Alcatel
-
భారత్లో మళ్లీ అల్కటెల్ ఫోన్లు..
దేశీ మొబైల్ ఫోన్ల మార్కెట్లో అల్కటెల్ బ్రాండ్ను తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు నెక్ట్స్సెల్ ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు వీలుగా తొలి దశలో 3 కోట్ల డాలర్లు(రూ. 260 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి ఏడేళ్ల తదుపరి తిరిగి దేశీయంగా అల్కటెల్ బ్రాండ్ను విడుదల చేయనుంది.భారత్తోపాటు ప్రపంచ మార్కెట్లకు అవసరమయ్యే ప్రత్యేక ఫీచర్స్తో స్మార్ట్ఫోన్లను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు నెక్ట్స్సెల్ ఇండియా వివరించింది. నోకియాతో ట్రేడ్మార్క్ ఒప్పందం కింద అల్కటెల్ బ్రాండ్ను చైనీస్ కంపెనీ టీసీఎల్ కమ్యూనికేషన్ నిర్వహిస్తోంది.దేశీయంగా అల్కటెల్ బ్రాండ్ అధీకృత హక్కులను నెక్ట్స్సెల్ ఇండియా కలిగి ఉంది. దీంతో అల్కటెల్ ప్రొడక్టుల సంబంధిత అన్నిరకాల కార్యకలాపాలను కంపెనీ నిర్వహించనున్నట్లు నెక్ట్స్సెల్ ఇండియా చీఫ్ బిజినెస్ అధికారి అతుల్ వివేక్ వెల్లడించారు. రూ. 20,000 నుంచి రూ. 25,000 ధరల శ్రేణిలో తమకు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదే స్థాయిలో స్టైలస్తో కూడిన స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో తమ బ్రాండ్ ఫోన్ల అమ్మకం కోసం ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నట్లు వివరించారు. -
అల్కాటెల్ 3వీ స్మార్ట్ఫోన్, బడ్జెట్ ధర, ఫీచర్లు అదుర్స్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల హవా కొనసాగుతోంది. ఇప్పటికే షావోమి, వివో, లెనోవా లాంటి కంపెనీలు ఆకట్టుకునే స్మార్ట్ఫోన్లతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి. తాజాగా ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా అల్కాటెల్ అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. 'అల్కాటెల్ 3వి' పేరుతో తాజా డివైస్ను మంగళవారం విడుదల చేసింది. ముఖ్యంగా రూ.9,999 ధరలో ఈ నెల 31వ తేదీ నుంచి వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ సైట్ నుంచి ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఫేస్ అన్లాక్ ఫీచర్కూడా ఈ స్మార్ట్ఫోన్లో పొందుపర్చింది. అంతేకాదు ఫోన్ను కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్, ఇతర ఆఫర్లను అందిస్తోంది. జియో కస్టమర్లకు ఈ ఫోన్పై రూ.2200, రూ.3700 ల క్యాష్బ్యాక్ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు వెయ్యి రూపాయలు, రూ.500 విలువ చేసే మింత్రా, క్లియర్ ట్రిప్ గిఫ్ట్ ఓచర్లను అందిస్తారు. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ సదుపాయం కూడా లభ్యం. ప్రీమియం బ్రాండ్లో కసమర్లు ఆశించే ఫేస్ అన్లాక్ సహా అన్ని ఫీచర్లతో తాజా స్మార్ట్ఫోన్ను లాంచ్ చేశామని భారత్లో అల్కాటెల్ పరికరాలను విక్రయిస్తున్న చైనాకు చెందిన టిసిఎల్ కమ్యూనికేషన్ రీజనల్ డైరెక్టర్ ప్రవీణ్ వలేచా తెలిపారు. అల్కాటెల్ 3వి ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160x1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 1.45 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 16+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆల్కాటెల్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్
బెంగళూరు: ఆల్కాటెల్ సంస్థ అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1,990 రూపాయలకే వినియోగదారులకు స్మార్ట్ఫోన్ను అందించనుంది. సంస్థ రీజనల్ డెరైక్టర్ ప్రవీణ్ బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఫైర్ ఫాక్స్తో కలిసి ఈ స్మార్ట్ ఫోన్ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ వెబ్సైట్లో ఈనెల 6 నుంచి దీనిని అందుబాటులో ఉంచనున్నట్లు ప్రవీణ్ చెప్పారు. **