Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Slams Nara Lokesh Over Tenth Papers Valuation Errors1
ఇంత జరిగినా మౌనమేలా మంత్రి లోకేశా?: YSRCP

సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థపై ఘోరమైన మరక పడింది. పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు జరిగాయి. వేలమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి మరీ మౌనంగా ఉండిపోయారంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది... పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత 60% మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. బోర్డు చేసిన దారుణమైన తప్పులు పాసైన వారిని కూడా ఫెయిల్ చేశాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వమే ప్రమాదంలోకి నెట్టింది. ఇంత దారుణం జరిగినా మంత్రి నారా లోకేష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రశ్నించింది. .. నారా లోకేష్ చేసిన తీవ్రమైన ఒత్తిడి వలనే ఉపాధ్యాయులు మార్కులు తారుమారు చేయటానికి కారణమైంది. మొత్తం 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటి వరకు టెన్త్‌ రీవాల్యూషన్‌(AP 10th Class Revaluation) 11,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్వయానా ప్రభుత్వమే ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోందట. ఈ పరిణామంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని వైఎస్సార్‌సీపీ(YSRCP), ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనను జోడించి తన ట్వీట్‌లో పేర్కొంది. అలాగే ఈ విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో.. అన్ని నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.Unprecedented chaos in 10th class exam evaluation! Thousands of students’ futures at stake as 60% have applied for revaluation — a first in AP history. Shocking errors by the board failed even those who passed. Due to Nara Lokesh’s pressure, marks were tampered with. 66,363… pic.twitter.com/q34Gm46Yj1— YSR Congress Party (@YSRCParty) May 30, 2025

IPL 2025: RCB Won Qualifier 1, Interestingly All Qualifier 1 Winning Teams Have Won The Title Since 20182
IPL 2025: 'ఈ లెక్కన' ఈ సారి ఆర్సీబీదే టైటిల్‌..!

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్‌ అవుతుంది. గడిచిన మూడు సందర్భాల్లో ఈ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఆర్సీబీ ఫైనల్‌కు చేరిన సీజన్లు..2009- డెక్కన్‌ ఛార్జర్స్‌ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి2011- సీఎస్‌కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి2016- ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి2025- ?కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరాక ఓ ఆసక్తికర విషయం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రతి సీజన్‌లో ఈ సాలా కప్‌ నమదే అనే ఆర్సీబీ అభిమానులకు ఇది ఊపునిచ్చే అంశం. అదేంటంటే.. 2018 నుంచి క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టే టైటిల్‌ గెలిచింది. ఈ విషయం తెలిసి ఆర్సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ ఒక్క సెంటిమెంట్‌ చాలు మేము ఈ యేడు కప్‌ కొడతామని చెప్పడానికంటూ చాటింపు చేసుకుంటున్నారు.సెంటిమెంట్‌ విషయాన్ని పక్కన పెడితే, ఈ యేడు ఆర్సీబీకి టైటిల్‌ గెలిచే జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆర్సీబీ ఈ సీజన్‌లో గత సీజన్లకు చాలా భిన్నంగా కనిపిస్తుంది. టైటిల్‌ గెలవాలన్న కసి ఆ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే వారి ప్రదర్శనలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ప్రతి సీజన్‌లో వీక్‌గా కనిపించే ఆర్సీబీ బౌలింగ్‌ విభాగం ఈ సీజన్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నిన్న జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో అది నిరూపితమైంది. ఇదే జోరును ఆర్సీబీ బౌలర్లు ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే, ఆ జట్టును టైటిల్‌ గెలవకుండా ఎవరూ ఆపలేరు.ఈ సారి ఆర్సీబీకి పటిష్టమైన జట్టుతో పాటు సెంటిమెంట్లు కూడా వర్కౌటయ్యేలా ఉన్నాయి. క్వాలిఫయర్‌-1 సెంటిమెంట్‌తో పాటు విరాట్‌ కోహ్లి జెర్సీ నంబర్‌ సెంటిమెంట్‌ కూడా ఆ జట్టుకు ఈ సారి కలిసొచ్చేలా ఉంది. కోహ్లి జెర్సీ నంబర్‌ 18, ఐపీఎల్‌ సీజన్‌ సంఖ్య కూడా 18.2018 నుంచి క్వాలిఫయర్‌-1 గెలిచిన జట్లు, టైటిల్‌ గెలిచిన జట్ల వివరాలు..2018- క్వాలిఫయర్‌-1 విజేత సీఎస్‌కే- టైటిల్‌ విజేత కూడా సీఎస్‌కేనే2019- క్వాలిఫయర్‌-1 విజేత ముంబై ఇండియన్స్‌- టైటిల్‌ విజేత కూడా ముంబై ఇండియన్సే2020- క్వాలిఫయర్‌-1 విజేత ముంబై ఇండియన్స్‌- టైటిల్‌ విజేత కూడా ముంబై ఇండియన్సే2021- క్వాలిఫయర్‌-1 విజేత సీఎస్‌కే- టైటిల్‌ విజేత కూడా సీఎస్‌కేనే2022- క్వాలిఫయర్‌-1 విజేత గుజరాత్‌- టైటిల్‌ విజేత కూడా గుజరాతే2023- క్వాలిఫయర్‌-1 విజేత సీఎస్‌కే- టైటిల్‌ విజేత కూడా సీఎస్‌కేనే2024- క్వాలిఫయర్‌-1 విజేత కేకేఆర్‌- టైటిల్‌ విజేత కూడా కేకేఆరే2025- క్వాలిఫయర్‌-1 విజేత ఆర్సీబీ- టైటిల్‌ విజేత..?

