్’..
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
నివురుగప్పిన నిప్పు
జీడీపీ వృద్ధి కథనం వెనుక...
పటిష్ఠ క్వారంటైన్తోనే చెక్!
దారి చూపిన నారి
ఆకాశ సిందూరం
TPCC: టీపీసీసీ కార్యవర్గం ప్రకటన
కన్నప్పలో ఆ పేర్లపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు!
‘చంద్రబాబు.. ఎల్లకాలం మీ ఆటలు సాగవు’
గ్రాండ్గా అఖిల్- జైనాబ్ రిసెప్షన్ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)
నీకు రెండో పెళ్లి నేను చేస్తా!
రెండు వేల కోట్ల అధిపతి.. శ్రీను వైట్ల ఏం అన్నారంటే..
అఖిల్ అక్కినేని సతీమణి 'జైనబ్' ఫోటోషూట్ లుక్స్ చూశారా..? (ఫొటోలు)
సాక్షి కార్టూన్ 09-06-2025
IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్దే టైటిల్.. రన్నరప్ ముంబై ఇండియన్స్..!
పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్ డాజ్లింగ్ లుక్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్
కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!
కొమ్మినేని అరెస్ట్పై వైఎస్ జగన్ స్పందన
దారులన్నీ యాదగిరిగుట్టకే..
చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఇంటిలో శుభకార్యాలు
ఈ నగరాలు...సముద్రం పాలు!
హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఎందులో అనేది మనకనవసరం! అమెరికాను అధిగమించి టాప్లో ఉన్నాం చాలు!
‘జాబ్స్ టియర్స్’..
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
నివురుగప్పిన నిప్పు
జీడీపీ వృద్ధి కథనం వెనుక...
పటిష్ఠ క్వారంటైన్తోనే చెక్!
దారి చూపిన నారి
ఆకాశ సిందూరం
TPCC: టీపీసీసీ కార్యవర్గం ప్రకటన
కన్నప్పలో ఆ పేర్లపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు!
‘చంద్రబాబు.. ఎల్లకాలం మీ ఆటలు సాగవు’
నీకు రెండో పెళ్లి నేను చేస్తా!
రెండు వేల కోట్ల అధిపతి.. శ్రీను వైట్ల ఏం అన్నారంటే..
సాక్షి కార్టూన్ 09-06-2025
IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్దే టైటిల్.. రన్నరప్ ముంబై ఇండియన్స్..!
పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్ డాజ్లింగ్ లుక్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్
కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!
కొమ్మినేని అరెస్ట్పై వైఎస్ జగన్ స్పందన
దారులన్నీ యాదగిరిగుట్టకే..
చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఇంటిలో శుభకార్యాలు
ఈ నగరాలు...సముద్రం పాలు!
హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఎందులో అనేది మనకనవసరం! అమెరికాను అధిగమించి టాప్లో ఉన్నాం చాలు!
కాంగ్రెస్లో ‘కేబినెట్ బెర్త్’ హీట్.. ముగ్గురు అసంతృప్తి నేతల దారెటు?
అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ
సినిమా

సుష్మిత సంపాదిస్తుంటే తేరగా తింటున్నావ్.. ఇల్లు కూడా నీది కాదు!
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. సుష్మితా సేన్ (Sushmita Sen) సోదరుడు, బాలీవుడ్ నటుడు రాజీవ్ సేన్ (Rajeev Sen) కూడా అందుకు అతీతుడు కాదు. అక్క ఎలాగో పెళ్లి చేసుకోలేదు.. ఆమె బాగా సంపాదిస్తుంటే తేరగా వచ్చిందని పుష్టిగా తింటున్నావ్.. ఎంజాయ్ చేస్తున్నావ్ అని కొందరు అతడిపై నోరు పారేసుకున్నారు.అక్క సంపాదనతోనే..ఈ నెగెటివ్ కామెంట్లు రాజీవ్ కంటపడ్డాయి. అతడి కష్టాన్ని గుర్తించకపోగా ఇలా తక్కువ చేసి మాట్లాడటంతో నటుడి మనసు చివుక్కుమంది. దీంతో తన యూట్యూబ్ ఛానల్లో ఈ ట్రోలింగ్పై స్పందించాడు. రాజీవ్ సేన్ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అయితే మా అక్క సంపాదించే డబ్బుతోనే బతుకుతున్నానని, మా అమ్మానాన్న వల్లే ఇంత విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నానని చాలామంది అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.అలాగైతేనే సక్సెస్ అయినట్లా?నేనేంటో చూపించుకోవడానికి నేనేమీ సూపర్స్టార్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు.. నేను పది సినిమాలు చేశాను, ఎన్నో యాడ్స్లో నటించాను.. ఇంకా నా చేతిలో ఫలానా ప్రాజెక్టులున్నాయి. వాటితో మరింత సక్సెస్ అవుతా.. ఇలాంటివి చెప్తేనే, చేస్తేనే సక్సెస్ అయినట్లు కాదు. చాలామంది బిజినెస్ పెట్టి సక్సెస్ అవుతున్నారు. రకరకాల విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. అవన్నీ కెమెరా ముందుకు వచ్చి చెప్పుకుంటారా? లేదు కదా! నగల బిజినెస్నాకు జ్యువెలరీ బిజినెస్ ఉంది. అమ్మానాన్నల సహకారంతో అది విజయవంతంగా రన్ చేస్తున్నాను. నేను కాస్త ఉన్నత కుటుంబంలోనే పుట్టాను. అయినా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే నగల వ్యాపారం ప్రారంభించాను. ఈ పని చాలాకాలంగా చేస్తున్నాను. ఇదే కాకుండా నటనవైపు వెళ్లాను, నిర్మాతగా కూడా ప్రాజెక్టులు చేస్తున్నా.. యూట్యూబ్ ఈ మధ్యే మొదలుపెట్టాను. ఇవన్నీ ప్యాషన్తో చేస్తున్నవే తప్ప డబ్బు సంపాదించడానికి చేయట్లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ను. నా సొంత పెట్టుబడితో చాలానే సంపాదించా.. అది ఎంత మొత్తమనేది మీకు చూపించాల్సిన అవసరం లేదు.గెంటేస్తే పోతా..నేను ఉండే ఇల్లు మా అమ్మదే.. ఈ ఇల్లు నాదే అని ఎన్నడూ చెప్పలేదే! రేప్పొద్దున అమ్మ.. వెళ్లిపో అని గెంటేస్తే తప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తా! ఎందుకంటే నేను సంపాదించినవి మాత్రమే నా ఆస్తులు. ఇది నాది కాదు. అయినా మీరన్నట్లు మా అమ్మ సంపాదించిన విలాసవంతమైన ఇంట్లో ఉండి.. ప్రతి ఖర్చులు తనే భరిస్తూ.. మా అక్క కూడా తనే డబ్బిచ్చి ఎంజాయ్ చేయమంటే మీకేంటి సమస్య? నేనేం మీ జేబులోని డబ్బు తీయట్లేదుగా? మీరేమనుకున్నా నాకు ఫరఖ్ పడదు అని రాజీవ్ సేన్ ట్రోలర్స్కు కౌంటర్ ఇచ్చాడు.చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. కొత్త జంట చేసిన పని చూశారా?

'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
'విరూపాక్ష' సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ దండు.. పెద్దగా హడావుడి లేకుండానే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆదివారం అమ్మాయి ఇంటి దగ్గర ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలోనే తోటి దర్శకులు కార్తీక్కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తన ఎంగేజ్మెంట్ వీడియోని కార్తీక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరు? పెళ్లి ఎప్పుడు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)దర్శకుడు సుకుమార్ శిష్యుల్లో ఒకడు కార్తీక్ వర్మ దండు. 'కార్తికేయ' సినిమాకు రైటర్గా పనిచేసిన అనుభవం ఉంది. అలా 2015లో 'భమ్ భోలేనాథ్' మూవీతో డైరెక్టర్గా పరిచమయ్యాడు. కానీ ఆ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో మరో ప్రయత్నం చేయలేదు. చాన్నాళ్ల గ్యాప్ తీసుకుని మెగా హీరో సాయిధరమ్ తేజ్తో 'విరూపాక్ష' తీశాడు. ఇది సూపర్ హిట్ అయింది.'విరూపాక్ష' హిట్ కావడంతో నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది. ఓవైపు దర్శకుడిగా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీ పర్సన్ అయ్యేందుకు కార్తీక్ వర్మ సిద్ధమైపోయాడు. ఈ క్రమంలోనే హర్షిత అనే అమ్మాయితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈమెది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదు. బంధువుల అమ్మాయిలా అనిపిస్తుంది. పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)

జయం రవితో రిలేషన్ రూమర్స్.. ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్!
గత కొద్ది నెలలుగా కోలీవుడ్ హీరో విడాకుల జయం రవి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన భార్య అతనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీంతో ఒకరిపై ఒకరు వరుస లేఖలతో విమర్శలు చేసుకున్నారు. వీరి విడాకుల వ్యవహారంలో ప్రముఖ సింగర్ కెన్నీషా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కూడా జయం రవి, కెన్నీషా ఓ వివాహా వేడుకలో కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చాయి.జయం రవి భార్య ఆర్తి సైతం తాము విడిపోవడానికి ముడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ మేరకు ఆమె లేఖ విడుదల చేసింది. పరోక్షంగా విడాకులకు కారణం సింగర్ కెన్నీషా అంటూ ఆరోపించింది. అయితే ఇటీవల జయం రవి, కెన్నీషా దండలు వేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఏకంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ వీరిద్దరు తమిళనాడులోని కుంద్రకుడి మురుగన్ ఆలయాన్ని సందర్శించినప్పుడు పూజారులతో కలిసి తీసుకున్న ఫోటో అని తెలిసింది.అయితే కొద్దికాలంగా సింగర్ కెన్నీషాపై సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ప్రస్తుత కెన్నీషా గర్భంతో ఉన్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొన్ని రోజుల తర్వాత కెన్నీషా తన గర్భధారణపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. ఓ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చింది. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది.. నేను గర్భవతిని కాదు.. ఎవరు ఏమి చెప్పినా వారి కర్మ వాళ్లే అనుభవిస్తారంటూ మాట్లాడింది. నిజం, అబద్ధాలు ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తాయి.. అప్పటి వరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకుని ప్రశాంతంగా తినండి.. నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ కెన్నీషా చెప్పుకొచ్చింది. తాజాగా సింగర్ మాటలతో తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టేసింది.

అఖిల్ పెళ్లి.. 33 ఏళ్లనాటి సీన్ రిపీట్.. అచ్చం నాన్నలాగే..
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ఈ నెల 6న తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంలో కొత్త జీవితం ప్రారంభించారు.తాజాగా వీరి పెళ్లి వేడుక తర్వాత నాగార్జున పెళ్లి ఫోటోను వైరలవుతోంది. అఖిల్- జైనాబ్ పెళ్లిని నాగార్జున- అమల్ పెళ్లి (వీరి వివాహం 1992లో జరిగింది) ఫోటోతో పోలుస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అచ్చం నాన్న స్టైల్లోనే అఖిల్ పెళ్లి ఫోటో ఉందంటూ ఇద్దరి ఫోటోలను జత చేస్తూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చూసేందుకు రెండు ఫోటోలు ఓకేలాగా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ - జైనాబ్ కూడా నాగార్జున-అమల మాదిరిగానే కుర్తా, చీరను ధరించారు. అఖిల్ పెళ్లి వేళ నాగార్జున-అమల వివాహ వేడుక ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, మహేష్ బాబు, యశ్తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. 2016లోనే వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియ భూపాల్తో అఖిల్కు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2017లో ఊహించని విధంగా వివాహం రద్దైన సంగతి తెలిసిందే. #KingNagarjunaAmala #AkhilZainab Same pattern... ❤️ pic.twitter.com/R2z5vyH8uw— NagaKiran Akkineni (@NagaKiran60) June 8, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఇంగ్లండ్తో తొలి టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు భారత క్రికెట్ జట్టు అన్నివిధాల సన్నదమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. లార్డ్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు.అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కగా.. వెటరన్ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సిరీస్తో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఆరంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. మొదటి టెస్టుకు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను పలు అరుదైన రికార్డు ఊరిస్తోంది.అరుదైన రికార్డుకు చేరువలో బుమ్రా..ఈ మ్యాచ్లో బుమ్రా రెండు వికెట్లు పడగొడితే సెనా(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉంది.సెనా దేశాల్లో అక్రమ్ 32 టెస్టులు ఆడి 146 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఇప్పటివరకు 31 టెస్టులు ఆడి 145 వికెట్లు సాధించాడు. కాగా ఈ ఐదు టెస్టుల సిరీస్లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. వర్క్లోడ్ మెనెజ్మెంట్ కారణంగా మిగిలిన రెండు మ్యాచ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ వెల్లడించాడు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్)

'అతడొక సూపర్ స్టార్.. మరో విరాట్ కోహ్లి అవుతాడు'
భారత్ ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ ఆరంభానికి మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్పై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.ఇక ఇది ఇలా ఉండగా.కాగా భారత టెస్టు క్రికెట్లో నాలుగో నంబర్ బ్యాటింగ్ స్దానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1970ల నుండి 1980ల వరకు దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేయగా.. ఆ తర్వాత గవాస్కర్ వారసుడిగా సచిన్ టెండూల్కర్ రెండు దశాబ్దాలకు పైగా నాలుగో నంబర్లో కొనసాగాడు. అనంతరం సచిన్ నుంచి 2013లో విరాట్ కోహ్లి ఆ బాధ్యతలను స్వీకరించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో కీలకమైన నాలుగో స్ధానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. కొంతమంది సాయిసుదర్శన్ పేరును సూచిస్తుంటే.. మరి కొంతమంది కరుణ్ నాయర్ను పేరును చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి స్ధానంలో సాయిసుదర్శన్ సరైనోడని పనేసర్ అభిప్రాయపడ్డాడు."ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన యువ ఆటగాళ్లు ఉన్నారు. అందులో ఒకరు సర్రే ఆటగాడు సాయిసుదర్శన్. అతడు చాలా దూకుడుగా, ఎటువంటి భయం లేకుండా ఆడుతాడు. అతడికి ఇంగ్లండ్ కండీషన్స్లో ఆడిన అనుభవం ఉంది. సర్రే క్రికెట్ క్లబ్ తరపున అద్బుతంగా రాణించాడు. అతడు భారత క్రికెట్లో మరో విరాట్ కోహ్లి అవుతాడు. కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని సుదర్శన్ సమర్ధవంతంగా భర్తీ చేస్తాడని నేను భావిస్తున్నాను. విరాట్ కోహ్లికి రెడ్ బాల్ క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. యువ భారత జట్టు కోహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా" అని ఇన్సైడ్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ పేర్కొన్నాడు.

రిజ్వాన్, మసూద్లపై వేటు!.. పాక్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా స్టార్ ప్లేయర్?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ సల్మాన్ అలీ అఘాను నియమించేందుకు పీసీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాక్ టీ20 కెప్టెన్గా ఉన్న సల్మాన్.. కొత్తగా వన్డే, టెస్టు జట్టు పగ్గాలను కూడా చేపట్టనున్నట్లు సమాచారం.కాగా ప్రస్తుతం పాక్ టెస్టు కెప్టెన్గా షాన్ మసూద్, వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. వీరిద్దరూ కూడా పాక్ జట్టును విజయ పథంలో నడిపించలేకపోయారు. 2023 ఆఖరిలో పాక్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన షాన్ మసూద్.. దారుణంగా విఫలమయ్యాడు. మసూద్ సారథ్యంలో పాకిస్థాన్ 12 టెస్టు మ్యాచ్లు ఆడగా.. కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించి, తొమ్మిదింట ఓటమిపాలైంది.ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో సిరీస్ వైట్వాష్లకు గురైంది.అదేవిధంగా రిజ్వాన్ కూడా తన మార్క్ను చూపించలేకపోయాడు. అతడి సారథ్యంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లను పాక్ జట్టు సొంతం చేసుకున్నప్పటికి.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దారుణ ప్రదర్శన కనబరిచి లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.ఈ కారణంగానే వారిద్దరిపై వేటు వేసి సల్మాన్ను మూడు ఫార్మాట్లలో తమ కెప్టెన్గా నియమించాలని పీసీబీ భావిస్తుందంట. కొత్త హెడ్కోచ్ మైక్ హెస్సన్ కూడా సల్మాన్ వైపు మొగ్గు చూపతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి."సల్మాన్ను ఆల్ఫార్మాట్ కెప్టెన్గా ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ, కొత్త హెడ్ కోచ్ హెస్సన్ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సల్మాన్ నాయకత్వ లక్షణాలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని సైతం ఆకట్టుకున్నాయి.అందరూ ఒకే మాటపై ఉన్నారు అని పీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా సల్మాన్ ఈ ఏడాది మార్చిలో పాక్ టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అతడి సారథ్యంలో జింబాబ్వే, బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లను పాక్ జట్టు సొంతం చేసుకుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ప్లేయర్కు గాయం

ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ప్లేయర్కు గాయం
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఆదివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడినట్లు తెలుస్తోంది. రెవ్స్పోర్ట్స్ ప్రకారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి ఎడమ చేతికి బలంగా తాకినట్లు సమాచారం. తీవ్రమైన నొప్పితో పంత్ విల్లవిల్లాడని, ఫిజియో మైదానంలోకి వచ్చి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడని సదరు వెబ్సైట్ పేర్కొంది.ఆ తర్వాత ఫిజియో పంత్ తన చేతికి బ్యాండేజ్ వేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి పంత్ ప్రాక్టీస్కు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ గాయంపై బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా పంత్ గాయం తీవ్రమైనది అయితే భారత్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఎందుకంటే భారత టెస్టు జట్టులో పంత్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు కొత్త వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఈ డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ చేపట్టాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.అంతకంటే ముందు ఈ నెల 13న ఇండియా-ఎ జట్టుతో భారత సీనియర్ జట్టు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ ఆడనుంది. కాగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్మన్ గిల్ సారథ్యంలో యువ భారత జట్టు ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) చదవండి: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక నియామకం
బిజినెస్

అస్థిర ధరలు.. చైనా ఈవీకి సవాళ్లు
అధిక ధరలు మార్కెట్ అస్థిరతకు కారణం అవుతుండడంతో చైనా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగం ఒడిదొడుకులకు లోనవుతోంది. దాంతో చైనా ఈవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బీవైడీ ధరల తగ్గింపు నిర్ణయాలు చేపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది మార్కెట్ స్థిరత్వం, పోటీతత్వంపై ఆందోళనలను రేకెత్తిస్తుంది. ఇదిలాఉండగా, చైనా ప్రభుత్వం రంగంలోకి దిగి స్థానిక కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించాలని, తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని కోరింది.ధరల యుద్ధానికి మూలంఈ పరిణామాలకు కారణం డిమాండ్ కంటే అధిక సరఫరా ఉండడమేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనా తయారీదారులు మార్కెట్లోని డిమాండ్ కంటే చాలా ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్ తగ్గడంతో కంపెనీలు అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దాంతో చేసేదేమిలేక ధరల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ప్రధాన బ్రాండ్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయని, చిన్న కంపెనీలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీవైడీ మే చివరి నుంచి ఇప్పటివరకు 21.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది.ప్రభుత్వ జోక్యంమితిమీరిన రాయితీల వల్ల ‘మేడ్-ఇన్-చైనా’ ఎలక్ట్రిక్ వాహనాల దీర్ఘకాలిక ప్రతిష్ఠ మసకబారుతుందని అధికారులు భయపడుతున్నారు. భారీగా ధరల తగ్గింపు వల్ల చైనా బ్రాండ్ విశ్వసనీయత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇది వినియోగదారులు ఉత్పత్తుల నాణ్యత, విలువను ప్రశ్నించేలా చేస్తుంది. దీన్ని పరిష్కరించడానికి చైనా ప్రభుత్వం వాహన తయారీదారులకు ధరల క్రమశిక్షణను పాటించాలని పిలుపునిచ్చింది. పరిశ్రమను దెబ్బతీసే పద్ధతులను నివారించాలని కోరింది. తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని వేడుకుంది.ఇదీ చదవండి: బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతుఎగుమతులపై ప్రభావందేశీయ సవాళ్లకు అతీతంగా చైనీస్ ఈవీ తయారీదారులు గ్లోబల్ మార్కెట్లలో దూకుడుగా విస్తరిస్తున్నారు. అయితే స్వదేశంలో అస్తవ్యస్తమైన సప్లై-చెయిన్ వల్ల ఏర్పడిన ధరల యుద్ధం విదేశాల్లో విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ పట్టును కోరుకునే కంపెనీలు పోటీ ధరలతో స్థిరమైన లాభదాయకతను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యాన్ని పాశ్చాత్య దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

సీఈఓకు సహాయకారిగా ఏఐ
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ భవిష్యత్తు నాయకత్వం పనితీరుపై ఆసక్తికర ప్రకటన చేశారు. బ్లూమ్బర్గ్ టెక్ కాన్ఫరెన్స్లో పిచాయ్ పాల్గొని మాట్లాడారు. సంస్థ సీఈఓ తదుపరి నిర్ణయాలు తీసుకోవడానికి, రోజువారీ కార్యకలాపాల్లో సహాయపడటానికి కృత్రిమమేథ తోడుంటుందని చెప్పారు. ఈ ప్రకటన కృత్రిమ మేధ ఆధారిత ఉత్పాదకత పట్ల గూగుల్ నిబద్ధతను నొక్కిచెబుతుంది. కృత్రిమ మేధ మానవ నాయకత్వాన్ని భర్తీ చేయడానికి బదులుగా దాన్ని మెరుగుపరుస్తుందనే భావనను పిచాయ్ ప్రకటన బలపరుస్తుంది.ఎగ్జిక్యూటివ్ స్థాయి నాయకత్వంలో కృత్రిమ మేధను వాడడం, శ్రామిక శక్తి అంతటా ఏఐను ఏకీకృతం చేసే గూగుల్ విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఈ ప్రకటన ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. పిచాయ్ తెలిపిన వివరాల ప్రకారం కార్యనిర్వాహక నిర్ణయాలను ఆటోమేట్ చేయడానికి బదులుగా ఏఐ వ్యూహాత్మక సలహాదారుగా పనిచేస్తుంది. పెద్ద మొత్తంలో డేటాను సేకరించడానికి, వర్క్ ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడానికి, సృజనాత్మక పరిష్కారాలను మరింత సమర్థవంతంగా అన్వేషించడానికి నాయకులకు ఏఐ సహాయపడుతుంది.ఇదీ చదవండి: బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతువైబ్ కోడింగ్పిచాయ్ స్వయంగా రిప్లిట్, కర్సర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోడింగ్ సాధనాలతో ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని ‘వైబ్ కోడింగ్’ అని పిలుస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణ ప్రాంప్ట్లతో కస్టమ్ వెబ్ పేజీలను సృష్టించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది. 2026 నాటికి గూగుల్ తన ఇంజినీరింగ్ టాలెంట్ పూల్ను విస్తరించడంలో ఏఐ కీలక భాగస్వామిగా పనిచేసే వ్యవస్థను ప్రోత్సహిస్తోంది.

పసి మనసులకు కావాలి ఆర్థిక పాఠాలు
మనీ మేనేజ్మెంట్ ఒక కళ. జీవితంలో సరైన సమయంలో సరైన ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సబ్జెక్టును పిల్లలకు దురదృష్టవశాత్తు పాఠశాలల్లో చాలా అరుదుగా నేర్పిస్తారు. పిల్లలు కూడా మనకెందుకులే ఇప్పుడే నేర్చుకోవడం అనే ధోరణితో ఉన్నారు. కానీ అది సరికాదు. పాఠశాలల్లో వీలుకాని ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్చుకోవాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కలిగి ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్న వయసులో పిల్లలు నేర్చుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం.డబ్బు సంపాదనపై స్పష్టతజీవితంలో డబ్బు పాత్ర ఎమిటో వివరంగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఎలా ఈ డబ్బు సంపాదిస్తారో స్పష్టత ఏర్పరుచుకోవాలి. అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారో ముందే అవగాహన కల్పించుకోవాలి. ఈ దశలోనే అవసరాలు, సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి.పొదుపుతో లాభాలురూపాయి ఖర్చు చేయడం మానేస్తే.. రూపాయి సంపాదించినట్లే.. ఈ సూత్రం పిల్లలు ఎప్పుడూ గుర్తించుకోవాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకోవాలి. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తున్నప్పుడు అమ్మానాన్నలు వచ్చే మనీని పొదుపు చేసి అత్యవసరమైన వస్తువులను వీరిపై ఆధారపడకుండా కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాంటప్పుడు డబ్బు విలువ అర్థం అవుతుంది.పెట్టుబడులపై అవగాహనపొదుపు, ఖర్చుపై అవగాహన వచ్చాక మెల్లిగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి. పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేసేలా పిల్లల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ పథకాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవరుచుకోవాలి.ఆర్థిక ప్రణాళికఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలన్న సూత్రాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో నేర్చుకోవాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. వంటి విషయాల్ని అవగాహన చేసుకోవాలి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలుఅప్పు గురించి తెలుసుకోవాలి..ఇంట్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాల కోసం తీసుకునే రుణాలకు సంబంధించిన వివరాలను పిల్లలు తెలుసుకోవాలి. ఎలాంటి సమయంలో అప్పు చేయాలి? అప్పు చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి.. అప్పు చేయకుండా ఉండాలంటే ఎలా మెదలాలి.. వంటి అంశాలను తెలుసుకోవాలి.

బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతు
భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఇదో వేడుక. మ్యాచ్లు జరిగినన్ని రోజులు నిత్యం వీటిపైనే చర్చ. అయితే ఈసారి ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఎంత సంపద సమకూరిందోననే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఐపీఎల్ 2025లో బీసీసీఐకు మీడియా హక్కులు, ఇతర ప్రకటనలు వంటి వాటి ద్వారా ఎంత రాబడి వచ్చిందో తెలుసుకుందాం.ఐపీఎల్ 2025 జూన్ 3న ముగిసింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనన్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటిసారి ఈ లీగ్ను గెలుచుకుంది. బీసీసీఐకి కీలకంగా మారిన ఐపీఎల్లో వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ప్రసార రుసుము ద్వారా రూ.9,678 కోట్లు అంటే ఒక్కో ఆటకు సుమారు రూ.130.7 కోట్లు రాబడి వచ్చినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. టెలివిజన్ హక్కుల నుంచి డిజిటల్ హక్కులను బీసీసీఐ వేరు చేయడంతో ఆదాయం మరింత పెరిగింది.టెలివిజన్ హక్కులు స్టార్ స్పోర్ట్స్ వద్ద ఉండగా, డిజిటల్ హక్కులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన వయాకామ్ 18 వద్ద ఉన్నాయి. వీటిని అదనంగా స్పాన్సర్షిప్ ఫీజు వస్తుంది. లీగ్ టైటిల్ స్పాన్సర్ టాటా గ్రూప్. ఇది 2024 నుంచి 2028 వరకు ఐపీఎల్తో తన స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రూ.2,500 కోట్లకు పొడిగించింది. అంటే 2025 సీజన్తో సహా ప్రతి సీజన్కు రూ.500 కోట్ల డీల్ కుదుర్చుకుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలువీటితో పాటు అసోసియేట్ పార్టనర్స్ మై11సర్కిల్, ఏంజెల్ వన్, రూపే వంటి ఇతర స్పాన్సర్ల నుంచి కూడా బీసీసీఐ డబ్బు సంపాదించింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్ - సియెట్; అధికారిక అంపైర్ భాగస్వాములు - వండర్ సిమెంట్; ఆరెంజ్ & పర్పుల్ క్యాప్ పార్టనర్- ఆరామ్కో వంటి కంపెనీలు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. టిక్కెట్లు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం బీసీసీఐకి అదనం. అయితే నిర్ణీత కేంద్ర ఆదాయ భాగస్వామ్య ప్రక్రియలో భాగంగా ఒక్కో జట్టుకు బీసీసీఐ రూ.425 కోట్లు ఇస్తుంది. 2024లో బీసీసీఐకి రూ.20,686 కోట్లు సమకూరాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.16,493 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.
ఫ్యామిలీ

నెక్లెస్ రోడ్లో తెలంగాణా రన్ 2025
ఖైరతాబాద్ : సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో రన్– 2025 పేరుతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి 3కే, 5కే, 10కే, హాఫ్ మారథాన్ ఆదివారం నిర్వహించారు. ఆరోగ్యకరమైన, చురుకైన తెలంగాణ సాధనే లక్ష్యంగా నిర్వహించిన మారథాన్లో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి రన్నర్లు పాల్గొన్నారు. మారథాన్, రన్ను డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ ఏ రామ్కిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి క్రీడా రంగాన్ని సాధనంగా మలుచుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఫిట్ తెలంగాణ సాధన కోసం యావత్ క్రీడా సమాజం కృషిచేయాలన్నారు. మానసిక, శారీరక వికాసానికి దోహదపడే క్రీడలు ఐక్యతను సాధించడమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. అవంతి కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్రెడ్డి, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమ జగన్మోహన్రెడ్డి, సభ్యులు పన్నాల హరీష్ చంద్రరెడ్డి, శ్రీనివాస్ మగ్గారి, డాక్టర్ మహేష్ పాల్గొన్నారు. మారథాన్, రన్లో విజేతలను సన్మానించి, మెడల్స్ అందజేశారు. ఇదీ చదవండి: అఖిల్ పెళ్లి సందడి : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్

