aspirations
-
కొత్త ఏడాదికి సన్నద్ధమా?
కేలండర్లో నంబర్ మారిపోతోంది. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామంటే ఏదో తెలియని హుషారు. కొత్త ఏడాదిలో కలలు సాకారం కావాలని, మరిన్ని విజయాలు వరించాలని, గొప్ప అవకాశాలను అందుకోవాలని, వృత్తి/వ్యాపారం/ఉద్యోగంలో రాణించాలని ఇలా.. ఎన్నెన్నో ఆకాంక్షలు. ఈ జాబితాలో ఆర్థిక లక్ష్యాలకూ చోటు ఉండాల్సిందే. అయితే ఆర్థిక నిర్ణయాలకు ఫలితాలు వెంటనే కనిపించవు. కొన్నేళ్ల ప్రయాణం తర్వాతే విజయాలు సాకారం అవుతాయి. పెట్టుబడి వృద్ధి అన్నది ఒక్క ఏడాదితో అయ్యేది కాదు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ దిశగా ఆచరణ పక్కాగా ఉండాలి. కారు, సొంతిల్లు, పిల్లల విద్య, రిటైర్మెంట్.. తదితర కీలక లక్ష్యాలను సరైన ప్రణాళికతోనే చేరుకోగలరు. ప్రస్తుత ఏడాది ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులు, రుణాలను ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన తరుణం కూడా ఇదే. ఆర్థిక సన్నద్ధతను పరీక్షించుకోవాల్సిన సందర్భం కూడా ఇదే. బడ్జెట్ రూపకల్పనరూపాయి ఆదా చేయడం తిరిగి సంపాదించడంతో సమానం. అందుకే డబ్బు విషయంలో లెక్క పక్కాగా ఉండాలి. ఇందుకు వీలు కలి్పంచేదే ఆర్థిక ప్రణాళిక. ఈ దిశగా మొదట చేయాల్సింది కుటుంబానికి బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం. కానీ, అందరికీ ఆర్థిక అంశాలపై అవగాహన ఉండదు. అటువంటప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తదితర నిపుణుల సాయంతో బడ్జెట్ రూపొందించుకోవాలి. ముందుగా మీ ఆర్థిక స్థితిపై అవగాహన అవసరం. వివిధ మార్గాల్లో వస్తున్న మొత్తం ఆదాయం, వ్యయాలు, అవసరాలు, కోరికలు, జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలు, వాటిని నెరవేర్చుకునేందుకు సమకూర్చుకోవాల్సిన వనరులు తదితర సమాచారం ఆధారంగా నిపుణులు మీకంటూ ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళికను సూచిస్తారు. ఆర్థిక స్వేచ్ఛకు స్పష్టమైన మార్గసూచీ మీకు లభిస్తుంది.50/30/20 సూత్రం ఆర్థిక క్రమశిక్షణతో మెలిగేవారికి 50/30/20 సూత్రం ఆచరణీయం. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపులు పోను మిగులు ఆదాయంలో 50 శాతాన్ని అవసరాలకు వెచి్చంచుకోవాలి. రోజువారీ జీవన వ్యయాలు (గ్రోసరీ, ఇంటి అద్దె, ఫోన్, గ్యాస్, వాహన ఇంధన వ్యయాలు, పిల్లల స్కూల్/కాలేజీ ఫీజులు/ఔషధాలు, చికిత్సల ఖర్చులు), ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవన్నీ అవసరాల కిందకే వస్తాయి. 30 శాతాన్ని కోరికలకు కేటాయించుకోవచ్చు. జీవనానికి కచ్చితంగా అవసరం లేనివి ఈ విభాగంలోకి వస్తాయి. రెస్టారెంట్లలో విందులు, విహార యాత్రలు, ఖరీదైన ఎల్రక్టానిక్ వస్తువులు, లగ్జరీ ఉత్పత్తులు, వినోదం ఈ విభాగం కిందకు వస్తాయి. మిగిలిన 20 శాతాన్ని పెట్టుబడులకు కేటాయించుకోవాలి. ఈ పెట్టుబడులు జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఉండాలి. ఇల్లు కొనుగోలు, పిల్లల ఉన్నత విద్య, పిల్లల వివాహాలు, ప్రశాంతమైన విశ్రాంత జీవనం వీటన్నింటికీ మద్దతుగా నిలవాలి. అవసరమైతే ముఖ్యమైన జీవన లక్ష్యాల కోసం 30–40 శాతం మేర పెట్టుబడులకు కేటాయించుకుని, కోరికలకు 20–10 శాతం బడ్జెట్తో సరిపెట్టుకున్నా తప్పులేదు. రోజువారీ ముఖ్యమైన జీవన అవసరాలు మొదటి ప్రాధాన్యంగా, ముఖ్యమైన జీవిత లక్ష్యాలు రెండో ప్రాధాన్యంగా పెట్టుబడుల ప్రణాళిక సాగిపోవాలి. పన్ను ప్రయోజనాలు పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల రాబడి పెంచుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవాలంటే అందుకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనుకూలం. రిటైర్మెంట్ ఫండ్కు వీలైన పీపీఎఫ్, ఎన్పీఎస్ సాధనాల్లో చేసే పెట్టుబడులకూ పన్ను ప్రయోజనాలున్నాయి. అందుకే పెట్టుబడులను పన్ను ప్రయోజనాలతో సమన్వయం చేసుకోవాలి. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలను సైతం వినియోగించుకోవాలి. అంతేకాదు, పన్నుల్లోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. వీటికి అనుగుణంగా నిర్ణయాల్లో సవరణలు కూడా అవసరం కావొచ్చు. స్పష్టమైన ఆచరణ ముఖ్యమైన లక్ష్యాలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ లక్ష్యాలకు ఎంత మొత్తం అవసరం అన్నది నిపుణుల సాయంతో తేల్చుకోవాలి. ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు మెరుగైన పెట్టుబడి సాధనాలను గుర్తించాలి. 10 ఏళ్లు అంతకుమించిన సాధనాలకు ఈక్విటీలు మెరుగైనవి. కానీ, వీటిల్లో స్వల్పకాలానికి (మూడేళ్లలోపు) రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ రిస్క్ ప్రభావం తగ్గిపోయి రాబడులు అధికంగా ఉంటాయి. ఐదేళ్ల కంటే తక్కువ కాల లక్ష్యాలకు డెట్ సాధనాలు అనుకూలం. ఐదు– ఏడేళ్ల కాల లక్ష్యాలకు డెట్, ఈక్విటీ కలయికగా పెట్టుబడులు ఉండాలి. మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతం బంగారానికీ కేటాయించుకోవాలి. లక్ష్యాలకు కావాల్సిన రాబడుల కోసం ఏ ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణులను అడిగి తెలుసుకోవాలి. సరైన అస్సెట్ అలోకేషన్ (వివిధ సాధనాల మధ్య వర్గీకరణ) వ్యూహం అమలు చేయాలి. ఈక్విటీ పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. ప్రతి నెలా నిర్ణయించిన మేర ఆటోమేటిగ్గా వాటిల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. ఆదాయం వచి్చన వెంటనే ముందు చేయాల్సింది పెట్టుబడి. ఆ తర్వాతే మిగిలిన అవసరాల సంగతి చూడాలి. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సంపాదన మొదలు పెట్టిన మొదటి నెల నుంచే పెట్టుబడులు కూడా ప్రారంభం కావాలి. ఎందుకంటే పెట్టుబడి సంపదగా మారడంలో కాంపౌండింగ్ (రాబడిపై రాబడి) కీలకం అవుతుంది. ఈ కాంపౌండింగ్కు ఎక్కువ కాలం కావాలి. ఎంత ఎక్కువ వ్యవధి ఉంటే అంత అధికంగా సంపద సమకూర్చుకోవచ్చు. అత్యవసర నిధి కుటుంబానికి అత్యవసర నిధి తప్పనిసరి. కారణం ఏదైనా ఉన్నట్టుండి ఆదాయం ఆగిపోతే.. కుటుంబ అవసరాలు, పెట్టుబడుల లక్ష్యాలు నిలిచిపోకూడదు. ముఖ్యమైన అవసరాలు, పెట్టుబడులకు ప్రతి నెలా ఎంత మెత్తం వెచి్చస్తున్నారో చూసుకుని.. కనీసం ఆరు నెలల నుంచి 12 నెలలకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వేగంగా వెనక్కి తీసుకో వచ్చు. బీమా రక్షణ అత్యవసర నిధితోపాటే బీమా రక్షణ కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి జరగరానికి జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్లకుండా జీవిత బీమా రక్షణ (టర్మ్ లైఫ్) కలి్పస్తుంది. రోడ్డు ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైతే ఆరోగ్య బీమా అండగా నిలుస్తుంది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా, ఆర్థిక కష్టాలను ఆహా్వనించినట్టే అవుతుంది. అంతేకాదు బడ్జెట్ ప్రణాళికలు తల్లకిందులవుతాయి. తన కుటుంబ జీవనం, కీలక లక్ష్యాలకు సంబంధించి పెట్టుబడులకు ఒక ఏడాదిలో ఎంత వ్యయం అవుతుందో.. అంతకు 20 రెట్ల మొత్తం టర్మ్ లైఫ్ అష్యూరెన్స్ తీసుకోవాలి. యాక్సిడెంటల్ డెత్, డిస్మెంబర్మెంట్ (వైకల్యం) రైడర్ జోడించుకోవాలి. ఒక కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ పాలసీతోపాటు, రూ.50 లక్షలకు (రూ.5–10 డిడక్టబుల్) సూపర్ టాపప్ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా ఉండాలి. రుణపడొద్దు.. ఒక్కసారి బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత దాని పరిధిలోనే లక్ష్మణ రేఖ దాటకుండా నడుచుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం నేటి కోరికలను నియంత్రించుకోవడం ఆర్థిక శాస్త్ర పరంగా ఎంత మాత్రం తప్పుకాదు. ఖర్చులు ఆర్జనను మించరాదు. మరీ ముఖ్యంగా ఆర్జనలో 70 శాతం దాటిపోకుండా చూసుకుంటేనే, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా చూసుకోవడం సాధ్యపడుతుంది. ఇందులో భాగంగా బై నౌ పే లేటర్, క్రెడిట్ కార్డు రుణాలకు దూరంగా ఉండాలి. రేపటి వనరులను కూడా నేడే ఖర్చు పెట్టేందుకు వీలు కల్పించే సాధనాలు ఇవి. వీటికి అలవాటుపడితే బయటకురావడం అంత సులభం కాదు. ఆర్థిక స్వేచ్ఛకు అతిపెద్ద అవరోధం రుణమే. గృహ రుణం, విద్యా రుణం మినహా మరే ఇతర రుణం జోలికి పోవకపోవడమే మంచిది. తప్పనిసరి అయి ఏదైనా రుణాన్ని ఆశ్రయించినట్టయితే.. పెట్టుబడి కంటే ముందే ఈ రుణాన్ని తీర్చివేసేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండేలా కాపాడుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్లో విద్యా, గృహ రుణాలు సులభంగా, తక్కువ రేటుకు పొందొచ్చు. పెట్టుబడులను రుణాల కోసం త్యాగం చేయాల్సి వస్తే.. అప్పుడు భవిష్యత్ లక్ష్యాల్లోనూ రాజీపడాల్సి వస్తుంది. అందుకే వచి్చన ఆదాయం పరిధిలోనే జీవించడం నేర్చుకోవాలి. ఒకవేళ రుణఊబిలోకి దిగి, బయటకు వచ్చే మార్గం తోచకపోతే ఆలస్యం చేయకుండా నిపుణుల సాయం తీసుకోవాలి. అవసరమైతే ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేíÙంచాలి. ఇలా చేయడం వల్ల రుణాల నుంచి బయటపడడంతోపాటు, దీర్ఘకాల లక్ష్యాలకు కావాల్సిన పెట్టుబడిని సమకూర్చుకోవచ్చు. నామినీ/వీలునామా ఇక పెట్టుబడులకు నామినేషన్ ఇవ్వడం మర్చిపోవద్దు. బ్యాంక్ ఖాతా, లైఫ్ ఇన్సూరెన్స్,, మ్యూచువల్ పండ్స్, డీమ్యాట్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి. అనుకోనిది జరిగితే, ఆయా పెట్టుబడులు తమ వారికి సులభంగా బదిలీ అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి వీలునామా రాయడం మంచి చర్య అవుతుంది. నామినేషన్ అన్నది కేవలం క్లెయిమ్ అర్హత కలి్పస్తుంది. కానీ, వీలునామా అన్నది చట్టపరమైన హక్కులకు మార్గాన్ని సులభం చేస్తుంది. వారసుల మధ్య వివాదాలను నివారిస్తుంది. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఆస్తుల బదిలీకి చట్టబద్ధమైన డాక్యుమెంట్గా సాయపడుతుంది. ముగ్గురిలో ఇద్దరు రుణగ్రస్తులే → మన దేశంలో రుణభారం లేని వారు 38 శాతమేనట. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆర్థిక సంస్థలకు రుణపడి ఉన్నట్టు తెలుస్తోంది. → మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారిలోనూ 31 శాతం మంది ఈఎంఐ చెల్లింపులతో సతమతం అవుతున్నారు. → 40 శాతం మందికి అత్యవసర నిధి లేదు → 27 శాతం మందికి మెరుగైన పన్నుల ప్రణాళిక లేదు. → దేశంలో 74 శాతం మందికి సరిపడా బీమా కవరేజీ లేదు. వీరిలో కొందరికి అసలు బీమా రక్షణే లేదు. → ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలోనూ 54 శాతం మందికి కాంపౌండింగ్ గురించి తెలియకపోవడం విడ్డూరం (ఫైనాన్షియల్ ఫిట్నెస్ ప్లాట్ఫామ్ ‘ఫిన్నోవేట్’ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో తెలిసిన ఆసక్తికర అంశాలు ఇవి) – సాక్షి, బిజినెస్డెస్క్ -
2030 నాటికి మూడో అతి పెద్ద ఎకానమీగా భారత్ - ఆకాంక్షల సాధనకు అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: 2030 నాటికల్లా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షల సాధనకు అదానీ గ్రూప్ కీలకంగా ఉండనున్నట్లు అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ క్యాంటర్ ఫిట్జ్గెరాల్డ్ అండ్ కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న అదానీ గ్రూప్ .. మౌలిక రంగ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) 50 శాతం పైగా లాభాలను అందించగలదని కంపెనీపై కవరేజీని ప్రారంభిస్తూ జనవరి 28న రాసిన నోట్లో వివరించింది. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారతదేశం 2030 నాటికల్లా మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడికి చేరుకోవాలంటే భారత్ ఇటు డిజిటల్ అటు భౌతిక మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేయాలి. ఇంధన వినియోగం పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి కూడా పెరగాలి. భారత్ ఆకాంక్షిస్తున్న వాటన్నింటి సాధనకు అదానీ ఎంటర్ప్రైజెస్ కీలకమైనదిగా ఉంటుంది‘ అని క్యాంటర్ పేర్కొంది. భారీ పోర్ట్ఫోలియో.. ఎయిర్లైన్ ప్యాసింజర్ ట్రాఫిక్లో దాదాపు 25 శాతం వాటా, కార్గోలో 33 శాతం వాటా ఉండే ఎనిమిది ఎయిర్పోర్టులు అదానీ గ్రూప్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అనేక డేటా సెంటర్లు నిర్మిస్తోంది. 5,000 కి.మీ. మేర రహదారుల నిర్మాణానికి కాంట్రాక్టులు ఉన్నాయి. ఏఈఎల్ రిస్కు–రివార్డుల నిష్పత్తి ప్రస్తుత స్థాయిలో ఆకర్షణీయంగా ఉన్నట్లు క్యాంటర్ వివరించింది. దేశీయంగా పబ్లిక్గా ట్రేడవుతున్న అతి పెద్ద నాన్–ఫైనాన్షియల్ కంపెనీల్లో 10వ స్థానంలో ఉన్నప్పటికీ ఏఈఎల్పై దాదాపుగా అనలిస్టు కవరేజీ లేకపోవడమనేది అదానీ గ్రూప్ సంస్థలపై ఇన్వెస్టర్లలో అంతగా అవగాహన లేకపోవడానికి కారణమని పేర్కొంది. హిండెన్బర్గ్ నివేదికతో తీవ్రమైన ఆందోళనలు తెరపైకి వచ్చినప్పటికీ .. గవర్నెన్స్ను, పారదర్శకతను మెరుగుపర్చుకునేందుకు, లిక్విడిటీ రిస్కులను తగ్గించుకునేందుకు కంపెనీ చర్యలు తీసుకుందని నోట్లో క్యాంటర్ తెలిపింది. ‘ప్రస్తుత దశలో విస్మరించ వీలు లేనంత పెద్ద గ్రూప్ అదానీది. అదానీకి దేశం అవసరం ఎంత ఉందో భారత్కి కూడా అదానీ అవసరం అంతే ఉందని మేము భావిస్తున్నాం‘ అని పేర్కొంది. -
శుభమే జరిగేట్టు శ్రద్ధ వహిద్దాం!
ఏ వ్యక్తికైనా కావాల్సింది ఏమిటి? ఏం ఉన్నా, ఏం లేకపోయినా ఒక వ్యక్తికి ప్రధానంగా ఉండాల్సింది ఏమిటి? ఎలాంటి వ్యక్తి ఐనా, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఐనా పొందాల్సింది ఏమిటి? ఎవరి ఆశలు వారివి. ఎవరి ఆకాంక్షలు వారివి. ఎవరి ఆశయాలు వారివి. మన అందరికీ అందాల్సిన వాటిల్లో ఏది అగ్రగణ్యమైంది? ఏది మనల్ని ఎప్పటికీ వీడిపోకుండా ఉండాలి? శుభం... శుభం... శుభం... ‘అథాతో బ్రహ్మ జిజ్ఞాస‘ అని బ్రహ్మ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం తెలియజెప్పింది. అంటే శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అని అర్థం. ఆధ్యాత్మిక పరమైన బ్రహ్మం గురించిన జిజ్ఞాస ఎందుకు అంటే అది శుభం కాబట్టి. లౌకిక జీవనానికైనా, ఆధ్యాత్మిక జీవనానికైనా శుభమే మనిషికి లక్ష్యం; ఆ లక్ష్యానికి మనిషి లక్షణం. లక్ష్య, లక్షణ సమన్వితం జరగాలి. అంటే మనిషికి శుభం సమన్వితం అవ్వాలి. క్షేమం, మంగళం, మేలు, సౌఖ్యం ఇవి అన్నీ శుభం ఔతాయి. శుభం మనకు నిండుగా ఉండాలి. మనకు శుభం కలగడానికి, మనం శుభంతో మెలగడానికి మనకు మనమే ఆధారం. కనుక మనంత మనమై శుభం కోసం ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం వల్ల ప్రయోజనం ఉంటుంది. మనం శుభం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి; మన ప్రయత్నాలకు ఫలితంగా మనం శుభాన్ని పొందుతూ ఉండాలి. శుభాలు ప్రభవించాలని ఎప్పుడైనా అకాంక్షించవచ్చు; ప్రభవించిన శుభాలు విభవాన్నివ్వాలని ఎవరైనా ఆశించవచ్చు. కానీ ఇంత వరకూ ఆ పని సరిగ్గా జరగలేదు. ఎవరూ ఆ పనిని సరిగ్గా చేసేందుకు ముందుకు రాలేదు. మనం శుభం కోసం పని చెయ్యాలి. మన కోసం శుభం పంట పండాలి. ఇకపైనైనా మనం శుభం కోసం పని చేద్దాం; ఇక అంతా శుభమయం కావడానికి మనల్ని మనం సరిచేసుకుందాం. ఆశపడి, ఆకాంక్షించి, ఆశించి మనం శుభాన్ని సాధించుకుందాం. కుత్సతం, మత్సరం, దాష్టీకం, దుర్మార్గం, ద్రోహం, వైరం, అసూయ, అక్కసు, బద్ధకం, నీరసం, అభిప్రాయాలు, మనో భావాలు, నమ్మకాలు, అపనమ్మకాలు, అపార్థాలు, అవిద్య, మూర్ఖత్వం, దుశ్చింతన, బుద్ధిమాంద్యం ఇవన్నీ శుభాన్ని మనకు లేకుండా చేశాయి. వీటిని మనం వెనువెంటనే వదిలించేసుకోవాలి. మన చెడు నడతను మనం మార్చుకోవాలి; మనం మనస్తత్త్వంలో మానవత్వాన్ని చేర్చుకోవాలి; మనం మస్తిష్కంలో మంచితనాన్ని కూర్చుకోవాలి. శుభం కోసం మనం ఇకపై సవ్యంగా ఉండాలి. మనమే కాదు, మన పెద్దలు చేసిన తప్పులూ మనకు శుభాన్ని లేకుండా చేస్తున్నాయి; అవి మన సమాజంలో అశుభాన్ని రగిలిస్తున్నాయి; ఎప్పుడో ఎవరో చేసిన కుట్రలు ఇప్పటికీ శుభాన్ని రానివ్వకుండా ఇలాతలాన్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ఈ స్థితిని సరిదిద్దుకుందాం; రానున్న ఆపదల్ని తొలగించుకుందాం; శుభాన్ని ఆవాహన చేసుకుని అందుకుందాం. ‘శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస’ అని ఒక బ్రహ్మసూత్రం మనకు తెలియజెప్పాక ‘సుఖ విశిష్టాభిధానాదేవ చ’ అని మరో బ్రహ్మసూత్రం మనకు ఉండాల్సిన తెలివిడిని ఇస్తూ ఉంది. విశిష్టమైన సుఖం ఇస్తుందని నిశ్చయంగా చెప్పబడినందువల్లే అది బ్రహ్మం అని ఆ సూత్రానికి అర్థం. సుఖం లేదా శుభం విశిష్టమైంది అన్న సత్యాన్ని మనం ఆకళింపు చేసుకోవాలి. ఆ విశిష్టమైన శుభాన్ని మనం పొందుతున్నామా? ఈ ప్రశ్నను మనకు మనమే వేసుకుని సరైన జవాబుగా మనం శుభాన్ని పొందాలి; పొందుదాం. సర్వత్రా శుభం నెలకొనాలి;సర్వులకూ శుభం వెల్లివిరియాలి.శుభం భూయాత్. ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు వీటివల్ల శుభం కలుగుతుంది, జరుగుతుంది అని మనం మన మనసు, మెదడులతో తెలుసుకోవాలి. మన ఆశలు, ఆకాంక్షలు, ఆశయాల వల్ల శుభం మాత్రమే జరిగేట్టు మనం శ్రద్ధ వహించాలి. శుభం కోసం మనం పూనుకోవాలి; శుభంతో మనల్ని మనం పునర్నిర్మించుకోవాలి – రోచిష్మాన్ -
పోరాటాల ఖిల్లా..
నిజాం రాజుల ఆగడాలను ఎదురించిన వీరులనుగన్న జన్మభూమి.. నక్సల్ బరి ఉద్యమానికి ఊతమిచ్చి.. భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన పోరుగడ్డ.. నాడు నల్లగొండ జిల్లాలో అంతర్భాగమై.. నేడు రెండు వందల గ్రామాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా విలసిల్లుతూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది జనగామ జిల్లా. ఎన్నో అవాంతరాలు.. మరెన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకుసాగి సొంత జిల్లా కలను సాకారం చేసుకుని ఇక్కడి ప్రజలు జయహో అంటూ నినదించారు. ఆర్థిక, సామాజిక వనరులు కలిగిన ఈ ప్రాంతం జిల్లా గా ఏర్పడడంతో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. జనగామ: బ్రిటిష్ పాలనలో వ్యాపార, వాణిజ్య, విద్య రం గాలను అభివృద్ధి చేయడంలో జనగామ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వందేళ్ల క్రితం ప్రారంభించిన ప్రిస్ట¯ŒS పాఠశాల, మిషనరీ చారిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ను రైల్వే మార్గాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగించారు. స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1952 నవంబర్లో జనగామ పట్టణాన్ని జిల్లాలోనే ఏకైక మునిసిపాలిటీగా ఏర్పాటు చేశారు. అయితే మునిసిపాలిటీకి ఆదాయ వనరులు తగ్గిపోవడంతో మధ్యలో మూడేళ్ల పాటు నగర పంచాయతీగా కు దించబడింది. అప్పటి వరకు నల్లగొండ జిల్లా పరిధిలో వరంగల్, ఖమ్మం ప్రాంతాలు కలిసే ఉండేవి. కాగా, మద్రాసు నుంచి విడిపోయి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం వరంగల్, ఖమ్మం ప్రాంతాలను వేరు చేశారు. ఆ సమయంలోనే నల్లగొండ పరిధిలో ఉన్న జనగామ తాలూకాను వేరు చేయడంతో వరంగల్ జిల్లాలో కలిసి.. దినాదినాభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం జనగామ పట్టణంలో 28 వార్డులు, 1.12 లక్షల జనాభాతో గ్రేడ్–1 మునిసిపాలిటీగా కొనసాగుతుంది. ఆలయాలకు నెలవు.. జనగామ కొత్త జిల్లా ఆలయాలకు నెలవుగా మారనుంది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కొమురవెల్లి, మ ద్దూరు మండలం బెక్కల్ రామలింగేశ్వరాలయం, నిజాం రజాకార్లను ఎదిరించిన వీరబైరా¯ŒSపల్లి చరిత్ర జనగామ నుం చి విడిపోయాయి. జిల్లాల విభజనలో భాగంగా కొత్తగా పాలకుర్తి సోమేశ్వరస్వామి, చిల్పూర్లోని బుగులు వెంకటేశ్వరస్వామి, దేవరుప్పులలోని మానకొండ లక్ష్మీనర్సింహస్వా మి, లింగాలఘనపురంలోని జీడికల్ సీతారామచంద్రస్వా మి, నవాబుపేటలోని శ్రీకోదండరామస్వామి ఆలయాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనతో విరాజిల్లనుంది. చీట కో డూరులోని కోటిలింగాల పుణ్యక్షేత్రం..పట్టణ ప్రజలకు 365 రోజుల పాటు తాగునీరు అందించే చీటకోడూరు రిజర్వాయర్ జనగామ జిల్లాలోనే ఉండడం గమనార్హం. సాహితీ రంగంలో ప్రత్యేక గుర్తింపు.. కళలకు పుట్టినిల్లు అయిన జనగామ చరిత్ర ప్రపంచ పుటల్లోకి ఎక్కింది. హస్తకళలకు ప్రసిద్ధి గాంచిన పెంబర్తి గ్రామం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. అమెరికా, లండ¯ŒS, ఆసే్ట్రలి యా, అరబ్ దేశాలతో పాటు పలు ఖండాల్లో ఇక్కడ తయా రు చేసే హస్తకళలకు పేరుంది. ప్రపంచ గుర్తింపు పొందిన ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తెయ్యది కూడా జనగామ ప్రాంతమే. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆయన గండ పెండేరం అందుకుని, ఎన్నో అవార్డులను పొందారు. కాగా, ఐఐటీ ద్వారా ఎందరో విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసి, ప్రపంచం నలుమూలా ల తన శిషు్యలను తయారు చేసుకున్న చుక్కా రామయ్య పా లకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. సాహిత్య రంగానికి వన్నెతెచ్చిన పలకనూరి సోమేశ్వర్, బమ్మెర పోతన ఈ ప్రాంతానికి చెందిన వారే. జనగామ జిల్లాలోని మండలాలు.. కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలో జనగామ, నర్మెట, లింగాలఘణపురం, బచ్చన్నపేట, తరిగొప్పుల (కొత్త), గుండాల(నల్లగొండ జిల్లా) స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, జఫర్గఢ్, చిల్పూరు(కొత్త), పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పు ల మండలాలు ఉన్నాయి. మొత్తంగా 13 మండలాలతో సుమారు 5,82,457 జనాభాతో జనగామ జిల్లా నూతనంగా ఆవిర్భవించింది. అభివృద్ధిలో పోటీ పడుతూ.. గ్రామంగా ఆవిర్భవించిన జనగామ అభివృద్ధిలో పోటీపడుతూ జిల్లాస్థాయికి ఎదిగింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే రైల్వే మార్గం, ఐదు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కలిగి ఉన్న రోడ్డు మార్గం జనగామ సొంతం. వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో వంద పడకల ఆస్పత్రికి అనుసంధానంగా చంపక్హిల్స్ లో మాతాశిశు సంక్షేమ ఆస్పత్రితో జిల్లాస్థాయి కేడర్ను కలిగి ఉంది. విద్య, ఉపాధి రంగాలకు నెలవుగా ఇంజనీరింగ్, ఫార్మసీ, కోచింగ్ సెంటర్లు, కళాశాలలు, నర్సింగ్తో పాటు వైద్య రంగంలో కార్పొరేట్ స్థా యి కలిగిన ప్రైవేట్ ఆస్పత్రులతో వరంగల్ తర్వాత జనగామ విద్యాహబ్గా విలసిల్లుతోంది. దేశంలోనే ఏకైక పట్టుదారం రోలింగ్ యూనిట్ సెంటర్ ఇక్కడ ఉండడం విశేషం. రైతులు పండించిన సరుకులను భద్రపరుచుకునేందుకు వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన గోదాంలు, వ్యవసాయ మార్కెట్, కాటన్ యార్డు ఉన్నాయి. రెండు ఫస్ట్ క్లాస్ మెజిసే్ట్రట్ కోర్టులు, సెకండ్ క్లాస్ మెజిసే్ట్రట్, సబ్కోర్టు, అడిషనల్ జిల్లా కోర్టుతో పాటు సబ్ జైలు ఉంది. క్రీడాపరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మినీ స్టేడియం, మినీట్యాంకు బండ్ ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండసీ్ట్రయ ల్, ఐటీ కారిడార్తో జనగామకు మరింత ప్రాధాన్యం కలుగనుంది. పది దశాబ్దాల చరిత్ర కలిగిన జనగామ ఘనకీర్తి ప్రచారానికి నోచుకోవడంలేదు. ప్రపంచానికి శాంతి మంత్రాన్ని అందించిన జైనులు జీవించిన ఈ ప్రాంతంలో సజీవ సాక్ష్యాలెన్నో కళ్లెదుటే కని పిస్తున్నా.. నేటి తరానికి అందించే ప్రయత్నం జరగడంలేదు. నల్లగొండ జిల్లా కొలనుపాక రాజధానిగా క్రీ.శ 973లో తెలంగాణను పాలించి న కళ్యాణ చాణక్యులు ఇక్కడ జైన మతాన్ని ఆచరించారు. దేవాలయాలు, విద్యాలయాల ను ని ర్మించి సాక్ష్యాలుగా అనేక శాసనాలు వేయిం చా రు. జనగామ కేంద్రంగా జైనులు వర్తక వ్యా పారం చేస్తూ కాలక్రమేణా ఇక్కడే స్థిర పడ్డారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన కొలనుపాక జైన దేవాలయంతో పాటు మద్దూరు మండలం బైరాపల్లి జైన దేవాలయం (ప్రస్తుత వీరభద్రస్వామి) ఆలయాలు నాటి పూర్వ వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జనగామ మం డలం ఎల్లంల గ్రామ శివారులో శిథిలమైన జైన యక్ష దేవాలయం గుట్టపై బసది (విడిది కేం ద్రం) బండ్ల గూడెంలోని జైన ఆనవాళ్లు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. సిద్ధెంకి గుట్టపై ఉన్న ఓ బండరాయిపై వర్ధమాన మహావీరుడు, పా ర్శ్వనాథుడు, జైనయక్షిణి శిల్పలాలు సుందరం గా చెక్కినట్టు కనిపిస్తాయి. గ్రీకు రాయబారి మొ గస్తనీస్ తన రచనల్లో నగ్న సన్యాసులను ఎంతో మందిని తెలంగాణ ప్రాంతంలో చూసినట్లు రా సిన గ్రంథాన్ని ఆంగ్లంలో అనువదించిన ‘మాక్ క్రిండాల్’ అనే పరిశోధకుడు వివరించారు జైనమతాన్ని విస్తరించేందుకు లింగాలఘనపురం మండలం కళ్లెంలో ఆర్యవైశ్యులు భూమిని దా నం ఇచ్చినట్లు అక్కడి శాసనంలో కనిపిస్తుంది. ప్రపంచ పర్యాటక ప్రాంతాలకు తీసిపోని చరిత్ర కలిగిన జనగామకు గురింపు తీసుకొచ్చేందుకు పురావస్తు శాఖ స్పందించాలి. ఇక్కడ మ్యూజి యం ఏర్పాటు చేసి భావితరాలకు నాటి ఘనచరిత్రను తెలియజేసేందుకు చర్యలు తీసుకోవాలి. పర్యాటక అర్హతలున్న ఎల్లంల, బండ్లగూడెం, బండనాగారం, సిద్దెంకి గుట్టలను తీర్చిదిద్దాలి. పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు హైదరాబాద్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామ రాబోయే రోజుల్లో అభివృద్ధికి చిరునామాగా మారనుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండసీ్ట్రయల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించిన నేపథ్యంలో జనగామకు సువర్ణ అవకాశం దక్కనుంది. పరిశ్రమల స్థాపనకు జనగామ జిల్లా అన్నింటికి తగిన విధంగా ఉంది. అనుకూల, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే స్వభావమున్న ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. లింగాలఘణపురం మండలం ఏనె బావి వద్ద గతంలో ప్రభుత్వం 150 ఎకరాల విస్తీర్ణంలో కామోజీ టెక్స్టైల్స్ పా ర్కు ఏర్పాటుకు సన్నాహాలు చేయగా, నాటి ఉమ్మడి ప్రభుత్వం దానిని ఆంధ్ర ప్రాంతానికి తరలించింది. నూతన జిల్లాల విభజన తరుణంలో టెక్స్టైల్స్ పా ర్కు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తే వందలాది కార్మికులు, నిరుగ్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే ఆవకాశం ఉంది. -
బెలూచ్ ప్రజల్లో రేగిన స్వతంత్ర్య కాంక్ష