mlc kavitha comments on brs merge with bjp3
బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత

సాక్షి,మంచిర్యాల: నాకంటూ సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా త‌పన అంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ క‌విత మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.ఎమ్మెల్సీ కవిత శుక్ర‌వారం మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. ‘నాకు సొతంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా తప‌న‌. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్ద‌నేది నా వాద‌న. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుప‌డ‌లేదు. నేను జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీని బీజేపీలో క‌లుపుతాన‌ని అన్నారు. పార్టీని బీజేపీలో క‌లుపుతానంటే నేను ఒప్పుకోను. లెట‌ర్ రాయ‌డంలో నా త‌ప్పేమీ లేదు. లెట‌ర్ బ‌య‌ట‌పెట్టిన వారిని ప‌ట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు.

A Wife Ends Life After Sent A Message To Husband Rajahmundry4
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!

ఏలూరు టౌన్‌: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్‌లో మెసెజ్‌ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్‌ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్‌ 21 వ డివిజన్‌ సచివాలయంలో కళ్యాణి ఏఎన్‌ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్‌లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్‌ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ట్రేస్‌ చేశారు. లొకేషన్‌ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్‌ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

Kamal Haasan's Thug Life banned in Karnataka amid Kannada language row5
కమల్‌ హాసన్‌ కామెంట్స్.. కర్ణాటకలో థగ్‌ లైఫ్‌కు బిగ్‌ షాక్!

కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్‌పై వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే క్షమాపణ చెప్పాలని కమల్‌కు డెడ్‌లైన్‌ విధించిన కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమల్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఎఫ్‌సీసీ కర్ణాటకలో థగ్‌ లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన గడువులోగా క్షమాపణలు చెప్పకపోతే నిషేధం అమల్లోకి వస్తుందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సారా గోవిందు స్పష్టం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ అనుకూల సంస్థల డిమాండ్లకు కూడా తమ మద్దుతు ఉంటుందని ఆయన తెలిపారు.కాగా.. ఇటీవల బెంగళూరులో జరిగన థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. ఆయన వ్యాఖ్యలపై కన్నడ భాష సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో కమల్ సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) 'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలో నిషేధించింది. ఇ‍ప్పటికే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశారని కమల్ హాసన్‌పై కర్ణాటక రక్షణ వేదిక ఫిర్యాదు చేసింది.

