akhil team
-
ఫైనల్లో నాగార్జున టీం విజయం
హైదరాబాద్:'మేము సైతం'కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్ర కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరిగిన ఫైనల్లో నాగార్జున టీం(అఖిల్ టీం) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నాగార్జున టీం నిర్ణీత రెండు ఓవర్లలో 26 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెంకటేష్ టీం 23 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. నాగార్జున టీం విసిరిన లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన వెంకటేష్ టీం చివరి వరకూ పోరాడినా విజయం సాధించడంలో చతికిలబడింది. హుద్హుద్ తుపాను బాధితులకు చేయూతనిచ్చేందుకు తెలుగు చలన చిత్రసీమ కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. ఇందులో భాగంగానే ఆదివారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
రాంచరణ్ జట్టుపై వెంకటేశ్ టీం ఘనవిజయం
హైదరాబాద్: 'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా సినీ తారల మధ్య ఆదివారం కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో క్రికెట్ మ్యాచ్ లో రాంచరణ్ టీంపై వెంకటేశ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెంకటేశ్ టీం 69 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన రాం చరణ్ టీం ఆదిలో బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ చివర్లో తడబడి ఓటమి పాలైంది. చివరి మూడు బంతుల్లో గెలుపుకు 14 పరుగులు చేయాల్సిన తరుణంలో రాం చరణ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. నిర్ణీత ఆరు ఓవర్లలో 54 పరుగులకే పరిమితమైన రాం చరణ్ ఓటమి పాలైంది. హుద్హుద్ తుపాను బాధితులకు చేయూతనిచ్చేందుకు తెలుగు చలన చిత్రసీమ ముందుకొచ్చి పలు కార్యక్రమాలు చేపట్టింది. అంతకుముందు జరిగిన క్రికెట్ మ్యాచ్ లో జూ.ఎన్టీఆర్ టీంపై అఖిల్ టీం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. -
ఎన్టీఆర్ క్రికెట్ జట్టుపై అఖిల్ టీం గెలుపు
హైదరాబాద్: తెలుగు సినీ తారల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఆకట్టుకుంది. ' మేము సైతం' కార్యక్రమంలో భాగంగా ఆదివారం కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో జూ.ఎన్టీఆర్ టీంపై అఖిల్ టీం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఖిల్ టీం ఆరు ఓవర్లలో 74 పరుగులు చేసింది. అఖిల్ టీం లో అందరూ స్థాయికి తగ్గట్టుగా రాణించి జట్టు చక్కటి స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎన్టీఆర్ టీం 64 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. హుద్హుద్ తుపాను బాధితులకు చేయూతనిచ్చేందుకు తెలుగు చలన చిత్రసీమ ముందుకొచ్చి పలు కార్యక్రమాలు చేపట్టింది. అంతకముందు జరిగిన కబడ్డీ పోటీలో మంచు విష్ణు టీంపై మంచు మనోజ్ టీం విజయం సాధించింది.