Aleppo
-
సిరియాలో మళ్లీ... అంతర్యుద్ధం!
సిరియా మళ్లీ భగ్గుమంటోంది. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పో తాజాగా తిరుగుబాటుదార్ల పరమైంది. ప్రభుత్వ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో మళ్లీ అంతర్యుద్ధం రాజుకుంది. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో సిరియాలో ఏకంగా 3 లక్షల మందికిపైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశీ బాట పట్టారు. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇలా ఉద్రిక్తతలు పెరగడం తాలూకు మూలాలు ఉక్రెయిన్–రష్యా, ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధాల్లో ఉన్నాయి.2011లో ‘అరబ్ వసంతం’ పేరిట అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ఊపందుకుంది. రాచరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటూ జనం వీధుల్లోకి వచ్చారు. ఈజిప్టులో ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దారులు ఏర్పడ్డాయి. అది ఇతర అరబ్ దేశాల ప్రజలకూ స్ఫూర్తినిచ్చింది. సిరియా ప్రజలు కూడా నియంతగా అధికారం చలాయిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను గద్దె దించడమే లక్ష్యంగా పోరుబాట పట్టారు. వాటిని అసద్ ఉక్కుపాదంతో అణచేయడంతో జనం ఆయుధాలు చేతపట్టారు. సైన్యంలో అసద్ను వ్యతిరేకించే వర్గం కూడా వారితో చేతులు కలిపింది. అంతా కలిసి తిరుగుబాటుదార్లుగా మారారు. దేశమంతటా వేర్వేరు తిరుగుబాటు దళాలు ఏర్పడ్డాయి. వీటి సిద్ధాంతాలు వేరైనా అసద్ను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఉమ్మడి లక్ష్యం. అసద్ అంటే గిట్టని తుర్కియే, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు అమెరికా తదితర దేశాలు తిరుగుబాటుదార్లకు అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయి. దాంతో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలం పుంజుకున్నాయి. అటు అసద్కు మద్దతుగా సిరియా మిత్రదేశాలైన ఇరాన్, రష్యా రంగంలోకి దిగాయి. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా అసద్ సైన్యానికి అండగా నిలిచాయి. రష్యా ఇచ్చిన యుద్ధ విమానాలతో సిరియా వైమానిక దళానికి కొత్త బలం చేకూరింది. అసద్ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఏళ్ల తరబడి భీకర యుద్ధమే జరిగింది. ఉగ్ర సంస్థలకు చేదు అనుభవం సిరియా పరిణామాలను అల్ఖైదా, ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమకనుకూలంగా మార్చుకున్నాయి. తిరుగుబాటుదార్లకు సాయం చేసే నెపంతో సిరియాపై పట్టు సాధించాయి. 2014 నాటికి ఈ జిహాదీల పెత్తనం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఐసిస్ ప్రభావం విపరీతంగా పెరిగింది. ఉగ్రవాదులకు సిరియా శాశ్వత అడ్డాగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా రంగంలోకి దిగి సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్) సాయంతో విరుచుకుపడటంతో అల్ఖైదా, ఐసిస్ తోకముడిచి దేశం వీడాయి. కాల్పుల విరమణతో ఆగిన ఉద్రిక్తతలు సిరియాలో పలు ప్రావిన్స్లను తిరుగుబాటుదార్లు ఆక్రమించడం, తర్వాత వాటిని ప్రభుత్వ సైన్యం స్వా«దీనం చేసుకోవడం జరుగుతూ వచ్చింది. 2020లో ఇద్లిబ్ ప్రావిన్స్ తిరుగుబాటుదార్ల చేతుల్లోకి వచ్చింది. ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు రష్యా, తుర్కియేతో పాటు తిరుగుబాటుదారులూ ఒప్పుకున్నారు. ఉమ్మడి పహారాతో సెక్యూరిటీ కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నాటినుంచీ కీలకమైన ప్రావిన్సులతో పాటు సిరియాలో మెజారిటీ భూభాగం తిరుగుబాటుదార్ల అ«దీనంలోనే ఉండిపోయింది.నాయకత్వం ఎవరిది? సిరియాలో తిరుగుబాటుదార్లతో ఏర్పాటైన ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’కు హయత్ తా హ్రీర్ అల్–షామ్ సంస్థ నాయకత్వం వహి స్తోంది. ఇది గతంలో అల్–నుస్రా ఫ్రంట్ పేరు తో అల్ఖైదాకు అనుబంధంగా పనిచేసింది. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇద్లిబ్ ప్రావిన్స్లో అధికారం చెలాయి స్తోంది. తుర్కియే, అమెరికా మద్దతుతో సిరియాలో కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని గ్రూప్లు తాహ్రీర్ అల్–షామ్కు అండగా నిలుస్తున్నాయి. ఇప్పుడే ఎందుకీ అలజడి? అసద్ మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. మరో మిత్రదేశం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హెజ్బొల్లా గ్రూప్కూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటినుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బయటి సాయం లేక ఆయన ప్రభుత్వమూ బలహీనపడింది. ఈ పరిస్థితిని వాడకుంటూ తిరుగుబాటుదార్లు క్రియాశీలకంగా మారారు. ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’ పేరిట కొత్త కూటమి కట్టారు. పెద్దగా ప్రతిఘటనే లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పోతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామాల్లోనూ పాగా వేశారు. ఇది అసద్కు భారీ ఎదురుదెబ్బే. అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల అండదండలతో వాళ్లిప్పుడు మొత్తం సిరియానే స్వాధీనం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలెప్పోతో పాటు పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆదివారం సైన్యం ఎదురుదాడి యత్నాలు మొదలు పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అసద్ నుంచి విముక్తి పొందడానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఏర్పడుతుందా? లేక పశ్చిమ దేశాల కీలుబొమ్మ సర్కారు గద్దెనెక్కుతుందా అన్నది మాత్రం ఆసక్తికరం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కారు బాంబు దాడి, 16 మంది మృతి
అలెప్పొ: సిరియా మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. శనివారం అలెప్పొ నగర శివారులో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 16 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. అలెప్పొకు వెళ్తున్న ఓ బస్సును నగర శివారులో ఆపి ఉంచిన సమయంలో.. దానికి సమీపంలో ఆత్మాహుతి దళ సభ్యుడు కారు బాంబును పేల్చినట్టు మిలటరీ మీడియా వెల్లడించింది. ఈ పేలుడుతో బస్సు ధ్వంసమైంది. ప్రయాణికుల మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
అలెప్పోకు దాదాపుగా విముక్తి!
డెమాస్కస్: సిరియాలోని ఉగ్రవాదులకు, తిరుగుబాటుదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అలెప్పో నగరంలో సిరియా బలగాలు వారిని తుదముట్టించాయి. దాదాపు 93శాతం ప్రాంతాన్ని బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. ఇంకొన్ని ప్రాంతాలపై మాత్రమే పట్టుసంపాదించాల్సి ఉంది. ఇది పూర్తయితే, పూర్తిగా అలెప్పోకు తిరుగుబాటుదారుల నుంచి విముక్తి లభించినట్లవుతుంది. ఇప్పటికే దాదాపు 30వేల మంది అలెప్పో నగర పరిధిలోని పౌరులంతా ప్రభుత్వ రక్షణ దళాల సహాయంతో సురిక్షిత ప్రాంతాలకు తమ ఇంటిని, కట్టుకున్న బట్టలను వదిలేసి వెళ్లారు. తాజాగా మరికొన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తెచ్చుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్లో మరో మూడువేల మంది సౌకరి అనే ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. అలెప్పో పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వచ్చాక దాని రూపురేఖలు పూర్తిగా మార్చి వేస్తామని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ అన్నారు. -
‘ప్రియమైన ప్రపంచమా మళ్లీ కలుద్దాం.. సెలవు’
అలెప్పో: ఏడేళ్ల ప్రాయంలోనే తన ట్వీట్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కంటతడి పెట్టించిన అలెప్పో చిన్నారి బనా అలాబెడ్(7) జాడ కనిపించకుండా పోయింది. తన ట్విట్టర్ ఖాతా ఆదివారం నుంచి కనుమరుగైంది. అనతి కాలంలోనే దాదాపు లక్షమంది ఫాలోవర్స్ను సంపాధించుకుని వాళ్ల హృదయాలను ద్రవించజేసిన అలాబెడ్ ఆదివారం రాత్రి నుంచి ట్విట్టర్లో మాయమైంది. సిరియాకు చెందిన ప్రముఖ నగరం అలెప్పో నగరంలో ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు, అమెరికా సంయుక్త సిరియా బలగాలకు మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదుల చెర నుంచి అలెప్పోను విముక్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ బలగాలు ముందుకు సాగుతుండగా బాంబుల వర్షం కురుస్తోంది. బాంబు శబ్దం, విస్పోటనాలు లేని రాత్రి అక్కడ లేదంటే ఆశ్చర్యం కాదు. అలాంటి పరిస్థితులను, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న దౌర్భాగ్యాన్ని అలాబెడ్ గత సెప్టెంబర్ నుంచి తన తల్లి ఫతేమా క్రియేట్ చేసిన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తోంది. ‘మేమింకా బ్రతికే ఉన్నాం. ప్రపంచమా గుడ్ మార్నింగ్’ అంటూ ఈ మధ్యే ఓ ట్వీట్ చేసి గుండెలు పిండేసింది. అలాంటి అలాబెడ్ గత నెల(నవంబర్) 27న ‘ఈ రోజు రాత్రి మాకు ఇల్లు లేదు. బాంబు దాడిలో అది ధ్వంసమైంది. నేను ఎంతోమంది మరణాలు చూశాను. నేను కూడా దాదాపు చనిపోయినట్లే’ అని ట్వీట్ చేయడంతోపాటు ఇప్పటకీ బాంబుల వర్షం కురుస్తోంది. మేం చావుకు బ్రతుకుకు మధ్య పోరాడుతున్నాం. మాకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్ చేసింది. ఇక చివరిసారిగా ‘కచ్చితంగా మమ్మల్ని ఆర్మీ అదుపులోకి తీసుకుంటుంది. ప్రియమైన ప్రపంచమా త్వరలోనే మనం మరోసారి కలుసుకుంటాం. ఇక సెలవు’ అని ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఆదివారం రాత్రి నుంచి అలాబెడ్ ట్విట్టర్ ఖాతా నుంచి కనిపించకుండా పోయింది. పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్నా ఆమె సురక్షితంగా ఉండాలని వేడుకుంటున్నారు. భద్రతా బలగాలు వారిని ఏదో ఒక చోట భద్రంగా ఉంచి ఉంటారని, కుదురుకున్నాక అలాబెడ్ తన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తుందని అనుకుంటున్నామని చెబుతున్నారు. May Allah keep you safe, Bana and family. Please let us know you're safe when you're able. #BanaAlabed — Lil Yum Yum (@ScribeShelly) 5 December 2016 God be with Bana Alabed and her family. Praying they're safe and will have an opportunity to live a better life elsewhere. #Aleppo — Dan Jones (@djonesvi) 5 December 2016 -
'గుడ్ మార్నింగ్.. మేమింకా బతికే ఉన్నాం'
అలెప్పో: అలెప్పో..సిరియాలోని ఒక ప్రముఖ నగరం.. అయితే, నిత్యం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ప్రభుత్వ బలగాలకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఏక్షణం ఏ ఇంటి మీద బాంబు పడుతుందో ఎవరూ ఏ రాత్రి అనూహ్యంగా శిథిలాల కింద పడి ప్రాణాలుకోల్పోతారో తెలియని పరిస్థితి. ఎలాగైనా తమ ఆదీనంలోకి తెచ్చుకోవాలని సిరియా ప్రభుత్వం ఓ పక్క.. ఏమైనా సరే పట్టు విడవొద్దని ఉగ్రవాదులు మరోపక్క.. మొత్తానికి పరస్పరం విసురుకుంటున్న బాంబుల ధాటికి అక్కడి సామాన్యుల ప్రాణాలు మాత్రం గాల్లో దీపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఉగ్రవాదులు దాడులు ఆపేయాలని అలెప్పోను ప్రశాంతంగా విడిచిపెట్టాలని కోరుకుంటూ ఓ చిన్నారి ట్విట్టర్ ద్వారా తన విన్నపాలు వినిపిస్తోంది. ఏడేళ్ల వయసున్న బనా అలబెడ్ అనే చిన్నారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా మనసును కదిలించే చిత్రాలతోపాటు స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోలు కూడా ట్విట్టర్ లో పెడుతూ ఆశ్చర్య పరుస్తోంది. ఈ ఖాతాను ఆమె తల్లి నిర్వహిస్తోంది. ట్విట్టర్ ద్వారా తాను చెబుతున్న మాటలు, వివరాలు వింటుంటే ఎవరికైనా జాలి కలగాల్సిందే. అవేంటో ఒక్కసారి గమనిస్తే.. 'మీరేందుకు ప్రతి రోజు అమాయకులైన మాపై బాంబులు వేస్తున్నారు' అంటూ విషాదంతో చూస్తున్నట్లుగా ఒక ఫొటో పోస్ట్ చేయగా మరో చోట.. 'ఫ్రెండ్స్ ఇది జాబిలి కాదు.. మా నగరంపై బాంబు దూసుకొస్తుంది' అంటూ ఓ బాంబు అలెప్పోపై పడుతున్న ఛాయా చిత్రాన్ని పెట్టింది. అలాగే, రాత్రి బాంబు దాడి అనంతరం ఉదయాన్నే ఆ ప్రాంతాన్ని తాను పరిశీలిస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. 'అలెప్పో నుంచి మేం శుభోదయం చెబుతున్నాం.. మేం ఇంకా బతికే ఉన్నాం' అని ఆశ్చర్యపోయినట్లుగా ఓ బాంబు వలన రేగిపోయిన దుమ్ము ఫొటో పెట్టింది. 