'గవర్నర్కు అన్ని అధికారాలున్నాయి'
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ కేసు విషయంలో గవర్నర్ నరసింహన్కు కీలక సూచనలు ఇచ్చారు. ఈ కేసును నరసింహన్ స్వయంగా పరిశీలించవొచ్చని, పర్యవేక్షించవచ్చని సూచించారు. విభజనం చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు ఈ అధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల పోలీసులకు కూడా అధికారాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. శాంతిభద్రతలపై రెండు రాష్ట్రాల పోలీసులను పిలిపించే అధికారం గవర్నర్కు ఉందని ఆయన ఓ జాతీయ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.