భారత్-భూటన్ చిల్.. లాంగ్.. టూర్
మేఘాల మధ్య విస్తరించిన మేఘాలయ. ఛిల్ అవమని ఆహ్వానిస్తున్న షిల్లాంగ్. నాలుగు వేల అడుగుల ఎత్తులో సరస్సు. అంతకు వెయ్యి అడుగుల ఎత్తుల జలపాతం. బౌద్ధంలా విస్తరించిన ప్రశాంత విహారం. ఏడు పాయల సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్. కేథడ్రల్ చర్చ్ వందేళ్ల చారిత్రక గ్రంథం. సంతోషాల విలాసభవనం పునాఖ ద్జోంగ్. భారత్ – భూటాన్ మౌంటెయిన్ టూర్... వీటన్నింటినీ దండలా కూర్చి చూపిస్తోంది.సోమవారం ‘‘ 9–6–2025భారత్ భూటాన్ మిస్టిక్ మౌంటెయిన్ టూర్... ఇది 14 రోజుల యాత్ర. రైలు ఢిల్లీలో మొదలై గువాహటి, షిల్లాంగ్, చిరపుంజి, థింఫు, పునఖ, పారో మీదుగా ఢిల్లీకి చేరుతుంది. ఢిల్లీలోని సఫ్దర్గంజ్, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా జంక్షన్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో రైలెక్కవచ్చు. ఈ టూర్ ఈ నెల 28వ తేదీన మొదలవుతుంది. టికెట్ ధరలు ఏసీ కూపేలో (డబుల్ షేరింగ్) ఒక్కొక్కరికి లక్షా అరవై వేలవుతుంది. ఏసీ క్యాబిన్లో సింగిల్ షేరింగ్ లక్షా డెబ్బయ్ ఐదు వేలు, డబుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి లక్షా నలభై ఐదు వేలు. డీలక్స్ (ఏసీ టూ టైర్)లో డబుల్ షేరింగ్ లక్షా ముప్పై వేలు, కంఫర్ట్ (థర్డ్ ఏసీ) కేటగిరీలో డబుల్ షేరింగ్ ఒక్కొక్కరికి లక్షా ఇరవై వేలవుతుంది. ఇవన్నీ ఉండాలి: ఈ టూర్లో విదేశీ పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయాణికులు పాన్ కార్డు, పాస్పోర్టు (ఆరు నెలల కనీస గడువు ఉండాలి) లేదా ఓటర్ ఐడీ కార్డు (హోలోగ్రామ్ తప్పనిసరి), పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు (వైట్ బ్యాక్ గ్రౌండ్) ఉండాలి.1వ రోజు: మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. రైలు బయలుదేరగానే ప్రయాణికులకు హై టీ, రాత్రి భోజనం అందిస్తారు. రాత్రంగా ప్రయాణం కొనసాగుతుంది.2వ రోజు: ఈ రోజంతా కూడా ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఉదయం టీ నుంచి రాత్రి భోజనం వరకు ఆహారపానీయాలను అందిస్తారు. ఆ రాత్రి కూడా ప్రయాణం సాగుతుంది. 3వ రోజు: మధ్యాహ్న భోజనం తర్వాత రైలు గువాహటికి చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవ్వాలి. సాయంత్రం ఫ్రీ టైమ్. రాత్రి బస అదే హోటల్లో.4వ రోజుఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత రూమ్ చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. కామాఖ్య ఆలయంలో ముఖ దర్శనం చేసుకుని షిల్లాంగ్ వైపు సాగిపోవాలి. ఉమియుమ్ లేక్ మీదుగా సూర్యాస్తమయాన్ని వీక్షించి హోటల్ గదిలో చెక్ ఇన్ అవ్వాలి. రాత్రి బస షిల్లాంగ్లో.మేఘాల కింద విహారంమేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ప్రధానమైన నీటి వనరు ఉమియుమ్ లేక్. ఇది సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతి.5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత చిరపుంజి వైపు సాగిపోవాలి. సెవెన్ సిస్టర్స్ జలపాతంతో సేదదీరి మావ్సామాయ్ గుహలు, నొఖాలికాయ్ జలపాతాలకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం తర్వాత ఎలిఫెంటా జలపాతాన్ని చూసుకుని హోటల్ గదికి వచ్చి సేదదీరాలి. ఆ రాత్రి బస కూడా షిల్లాంగ్లోనే.ఏడు జలధారలుసెవెన్ సిస్టర్స్ జలపాతం మేఘాలయలో ప్రసిద్ధి. వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటుంది. ఇది ఏడు పాయలుగా జాలువారుతుండంతో ఆ పేరు వచ్చింది. స్థానికులు నోహ్స్నిగిథియాంగ్ జలపాతం అంటారు. సముద్రమట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తులో వెయ్యి అడుగుల పై నుంచి కొండ వాలు నుంచి జాలువారే జలపాతం కనువిందు చేస్తుంది. మన దక్షిణాది వాళ్లకు కర్నాటకలోని జోగ్ వాటర్ఫాల్స్ పరిచితం. ఇది నాలుగు పాయలుగా ఉంటుంది. ఇవి రెండూ దేశంలో టాప్ టెన్ జలపాతాల్లో చోటు చేసుకున్నవే.6వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి సైట్ సీయింగ్కి సాగిపోవాలి. కేథడ్రల్ చర్చ్, వార్డ్స్ లేక్, డాన్ బాస్కో మ్యూజియం తర్వాత గువాహటికి ప్రయాణం. గువాహటిలో బ్రహ్మపుత్ర క్రూయిజ్లో విహరిస్తూ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన తర్వాత ప్రశాంతంగా గువాహటి రైల్వేస్టేషన్కి చేరి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. హాసిమరా వైపు ప్రయాణం రాత్రంతా సాగుతుంది.ఏడంతస్థుల మ్యూజియంషిల్లాంగ్లోని కేథడ్రల్ చర్చ్కి వందేళ్లకు మించిన చరిత్ర ఉంది. దీనిని 1913లో పూర్తిగా చెక్కతో నిర్మించారు. అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో తిరిగి కాంక్రీట్ నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణానికి 85 ఏళ్లు. యూరప్ దేశాలు పాటించి గోథిక్ శైలి నిర్మాణం ఇది. ఇంటీరియర్లో జర్మనీ శైలి కళాత్మకతలోని లాలిత్యం ఉంటుంది. ఇక డాన్ బాస్కో మ్యూజియం ఏడంతస్థుల భవనం. ఈశాన్య రాష్ట్రాల కళాకృతుల నిలయం. మనసు నిండుగా చూడాలంటే మూడు గంటల సమయం కేటాయించాల్సిందే. టూర్లో ఆ మేరకు సమయం ఇస్తారు. ఆవరణలో ఫొటోలు తీసుకోవడంలో ఎక్కువ సమయం గడిచిపోయిందంటే మ్యూజియంలోని కళాకృతులను సరగ్గా చూడలేం.7వ రోజురైల్లోనే బ్రేక్ఫాస్ట్. హాసిమరా స్టేషన్లో రైలు దిగి రోడ్డు మార్గాన ఫుయెంట్షోలింగ్, తర్వాత థింఫూకి సాగిపోవాలి. థింఫూ కి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ అని సాయంత్రం విశ్రాంతిగా గడపాలి. రాత్రి బస అక్కడే.భూటాన్లో అడుగుపెట్టాం!హసిమరా రైల్వేస్టేషన్ వెస్ట్బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ దిగి రోడ్డు మార్గాన వెళ్లాలి. భారత్ సరిహద్దు దాటి భూటాన్లో అడుగుపెట్టిన తర్వాత ఇరవై కిలోమీటర్ల దూరంలో ఫుయెంట్షోలింగ్ అనే చిన్న పట్టణానికి చేరుతాం. ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ చేస్తారు.8వ రోజుఈ రోజంతా థింఫూలో సైట్ సీయింగ్లో గడుస్తుంది. బుద్ధపాయింట్, మోతీతాంగ్ జూ, పెయింటింగ్ స్కూల్, నేషనల్ లైబ్రరీ, బౌద్ధ సంస్కృతికి సంబంధించి పురాతన గ్రంథాల సముదాయాన్ని వీక్షించడం, థింపూ హాండీక్రాఫ్ట్స్ మార్కెట్ పర్యటన, తాషి చో ద్జోంగ్ వీక్షణం తర్వాత హోటల్కి చేరి రాత్రి బస.గ్రేట్ బుద్ధ భూటాన్ రాజధాని నగరం థింపూ. ఈ నగర శివారులో బుద్ధ డోర్డెన్మా విగ్రహం ఉంది. 177 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచంలోని అత్యంత పెద్ద బుద్ధ విగ్రహాల జాబితాలో లిస్ట్ అయింది. ప్రపంచానికి శాంతి, సంపదలు దక్కాలని కోరుకుని దీనిని నిర్మించారు. గ్రేట్ బుద్ధగా వ్యవహరిస్తారు. ఇది ్రపాచీనమైనది కాదు. ఇరవై ఏళ్ల కిందట నిర్మాణం మొదలైంది. ్రపారంభించి పదేళ్లవుతోంది.చిన్ని చిత్రాలయంథింపూలో ఉన్న జాతీయ స్థాయి పెయింటింగ్ స్కూల్ పరిమాణంలో చిన్నది. కానీ ఇందులో పిల్లలకు పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, శిల్పకళ, స్కెచింగ్, ఉడ్ కార్వింగ్ వంటి అనేక కళల్లో శిక్షణనిస్తారు. విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలగని విధంగా పర్యాటకులు నిశ్శబ్దం పాటించాలి.9వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గాన పునఖా వైపు సాగుతుంది ప్రయాణం. దారిలో ఆగుతూ దోచులా పాస్, చోర్టెన్, మణివాల్, ప్రేయర్ ఫ్లాగ్స్ను చూసుకుంటూ మధ్యాహ్యానికి పునఖా ద్జోంగ్, మేల్ రివర్, ఫిమేల్ రివర్ వీక్షణం. సస్పెన్షన్ వంతెన మీద విహారం, ΄్యాలెస్ ఆఫ్ హ్యాపీనెస్ సందర్శనం తర్వాత సాయంత్రం పునాఖాలో హోటల్కు చేరి చెక్ ఇన్ అయి రాత్రి బస చేయాలి.సంతోష భవనంఈ భవనాన్ని స్థానిక వ్యవహారంలో పునాఖ ద్జోంగ్ అంటారు. పునాఖ నగరం భూటాన్కి రాజధానిగా ఉన్నప్పుడు రాజ్యపాలన ఇక్కడి నుంచే జరిగేది. ఈ భవనానికి చారిత్రక ్రపాధాన్యం ఉండడంతో రాజధాని థింపూకి మారిన తర్వాత పర్యాటక భవనంగా మార్చారు. టిబెట్ బౌద్ధం విలసిల్లిన ప్రదేశం ఇది. ఇప్పుడిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల పరిశీలన జాబితాలో ఉంది.10వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత పునాఖాలో హోటల్ గది చెక్ అవుట్ చేసి పారో వైపు సాగిపోవాలి. దారిలో లంపేరీ రాయల్ బొటానికల్ పార్క్, పారో నది మీదున్న తామ్చోగ్ లాఖాగ్ ఐరన్ బ్రిడ్జ్ విహారం, పారో ద్జోంగ్ (రింన్పుంగ్ ద్జోంగ్), కోట సందర్శన తర్వాత ద్జోంగ్ఖాగ్ సందర్శనం. రాత్రి బస పారోలోనే.వంతెన మీద సూర్యాస్తమయంపారో నగరంలో ఉన్న బౌద్ధ క్షేత్రం రిన్పుంగ్ ద్జోంగీ. ్రపాచీనకాలంలో ఈ ప్రదేశాన్ని పాలించిన రాజవంశాలు నివసించిన ప్రదేశం. వారు బౌద్ధాన్ని ఆచరించడంతో ఆ పరంపరగా వచ్చిన బౌద్ధక్షేత్రం ఇది. దీనిని యునెస్కో పరిశీలన జాబితాలోకి తీసుకుంది. నది కి ఇరు వైపులా రెండు భవనాలను కలుపుతూ ఉన్న వంతెన మీద నుంచి సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతి.11వ రోజురోజంతా పర్యటన పారోలో ప్రశాంతంగా సాగుతుంది. టైగర్ నెస్ట్ బేక్క్యాంప్ పాయింట్లో ఫొటో సెషన్, నేషనల్ మ్యూజియం సందర్శనం, తా ద్జోంగ్ (వాచ్ టవర్) నుంచి ప్రకృతి వీక్షణం, భూటాన్ సంప్రదాయ హస్తకళాకృతుల వీక్షణం, మధ్యాహ్న భోజనం తర్వాత భూటాన్ జాతీయ క్రీడ ఆర్చరీ సాధన, విన్యాసాలను వీక్షించడం, చివరగా ఔషథ నీటితో హాట్ స్టోన్ బాత్ చేయించుకుని హోటల్కి చేరడం. ఈ రాత్రి కూడా బస పారోలోనే.రాతితో ఔషథ స్నానంఇది ఇక్కడ ఆయుర్వేద చికిత్స. యాభై రకాల మానసిక, శారీరక అనారోగ్యాలతోపాటు ఆధ్యాత్మిక భావనలను పెం΄÷ందించే చికిత్స. హిమాలయ పర్వత శ్రేణుల్లో విస్తరించిన ఈ నేలకు ఔషధాల పుట్టిల్లు అని పేరు. ఇక్కడ నీటిలో ఔషథ పత్రాలను వేసి మరిగిస్తారు. రాళ్లను వేడి చేసి ఆ నీటిలో వేస్తారు. ఆ తరవాత ఆ రాళ్లను ఒక చట్రంలో అమర్చి ఒంటికి హాయి కలిగేటట్లు మర్దన చేయడమే హాట్ స్టోన్ బాత్. మోడరన్ లైఫ్ స్టైల్లో ఒత్తిడి, హైపర్ టెన్షన్, జీర్ణ వ్యవస్థ పని తీరు మందగించడం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. వీటన్నింటి నుంచి ఉపశమనం ΄÷ందడానికి హాట్ స్టోన్ బాత్ దోహదం చేస్తుంది. కేరళలో తైలాలతో చేసే చికిత్స వంటిదే ఇది.12వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గాన హసిమరా రైల్వేస్టేషన్కు సాగిపోవాలి. దారిలో లంచ్ తర్వాత స్టేషన్కి చేరి రైలెక్కిన తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. పదమూడవ రోజు మొత్తం రైల్లోనే. పద్నాలుగవ రోజు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎనిమిది గంటలకు రైలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ స్టేషన్కు చేరడంతో యాత్ర పూర్తవుతుంది.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి

మిస్ యూనివర్స్కు మన తెలుగు తేజాలు
త్వరలో థాయిలాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి పోటీలు జరిగాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనలిస్టుల ఎంపికలో మిస్ యూనివర్స్ తెలంగాణగా కశ్వి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ప్రకృతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు..సుస్మితాసేన్ స్ఫూర్తినేను మెడికల్ స్టూడెంట్ని. మోడల్ గా కూడా రాణిస్తున్నాను. శాస్త్రీయ నృత్యమూ నేర్చుకున్నాను. అందాల పోటీలు అంటే కేవలం బ్యూటీ గురించి మాత్రమే కాదు. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, సమాజానికి మంచి చేయాలనే ఆలోచన, జీవన నైపుణ్యాల వృద్ధి.. ఇలా అన్నింటిపై ఫోకస్ ఉంటుంది. అందుకే నేను దీనిమీద దృష్టి పెట్టాను. నేను పుట్టి పెరిగింది అమెరికాలో. మా అమ్మానాన్నలు తెలంగాణ వాసులు. మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెలా ఎదగాలన్నది నా డ్రీమ్. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఈరోజుల్లో ప్రజల్లో మానసిక అనారోగ్యం బాగా పెరుగుతోంది. దీనిపై చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నాను. అలాగే గృహహింస పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను. వీటితో పాటు మూగ, చెవిటి వారికి సహాయకారిగా ఉంటూ వారి వృద్ధికి కృషి చేస్తున్నాను. ఈ విషయాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. తెలంగాణకు రావడానికి ముందే మా పేరెంట్స్ నుంచి, బుక్స్ నుంచి తెలంగాణ గొప్పతనం గురించి తెలుసుకున్నాను. ఇక్కడికి రావడం విజేతగా నిలవడం... చాలా సంతోషంగా ఉంది.– కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణకాన్ఫిడెన్స్ ముఖ్యంకళ్ళు మూసినా, తెరిచినా కిరీటమే కళ్ళ ముందుండేది. ఫైనలిస్ట్గా ఎంపికయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. పోటీలో మన మాటల్లో, నడకలో, ప్రవర్తనలో కాన్ఫిడెన్స్ నే ప్రధానంగా చూస్తారు. ఫైనల్ రౌండ్లో... త్యాగం, పాజిటివిటీ, నెగెటివిటీల గురించి అడిగారు. త్యాగం అనేది ఎప్పుడూ గొప్పదే. మన జీవితంలో చిన్న చిన్న త్యాగాలు చేస్తుంటాం. కానీ, త్యాగం వల్ల మన సెల్ఫ్ హ్యాపీగా లేకపోతే చేయకూడదు అని నేను చెప్పడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. గత ఏడాది ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలు పొందాను. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికయ్యాను. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, భాష.. ఇలా అన్నింటి గురించి తెలిసుండాలి. అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. అమ్మ వర్కింగ్ విమెన్, అక్క ప్రేరణ నాకు బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. అంతగా ఎంకరేజ్ చేస్తారు. బీకామ్లో డిగ్రీ చేశాను. డాన్స్ అంటే ఇష్టంతో డాన్స్ కోర్సు చేశాను. బెంగళూరులో డాన్స్ స్టూడియో ఉంది. రియాలిటీ షో చేశాను, నేను నటించిన సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. నన్ను ఆల్ రౌండర్ అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. బ్యూటీ అంటే ఫిజికల్గా కనిపించేదే కాదు.. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ . దానినే అన్నింటికన్నా భిన్నంగా చూపగలగాలి.–ప్రకృతి కంబం, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్– నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

తొలి నెలసరి వాయిదా వెయ్యొచ్చా?
ఇటీవలి కాలంలో కూతుళ్లు ఉన్న తల్లులలోఒక ఆందోళన కనిపిస్తోంది. అదేంటంటే పదేళ్ల వయసుకే కూతుళ్ళు రజస్వల కావడం. ఇది వారి భవిష్యత్తు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. అనే భయాన్ని దూరం చేయాలనుకుంటున్నారు. తమ గురించి తమకు ఏ మాత్రం తెలియని అమ్మాయిల్లో తొలి నెలసరి ఆలస్యంగా రావాలని తల్లులు ప్రయత్నిస్తున్నారు, ఇది మంచి పరిణామం అంటున్నారు నిపుణులు.కూతుళ్ళ తొలి నెలసరి ఆలస్యంగా రావడాన్ని తల్లులు ప్రయత్నించవచ్చా... ఈ విషయం గురించి ఇటీవల రిబెక్కా కిండెర్మన్ అనే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ప్రాంతానికి చెందిన తల్లి తన 10, 12 ఏళ్ళ కుమార్తెలకు నెలసరి ఆలస్యం కావాలన్న లక్ష్యంతో కుటుంబ ఆహారం నుండి స్క్రీన్ టైం చూసే వరకు అన్నీ మార్చేసింది. ఆమె ఈ విషయంపై చేసిన ఇన్ స్ట్రాగామ్ రీల్ (@bec&kinderman) 1.6 మిలియన్ల వీక్షణలు, 57,000కు పైగా లైకులు పొందింది.‘పిల్లల మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకముందే, వారిపై ఇంటర్నెట్లో కనిపించే విషయాలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వయస్సులోనే పెద్దవాళ్లలా మారకుండా, చిన్న పిల్లలుగా ఉండేలా చేయాలనుకుంటున్నాను,‘ అంటారు ఆమె. ఈ తల్లి చేస్తున్న ప్రయత్నం గురించి మనమూ ఆలోచించాలి. మన కూతుళ్ళ భవిష్యత్తు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.అమెరికాలో బాలికలు మొదటిసారి నెలసరి అయ్యే సగటు వయస్సు 11.9 సంవత్సరాలు. 11 ఏళ్లకు ముందే నెలసరి ్ర΄ారంభమయ్యే బాలికల శాతం16 గా ఉంది. ఇండియాలోనూ ఈ శాతం ఇదే విధంగా ఉంది.నెలసరి.. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు..12 ఏళ్ల వయస్సు ముందు నెలసరి వచ్చే బాలికలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 23 శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఎండోమెట్రియల్, ఓవరియన్ క్యాన్సర్లకు కూడా ఇది కారణంగా ఉండే ప్రమాదం ఉంది.గతంలో ఇలా ఉండేది కాదు. రచయిత ఎలెనా బ్రిడ్జర్స్ తెలిపిన ప్రకారం, గిరిజన సమాజాలలో బాలికలు సుమారు 17 ఏళ్ల వయస్సులో తొలి నెలసరి పొందేవారు, తగిన అండాశయాల విడుదల 19 ఏళ్ల వయస్సులో మొదలయ్యేది.ప్రాంచీన కాలంలో మానవ మేధస్సు, శరీరం ముందు నుంచీ వయోజన భావోద్వేగాలను ఎదుర్కొనేవి. కానీ నేటి బాలికలు ఇప్పుడే పీరియడ్లు, బాల్య గర్భధారణను ఎదుర్కొంటున్నారు,‘ అని ఆమె చెప్పారు. ఈ పరిస్థితిని ‘ఎవల్యూషనరీ మిస్మ్యాచ్‘గా అభివర్ణిస్తూ, బ్రిడ్జర్స్ ఇలా అన్నారు: ‘ఇప్పుడు రి పొడక్టివ్ ప్యూబర్టి చైతన్యం అతి త్వరగా వస్తోంది, కానీ మానసికంగా, శారీరకంగా పరిపక్వత రావడం లేదు.‘రసాయనాలు కీలకంప్యూబర్టి ముందే మొదలవడం వల్ల గర్భస్రావం, నెలసరి సమస్యలు, ఆందోళన, డిప్రెషన్, పీసీఓఎస్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.ఆహారం, ఒత్తిడి, రసాయనాలు వంటి పర్యావరణ అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీన్ని దష్టిలో ఉంచుకుని కిండెర్మన్ తన పిల్లలను సంపూర్ణ సహజ జీవనశైలిలో పెంచుతున్నారు.ఆమె కుటుంబం ఎక్కువగా ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకుంటుంది, పంటలపై ఉండే పెస్టిసైడ్ మిగులు తొలగిస్తారు, ఇంట్లో రసాయనాల్లేని పరిసరాలను కల్పిస్తారు. ‘సువాసన కోసం పిల్లలు ఉపయోగించే పరిమళ ద్రవ్యాలు హార్మో¯Œ లను ప్రభావితం చేస్తాయి, అందుకే మేం ఇంట్లోనే ఎసెన్షియల్ ఆయిల్స్తో పరిమళాలు తయారు చేస్తాం,‘ అని చెబుతున్నారు.న్యూజిలాండ్కు చెందిన నికీ స్కిన్నర్ (@nourished&and&vibrant) కూడా తన 7, 4 సంవత్సరాల కుమార్తెల కోసం ఇదే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.‘ఇది సహజ అభివృద్ధిని కృత్రిమంగా నియంత్రించడమేం కాదు,‘వాతావరణ అంశాలు నెలసరి ముందే రావడానికి కారణమవుతున్నాయని తెలుసుకొని, వాటిని నియంత్రించగలిగినంతవరకు నేను తల్లిగా జాగ్రత్త పడుతున్నాను..‘ అంటారు ఆమె.నిపుణుల మాటలలో...నాచురోపతి వైద్యురాలు లారా బ్రిడెన్ చెప్పిన ప్రకారం, 8 సంవత్సరాల వయస్సుకు నెలసరి రావడం అసాధారణమైన విషయం. 11 ఏళ్ల లోపల నెలసరి రావడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్, , బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనేక సమస్యలతో నెలసరికి సంబంధం ఉంది. మెటబాలిక్ డిస్ఫంక్షన్ వల్ల ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. ఆహారం, పర్యావరణ మార్పులు, వ్యాయామం లేకపోవడం, ఎపిగెనెటిక్ ప్రభావాలు ... ఇవన్నీ నెలసరి ముందుగా రావడానికి కారణాలు. బ్రిడ్జర్స్ హెచ్చరిస్తూ ‘నెలసరి ఆలస్యం చేయాలనే లక్ష్యం తల్లిదండ్రులకు, పిల్లలకు ఒత్తిడిని కలిగించవచ్చు. అది ఆరోగ్యానికి హానికరమైన చర్యలకూ దారితీయవచ్చు‘ అని కూడా అంటున్నారు.మాట్లాడటానికి భయపడవద్దు..కిండెర్మర్ అండ్ స్కిన్నర్ తమ కుమార్తెలతో జరిపిన సంభాషణలు కూతుళ్లు ఉన్న తల్లులకు తప్పక ఉపయోగపడతాయి.‘మీ పిల్లలు నెలసరి వస్తే భయపడకూడదు. అది ఒక ప్రకృతి సహజమైన చర్యగా సానుకూలంగా తీసుకోవాలి. పిల్లలకు పూర్తి అవగాహన ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం‘ అంటున్నారు. పిల్లల చిన్నప్పటి నుంచే వారి శారీరక, మానసిక ఆరోగ్య విధానాలలో జాగ్రత్తలు తీసుకుంటే తల్లుల్లోనూ ఆందోళన తగ్గుతుంది. – నిర్మలారెడ్డిజీవనశైలి మార్పులే కారణంమా వద్దకు 8, 10 ఏళ్ల వయసున్న అమ్మాయిల్ని రజస్వల అయ్యింది అని తల్లులు తీసుకొస్తుంటారు. ఆందోళన పడుతుంటారు. ఆ పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియని వయసు. పాల్ట్రీ ఉత్పత్తులు, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, వాతావరణం, క్రీడల వంటి శారీరక వ్యాయామం లేకపోవడం.. వంటి వాటి వల్ల చిన్నవయసులోనే రజస్వల కావడం ఇటీవల జరుగుతోంది. కొన్ని సార్లు వారి జీన్స్, ఎండోక్రైౖ మ్స్ పనితీరులో లోపాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. జీవనశైలి సరిగా ఉండేలా చూసుకోవడంతో పాటు, రెగ్యులర్ చెకప్స్, నిపుణుల సూచనలు పాటిస్తూ, అవగాహన పెంచుకుంటే సమస్య తగ్గుతుంది. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, హైదరాబాద్
ఫొటోలు
అంతర్జాతీయం

మస్క్, అమెరికా ఆర్థిక మంత్రి కొట్టుకున్నారు!
వాషింగ్టన్: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్, లక్షల కోట్లకు అధిపతి ఎలాన్ మస్క్ మధ్య మాటల మంటలకు మూలకారణమైన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. వారి మధ్య సఖ్యత చెడటానికి ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ కారణంగా మారినట్టు ట్రంప్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత ఏప్రిల్లో అధ్యక్ష కార్యాలయంలోని ఓవల్ ఆఫీస్లో భేటీ తర్వాత మస్క్, బిసెంట్ బాహాబాహీకి దిగారట! ట్రంప్ సన్నిహితుడు, పాడ్కాస్టర్ స్టీఫెన్ కె.బ్యానన్ ఈ మేరకు బయటపెట్టారు. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ, వాళ్ల జీతభత్యాలను ట్రంప్ సర్కార్కు ఆదా చేస్తూ, లక్షల కోట్ల విదేశీ నిధులను నిలిపివేస్తూ ఆర్థిక శాఖపై తాను భారం తగ్గిస్తుంటే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరిట పన్నులను తగ్గించి ఆర్థిక శాఖపై అధ్యక్షుడు భారం పెంచుతున్నారంటూ మస్క్ తీవ్రంగా ఆక్షేపించడం తెలిసిందే. బిసెంట్తో ముష్టిఘాతాల పర్వం వారి మధ్య దూరాన్ని బాగా పెంచేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది? ఏప్రిల్ నెల మూడోవారంలో ఓవల్ కార్యాలయంలో ట్రంప్తో భేటీ సందర్భంగా అంతర్గత రెవెన్యూ విభాగ కమిషనర్గా మస్క్, బిసెంట్ చెరో పేరు ప్రతిపాదించారు. బిసెంట్ సూచించిన అభ్యర్థి వైపు ట్రంప్ మొగ్గా రు. అవమానభారంతో వెళ్లిపోతున్న మస్క్తో బిసెంట్ వాగ్వాదానికి దిగారు. అది కాస్తా కొట్లాటకు దారితీసింది. ‘రగ్బీ’ మ్యాచ్ తరహాలో బిసెంట్ను మస్క్ తన భుజంతో ఎత్తి కుదేశాడు. ఇద్దరూ కొట్టుకుంటుండటంతో సిబ్బంది నిలువరించారు. ఇది ట్రంప్కు తెలియడంతో ‘మరీ ఓవర్గా ఉంది’ అన్నారు. అనంతరం మీడియా భేటీ సందర్భంగా మస్క్ ముఖం వాచిపోయి, కళ్లు ఎర్రబారడం కన్పించింది. కొడుకుతో ఆడుతుంటే దెబ్బలు తగిలాయని మస్క్ అప్పట్లో కవర్ చేశారు.

40 ఏళ్లలో కరువుల తీవ్రతశాతం పెరిగింది
కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. దాంతో కరువు కాటకాలు తప్పడం లేదు. కరువుల బెడద మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రపంచవ్యాప్తంగా గత 40 ఏళ్లలో కరువుల తీవ్రత ఏకంగా 40 శాతం పెరిగినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధనలు తేలింది. వర్షపాతం స్థిరంగా ఉన్నచోట కూడా కరువుల తీవ్ర పెరుగుతున్నట్లు వెల్లడయ్యింది. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ అది తేమను ఒడిసిపట్టుకొనే సామర్థ్యం సైతం పెరుగుతోంది. దాంతో కరువులు తీవ్రత సైతం పైపైకి ఎగబాకుతోందని సైంటిస్టులు వెల్లడించారు. వాతావరణం వేడెక్కడానికి, కరువులు తీవ్రంగా మారడానికి మధ్య దగ్గర సంబంధం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన క్లైమేట్ హజార్డ్స్ సెంరట్ డైరెక్టర్ క్రిస్ ఫాంక్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలను నేచర్ జర్నల్లో ప్రచురించారు. రాబోయే రోజుల్లో ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు మరింత పెరగడమే తప్ప తగ్గిపోయే సూచనలైతే కనిపించడం లేదు. దీన్నిబట్టి చూస్తే మరింత తీవ్రమైన కరువులకు మానవాళి సిద్ధపడక తప్పదని చెప్పొచ్చు. ఈ అధ్యయనం కోసం 1901 నుంచి 2022 వరకు వాతావరణ డేటాను సేకరించి, విశ్లేíÙంచారు. అట్మాస్ఫియరిక్ ఎవాపరేటివ్ డిమాండ్(ఏఈడీ) పెరుగుతుండడంతో కరువుల తీవ్రత కూడా పెరుగుతున్నట్లు తేలింది. గత 40 ఏళ్లలో ఇది 40 శాతం పెరిగినట్లు స్పష్టమయ్యింది. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగినా సరే అక్కడి వాతావరణం తేమను అధికంగా పీల్చుకుంటుంది. పంటలు, చిత్తడి నేలలు, అడవుల నుంచి తేమ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఫలితంగా నేల నిస్సారమైపోతోంది. పంటలు ఎండిపోతాయి. చిత్తడి నేలలు పొడి నేలలుగా మారిపోతాయి. మరో విషయం ఏమిటంటే.. 1981–2017 నాటి సగటుతో పోలిస్తే గత ఐదేళ్లలో కరువు పరిస్థితి 74 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు 58 శాతం ఏఈడీనే కారణం. 2022లో భూగోళంపై రికార్డు స్థాయిలో 30 శాతం భూభాగం కరువునకు గురయ్యింది. దీనికి 40 శాతం ఏఈడీనే కావడం గమనార్హం. – న్యూఢిల్లీ

పూ పిల్స్తో సూపర్బగ్స్ ఖతం
శరీరంలో తిష్ట వేసి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూపర్ బగ్స్ను తుదముట్టించడానికి బ్రిటన్ పరిశోధకులు సరికొత్త మాత్రను అభివృద్ధి చేశారు. ప్రధానంగా పేగుల్లో యాంటీబయోటిక్స్ను దెబ్బతీసే ఇన్ఫెక్షన్లకు విరుగుడు కనిపెట్టారు. ఈ మాత్రను మానవ మలంతో తయారు చేయడం గమనార్హం. వీటికి ‘పూ పిల్స్’ అని పేరు పెట్టారు. ఎండబెట్టి, పొడి చేసిన మలాన్ని ఈ మాత్రల తయారీకి ఉపయోగించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన దాతల నుంచి మలం నమూనాలు సేకరించారు. అందులో మనుషులకు మేలు చేసే బ్యాక్టీరియా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జీర్ణం కాని వ్యర్థాలుంటే తొలగించారు. పూ పిల్స్లోని మంచి బ్యాక్టీరియా పేగుల అంతర్భాగంలోని సూపర్బగ్స్తో నేరుగా పోరాడి బయటకు పంపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు తేల్చారు. అండన్లోని గైస్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రిలో 41 మంది రోగులపై ఈ ప్రయోగం చేశారు. వారికి పూ పిల్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను నివారించడానికి మలం మాత్రలు చక్కటి ప్రత్యామ్నాయమని డాక్టర్ బ్లెయిర్ మెరిక్ చెప్పారు. యాంటీబయాటిక్స్ను అడ్డుకొనే ఇన్ఫెక్షన్లకు, ఔషధాలకు లొంగని సూపర్బగ్స్కు మూలం పేగులేనని తెలిపారు. పూ పిల్స్తో సూపర్బగ్స్ను పేగుల నుంచి తరిమేయవచ్చని వెల్లడించారు. పూ పిల్స్ వాడకం కొత్తేమీ కాదు. క్లో్రస్టిడియం డిఫిసైల్ బ్యాక్టీరియా వల్ల ఏర్పడే డయేరియా చికిత్సకు ఈ మాత్రలు వాడుతున్నారు. సూపర్బగ్స్ నియంత్రణకు పూ పిల్స్పై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించారు. – లండన్

