Black Day of Indian Democracy
-
1975 జూన్ 25.. అప్పుడేం జరిగింది?
భారతదేశ చరిత్రలో చీకటి రోజు అది. ఒక్క కలం పోటుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన రోజు. సరిగ్గా 44 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అధికారంకోసం యావత్ జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించిన రోజు. అప్పటి ఇందిర ప్రత్యర్థి రాజ్ నారాయణ్ తరఫున వాదించిన లాయర్లలో ఒకరైన జేపీ గోయెల్ అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజు జరిగిన ఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. గోయెల్ చెప్పిన ఆ విషయాలను ఆయన కుమార్తె రమా గోయెల్ ‘సేవింగ్ ఇండియా ఫ్రం ఇందిర’పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. అందులోని వివరాల ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి గెలుపు సాధించేందుకు ఇందిర అక్రమాలకు పాల్పడ్డారని, ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నారాయణ్ ఆరోపణలకు తగిన ఆధారాలున్నందున ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12వ తేదీన అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఇందిర రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్ 25వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ తాను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని బయటకు చదివి వినిపించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూనే ఇందిర ప్రధాని పదవిలో ఉండొచ్చని కానీ, తుది తీర్పు వెలువడే వరకు ఆమె ఎంపీగా కొనసాగరాదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఇందిర మాట్లాడవచ్చు కానీ ఓటు వేసే అధికారం ఆమెకు ఉండదని ఆ తీర్పులో పేర్కొ న్నారు. తీర్పు కాపీతో నేను బయటకు వచ్చేసరికి సుప్రీంకోర్టు ఆవరణ ఒక జనసంద్రంగా మారింది. పత్రికా విలేకరులు, ఇతర లాయర్లందరినీ దాటు కొని చాంబర్కు వెళ్లడానికి గంటకు పైగా పట్టింది. ప్రతిపక్షాల తీర్మానం చాంబర్లోకి వెళ్లిన కాసేపటికే రాజ్ నారాయణ్ ఆయనకు ఫోన్ చేశారు. అలహాబాద్ ఉత్తర్వులపై సుప్రీం పూర్తిస్థాయిలో స్టే విధించకపోవడంతో ఇందిర దిగిపోవాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు అర్థమయ్యేలా చెప్పాలంటూ అభ్యర్థించారు. అప్పటికే విపక్ష నేతలందరూ మొరార్జీ దేశాయ్ నివాసానికి చేరుకున్నారు. నేను అక్కడికి వెళ్లేసరికి జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ కలిసి కూర్చొని కనిపించారు. జస్టిస్ కృష్ణ అయ్యర్ తన తీర్పులో ఇందిర ప్రధాని పదవిలో ఉండాలని తీర్పు ఇచ్చినప్పటికీ ఆమె దోషి అన్న అర్థం వచ్చేలా రాజకీయ పరమైన ఆస్తులు, ప్రజాస్వామ్య ధర్మాలు వంటివి ప్రస్తావించారు. దీంతో ఇందిర దిగాల్సిందేనంటూ కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్దళ్, జన్సంఘ్, సోషలిస్టు పార్టీ, అకాలీదళ్లతో కూడిన అయిదు పార్టీలు తీర్మానించాయి. అదే రోజు సాయంత్రం జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ప్రసంగించారు. ఇందిర వెంటనే గద్దె దిగకపోతే అయిదు విపక్షాల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులందరూ శాంతియుతంగా సత్యాగ్రహానికి దిగుతామని ప్రకటించారు. ఆ సభలో రాజ్ నారాయణ్ కూడా మాట్లాడారు. సభ ముగిసేసరికి రాత్రి 9.30 గంటలైంది. రాజ్ నారాయణ్ వాళ్లింటికి రమ్మని కోరడంతో వెళ్లాను. జరగరానిదేదో జరగనుందని అనుమానించిన రాజ్.. అక్కడే ఉండాలని కోరడంతో అక్కడే ఉండిపోయా. క్లైమాక్స్ ఎలా మారిందంటే.. నాకింకా నిద్ర పట్టలేదు. అప్పట్లో రాజ్ నారాయణ్ కార్యదర్శిగా ఊర్మిలేశ్ నన్ను లేపారు. ఇంటిని పోలీసులు చుట్టుముట్టారన్నారు. అప్పటికే జయప్రకాశ్ నారాయణ్ని అరెస్ట్ చేశారని సమాచారం అందినట్టు తెలిపారు. నేను హుటాహుటిన రాజ్ నారాయణ్ గదిలోకి వెళ్లేసరికి పోలీసులు