ప్రముఖ పాత్రికేయుడు అరిందమ్ సేన్గుప్తా మృతి
న్యూఢిల్లీ : ప్రముఖ పాత్రికేయుడు అరిందమ్ సేన్గుప్తా కేన్సర్తో గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. గత 33 ఏళ్లుగా ఆయన పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. గతంలో అరిందమ్ సేన్గుప్తా ది పేట్రియాట్, ది సండే అబ్జర్వర్, ది ఎకనామిక్ టైమ్స్లో పని చేశారు. ఎస్టీ స్టిఫెన్స్ కాలేజీలో ఎంఏ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు.
అరిందమ్ సేన్గుప్తా ప్రస్తుతం టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అరిందమ్ మృతిపై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేశారు.