breaking news
Bhawanipur
-
ఇళ్ల కూల్చివేత వెనుక లోకేశ్
భవానీపురం (విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురం జోజినగర్లో 42 ప్లాట్లలో ఇళ్ల కూల్చివేత వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు సర్కారుకు ఇళ్లు కూల్చివేయడమే తప్ప కట్టిన చరిత్ర లేదని విమర్శించారు. జోజినగర్లో ఇళ్ల కూల్చివేసిన ప్రాంతాన్ని శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీమంత్రి, పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించారు. బాధితులు నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుమారు 2.17 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటే దానివెనుక కచ్చితంగా ప్రభు త్వ పెద్దల అండ, వెన్నుదన్ను ఉండే ఉంటాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో 200 మంది పోలీసులు రౌడీల్లా వచ్చి ఇళ్లల్లోవారిని బయటకు లాక్కొచ్చి కూల్చేశారని చెప్పారు. -
మా గూడును కూల్చారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: ‘‘ఎన్నో ఏళ్లపాటు పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న గూడును నేలమట్టం చేసి రోడ్డు పాల్జేశారు. బాబు సర్కారు వచ్చాక మాపై దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది. ఇళ్లలోని సామగ్రి మొత్తం నష్టపోయి మూడు రోజులుగా భార్యాబిడ్డలతో టెంట్ల కింద ఉంటున్నాం. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని మాట సాయం చేసిన పాపాన పోలేదు. మాకు మీరే న్యాయం చేయాలి. మా జీవితాలను నిలబెట్టాలి’’ అని వైస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను విజయవాడ భవానీపురం జోజినగర్లో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు వేడుకున్నారు. శుక్రవారం ఉదయం 42 ప్లాట్ల యజమానులు ఆయనను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని వినతిపత్రం అందజేశారు.ప్రభుత్వం నుంచి తాము ఎదుర్కొన్న వేధింపులను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ‘‘మేం 23 ఏళ్ల క్రితం భవానీపురం జోజినగర్ వద్ద అబ్దుల్ మజీద్ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి ఇళ్లు నిర్మించుకున్నాం. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాం. కానీ, మా స్థలాలు శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి చెందినవని, కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని, ఖాళీ చేయాలని, లేదంటే కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. మమ్మల్ని కిరాయి గూండాలతో వచ్చి అనేకసార్లు బెదిరించారు. పోలీసులను కలిశాం. చాలామంది నాయకులకు చెప్పినా న్యాయం జరగలేదు. కోర్టు ఉత్తర్వులున్నా వినలేదు... మా విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు ఉపక్రమించవద్దని గత నెల 3న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ నెల 3వ తేదీన బుధవారం 300 మందిపైగా పోలీసులు, శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు ఆరు జేసీబీలతో వచ్చి మా ఇళ్లను కూల్చివేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తాయని, కాళ్లావేళ్ల్ల ప్రాథేయపడి నాలుగు గంటల సమయం కోరినా కనీసం మానవత్వం చూపలేదు. వందలాది పోలీసులతో వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇంట్లో సామాన్లను కూడా బయటికి తెచ్చుకోనివ్వలేదు.పిల్లలకు పాలు, మంచినీళ్లు అందించే అవకాశం ఇవ్వకుండా మా ఇళ్లను మా కళ్లముందే కూల్చివేశారు. చర్చిని అయినా కూల్చొద్దని ప్రాథేయపడ్డాం. కానీ, మాకెవరు అడ్డు వస్తారో చూస్తామంటూపడగొట్టారు. డిసెంబరు 31 వరకు 42 ప్లాట్లపై చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పూర్తి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపాక పోలీసులు వెళ్లిపోయారు. అప్పటికే అంతా అయిపోయింది’’ అని వాపోయారు. ప్లాట్ల యజమానులు వైఎస్ జగన్ను కలిసిన సమయంలో వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, వెలంపల్లి, భాగ్యలక్షి్మ, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. -
మమతా బెనర్జీ భవితవ్యం తేలేది నేడే
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఆమె పోటీ చేసిన భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఈ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. భవానీపూర్ నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ పారీ్టకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు. -
భవానీపూర్లో 53.32 శాతం ఓటింగ్
కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలోకి దిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ మోస్తరు ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయానికి 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ అనుమతించనున్నట్లు తెలిపారు. మొత్తం ఓటింగ్ శాతాన్ని శుక్రవారం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. భవానీపూర్లో టీఎంసీ తరఫున సీఎం మమత, బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్, సీపీఎం తరఫున శ్రిజిబ్ బిశ్వాస్లు బరిలోకి దిగారు. ముర్షిదాబాద్లోని సంసేర్ గంజ్లో 78.60 శాతం, జంగిపూర్లో 76.12శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ టీఎంసీ, బీజేపీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఈసీ వద్దకు 97 ఫిర్యాదులు రాగా, వాటిలో 91 ఫిర్యాదులను అధికారులు కొట్టేశారు. 97 ఫిర్యాదుల్లో 85 ఫిర్యాదులు సీఎం పోటీ చేస్తున్న భవానీపూర్లోనే రావడం గమనార్హం. మేలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ తన పదవిని నిలబెట్టుకొనేందుకు ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. ఒడిశా ఉప ఎన్నికలో 68.40 శాతం ఓటింగ్.. పిపిలి: ఒడిశాలోని పిపిలి అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం జరిగిన ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల సమయానికి 68.40శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్కే లోహని తెలిపారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ 19 నియమావళి ప్రకారం ఓటింగ్ జరిగిందని, భద్రతబలగాలు అందుకు సాయపడ్డాయని చెప్పారు. అక్టోబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద మమత -
నేడే భవానీపూర్ ఉప ఎన్నిక
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పోలింగ్ బూత్ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. ఇక పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు. -
నామినేషన్ దాఖలు చేసిన మమత
కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి టీఎంసీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బెంగాల్లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్ని కలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే పార్టీకి మెజారిటీ రావడంతో సీఎం పదవి చేపట్టారు. ఆరు నెలల తర్వాత కూడా సీఎంగా కొనసాగాలంటే ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో ఆమె గెలిస్తేనే సీఎంగా కొనసాగుతారు. నామినేషన్ వేసే సమయంలో మమతతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రి భార్య ఫిర్హాద్ హకిమ్తో కలసి వెళ్లారు. అనంతరం పిర్హాద్ మాట్లాడుతూ.. నంది గ్రామ్లో మమతపై కుట్రపన్ని ఓడించారని, ఇప్పు డు భవానీపూర్ ప్రజలు మమతను రికార్డు మెజా రిటీతో గెలిపించి చరిత్రను తిరగరాస్తారని వ్యాఖ్యా నించారు. భవానీపూర్ నుంచి 2011, 2016 ఎన్ని కల్లో మమత పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్.. భవానీపూర్లో మమతకు పోటీగా బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఆమె పేరును నామినేట్ చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తే ఈ ప్రియాంక తిబ్రేవాల్. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది. ఆమెతో పాటు సంసేర్గంజ్కు మిలాన్ ఘోష్, జంగీపూర్కు సుజిత్ దాస్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. -
West Bengal Bypolls: నామినేషన్ దాఖలు చేసిన దీదీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల జోరు మొదలయ్యింది. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీదీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినప్పటికి.. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో మమత తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ క్రమంలో మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి దీదీ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట. (చదవండి: మమతా బెనర్జీకి తాడోపేడో: భవానీపూర్ నుంచే పోటీ) పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్తో పాటు శంశేర్గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలకు సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తుండగా.. 16వ తేదీ ఉపసంహరణ. అక్టోబర్ 3న ఫలితాలు ప్రకటించనున్నారు. చదవండి: మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా -
మమతా బెనర్జీకి తాడోపేడో: భవానీపూర్ నుంచే పోటీ
కలకత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 294 స్థానాల్లో 213 ఎమ్మెల్యేలను గెలుచుకుని ముచ్చటగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే మమతా ఓటమి మాత్రం ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆరు నెలల్లోపు అసెంబ్లీ సభ్యురాలు కాకుంటే ఆమె ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సిందే. చదవండి: తండ్రిపై పోలీస్స్టేషన్లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి మమత పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు విసిరిన సవాల్ను స్వీకరించి నందిగ్రామ్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సవాళ్ల పర్వంలో త్రుటిలో పరాజయం పొందారు. ఆమెను బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచారు. సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. 16వ తేదీ ఉపసంహరణ. ఈ స్థానంతో పాటు మరో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక -
మమతా ఎనర్జీ
కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ నుంచి ఎదిగిన వ్యక్తి మమత. అయితే ఆ మాటను దీదీ ఒప్పుకోరు. ‘‘నేనెక్కడికీ ఎదగలేదు. ప్రజల మధ్యలోనే ఉన్నాను’’ అంటారు. ‘కాదు, కాంగ్రెస్ నుంచే ఎదిగారు గుర్తుకుతెచ్చుకోండి అని రెట్టిస్తే’ - ‘నిజమే, కాంగ్రెస్ తప్పిదాల నుంచి ఎదిగి ఉంటాను’ అని నవ్వేస్తారు! ప్రజల కోసం తను ఎంతైతే చెయ్యగలరో అంతా చేసేందుకు ప్రయత్నిస్తారు మమతా బెనర్జీ. అందుకోసం అడ్డొచ్చిన వారిని హక్కుగా నిలదీసి అడుగుతారు. వారు సొంత పార్టీవారైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా! ఆ ధర్మాగ్రహమే.. ఆమె ఎనర్జీ. ఆ ఎనర్జీతోనే ఇప్పుడు మమతా బెనర్జీ.. ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. 20 మే 2011. శుక్రవారం. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఆ ఉదయమే ప్రమాణం చేశారు. రాజ్భవన్ నుంచి రైటర్స్ బిల్డింగ్స్ (సచివాలయం)కి వెళ్లాలి. రోడ్డయితే ఉంది కానీ వెళ్లేందుకు దారే లేదు. కనీసం రెండు లక్షల యాభై వేల మంది బెంగాల్ ప్రజలు తమ తొలి మహిళా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడం కోసం క్రిక్కిరిసి ఉన్నారు. ‘‘నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి’’ అని గవర్నర్ను అడిగారు మమత. ఆ తర్వాత ప్రజల మధ్యలోంచి అడుగు అడుగు వేసుకుంటూ... పుష్పగుచ్ఛాలు, ఆశీర్వచనాలు అందుకుంటూ కిలో మీటరు దూరంలో ఉన్న సచివాలయం చేరుకున్నారు. పదిహేడేళ్ల తర్వాత ఆమె మళ్లీ సచివాలయం గడప తొక్కడం అదే మొదటిసారి! పదిహేడేళ్ల క్రితం ఒకరోజు - పోలీసులు మమతాబెనర్జీని అదే సచివాలయ ప్రాంగణం నుంచి ఈడ్చి పడేశారు! అప్పుడామె కాంగ్రెస్లో ఫైర్బ్రాండ్ కార్యకర్త. అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు. బసు కార్యాలయం బయట మమత నినాదాలిస్తోంది. అత్యాచారానికి గురైన ఒక బాధితురాలిని బసు పరామర్శించాలని ఆమె డిమాండ్. అత్యాచారం జరిపింది సి.పి.ఎం. కార్యకర్తలేనని ఆరోపణ. బసు బయటికి రావడం లేదు. మమత బయటికి వెళ్లడం లేదు. మధ్యలోకి పోలీసులు తోసుకుంటూ వచ్చేశారు. మమతను గెంటేశారు. అదిగో... అప్పుడు చేశారు ఆవిడ ప్రతిజ్ఞ. బెంగాల్లో కమ్యూనిస్టుల కరెంట్ పోయేవరకు రైటర్స్ బిల్డింగ్లోకి అడుగు పెట్టనని ప్రకటించారు. చివరికి ప్రజలే ఆమె ప్రతిజ్ఞను నెరవేర్చారు! గిర్రున ఐదేళ్లు ! బెంగాల్కు మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఈ నెల చివర్లో షెడ్యూల్. మార్చి మొదటి వారంలో మమత ప్రచారం. అయితే ఈసారి మమత ప్రత్యేకంగా హామీలేం ఇవ్వడం లేదు. అలాగని చేసిన పనుల్నీ ఏకరువు పెట్టబోవడం లేదు. ‘మా, మాటీ, మనుష్’ (మదర్, మదర్లాండ్, పీపుల్) అనే తన పూర్వపు నినాదంతోనే ప్రజల్లోకి వెళుతున్నారు. బి.జె.పి. వ్యతిరేక శక్తులను చేరదీసి, సి.ఐ.ఐ.(ఎం)కి వ్యతిరేకంగా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు. ఇంతకీ ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా మమత ఏం చేశారు? అన్నం మొత్తం పట్టుకుని చూడనవసరం లేదు. ముఖ్యమంత్రిగా తొలి 48 గంటల్లోనే తనేమిటో బెంగాల్కి, మిగతా దేశానికి చూపించారు మమత. మొదట ఆమె అన్ని ప్రొటోకాల్స్ని బ్రేక్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి అధికార లాంఛనాన్నీ తీసి అవతల పడేశారు. బులెట్ ప్రూఫ్ కారును తిప్పి పంపించారు. తన సొంత కారులోనే విధులకు బయల్దేరారు. ఆ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపించే విషయంలోనూ కోల్కతా రాజనీతిజ్ఞులు మునుపెన్నడూ ఎరుగని ప్రత్యేక మర్యాదలు పాటించారు! మమత సూచన మేరకు డిప్యూటీ అసెంబ్లీ లీడర్ పార్థ చటర్జీ ఉదయం 8.35కి నేరుగా బుద్ధదేవ్ భట్టాచార్జీ (అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రి) ఇంటికి వెళ్లి, తలుపు తట్టి మరీ ఆయన చేతికి ఇన్విటేషన్ అందించారు! అనుకోని అతిథులు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని అంత పర్సనల్గా ఆహ్వానించడం బెంగాల్లో బహుశా అదే మొదటిసారి కావచ్చు. ఇలాంటి ‘ఫస్ట్’లు ఇంకో రెండుమూడు కూడా ఉన్నాయి! సీమ అని... సెక్స్ వర్కర్. సోనాగంజ్ రెడ్లైట్ ఏరియాలో ఉంటుంది. ఆవిడక్కూడా మమత ప్రత్యేక ఆహ్వానం పంపారు. అలాగే, నెతాయ్, నందిగ్రామ్ ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు మమత నుంచి ఆహ్వానాలు అందాయి. ఏం చేసినా ప్రజల కోసమే.. మమతా బెనర్జీ... అగ్గిరవ్వ, తారాజువ్వ. మొహమాటాల్లేని మనిషి. ‘నీకోసం అది చేశాను, ఇది చేసేశాను. అవన్నీ మర్చిపోయి ఇప్పుడిలా చేస్తావా’ అని అడిగితే - ఎంతటి వాళ్లకైనా ఆమె చెప్పే సమాధానం ఒక్కటే... నీకూ నాకూ జరగడం కాదు, ప్రజలకు ఏం ఒరిగిందన్నదే నా ప్రయారిటీ అని! మమత తగాదాలు, వివాదాలు, నినాదాలు, రాజీనామాలు అన్నీ ప్రజల కోసమే. అలాగే ఏ పార్టీలో ఉన్నదీ, ఏ పదవిలో ఉన్నానన్నది, ఎవరికి మద్దతు ఇస్తున్నదీ ముఖ్యం కాదు దీదీకి. తను అనుకున్నది నెరవేరాలి. అంతే. అయితే తనెప్పుడూ తనకోసం ఏదీ అనుకున్నది లేదు. ప్రజలు, పశ్చిమబెంగాల్... పార్లమెంటులోనూ ఇదే ఆమె అజెండా. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మమత కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. యూత్, స్పోర్ట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ చూస్తున్నారు ఆవిడ. దేశంలో క్రీడారంగం నీరసించి పోయింది. కాస్త గ్లూకోజ్ ఎక్కించండి అని దీదీ ఎంత మొత్తుకున్నా ఎవరూ విన్లేదు. చిర్రెత్తుకొచ్చి కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ర్యాలీ తీశారు. రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మమతతో వేగలేక కాంగ్రెస్ ఆమె శాఖలన్నిటినీ ఇంకొకరికి మార్చింది. అయినా దీదీ మారలేదు. బెంగాల్లో సి.పి.ఐ-ఎం. కి కాంగ్రెస్ తొత్తులా వ్యవహరిస్తోందని 1996 ఏప్రిల్లో బహిరంగంగా ప్రకటించినప్పుడు కాంగ్రెస్ వణికిపోయింది. ఇంటి రహస్యాలను ఎవరైనా బైటికి చెప్పుకుంటారా అని ప్రత్యేక దూతలు కొందరు ఢిల్లీ నుంచి వచ్చి లాజికల్గా కన్విన్స్ చెయ్యబోయారు కానీ ఆమె కాలేదు. తర్వాతి ఏడాదే పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. దీదీగిరి ‘దాదాగిరి’ అనే మాట భారత రాజకీయాలలోకి ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టం. ‘దీదీగిరి’ అనే మాట మాత్రం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే పుట్టుకొచ్చింది! మూడు దశాబ్దాల కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి మరీ అమె 2011లో బెంగాల్కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. వచ్చీరావడంతోనే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి మరీ ప్రజలకు చేరువ అయ్యారు. అవే పరుగులను తనను వ్యతిరేకించేవారినీ పెట్టించి అసహన వైఖరికి ప్రతిరూపంలా నిలిచారు. అయితే ఈ వైఖరిని నియంతృత్వ పోకడ అనేందుకు లేదు. ప్రజల మధ్య చిరస్థాయి నాయికగా నిలిచిపోయేందుకు చేసే ప్రయత్నంలో అమె అనుసరించిన విధానంగానే చూడాలి. పాలనలో వందకు వంద మార్కులు గెలుచుకోగలిగారంటే అంత కన్నా ముందు ప్రజల హృదయాలను గెలుచుకున్నారనే కదా. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన నాయకురాలు మమత. స్కూల్లో ఉండగానే ఆమె విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరీ పదిహేనేళ్ల వయసుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. చరిత్రలో డిగ్రీ, ఇస్లాం చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ, ‘లా’లో ఇంకో డిగ్రీ... పాలిటిక్స్లో ఉంటూనే పూర్తి చేశారు. పొయెట్రీ రాశారు. పుస్తకాలు వేశారు. సీపీయెంకు వ్యతిరేకంగా గోడలకు పోస్టర్లు అంటించిన అజ్ఞాత కార్యకర్తగా మొదలైన మమత కెరీర్.. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత కాంగ్రెస్నే ధిక్కరించే స్థాయికి, శిఖరాగ్రానికి చేరుకుంది. మమత ఒక సాధారణ మహిళగా ఎలా ఉంటారో... ముఖ్యమంత్రిగానూ అలాగే ఉంటారు. రెండు మూడొందల్లో వచ్చే కాటన్ చీర, కాళ్లకు రబ్బరు స్లిప్పర్స్.. ఇవీ కూడా ఆమె దృఢచిత్తంలా ఆమెకో ప్రత్యేకమైన గుర్తింపును, ఎనర్జీని తెచ్చిపెట్టాయి. మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జననం : 5 అక్టోబర్ 1960 జన్మస్థలం : కలకత్తా తల్లిదండ్రులు : గాయత్రి, ప్రమీలేశ్వర్ బెనర్జీ తోబుట్టువులు : ఆరుగురు సోదరులు వైవాహిక స్థితి : అవివాహిత పార్టీ : తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ ప్రవేశం : 1970 (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) కాంగ్రెస్ను వదిలిపెట్టింది : 1997 చేపట్టిన పదవులు : ఎంపీగా, రైల్వే మంత్రిగా. ప్రస్తుత ప్రాతినిధ్యం : భవానీపూర్ (విధాన సభ నియోజకవర్గం) ఆటోబయోగ్రఫీ : మై అన్ఫర్గెటబుల్ మెమరీస్ రాజకీయాలలోకి ప్రవేశించినట్లే, చదువులలోకీ చాలా త్వరగా వచ్చేశారు మమత. సెకండరీ (టెన్త్) పరీక్షలు రాయడానికి వయసు సరిపోకపోతే ఐదేళ్లు ఎక్కువగా వేసి రాయించారు! అసలైతే మమత పుట్టింది 1960 అక్టోబర్ 5న. రికార్డులలో ఉన్న తేదీ మాత్రం 1955 జనవరి 5.


