Amarinder Singh lambi
-
‘మరి గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పదా’
చంఢీగడ్ : జలియన్ వాలాబాగ్ మారణహోమానికి నేటికి సరిగ్గా వందేళ్లు. బ్రిటీష్ - ఇండియా చరిత్రలో ఈ మారణహోమం ఓ మచ్చగా మిగిలిపోతుందని రెండు రోజుల క్రితం బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. థెరిసా వ్యాఖ్యలు ప్రస్తుతం భారత రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి పాల్పడినందుకుగాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పంబాజ్ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్.. ‘అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి గాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కోరడం బాగానే ఉంది. మరి మీ పార్టీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ సంగతేంటి. దానికి గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పాల్సిన పని లేదా’ అని ప్రశ్నించారు. అంతేకాక మీరు స్వయంగా దగ్గరుండి రాహుల్ గాంధీని సిక్కుల పవిత్రంగా భావించే శ్రీ అకాళి తక్త్ సాహిబ్లోకి తీసుకెళ్లారు.. మరి దీనికేం సమధానం చెప్తారంటూ హర్సిమ్రత్ కౌర్ వరుస ట్వీట్లు చేశారు. 1984లోఅమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న సిక్కు ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ అమలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ.. హర్సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు. అంతేకాక స్వర్ణ దేవాలయంలోకి ఆయుధాలను, ట్యాంక్లను తీసుకువచ్చిన గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించే ధైర్యం అమరీందర్కు లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్పై స్పందించిన అమరేందర్.. ‘మీరు, మీ భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మీ ముత్తాత సర్దార్ సుందర్ సింగ్ మజిథియి జలియాన్ వాలాబాగ్ మారణకాండ అనంతరం జనరల్ డయ్యర్కు బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు. దాంతో ఆయన ప్రభు భక్తికి మెచ్చి బ్రిటన్ ప్రభుత్వం అతన్ని నైట్హుడ్ బిరుదతో సత్కరించడం గుర్తులేదా’ అని రీట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి ట్వీట్ల యుద్ధం ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. -
పంజాబ్, గోవాల్లో ముగిసిన ప్రచారం
-
పంజాబ్, గోవాల్లో ముగిసిన ప్రచారం
రేపే ఎన్నికలు న్యూఢిల్లీ: పంజాబ్, గోవా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు పోలింగ్ శనివారం జరగనుంది. ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మోదీ ప్రభుత్వం రూ.1,000, పాత రూ.500 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. పంజాబ్లో 117 స్థానాలకు, గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ♦ పంజాబ్ ప్రచారంలో రైతుల ఆత్మహత్యలు, డ్రగ్స్ మాఫియా ప్రధాన అస్త్రాలుగా నిలిచాయి. ♦ ఇక్కడ కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ లంబి, పాటియాలా స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.ప్రస్తుత సీఎం ప్రకాష్ సింగ్ బాదల్పై లంబిలో పోటీకి దిగుతున్నారు. ♦ మాజీ క్రికెటర్ సిద్ధూ అమృత్సర్ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ♦ గోవాలో అధికార బీజేపీ.. ఆప్ నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. ♦ గోవాలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ, గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ల చరిష్మాను ప్రచారాస్త్రంగా ఉపయోగించింది. బీజేపీ గెలిస్తే పరీకర్ మళ్లీ ముఖ్యమంత్రిగా గోవాకు వస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.