'నా ప్రియమైన ప్రపంచమా నేను ఈ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే నా మిత్రురాలు బాంబు దాడిలో చనిపోయింది. నేను ఏడుపు అపలేకపోతున్నాను'. 'ఎవరైనా దయచేసి నన్ను రక్షించరా ప్లీజ్ అంటూ తన బెడ్ వెనుకాల దాచుకున్నట్లుగా ఉన్న ఓ వీడియో' 'శుభ మధ్యాహ్నవేళ.. నేను యుద్ధాన్ని మర్చిపోయేందుకు చదువుతున్నాను' అంటూ ఇలా ప్రతిరోజు అలెప్పోలోని పరిస్థితులు ప్రపంచానికి అర్థమయ్యేలా ఈ చిన్నారి తన ఖాతాలో వివరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. Why would they bomb us and kill innocent people everyday?. - Bana #Aleppo pic.twitter.com/XeF3Q7HKZ9 — Bana Alabed (@AlabedBana) 21 November 2016 checking in the morning after a night of bombing #Aleppo #StandWithAleppo pic.twitter.com/vcbJ3vbD91 — Bana Alabed (@AlabedBana) 22 November 2016 My friends this is not the moon, this is bomb falling now. Please pray for us tonight. I am afraid. - Bana #Aleppo pic.twitter.com/1jpy87rSrn — Bana Alabed (@AlabedBana) 23 November 2016 Good morning from #Aleppo. We are still alive. - Bana pic.twitter.com/hw0XyaXBKA — Bana Alabed (@AlabedBana) 24 November 2016 Oh dear world, I am crying tonight, this is my friend killed by a bomb tonight. I can't stop crying. - Bana #Aleppo pic.twitter.com/WpmCrEDTIa — Bana Alabed (@AlabedBana) 24 November 2016 I swear I am crying tonight. My student, her father were killed in rocket tonight. The bombs becoming louder. - Fatemah #Aleppo — Bana Alabed (@AlabedBana) 24 November 2016 -
ఎంత కష్టమోచ్చింది...
-
ఎంత కష్టమొచ్చింది...
డమాస్కస్(అలెప్పో): సిరియాలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు సామాన్య ప్రజలు, చిన్నారులు ఎలా సమిధలౌతున్నారో తెలిపే ఓ బాలుడి వీడియో ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. శకలాల మధ్య కాళ్లు ఇరుక్కున్న 16ఏళ్ల బాలుడు మరూఫ్ని సహాయక సిబ్బంది కాపాడుతున్న వీడియో సిరియా అంతర్యుద్దాన్ని కళ్లకుకడుతోంది. ఈ ఘటనలో శకలాల మధ్య బాలుడి కాళ్లు ఇరుక్కోవడంతో బాలున్ని బయటకు తీయడానికి సిబ్బంది ప్రయత్నాలు చూస్తే, కళ్లు చెమ్మగిల్లేలా ఉన్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందారు. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయి. కాగా, తీవ్రగాయాలైన మరూఫ్కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఆ ఘటన మరువక ముందే అలెప్పో ప్రాంతంలో తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని ఆగష్టులో జరిగిన వైమానిక దాడుల్లో ఓ భవనం ధ్వంసమైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు, పాత్రికేయులు ఒమ్రాన్ అనే బాలుడి కుటుంబాన్ని రక్షించారు. ఒళ్లంతా తీవ్రగాయాలై రక్తమోడుతున్న బాలుడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఒమ్రాన్ కుటుంబాన్ని భవనం నుంచి బయటకు తీసుకొచ్చిన కొద్ది సేపట్లోనే అది పూర్తిగా కుప్పకూలింది. ఒమ్రాన్ అంబులెన్స్ లో కూర్చున్న సమయంలో ఓ పాత్రికేయుడు తీసిన ఫోటో ఇది. ఒమ్రాన్ ఫోటోతో అంతర్జాతీయ సమాజం కదిలిపోయింది. సామాజిక కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. -
వైమానిక దాడుల్లో 31 మంది మృతి
డమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందినట్టు బ్రిటన్ కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ వెల్లడించింది. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై నాలుగు వైమానిక దాడులు జరిగినట్టు తెలిపింది. శిథిలాల్లో 10 కుటుంబాలు చిక్కుపోయాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఈ దాడుల వెనుక సిరియా ప్రభుత్వ దళాల హస్తం ఉండొచ్చ అనుమానాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.