bannappa
-
కీలకంగా మారిన సీసీ కెమెరాల ఫుటేజీ
-
ఆ 45 నిమిషాల్లో ఏం జరిగింది?
కీలకంగా మారిన సీసీ కెమెరాల ఫుటేజీ మారేడుపల్లి: సంచలనం సృష్టించిన మారేడుపల్లి పోలీస్స్టేషన్పై దాడి చేసిన కేసును పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడిలో బన్నప్ప కుటుంబ సభ్యులతో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి 9.15 నిమిషాలకు ప్రారంభమైన గొడవ... 10 గంటల వరకు జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు మారేడుపల్లి పోలీసులతో పాటు సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బన్నప్పను సోమవారం మధ్యాహ్నం పోలీస్స్టేషన్ నుంచి పంపించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆటోలో అతడిని రాత్రి 8.30కి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీసులు తీవ్ర అస్వస్థతకు గురైన బన్నప్పకు ఓ కానిస్టేబుల్ను తోడు ఇచ్చి అదే ఆటోలో ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలో బన్నప్ప మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మృతదేహాన్ని ఆటోలో తిరిగి మారేడుపల్లి స్టేషన్కు తీసుకొస్తూ మహాత్మాగాంధీనగర్ బస్తీవాసులకు బన్నప్ప మృతిపై సమాచారం ఇచ్చారు. 9.15కి బన్నప్ప మృతదేహంతో పోలీస్స్టేషన్కు చేరుకున్న బంధువులు విధి నిర్వహణలో ఉన్న ఎస్సై రవికుమార్, మధులతో వాగ్వాదానికి దిగారు.స్టేషన్కు సమీపంలోనే మహాత్మాగాంధీనగర్ ఉండటంతో బస్తీలోని వారు భారీ ఎత్తున పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. 9.30కి గొడవ పెద్దదైంది. బన్నప్ప మృతికి పోలీసులే కారణమని పోలీస్స్టేషన్లో 9.35కి పోలీసులపై దాడి చేశారు. అకస్మాత్గా జరుగుతున్న పరిణామాలతో నెవ్వెరపోయిన పోలీసులు ఏమీ చేయలేకపోయారు. సెట్లో కంట్రోల్ రూమ్కు సమాచారం ఇస్తుండగా ఆందోళనకారులు సెట్ను ధ్వంసం చేశారు. చిన్నగా మొదలైన గొడవ 9.45కి మరింత పెద్దదైంది. రోడ్లపై ఎక్కువగా మంది చేరుకొని ఆ మార్గంలో వెళ్లే వాహనాలపై దాడికి పాల్పడ్డారు. పోలీస్స్టేషన్లో ఉన్న కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. 9.47కు నిమిషాలకు పోలీస్స్టేషన్ దారిగుండా వస్తున్న రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. 9.52కి పెట్రోలింగ్లో వస్తున్న పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. 9 గంటల 47 నిమిషాలకు పోలీస్స్టేషన్ వద్దనున్న ఎస్.ఐ మధు వాహనంతోపాటు మరో రెండు వాహనాలను స్టేషన్ ముందు నిప్పంటించారు. -
శ్వాసకోశ వ్యాధితోనే బన్నప్ప మృతి!
పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడి విస్రా నివేదిక వస్తేనే.. పూర్తి వివరాలు పోలీసు బలగాల నడుమ బన్నప్ప అంత్యక్రియలు బస్తీలోనే మకాం వేసిన మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న బాధిత కుటుంబానికి జస్టిస్ చంద్రకుమార్ పరామర్శ హైదరాబాద్: మారేడ్పల్లి ఠాణాపై దాడి ఘటనకు సంబంధించిన కేసులో మృతుడు బన్నప్ప(35) శ్వాసకోశ సమస్యతోనే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. బన్నప్ప మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో ప్రొఫెసర్ రమణమూర్తి ఆధ్వర్యంలో మారేడుపల్లి ఎమ్మార్వో సైదులు సమక్షంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరిపారు. మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న బస్తీలోనే మకాం వేసి ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ముగిసిన వెంటనే బన్నప్ప మృతదేహాన్ని వాల్మీకినగర్కు తీసుకురాగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బన్నప్ప కుటుంబ సభ్యు లు నేతలను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్వాసకోశ సమస్యతోనే..: శ్వాసకోశ సమస్యతోనే బన్నప్ప మృతిచెందినట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మృతుని ఒంటిపై, అంతర్గతంగా ఎటువంటి గాయాలు లేవని, ఎడమకాలుకు గీరుకున్న గాయమే ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలి సింది. మృతుని కడుపులో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని, పడుకున్నప్పుడు వాంతులు కావడంతో, ఆహారం శ్వాసకోశ నాళానికి అడ్డుపడి ఉండొచ్చని, దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి బన్నప్ప మృతిచెంది ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. విస్రా నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడి కావచ్చన్నారు. ఇద్దరు ఎస్సైలపై వేటు: బన్నప్ప మృతికి కారణమైన ఇద్దరు ఎస్ఐలపై ఉన్నతాధికారులు వేటువేశారు. ఆదివారం రాత్రి బన్నప్పను అదుపులోకి తీసుకున్న ఎస్సైలు బాధ్యతారహితంగా వ్యవహరించారని పేర్కొంటూ ఎస్సై రవికుమార్, మధులను హెడ్క్వార్టర్స్కు బదిలీ చేశారు. సోమవారం రాత్రి ఠాణాపై బన్నప్ప బంధువుల దాడి అనంతరం నగర పోలీస్ కమి షనర్ మహేందర్రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. దాడి ఘటనపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు మారేడుపల్లి పోలీస్స్టేషన్పై సోమవారం రాత్రి దాడికి పాల్పడి కీలకమైన ఫైళ్లతోపాటు పోలీస్స్టేషన్ ధ్వంసానికి పాల్పడిన వారిపై మొత్తం 4 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. పోలీస్స్టేషన్పై దాడి, విధ్వంసంలో సుమారు 100 మంది పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్స్టేషన్ దగ్గరున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దాడి ఘటనపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్యామ్బాబు పోలీస్స్టేషన్ లోపల ధ్వంసమైన కంప్యూటర్లు, రికార్డులను పరిశీలించారు. జస్టిస్ చంద్రకుమార్ పరామర్శ బన్నప్ప కుటుంబ సభ్యులను మంగళవారం జస్టిస్ చంద్రకుమార్ పరామర్శించి మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మనుషులను కొట్టడం చట్ట వ్యతిరేకమని, ప్రజలు కూడా దాడులకు పాల్పడటం తగదన్నారు. ఆలిండియా లాయర్ల సంఘం విచారణ బన్నప్ప మృతి, స్టేషన్పై దాడికి సంబంధించిన వివరాల్ని ఆలిండియా న్యాయవాదుల సంఘం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో పార్థసారథి, శివకుమార్, పాశం యాదగిరి, మాధవరెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. -
నాలుగు ఎఫ్ఐఆర్లు.. ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్
బన్నప్ప మృతి, ఠాణాపై దాడి ఘటనపై కమిషనర్ సీరియస్ కంటోన్మెంట్: సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీసు స్టేషన్పై సోమవారం రాత్రి జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు ఎస్ఐలపై పోలీసు ఉన్నతాధికారులు వేటువేశారు. మారేడుపల్లిలో ఆదివారం రాత్రి బన్నప్పను అదుపులోకి తీసుకున్న ఇద్దరు ఎస్సైలు బాధ్యతారహితంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఎస్సైలు రవికుమార్, మధులను హెడ్క్వార్టర్స్కు బదిలీ చేశారు. సోమవారం రాత్రి బన్నప్ప బంధువులు, మహాత్మాగాంధీ నగర్ వాసులు పోలీస్స్టేషన్పై దాడికి పాల్పడి స్టేషన్కు నిప్పంటించిన సంగతి తెలిసిందే. పోలీసులు కొట్టడం వలే బన్నప్ప మృతి చెందాడని, అతడి బంధువులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయితే, ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్న బన్నప్పను పోలీసులు వదిలిపెట్టకుండా మరుసటి రోజు బెయిలుపై వదిలేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీస్స్టేషన్లో బన్నప్పను ఉంచినందుకు ఎస్సైలపై వేటు పడినట్టుగా సమాచారం. ఇదిలా ఉండగా, మారేడుపల్లి పోలీస్స్టేషన్పై సోమవారం రాత్రి దాడికి పాల్పడి కీలకమైన ఫైళ్లతోపాటు పోలీస్స్టేషన్ ధ్వంసానికి పాల్పడిన వారిపై పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. దాడి ఘటనలో సుమారు 100 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని గుర్తించేందుకు పోలీస్స్టేషన్ దగ్గరున్న సీసీకెమెరాల డేటాను పరిశీలించి, కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.