కోవిడ్-19 కంటే డేంజర్: చైనా నుంచి అమెరికాకు ఫంగస్, ట్రంప్కు డెడ్లీ వార్నింగ్
బీజింగ్: అమెరికా సంతతికి చెందిన చైనా నిపుణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాగ్రత్త పడకపోతే కోవిడ్-19 కన్నా దారుణ విపత్తు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఇటీవల చైనాకు చెందిన ఇద్దరు సైంటిస్టులు ప్రమాదకరమైన ఫంగస్ను రహస్యంగా అమెరికాకు తరలించేందుకు కుట్ర చేశారు. ఆ కుట్రను అమెరికా గుట్టు రట్టు చేసింది.యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కోవిడ్-19 మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా మరోసారి కోవిడ్-19 కంటే ప్రమాదకరమైన పొటెన్షియల్ ఆగ్రోటెర్రరిజం వెపన్ పేరుతో ప్రమాదకరమైన ఫంగస్ ఫ్యూసారియం గ్రామినియంను అమెరికాకు తరలించింది. చైనా సైంటిస్టులు యున్ క్వింగ్ జియాన్ (33),జూన్ యాంగ్ లియూ (34) ఫంగస్ను స్మగ్లింగ్ చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో ఫంగస్ విషయంలో అమెరికా జాగ్రత్తగా ఉండాలని చైనా నిపుణుడు గార్డన్ జి.చాంగ్ వార్నింగ్ ఇచ్చారు.‘అమెరికాతో యుద్ధం చేసేందుకు చైనా సిద్ధమైంది. అమెరికా తక్షణ చర్యలు తీసుకోకపోతే కోవిడ్-19 కంటే భయంకరమైన విపత్తు చోటు చేసుకునే అవకాశం ఉంది. 2020లో చైనా పండించిన విత్తనాల్ని అమెరికాలోని 50 రాష్ట్రాలకు రవాణా చేసింది. ఆ విత్తనాల రవాణాకు చైనా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అది ఆగ్రో టెర్రరిజంలోని భాగమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.అందుకు 2019 మే నెలలో ప్రముఖ చైనా పత్రిక పీపుల్స్ డైలీ ఎడిటోరియల్ ప్రచురించింది. ఆ ఎడిటోరియల్ సారాంశం అమెరికాతో చైనా యుద్ధం చేయాలి. అదే కథనాన్ని గార్డన్ జి.చాంగ్ ఊటంకిస్తూ.. తాజాగా ఫ్యూసారియం గ్రామినియం ఫంగస్ను అమెరికాకు పంపించింది. చైనా ప్రభుత్వం స్వయంగా ఈ యుద్ధానికి సిద్ధమవుతోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనా ప్రజల్ని సైతం సంసిద్ధం చేస్తున్నారు. మనం చైనాను ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలి. ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని సూచించారు. చైనా తయారు చేసిన ఈ ఫంగస్ వల్ల గోధుమ, బార్లీ, మొక్కజొన్న, బియ్యానికి నష్టం కలిగించే ఫ్యుసేరియం హెడ్ బ్లైట్ అనే వ్యాధి అపార నష్టాన్ని మిగుల్చుతుంది. ఈ వ్యాధి మానవులకూ, జంతువులకు సోకుతుంది. వాంతులు, కాలేయం దెబ్బతినడం, సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి.అంతేకాదు, ఈ ఫంగస్ వల్ల ధాన్యం దిగుబడి తగ్గడానికి, నాణ్యత లేని ధాన్యాలు, హానికరమైన మైకోటాక్సిన్లతో (డియోక్సినివాలెనాల్ (DON) వంటివి) కలుషితం కావడానికి దారితీస్తుంది. ఈ వైరస్ ఉన్న ధాన్యంతో తయారు ఆహారం తింటే మనషులు,జంతువులకు ప్రమాదం ఏర్పడనుంది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఈ ఫంగస్ ఆగ్రోటెరరిజం ఆయుధంగా పరిగణిస్తుంది. అమెరికాను నాశనం చేసేందుకు అమెరికాపై చైనా దీనిని ప్రయోగిస్తుందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
జాతీయం

హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
గౌహతి/షిల్లాంగ్: మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కొత్త జంట హనీమూన్కు వెళ్లి, అదృశ్యమైన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఉదంతంలో భర్త రాజా రఘువంశీ హత్యకు గురికాగా, భార్య సోనమ్ కనిపించకుండా పోయింది. తాజాగా ఆమెను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ పోలీసులు అరెస్టు చేశారు.భర్త హత్య కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం సోనమ్ కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుని, భర్తను హత్య చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్రాంగ్ మాట్లాడుతూ సోనమ్ను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అదుపులోకి తీసుకున్నామని, ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.దర్యాప్తు జరిగిదిలా..మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనమ్ దంపతులు మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్లోని నోంగ్రియాట్ గ్రామంలో గడిపిన 12 గంటల సమయంలో వారు ఏమి చేశారనేది ఆధారంగా చేసుకుని, పోలీసులు దర్యాప్తులో ముందుకు సాగారు. ఇందుకోసం వారు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. మే 23న కనిపించకుండా పోయిన వీరు దీనికి ముందు మేఘాలయలోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్ ఆచూకీ కోసం పోలీసులు పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు గాలించాయి. సోనమ్ కుటుంబ సభ్యులు ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.మే 21న మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఒక గెస్ట్హౌస్కు ఆ జంట ముందుగా చేరుకుంది. మరుసటి రోజు వారు స్కూటీని అద్దెకు తీసుకుని, పర్యాటక ప్రదేశం సోహ్రా (చిరాపుంజి)కి వెళ్లారు. తరువాత వారు తూర్పు ఖాసీ హిల్స్లోని మావ్లాఖియాట్ గ్రామానికి చేరుకుని, స్కూటీని పార్కింగ్ స్థలంలో ఉంచారు. అక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ను సంప్రదించారు. అతను మావ్లాఖియాట్ నుండి నాంగ్రియాట్కు ట్రెక్కింగ్కు చేరేందుకు మూడు గంటలు పడుతుందని, మూడు వేల మెట్లు దిగాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పటికే టైమ్ అయిపోయిందని, మర్నాడు వెళ్లవచ్చని గైడ్ వారికి చెప్పాడు. అయితే ఆ జంట తమకు రూట్ తెలుసని, గైడ్ సర్వీస్ అవసరం లేదని చెప్పారు.కాగా రాజా రఘువంశీ సోనమ్ దంపతులకు హోమ్ స్టే కల్పించిన ఒక మహిళ పోలీసులు విచారణలో వారిద్దరూ సాయంత్రం 5.30 గంటలకు నోంగ్రియాట్ గ్రామంలోని తమ షిపారా హోమ్స్టేకు వచ్చారని తెలిపారు. తాను రూమ్ ఛార్జీలు తీసుకుని, రిజిస్టర్లో సైన్ ఇన్ చేయమని చెప్పి, వారి గదిని చూపించానన్నారు. వారు చెక్ ఇన్ చేసి, గదికి తాళం వేసి లివింగ్ రూట్ బ్రిడ్జిలను చూడటానికి వెళ్లారని ఆ మహిళ చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి వచ్చి, భోజనం చేసి, రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని ఆమె తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే.. మరుసటి రోజు ఉదయం ఆ జంట త్వరగా చెక్ అవుట్ చేస్తామని హోమ్స్టే యజమానికి చెప్పారు. అల్పాహారం వద్దని, ఆకలిగా లేదని చెప్పి ట్రెక్కింగ్ కోసం వెళతామని అతనితో అన్నారు. మే 23న ఉదయం 6 గంటలకు ఆ జంట హోమ్స్టే నుండి బయలుదేరింది. ఆ జంటను చూసిన చివరి వ్యక్తి గైడ్ ఆల్బర్ట్ పిడే. పోలీసుల విచారణలో అతను 23న ఉదయం 10 గంటల సమయంలో ఆ జంట ముగ్గురు టూరిస్టులతో పాటు మావ్లాఖియాత్ గ్రామం వైపు వెళ్లడం చూశానని తెలిపాడు. ఆ తర్వాత నుంచి ఆ జంట కనిపించకుండా పోయింది.

వందే భారత్ స్లీపర్ కోచ్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..
సాక్షి, అమరావతి: వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా దూర ప్రాంతాలకు రాత్రివేళ ప్రయాణానికి ప్రస్తుతం ఉన్న రైళ్ల స్థానంలో వందే భారత్ స్లీపర్ కోచ్లను దశలవారీగా ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో మరింత వేగం, సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ కోచ్ల తయారీ ప్రణాళికను రైల్వే శాఖ ఆమోదించింది.రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారుసరికొత్త వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం 1,920 కొత్త కోచ్లను భారతీయ రైల్వే నిర్మించనుంది. అందుకోసం రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లను తాజాగా ఖరారు చేసింది. ఈ కాంట్రాక్టును మూడు సంస్థలకు ఇచ్చింది. బీఈఎంఎల్, కినెట్ రైల్వే సొల్యూషన్స్, టిట్లాగఢ్ రైల్వే సిస్టమ్స్ లిమిటెడ్–భారత్ హెవీ ఇంజినీరింగ్ లిమిటెడ్లతో కూడిన కన్సార్షియానికి టెండర్లు ఖరారు చేసింది.ఈ సంస్థలు నిర్మించే అధునాతన స్లీపర్ కోచ్లను 2027 నుంచి దశలవారీగా ప్రవేశపెట్టనుంది. కీనెట్ రైల్వే సొల్యూషన్స్ ఇప్పటికే మహారాష్ట్రలోని లాతూర్లోని కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ కోచ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టింది. త్వరలోనే అధునాతన వందేభారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. కొత్తగా నిర్మించే 1,920 కోచ్లు 2027 నుంచి 2029 నాటికి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మరో 11 వందే భారత్ ఛెయిర్ కార్ రైళ్లు..ఇదిలా ఉండగా.. మరో 11 వందే భారత్ రైళ్లు ఛెయిర్ కార్తో కూడినవి తయారు చేయడానికి లక్ష్యం ఉందని ఇంటిగ్రల్ కోచ్ ప్యాక్టరీ(ఐసీఎఫ్) అధికారి ఒకరన్నారు. ఆ తర్వాత ఛెయిర్ కార్ బోగీల ఉత్పత్తులు ఆపేసి స్లీపర్ కోచ్లపై దృష్టి సారించనున్నట్టు చెప్పారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్), పెరంబూరులోని ‘ఐసీఎఫ్’లో వందేభారత్ రైళ్లకు స్లీపర్ బోగీలు తయారు చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో ఉత్పత్తి పూర్తయిందని, ప్రొటోటైప్తో కూడిన రైలును రైల్వే బోర్డుకు త్వరలో అందించనున్నామని, రైల్వే బోర్డు 97 వందే భారత్ రైళ్ల తయారీకి ఆర్డరు ఇచ్చిందని ఐసీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో 86 రైళ్లు తయారీ పూర్తయి డెలివరీ కూడా చేశామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మిగిలిన 11 ఛెయిర్ కార్ బోగీలను బోర్డుకి అందిస్తామని చెప్పారు.

నీకు రెండో పెళ్లి నేను చేస్తా!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భర్త రహస్యంగా రెండో వివాహం చేసుకుంటున్నట్లు తెలుసుకున్న భార్య.. నేరుగా కల్యాణమండపం చేరుకొని అతన్ని బయటకు ఈడ్చుకు వచ్చి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఈ ఘటన చిత్రదుర్గ లో ఆదివారం చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా అరసీకెరె తాలూకా తిప్పఘట్టకు చెందిన కార్తీక్ నాయక్కు నాలుగేళ్ల క్రితం దావణగెరె జిల్లా న్యామతి తాలూకా ముశేనాళ గ్రామానికి చెందిన తనూజాతో వివాహం జరిగింది. అయితే భార్యకు తెలియకుండా రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. చిత్రదుర్గలోని గాయత్రి కల్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తనూజాకు తెలియడంతో ముహూర్తం సమయానికి వెళి కార్తీక్ను పెళ్లి పీటల మీద నుంచి ఈడ్చుకు వచ్చి చెప్పుతో చితకబాదింది. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లికి వచ్చిన వారు కంగుతిన్నారు. సంఘటనకు సంబంధించి చిత్రదుర్గ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీలో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శనివారం అర్థరాత్రి దాటాక స్వల్ప భూకంపం సంభవించింది. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి దాటాక 1.23 గంటలకు రిక్టర్ స్కేల్పై 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీలో ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూమి కేవలం స్వల్పస్థాయిలో కంపించడంతో ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఏడాది ఢిల్లీ కేంద్రంగా భూకంపం రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 5.36 గంటలకు రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో భూమి కంపించింది. ప్రస్తుతం ఢిల్లీ నాలుగో జోన్లో ఉంది. ఇది దేశంలోని భూకంపాల ప్రభావాలకు లోనయ్యే రెండో తీవ్ర ప్రమాదజోన్. హిమాలయాల కింద పొరలు తరచూ ఢీకొనే జోన్కు ఢిల్లీ దగ్గర్లో ఉంది. అదీకాకుండా ఢిల్లీ నుంచి కేవలం 250 కిలోమీటర్ల దూరం నుంచే హిమాలయ శ్రేణి మొదలవుతుంది. ఢిల్లీ–హరిద్వార్, సోహ్నా, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫలకాలు సైతం తరచూ కదులుతూ ఢిల్లీని భూకంపాల జోన్లోకి నెట్టేస్తున్నాయి. దీంతో ఢిల్లీకి భూకంపాల ముప్పు ఎక్కువైంది.
ఎన్ఆర్ఐ

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డే
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డేను సింగపూర్ ఈస్ట్ కోస్ట్ పార్క్ (ECP)లో మే 31, 2025న ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డేలో సుమారు 200 ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయఆటలను భావి తరాలకు అందించాలని TCSS సభ్యులు.. సంచి దుంకుడు, కచ్చకాయలు, ఇతర వినోద భరిత ఆటలు అంత్యాక్షరి, స్పూన్ మార్బుల్, డం చరాడ్స్ , తంబోలా మొదలగు ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనం చేశారుద. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ మాట్లాడుతూ ఎలాంటి హంగు ఆర్భాటాలు, లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమాలు ఆదర్శప్రాయం, అభినందనీయం అన్నారు.టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ ఫామిలీ డే - 2025 ఇంతలా విజయవంతమయ్యేలా సహకరించి వారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి రమేష్ గడప, రాము బొందుగుల మరియు వెంకటరమణ నంగునూరి, కల్వ లక్ష్మణ్ రాజు మొదలగు వారు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.(చదవండి: అమెరికా అంతటా గులాబీ మయం..!)

అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బహిష్కరణ
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 1,100మంది ఇండియన్స్ బహిష్కరణకు గురయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది.వీరిలో 62 శాతం వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారన్నారు. ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతుందని, అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని మన దేశం వెనక్కి రప్పిస్తుందని చెప్పారు.1,080 మంది భారతీయులు అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్నారని రణదీర్ జైశ్వాల్ తెలిపారు. చట్టవిరుద్ధంగా అమెరికా వెళ్లిన భారతీయ పౌరులను బహిష్కరించే విషయంలో... వారి గురించి పూర్తి వివరాలు అందిన తర్వాత అన్ని విషయాలు ధ్రువీకరించుకున్న తరువాతనే వారిని తిరిగి స్వదేశానికి రప్పిస్తున్నాం. గతంలోనే చెప్పినట్లుగా వారి జాతీయతను ధృవీకరించిన ర్వాత మాత్రమే వారిని తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఈవిషయంలో భారత్ అమెరికాల మధ్య సన్నిహిత సహకారం ఉందన్నారు. స్టూడెంట్ , ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసా దరఖాస్తుదారులపై అమెరికా ప్రభుత్వ మార్గదర్శకత్వం గురించి వచ్చిన నివేదికలను కూడా జైస్వాల్ ప్రస్తావించారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థుల సంక్షేమంపై దృష్టిపెట్టినట్టు వివరించారు.అలాగే తప్పిపోయిన ముగ్గురు భారతీయుల కోసం ఇరాన్తో సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ ముగ్గురి కుటుంబ సభ్యులకు మంత్రిత్వ శాఖ అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని రణధీర్ జైశ్వాల్ వివరించారు.

పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్స్ట్రీట్లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)

FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు , స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగుఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయములో మలేషియ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించామని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్లో అమరులైన జవాన్లకు, పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు . ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియ జేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు. ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.
క్రైమ్

బావ పెళ్లి చేసుకోవడం లేదని ఆత్మహత్య
నిర్మల్టౌన్: బావ పెళ్లి చేసుకోవడం లేదని అనుమానంతో మరదలు ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గత ఆరేళ్ల క్రితం ఒంగోలు నుంచి గురునాథం శ్రీను కుటుంబంతో కలిసి నిర్మల్ రూరల్ మండలం డ్యంగాపూర్ గ్రామానికి వలసవచ్చి మేస్త్రి పని చేసుకుంటున్నారు. శ్రీను చెల్లెలు రాధ ఒంగోలులో నివాసం ఉంటోంది. రాధ భర్త తాగుడుకి బానిస కావడంతో.. ఆమె రెండో కుమార్తె భవాని(17)ని మూడేళ్ల క్రితం తీసుకువచ్చి వీళ్ల దగ్గరనే ఉంచుకున్నారు. ఇంకో నాలుగేళ్ల తర్వాత శ్రీను తన కొడుకును, భవానిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. అయితే శ్రీను కొడుకు వేరే యువతితో ఫోన్లో మాట్లాడుతున్నాడని, తనను పెళ్లి చేసుకోడేమోనని భవాని అనుమానించింది. శనివారం రాత్రి 10 గంటలకు పూలమొక్కలకు కొట్టే పురుగుల మందు తాగింది. గమనించిన కు టుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గిరిజన విద్యార్థిని దారుణహత్య
అనంతపురం /కూడేరు: కూటమి సర్కారు పాలనలో మరో ఘాతుకం జరిగింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో ఇంటర్ విద్యార్థిని తన్మయి(19) దారుణహత్యకు గురైంది. ఆమె తలపై బలమైన గాయం ఉంది. ఘటనాస్థలంలో బీరుబాటిల్ లభ్యమైంది. దీంతో దుండగులు బీరుబాటిల్తో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం నగరంలోని టీవీ టవర్ దగ్గర ఉన్న రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి, అరుణ దంపతులకు కొడుకుతోపాటు కుమార్తె తన్మయి ఉన్నారు. తన్మయి ప్రస్తుతం ఆకుతోటపల్లి వద్ద గల ఓ కాలేజీలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన్మయి ఈ నెల 3న అదృశ్యం కావడంతో మరుసటి రోజు తండ్రి లక్ష్మీపతి అనంతపురం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాత్రి 9గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని కూల్ డ్రింక్ తాగడానికి బయటకు వెళ్లిందని, తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే.. కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆదివారం తన్మయి తల్లిదండ్రులు చూసి తమ కూతురేనని గుర్తించారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.హత్యగా ధ్రువీకరించిన వైద్యులు తలకు బలమైన గాయమైందని, దేనితోనో కొట్టడంతోనే తన్మయి మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో బీర్ బాటిల్ ఉండడంతో దాంతోనే తలపై కొట్టి చంపారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తన్మయి కాల్డేటా ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.నిందితులను కఠినంగా శిక్షించాలిగిరిజన విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. హోంమంత్రి దళిత మహిళ అయినా కూటమి పాలనలో రాష్ట్రంలోని దళిత, గిరిజన మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

నీటిలో మునిగి ఆరుగురి మృతి
డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్ కుమారులు గుంట సాయికిరణ్ (14), గుంట భానుతేజ్ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్తో ఆడుకుంటుండగా.. బాల్ పక్కనే ఉన్న నదిలో పడింది. బాల్ కోసం సయ్యద్ ఖాదర్ వలి (13), సయ్యద్ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. బాలుడిని బలిగొన్న అలలు విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ ఎదురుగా బీచ్లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్కు వచ్చింది. వీరిలో స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న సతీష్ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు.

నదీగర్భంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం
కాళేశ్వరం: వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు నదీగర్భంలో ఆదివారం లభ్యమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎగువన మూడవ బ్లాక్ వద్ద గోదావరి లోతు ప్రవాహ ప్రాంతంలో అంబట్పల్లికి చెందిన పట్టి వెంకట్స్వామి ఇద్దరు కుమారులు మధుసూదన్ (18), శివమనోజ్ (15), కర్ణాల సాగర్ (16), తొగరి రక్షిత్ (13), మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రామ్చరణ్ (17), అదే మండలం స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19)తో మేడిగడ్డ బ్యారేజీ చూసి గోదావరిలో ఈతకు వెళ్లి శనివారం సాయంత్రం 6 గంటలకు నీట మునిగారు. ఆ ఘటనలో పట్టి శివమణి (18) ప్రాణాలతో బయటపడ్డాడు. ముమ్మర గాలింపు.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భూపాలపల్లి ఏఎస్పీ నరేశ్కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి, డీడీఆర్ఎఫ్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించాయి. ఏడు గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో ఆరుగురి మృతదేహాల ఆచూకీ నీటమునిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల దూరంలో లభించింది. మృతదేహాలను వెలికి తీసి అంబులెన్స్ల ద్వారా మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో మేడిగడ్డ ప్రాంతం శోకసంద్రంగా మారింది.