ఆయనను అంతర్గత భద్రతా వ్యవహారాల చట్టం, 1971 (మిసా) కింద అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడే మాకు అర్థమైంది ఇందిర రాత్రికి రాత్రి ఎంతకి తెగించారో. అన్నింటికీ సిద్ధపడిన రాజ్ నారాయణ్ స్నానం చేసి కొన్ని పుస్తకాలు తీసుకువచ్చేవరకు పోలీసులు ఎదురు చూశారు. తర్వాత ఆయనను అరెస్ట్చేసి తీసుకువెళ్లిపోయారు. ది స్టేట్స్మన్, హిందూస్తాన్ టైమ్స్ మరో రెండు పత్రికలు తప్ప మిగతావేవీ మర్నాడు రాలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్352 ప్రకారం అంతర్గత భద్రత ముప్పుగా మారడంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినట్టు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఉత్తర్వులే అన్ని పత్రికల్లో ప్రముఖంగా కనిపించాయి. ఆ తర్వాత హిందూస్తాన్ టైమ్స్ పత్రిక నా స్పందన కోరితే నేను చెప్పింది ఒక్కటే. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి కాదు. తన పదవి కాపాడు కోవడానికి ఇందిర విధించిన వ్యక్తిగత అత్యవసర పరిస్థితి. ఈ దేశంలో ప్రజాస్వామ్యమే నశించింది. అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇందిర పదవి దిగిపోయి ఉంటే హుందాగా ఉండేది.. అని లాయర్ జేపీ గోయల్ ముక్తాయించారు. ‘ఎమర్జెన్సీ హీరో’లకు ప్రధాని సెల్యూట్ న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితిని ఎదురించి, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ప్రధాని మోది నివాళులర్పించారు. నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన మహనీయులందరికీ దేశం సెల్యూట్ చేస్తోంది. నియంతృత్వ విధానాలపై భారత దేశ ప్రజాస్వామ్య విలువలు విజయం సాధించాయి. 1975లో ఇదే రోజు అధికారం కోసం కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. దానికి వ్యతిరేకంగా ఎందరో భారతీయ జన్సంఘ్, ఆర్ఎస్ఎస్ నేతలు ముందుండి పోరాడారు’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటిరోజులుగా మిగిలిపోయాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన వారందరికీ నివాళులర్పించారు. ఐదేళ్లుగా సూపర్ ఎమర్జెన్సీ:మమత అప్పటి ప్రభుత్వం ఇదే రోజు 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి దాదాపు రెండేళ్లు కొనసాగిందనీ, కానీ బీజేపీ ప్రభుత్వం హయాంలో గత ఐదేళ్లుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. -
ఇది బ్లాక్ డే: వైఎస్ జగన్
* బిల్లు ఆమోదంపై జగన్ ఆగ్రహం * నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపు * సీమాంధ్ర ఎంపీల్లేకుండా ఫ్లోర్ను ఖాళీ చేశారు * పాకిస్థాన్లో కూడా ఇలా ఎవరూ చేయరేమో! * సోనియా గాంధీ నియంతలా వ్యవహరించారు * విభజనకు సోనియా, చంద్రబాబు, బీజేపీలే కారణం * టీడీపీ ఎంపీలు నామా, రాథోడ్ విభజనకు ఓటేశారు పూర్వపు రోజుల్లో నియంత అన్న పదం ఎప్పుడైనా ప్రస్తావనకొస్తే.. హిట్లర్తో పోల్చేవారు. కానీ ఇవాళ పార్లమెంటులో బిల్లు ఆమోదం జరిగిన తీరును చూసిన తరువాత నియంత ఎవరంటే గుర్తుకు వచ్చే పేరు సోనియా గాంధీ. సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘బ్లాక్ డే’గా అభివర్ణించారు. నియంత పోకడలతో రాష్ట్రాన్ని విభజించినందుకు నిరసనగా బుధవారం బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీలే కారణమని దుయ్యబట్టారు. పార్లమెంటు టీవీ లైవ్ ప్రసారాలను నిలిపేయడం, పార్లమెంటు గేట్లు మూసివేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. పార్లమెంటు వెలుపల విజయ్చౌక్ వద్ద మంగళవారం సాయంత్రం జగన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదించిన తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో, దేశంలో ఉన్నామో, లేమో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. విభజన బిల్లు ఆమోదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, బహుశా