bhojaraju
-
ఐదు వందల ఏళ్ల నాటి బావి..నిర్మించిన తీరుకి విస్తుపోవాల్సిందే..!
పురాతన శిల్పాలు, ఆనాటి కట్టడాలు గొప్పగొప్ప కథలెన్నో చెబుతుంటాయి. ఆనాటి రాజరికపు దర్పాన్ని, ప్రజా జీవన శైలిని కళ్లకు కడుతుంటాయి. అలాంటిదే కర్నూలు జిల్లా మండల కేంద్రం మద్దికెరలోని భోజరాజు బావి. ఇది సుమారు 5 వందల ఏళ్ల క్రితం పెద్దనగరి యాదవరాజులైన భోజరాజు తవ్వించారు. నాటి నుంచి నేటికీ గ్రామస్థులు, ఆ బావి నీటిని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దాదాపు 70 అడుగుల లోతు, 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ బావి ఎన్నో ప్రాచీన విగ్రహాలతో ఆకట్టుకుంటుంది. ఈ బావిని ఎలాంటి మట్టి, ఇతర సామగ్రిని వినియోగించకుండా రాతి మీద రాతిని పేర్చి, హెచ్చుతగ్గులు కనిపించకుండా కట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాతి కట్టడంపై దేవతామూర్తులు, నర్తకుల నృత్యభంగిమలు, జలచర జీవుల రూపాలు, జలకన్యలు ఇలా వందలకొద్ది శిల్పాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. పదేళ్ల క్రితం వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ బావి నీటినే వినియోగించేవారు. కాలక్రమేణా నీళ్ల వ్యాపారం మొదలైననాటి నుంచి, ఎవరికి వారు, వాటర్క్యాన్స్ కొనుక్కుంటూ ఈ బావి నీటిని గృహ అవసరాలకు వాడటం మానేశారు. ప్రస్తుతం ఈ నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ‘అప్పట్లో ఈ నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఉండేవి కావు, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తేవి కావు’ అని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.కరువులోనూ ఆదుకుంది..దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు మా వంశస్తులు నిర్మించిన భోజరాజు బావి ప్రజల దాహార్తిని తీర్చింది. ప్రస్తుతం 15 ఎకరాల వ్యవసాయ భూమికి ఈ బావి నీరే ఆధారమైంది--విజయ రామరాజు జమేదార్ మద్దికెరపి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు డెస్క్టి.వెంకటేశ్వర్లు, మద్దికెర(చదవండి: ఈ తిను 'బండారం' గురించి తెలుసుకోండి..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
నారా లోకేశ్పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్పై డి.హీరేహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విటర్లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు. వివరాలు... టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేస్తూ.. లోకేశ్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ భోజరాజు నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని మండిపడ్డారు. చదవండి: చంద్రబాబుపై క్రిమినల్ కేసు -
సాక్షరభారత్ డిప్యూటీ డైరెక్టర్ స్వచ్ఛంద పదవీ విరమణ
సిబ్బంది వ్యవహారమే కారణం? అనంతపురం ఎడ్యుకేషన్ : సాక్షరభారత్ మిషన్ (వయోజన విద్య) ఉప సంచాలకులు భోజరాజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఈయనకు ఇంకా 20 నెలల సర్వీస్ ఉంది. అయినా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడం చర్చనీయాంశమైంది. స్వచ్ఛందవిరమణకు అనుమతి ఇవ్వాలని గతంలో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన భోజరాజు ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ)గా జిల్లాకు వచ్చారు. గతంలో డీడీగా పని చేస్తున్న ఈశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత డీడీ ఎఫ్ఏసీగా ఆయనకే బాధ్యతలు ఇచ్చారు. 2015 డిసెంబరులో డీడీగా రెగ్యులర్ అయింది. అప్పటి నుంచే ఆయనే కొనసాగుతున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడంతో పీఓగా పని చేస్తున్న సలీంకు ఎఫ్ఏసీగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలాఉండగా వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్లు భోజరాజు చెబుతున్నా...అంతర్గతంగా మాత్రం తాను పని చేస్తున్న చోట పడుతున్న ఇబ్బందులు తాళలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిబ్బందిలో మార్పు రాకపోవడం... తనకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనన్న భయంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడేందుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా...‘నేను నిజాయితీ కుటుంబం నుంచి వచ్చాను. ఉద్యోగ విరమణ చేయడం ద్వారా నాకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తాను. ఇంతకు మించి నన్నేమి అడగవద్దు’ అని సమాధానమిచ్చారు.