Miss England Milla Magee Row: Telangana Govt Probe Done6
మిల్లా మ్యాగీ వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీ(Milla Magee) సంచలన ఆరోపణల వ్యవహారంపై విచారణ ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై తెలంగాణ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ సాక్షితో శుక్రవారం మాట్లాడారు.‘‘మిస్‌ ఇంగ్లండ్‌ మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వ విచారణ ముగిసింది. అయితే ఆమె విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు లండన్‌లో కేసు వేశారు. ఆమెపై యూకే ప్రభుత్వమే లీగల్‌ చర్యలు తీసుకుంటుంది’’ అని జయేష్‌ రంజన్‌(Jayesh Ranjan) స్పష్టం చేశారు.వ్యక్తిగత, నైతిక కారణాలను చూపుతూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌ 2025 (Miss World 2025)పోటీల నుంచి నిష్క్రమిస్తూ మిల్లా మ్యాగీ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆపై ఆమె బ్రిటిష్ టాబ్లాయిడ్ ది సన్‌తో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా. తెలంగాణపై గౌరవం పెరిగింది. అక్కడి అతిథ్యం బాగుంది. కానీ, మేం పోటీలకు వచ్చామో, దేనికొచ్చామో అర్థం కాలేదు.. ఇవేం పోటీలు?’’ అని ఆమె అన్నట్లు సదరు టాబ్లాయిడ్‌ కథనం ఇచ్చింది.అయితే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ ఈ ఆరోపణలను ఖండించారు. తన తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఆమె పోటీ నుండి వైదొలగాలని అభ్యర్థించారని తెలిపారు. మిస్‌ వరల్డ్‌ పోటీలు.. గౌరవం, బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ విలువలకు కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు.అయితే ఈ వ్యవహారంపై తెలంగాణాలో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

One habit I have had now for many years External Affairs Minister Lifestyle7
'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌పై జైశంకర్‌ మాట

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్. జైశంకర్‌కు ఉన్న కుటుంబ నేపథ్యం ఏ మంత్రికీ ఉండకపోవచ్చు. ఆయన తండ్రి కే.సుబ్రహ్మణ్యం.. 1951 ఐఏఎస్ బ్యాచ్ టాపర్. ఆయన్ను చాలామంది కె.ఎస్ అని, సుబ్బు అని పిలుస్తుంటారు. అంతేగాదు భారత దౌత్య రంగానికి గురువు అని కూడా పిలుస్తారు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన జై శంకర్‌ కూడా అంతే చురుకుగా ఉంటూ.. దూకుడుతో నిర్ణయాలు తీసుకుని అంద‍ర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసా?.. వృత్తిపరంగా అత్యంత బిజీగా ఉండే జైశంకర్‌ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే మొదలైపోతుందట. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ కాల్స్‌, వార్తపత్రికలు సమాచారం తెలుసుకోవడం, ఆ రోజు ఉన్న ఈవెంట్లు, హాజరుకావల్సిన కార్యక్రమాలు షెడ్యూల్‌ చూసుకోడం వంటి గందరగోళంతో ఉంటుందట. అంత ఫుల్‌బిజీలో కూడా తనకున్న ఒక్క అలవాటే తన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందట. అదే తన ఆరోగ్య రహస్యమని అంటున్నారు జైశంకర్‌. ఎప్పుడే ఏ దేశంలో ఉంటామన్నది తెలియని పరిస్థతి కాబట్టి కచ్చితంగా వ్యాయామాలు, యోగా వంటివి చేయడం కుదరదని చెబుతున్నారు. అందువల్ల ఆయన దినచర్య తానున్న ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుందట. సాధారణ రోజుల్లో మాత్రం చాలామటుకు తన రోజు.. ఉదయం ఆరుగంటల నుంచి మొదలవ్వుతుందట. అయితే కచ్చితంగా ఉదయం స్క్వాష్ గేమ్‌ ఆడతారట. ఎంత బిజీ షెడ్యూల్‌ అయినా..ఓ అరగంట అది ఆడాల్సిందేనని చెబుతున్నారు. అలాగే తప భార్యతో కలిసి ఓ అరగంట వాక్‌ చేస్తానన్నారు. ఎందుకంటే తన భార్యతో స్పెండ్‌ చేసేందుకు అదే తనకు తగిన సమయమని చెబుతున్నారు. అదీగాక నిత్యం పర్యటించే జై శంకర్‌కు కుటుంబంతో గడపడం, ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడం అనేవి అత్యంత సవాలుతో కూడినవి. కాబట్టి తన లైఫ్‌స్టైల్‌కి అనుగుణంగా ఆరోగ్యకరమైన అలవాట్లకు సంబంధించి కనీసం రెండు అలవాట్లను తప్పనిసరిగా తన దినచర్యలో భాగం చేసుకుంటారట. అలాగే కుటుంబంతో గడపటం కోసం..భార్యతో సంభాషిస్తూ చేసే వాకింగ్‌ అనేది కూడా తప్పనిసరి అని అన్నారు. పర్యటనలో లేకపోతే..తన భాగస్వామితో గడపటానికి తప్పనిసరిగా అరగంట సమాయాన్ని కేటాయిస్తానని చెప్పారు. అలాగే తన వర్క్‌ లైఫ్‌ ఉదయం 9.30 గంటలకు మొదలవుతుందట. ఇక అక్కడ నుంచి ఉన్నత స్థాయి సమావేశాలు, సమీక్షలు, మంత్రిత్వ శాఖ ఫైళ్లను క్లియర్ చేయడం, పాశ్చాత్య దేశాలతో ఫోన్‌లో దౌత్య సంభాషణలు జరపడం వంటి కార్యక్రమాల్లో మునిగిపోతానని చెప్పారు. ఇక సినిమాలు చూసే ఛాన్సే లేదని అ‍న్నారు. ఎందుకంటే.. రెండు గంటల్లో అయిపోయే సినిమా ఉండదు కదా అని నవ్వేశారు. చివరగా ఆయన విదేశాంగ మంత్రిగా వర్క్‌కి సంబంధించి..24/7 అత్యంత బిజీగా ఉండాల్సిన పరిస్థితి అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యానికి సంబంధించిన ఆ అలవాట్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మిస్‌ అవ్వనని చెప్పారు. అంతేగాదు ఎంత పని గందరగోళంతో ఉన్నా..జీవితాన్ని అందంగా ఓ నిర్షిష్ట పద్ధతిలో నిర్మించుకోవడంలో విఫలమవ్వకూడదని అన్నారు జైశంకర్‌. బిజీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే కానీ, జీవితాన్ని అందంగా మలుచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుందని తేల్చి చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్‌. చెప్పాలంటే వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ అంటే అసలైన అర్థం మన విదేశాంగ మంత్రి లైఫ్‌స్టైలే కదూ..! సో.. మనం కూడా పని జీవితం తోపాటు..మన కుటుంబ జీవితానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం..ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకుందాం. (చదవండి: మహిళా సైనికులకు ఇన్ని ఆరోగ్య సవాళ్లు ఉంటాయా..? అందుకే ఇజ్రాయెల్‌..)

Pakistan Army Chief Asim Munir Comments On Indus Water Treaty8
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్‌ ఆర్మీ చీఫ్‌

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ను దెబ్బ కొడుతూ భారత్‌ తీసుకున్న నిర్ణయాల్లో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. ఆ ఒప్పందంపై పాకిస్తాన్‌ ఆర్మీ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ స్పందించారు. సింధు జల ఒప్పందం (IWT) తన దేశానికి రెడ్ లైన్‌ అని అభివర్ణించారు. నీటి సమస్యపై ఇస్లామాబాద్ (పాక్‌ రాజధాని) ఎప్పటికీ రాజీపడదు’ అని ప్రకటించారు.పాకిస్తాన్‌లో జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్‌ ఛాన్సిలర్లు, ప్రిన్సిపల్స్‌, సీనియర్‌ ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో అసిమ్‌ మునీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునీర్‌ మాట్లాడుతూ.. రెడ్‌లైన్‌ అనేది పాకిస్తాన్‌ నీరు. 24 కోట్ల పాకిస్తానీయుల కనీస హక్కు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమంటూ భారత్‌ సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై గురించి ప్రస్తావించారు.గత నెల ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్‌ ముష్కరులు అమాయకులైన టూరిస్టుల ప్రాణాలు తీశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌ ఆటకట్టించేందుకు ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టింది. ఏప్రిల్‌ 7న పాకిస్తాన్‌, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదుల స్థావరాల్ని నేలమట్టం చేసింది. వందల మంది పాక్‌ ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపింది. అదే సమయంలో భారత్‌- పాక్‌ మధ్య 1960లో సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్‌లో నీటి యుద్ధాలు మొదలయ్యాయి. తాగేందుకు,వ్యవసాయం చేసేందుకు, నిత్యవసరాలకు వినియోగించుకునేందుకు నీరు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ పాక్‌ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన వీడియోలో సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వంపై అసమ్మతి మొదలైంది. ఆ అసమ్మతిని చల్లార్చేందుకు భారత్‌కు లేఖ రాసింది. తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నానమని, సింధూ జలాల విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయంలో పునసమీక్షించుకోవాలని ప్రాధేయపడింది. భారత్‌ మాత్రం సున్నితంగా తిరస్కరించింది. పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించుకునే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Bhairavam Movie Review And Rating In Telugu9
భైరవం మూవీ రివ్యూ

టైటిల్‌: భైరవంనటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అతిధి శంకర్‌, ఆనంది , దివ్య తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్నిర్మాత: కేకే రాధామోహన్‌దర్శకత్వం: విజయ్‌ కనకమేడలసంగీతం: శ్రీచరణ్‌ పాకాలసినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతంఎడిటర్‌: చోటా కె ప్రసాద్‌విడుదల తేది: మే 30, 2025బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో వీరి నుంచి సినిమాలే రాలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే భైరవం. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్‌ బస్టర్‌ 'గరుడన్‌’ తెలుగు రీమేకే ఈ భైరవం. టాలీవుడ్‌ ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించామని మేకర్స్‌ చెప్పారు. మరి ఆ మార్పులలో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించారా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. (Bhairavam Review)భైరవం కథేంటంటే..?తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్‌), వరద(నారా రోహిత్‌),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. (Bhairavam Review)మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శీను ఎలా రక్షించాడు. గజపతి గురించి శీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అమ్మవారి పూనకం వచ్చే శీను.. న్యాయం కోసం చివరకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిన తర్వాత రీమేక్‌ చిత్రాలు రావడం తగ్గిపోయాయి. ఓ మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే ఓటీటీల పుణ్యమా అని అన్ని ప్రాంతాల ప్రేక్షకులు చూసేస్తున్నారు. అలాంటి సమయంలో తమిళ బ్లాక్‌ బస్టర్‌ గరుడన్‌ని తెలుగులో రీమేక్‌ చేశాడు దర్శకుడు విజయ్‌ కనకమేడల. ఇది ఓ రకంగా పెద్ద సాహసమే. కానీ దానికి తగిన న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. ఒరిజినల్‌ సినిమాలోని ఎమోషన్‌ని ఇందులో క్యారీ చేయలేకపోయాడు. కథలో ఆయన చేసిన చిన్న చిన్న మార్పులే దీనికి కారణం. ముగ్గురు హీరోలను మేనేజ్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు కానీ సెంటిమెంట్స్‌ని పండించే విషయంలో తడబడ్డాడు.ఒరిజినల్‌లో బెల్లంకొండ పాత్రను సూరి పోషించాడు. ఆయనకున్న ఇమేజ్‌కి ఆ పాత్ర కొత్తగా అనిపించింది. కానీ బెల్లంకొండకు ఇక్కడ ఉన్న ఇమేజ్‌ వేరు. దీంతో ఆ పాత్రలో ఆయన ఒదిగినట్లుగా కాకుండా నటించినట్లుగానే అనిపిస్తుంది. అలాగే మనోజ్‌ పాత్ర కూడా. ముగ్గురు హీరోలకు ఎలివేషన్స్‌ ఇవ్వడంపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. అమ్మవారి ట్రాక్‌ని కూడా సరిగా వాడుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. గుడి నేపథ్యంతో పాటు ముగ్గురు హీరోల పరిచయం తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. శీను-వెన్నెల(అతిధి శంకర్‌) లవ్‌ ట్రాక్‌ అంతగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సాగదీసినట్లుగా ఉంటుంది. గరుడన్‌ చూసిన వారికి ట్విస్టులు కూడా తెలుస్తాయి కనుక.. అవి కూడా ఆకట్టుకోలేవు. ఇక గరుడన్‌ చూడని ప్రేక్షకులకు మాత్రం కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మనోజ్‌, రోహిత్‌..ముగ్గురూ టాలెంటెడ్‌ నటులే. మంచి పాత్రలు పడాలేకానీ రెచ్చిపోయి నటిస్తారు. భైరవంలోనూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ సినిమా ప్లస్‌ అవుతుందని చెప్పాలి. శీను పాత్రలో ఆయన జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే పూనకాల సీన్‌లో అదరగొట్టేశాడు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న గజపతి వర్మగా మనోజ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీన్లలో బాగా నటించాడు. ఇక నారా రోహిత్‌ తన పాత్రకి న్యాయం చేశాడు. హీరోయిన్లు అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. వెన్నెల కిశోర్‌ , జయసుధ‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్‌ పాకాల పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Jeff Bezos To Secure His Fortune With Prenup Before Marrrying Lauren10
Jeff Bezos మెకంజీ షాక్‌, ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే జాగ్రత్తపడుతున్న బెజోస్‌

అమెజాన్ వ్యవస్థాపకుడు, భూమిపై అత్యంత ధనవంతులలో ఒకరైన జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది బిజినెస్‌ వ్యవహారమో, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించో కాదు. ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే బిలియన్ డాలర్ల తన సంపదను కాపాడుకునేందుకు న్యాయపరంగా ఒక కీలకమైన చర్య తీసుకోబోతున్నాడు. అమెరికన్ టీవీ, రిపోర్టర్ లారెన్ సాంచెజ్‌ (Lauren Sánchez)తో 2023లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. వచ్చే నెలలో గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేస్తున్నారన్న వార్తలు నెట్టింట్‌ హల్‌ చల్‌ చేస్తున్నాయి. మొదటి భార్యతో విడాకులు, భారీ భరణం నేపథ్యంలో బెజోస్‌ తాజా ఏర్పాట్టు మరింత ఆసక్తి కరంగా మారాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తమ వివాహం ఇప్పటికే చాలా అలస్యమైన కారణంగా వీలైనంత త్వరగా తమ వివాహాన్ని చేసుకోవాలని 61 ఏళ్ల జెఫ్ బెజోస్ (Jeff Bezos) ప్లాన్‌ చేస్తున్నాడట. అయితే జెఫ్ 220 బిలియన్ డాలర్ల సంపదను ( సుమారు 18.84 లక్షల కోట్ల రూపాయలు) భద్రపరచడానికి ఐరన్‌ క్లాడ్ ప్రెనప్‌కు సన్నాహాలు చేసుకున్నాడని అంతర్జాతీయ మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. వివాహానికిముందే చేసుకోబోయే ఈ పటిష్ఠ ఒప్పందాన్ని సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నందున పెళ్లికి సమయం తీసుకుంటున్నాడట. అటు గ్లోబల్‌ న్యాయనిపుణులు దీనిపై భారీ కసరత్తే చేస్తున్నారు.అసలేంటీ ప్రెనప్‌వివాహానికి ముందు ఒక జంట వ్రాతపూర్వకంగా చేసుకునే ఒప్పందం. విడాకులు లేదా మరణానికి సంబంధించిన సంభావ్య ఆర్థిక సంక్లిష్టతలను నిర్వహించడానికి ఇది ఒక మార్గం, విడాకుల సందర్భంలో ఆస్తులు , అప్పులు ఎలా విభజించబడతాయో ఇందులో పొందుపరుస్తారు. ముఖ్యంగా ఆయా జంటలు రాష్ట్రం లేదా దేశంలోని నియమ నిబంధనలపై ఆధారపడకుండా వారి స్వంత నిబంధనలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది.సర్టిఫైడ్ ఫ్యామిలీ లా అటార్నీ ఆల్ఫోన్స్ ప్రొవిన్జియానోను సంప్రదించిన జెఫ్‌ త్వరలోనే దీనిపై సంతకం చేయనున్నాడు. ప్రస్తుత ఆస్తులు, ఆస్తులు, హోల్డింగ్ పెట్టుబడులు మొదలైన వాటి జాబితా ఉండవచ్చని , వాటిని ప్రత్యేక సంస్థలుగా లేబుల్ చేయవచ్చని వివరించారు. కాబట్టి, భవిష్యత్తులో లారెన్ సాంచెజ్ జెఫ్ వ్యాపార సంస్థల వృద్ధికి తోడ్పడటానికి ముందుకు వచ్చినప్పటికీ, ఒక వేళ విడిపోతే, ఆ సందర్భంలో వాటి యాజమాన్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త. అయితే, వ్యాపారవేత్త తన ఆర్థిక , ఆస్తులన్నింటినీ బహిర్గతం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ లీగల్‌ అగ్రిమంట్‌ డ్రాఫ్టింగ్‌ కష్టతరంగా మారిందట. ముఖ్యంగా అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, ఆర్థిక సలహాదారుల బృందంతో సంప్రదింపులు జరగాల్సి ఉంటుందని అంచనా. అంతేకాదు ఇది సాధారణంగా రెండు వైపులా న్యాయవాదుల బృందాలను కలిగి ఉండే సుదీర్ఘ ప్రక్రియ. దీనికి చెల్లింపులు కూడా భారీ మొత్తంలోనే ఉంటాయి. ఇరు పార్టీల అంగీకారంతో జరిగే ఈ ముందస్తు ఒప్పందానికి చర్చోపచర్చలు, అంగీకారాలు అవసరమంటున్నారు నిపుణులు. కేన్స్ సమీపంలో 500 మిలియన్ డాలర్ల సూపర్‌యాచ్‌లో లారెన్‌కు జెఫ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఈ జంట 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుండి, ఈ జంట అనేక ఈవెంట్లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రూ. 5 వేల కోట్లు ఖర్చుతో అత్యంత ఘనంగా జెఫ్‌ రెండోపెళ్లి జరగనుందని సమాచారం.ఇదీ చదవండి: అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బ‌హిష్క‌ర‌ణ‌అమెజాన్‌ బాస్‌ జెఫ్ బెజోస్ 1993లో మెకంజీ స్కాట్‌ను పెళ్లి చేసుకున్నాడు.. వీరికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే 25 ఏళ్ల దాంపత్యం జీవితం తరువాత 2019లో విడాకుల ప్రకటన చేయడం యావత్‌ ప్రపంచాన్ని విస్మయపర్చింది. అయితే మెంకజీతో విడాకులకు ముందు (2018) నుంచే జెబోస్, 54 ఏళ్ల మహిళా జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. కొన్నాళ్లకు విలాసవంతమైన నౌకలో 2.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.21 కోట్ల) డైమండ్‌ రింగ్‌తో ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. అటు లారెన్ శాంచెజ్‌కు ఇప్పటికే రెండుసార్లు వివాహమైంది. పాట్రిక్ వైట్ సెల్‌ తో, పెళ్లి ఇద్దరు పిల్లలు తరువాత విడాకులు తీసుకుంది. ఆ తరువాత మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు టోనీ గోంజెలెజ్‌ను పెళ్ళాడింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్‌ భర్తలందరూ డ్రైవర్లేగా! మెకెంజీతో జెఫ్ బెజోస్ ఖరీదైన విడాకులుచరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులు అంటే జెఫ్‌, మెకంజీదే. అమెజాన్ కేవలం ఆన్‌లైన్ పుస్తక రిటైలర్‌గా ఉన్నప్పుడు వివాహం, అమెజాన్ విజయంలో అండగా నిలిచిన అతని మాజీ భార్యకు కంపెనీలో నాలుగు శాతం వాటా లభించింది. దీంతో ఆమె అత్యంత ధనవంతురాలైన మహిళల జాబితాలో చేరింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement