Australia under-19
-
టెస్టులో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ!
15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రికెట్లో హాట్టాపిక్గా మారిపోయాడు. అరంగేట్రంకు ముందే అంతర్జాతీయ రికార్డులన్నీ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ఎంపికైన వైభవ్ను ఇప్పుడు టెస్టుల్లోకి కూడా తీసుకుంటే బాగుంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ అనధికారిక టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసిన వీడియోనూ ఎక్స్లో షేర్ చేసుకున్నారు. 2025 అక్టోబర్లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత అండర్-19 జట్టు బ్రిస్బేన్ వేదికగా యూత్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 78 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ ఆడిన వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసాన్ని అనధికారిక టెస్టులోనూ కొనసాగించాడు. ఆ మ్యాచ్లో 86 బంతుల్లో 113 పరుగులు చేసిన సూర్యవంశీ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని జతచేశాడు. అంతేకాదు వైభవ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టెస్టులోనూ టీ20 తరహా ఆటతో విజృంభించిన వైభవ్ను సంప్రదాయ క్రికెట్లోనూ ఆడించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఐపీఎల్కు, అంతర్జాతీయ మ్యాచ్లకు చాలా తేడా ఉంటుందని, మొదట టీ20 ఫార్మాట్లో తనను తాను నిరూపించుకోవాలని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలున్నాయి. Just look at the dominance of Vaibhav Suryavanshi in test cricket.🤯- Vaibhav Suryavanshi playing test cricket like T20.😊pic.twitter.com/NvljSRcTAi— Cricket Central (@CricketCentrl) June 5, 2026చదవండి: చరిత్ర సృష్టించిన వైశాలీ.. అన్న బాటలోనే చెల్లి! -
ఆస్ట్రేలియా జట్టులో ఇద్దరు భారత మూలాలున్న క్రికెటర్లు
స్వదేశంలో భారత అండర్-19 జట్టుతో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా అండర్-19 జట్టును నిన్న (ఆగస్ట్ 7) ప్రకటించారు. ఈ జట్టులో ఇద్దరు భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూసౌత్ వేల్స్కు ప్రాతినిథ్యం వహించే యశ్ దేశ్ముఖ్, విక్టోరియాకు ఆడే ఆర్యన్ శర్మ ఈ జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో దేశ్ముఖ్ స్పిన్నర్ కాగా.. ఆర్యన్ శర్మ వికెట్ కీపర్ బ్యాటర్. ఆర్యన్ శర్మ విక్టోరియా తరఫున 31 మ్యాచ్ల్లో సత్తా చాటి జట్టులోకి రాగా.. దేశ్ముఖ్ 2024/25 అండర్-17 నేషనల్ ఛాంపియన్స్ లీగ్లో చెలరేగి జట్టులో ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఆసీస్ అండర్-19 జట్టు ఆయుశ్ మాత్రే నేతృత్వంలోని భారత్ అండర్-19 జట్టుతో తలపడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో తొలుత మూడు 50 ఓవర్ల మ్యాచ్లు, ఆతర్వాత రెండు 4 రోజుల మ్యాచ్లు జరుగనున్నాయి.భారత అండర్-19 జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు..సైమన్ బడ్జ్, అలెక్స్ టర్నర్, స్టీవ్ హోగన్, విల్ మలాజ్చుక్, యశ్ దేశ్ముఖ్, టామ్ హోగన్, ఆర్యన్ శర్మ, జాన్ జేమ్స్, హేడెన్ స్కిల్లర్, చార్లెస్ లచ్మండ్, బెన్ గార్డన్, విల్ బైరోమ్, కేసీ బార్టన్, అలెక్స్ లీ యంగ్, జేడన్ డ్రేపర్రిజర్వ్ ఆటగాళ్లు: జెడ్ హోల్లిక్, టామ్ పాడింగ్టన్, జూలియన్ ఓస్బోర్న్షెడ్యూల్..సెప్టెంబర్ 21- తొలి వన్డే (బ్రిస్బేన్)సెప్టెంబర్ 24- రెండో వన్డే (బ్రిస్బేన్)సెప్టెంబర్ 26- మూడో వన్డే (బ్రిస్బేన్)సెప్టెంబర్ 20- అక్టోబర్ 3 వరకు- తొలి టెస్ట్ (బ్రిస్బేన్)అక్టోబర్ 7-10- రెండో టెస్ట్ (మెక్కే)ఈ సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు..ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, డి దీపేష్, కిషన్ కుమార్, అన్మోలన్జీత్, ఖిలన్ పటేల్, ఉద్దవ్ మోహన్, అమన్ చౌహాన్ -
యువ భారత్దే టెస్టు సిరీస్
చెన్నై: ఆద్యంతం నిలకడగా రాణించిన యువ భారత్ జట్టు అదరగొట్టింది. ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్ల యూత్ సిరీస్ను టీమిండియా 2–0తో కైవసం చేసుకుంది. అంతకుముందు యూత్ వన్డేల్లోనూ ఆ్రస్టేలియాను క్లీన్స్వీప్ చేసిన యువ భారత్... సుదీర్ఘ ఫార్మాట్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత బౌలర్ల ధాటికి మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియగా... బుధవారం ఒక్క రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం.ఓవర్నైట్ స్కోరు 142/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు చివరకు 80.2 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ ఒలీవర్ పెక్ (199 బంతుల్లో 117;16 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీతో రాణించగా... అలెక్స్ లీ యాంగ్ (66; 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 166 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ జోడీ విడిపోయాకా ఆసీస్ ప్లేయర్లు పెవిలియన్కు వరుస కట్టారు. 59 పరుగుల వ్యవధిలో ఆసీస్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో మొహమ్మద్ ఇనాన్, అన్మోల్జీత్ సింగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో యువ భారత జట్టుకు 215 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో ఆ్రస్టేలియా జట్టును ఫాలోఆన్ ఆడించింది. అప్పటికే తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన చేసి ఉన్న కంగారూలు... రెండో ఇన్నింగ్స్లో ఆ మాత్రం కూడా పోరాడలేకపోయారు. 31.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలారు. మొత్తం జట్టులో ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకోగలిగారు.సిమోన్ బడ్జ్ (26; 3 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవెన్ హోగన్ (29;4 ఫోర్లు), పదకొండో స్థానంలో బరిలోకి దిగిన హ్యారీ హొకెస్ట్రా (20 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అన్మోల్ జీత్ సింగ్కు 5, లెగ్ స్పిన్నర్ మొహమ్మద్ ఇనాన్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు యువ భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 492 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ అన్మోల్జీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్లో అన్మోల్జీత్, ఇనాన్ కలిసి 16 వికెట్లు పడగొట్టడం విశేషం.