పాకిస్థాన్లో కూడా ఈ విధంగా ఎవరూ చేయరేమోనన్నారు. ‘‘పూర్వపు రోజుల్లో నియంత అన్న పదం ఎప్పుడైనా ప్రస్తావనకొస్తే.. హిట్లర్తో పోల్చేవారు. కానీ ఇవాళ పార్లమెంటులో బిల్లు ఆమోదం జరిగిన తీరును చూసిన తరువాత నియంత ఎవరంటే గుర్తుకు వచ్చే పేరు సోనియా గాంధీ’’ అని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం ఏ స్థాయికి దిగజారిపోతారో చెప్పడానికి పార్లమెంటు ఒక నిదర్శనంగా మిగిలిందన్నారు. రాష్ట్రం ఒప్పుకోకపోయినప్పటికీ, విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ పార్లమెంటుకు విభజన బిల్లు తెచ్చారని విమర్శించారు. సీమాంధ్రులు లేకుండా ఫ్లోర్ను ఖాళీ చేశారు ‘‘పార్లమెంటు సంప్రదాయాలను పక్కనబెట్టి నియంతలా పదే సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టారు. 17 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి ఫ్లోర్ను ఖాళీ చేశారు. సభలో మాట్లాడే వారు ఎవరూ లేని పరిస్థితుల్లో ఇవాళ పార్లమెంటుకు బిల్లు తెచ్చి నియంతలా బిల్లును ఆమోదించారు. మనం అసలు భారతదేశంలోనే ఉన్నామా? ఇంత నియం త పోకడతో రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. నీళ్ల కోసం, పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలని అడిగితే పట్టించుకునేవారు లేరు. ఆదాయం లేకుంటే ఉద్యోగులకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు.? ఈ పోకడ సరైందేనా? రాష్ట్రాన్ని చీల్చడానికి అధికార, ప్రతిపక్షం ఒక్కటైతే దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? దీన్ని నిరసిస్తూ ఈ రోజును బ్లాక్ డేగా పాటిస్తున్నాం. అంతేకాదు నియంత పోకడకు నిరసనగా బుధవారం బంద్కు పిలుపునిస్తున్నాను’’ అని జగన్ ప్రకటించారు. చంద్రబాబు ఎంపీలే విభజనకు ఓటేశారు.. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం సోనియా, చంద్రబాబులే అని చెప్పారు. బాబు పార్టీకి చెందిన ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్లు విభజనకు అనుకూలంగా ఓటేశారన్నారు. ‘ఇవాళ పార్లమెంటులోకి మమ్మల్ని పోనివ్వలేదు. కానీ కార్యదర్శి గదిలో ఆడియోలో వింటుంటే సభలో జరుగుతున్న తీరు బాధ కలిగించింది. ఇవాళ రాష్ట్రం ఈ స్థాయికి వచ్చిందంటే.. సోనియా ప్రధాన కారణమైతే, రెండవ కారణం చంద్రబాబు. ఆయన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు నామా, రాథోడ్ పార్లమెంటుకు వెళ్లి రాష్ట్రాన్ని విభజించాలని బిల్లుకు ఓటు వేశారు. నిజంగా వీరు అసలు మనుషులేనా?’ అంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయానికి సోనియా, ప్రతిపక్ష బీజేపీ, చంద్రబాబులదే బాధ్యతన్నారు. -
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కళంకం: కమల్నాథ్
-
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కళంకం: కమల్నాథ్
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరు పట్ల కేంద్ర మంత్రి కమల్నాథ్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్ వెలుపల కమల్నాథ్ విలేకర్లతో మాట్లాడుతూ... పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టామని చెప్పారు. అనంతరం సభ్యులు వ్యవహరించిన తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కళంకమని ఆయన అభివర్ణించారు. సభలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని పార్టీల నేతలు తమను కోరారని ఆయన చెప్పారు. సభలో జరిగిన పరిణామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బిల్లుకు అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ సభలోని సభ్యులు తమ అభిప్రాయాలు తెలపవచ్చని కమల్ నాథ్ తెలిపారు. సభలో ప్రతి ఒక్క సభ్యుడు తమ మనోభావాలను వ్యక్తీకరించే అవకాశం ఉంటుందన్నారు. సభ్యులు ఈ విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామంలో అత్యంత హేయమైన చర్యగా కమల్నాథ్ పేర్కొన్నారు.