Aurangzeb Road
-
కలాం రోడ్డుపై వివాదం!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఔరంగ జేబు రోడ్డుకు కొత్తగా మాజీ రాష్ట్రపతి, ఇటీవల పరమపదించిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరు పెట్టడం కొంత ఉద్రిక్తతలకు దారి తీస్తుందని కొందరు చరిత్రకారులు, స్కాలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేయడం చరిత్రను వక్రీకరించనట్లు అవుతుందని, బహుశా అది కొంత టెన్షన్ వాతావరణాన్ని భవిష్యత్తులో సృష్టిస్తుందేమోనని చెప్పారు. గత నెల 28న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఔరంగ జేబు రోడ్డుకు ఇక నుంచి అబ్దుల్ కలాం రోడ్డుగా నామకరణం చేయాలనుకుంటున్నట్లు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత వర్గాలు నివసించే ఔరంగజేబు రోడ్డు పేరు మార్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు దానికి పెట్టారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు పెట్టాలని ఎన్ఎండీసీ నిర్ణయించిందని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ ఆమోదంతో సెంట్రల్ ఢిల్లీ పౌర పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కేజ్రీవాల్ ట్వీట్ ను పెద్ద సంఖ్యలో రీ-ట్వీట్ చేశారు. బీజేపీ మద్దతుదారులు ఆయనపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకుల ప్రతిపాదనను తనదిగా కేజ్రీవాల్ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు పెడతామని ప్రధాని నరేంద్ర మోదీ ఈనెలారంభంలోనే ప్రకటించారని బీజేపీ నేత మహేశ్ గిరీ గుర్తు చేశారు. అబ్దుల్ కలాం జూలై 27న కన్నుమూశారు.