Borrowing
-
తెలంగాణ విద్యుత్ శాఖలో తెరమీదకు అప్పుల ప్రస్తావన
-
అంబానీకి అప్పు కావాలంట! విదేశీ బ్యాంకులతో టచ్లో రిలయన్స్..
ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. రూ.7,35,000 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. అయితే ఆయన నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ 2 బిలియన్ డాలర్ల (రూ. 16,386 కోట్లు) రుణం కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. అత్యంత విజయవంతమైన వ్యాపారాల శ్రేణిని కలిగి ఉన్న రిలయన్స్ గ్రూప్ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రుణాన్ని కోరుతోంది. రుణం కోసం రిలయన్స్ విదేశీ వాణిజ్య రుణ మార్గాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోందని నివేదికలు పేర్కొంటున్నాయి. బ్లూమ్బెర్గ్ నివేదక ప్రకారం.. ఇలా తీసుకున్న రుణాన్ని మూలధన వ్యయం కోసం, ఇతర రుణాలను రీఫైనాన్స్ చేయడానికి రిలయన్స్ కంపెనీ ఖర్చుచేయనున్నట్లు తెలుస్తోంది. టచ్లో ఉన్న బ్యాంకులు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణం కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లతో కంపెనీ టచ్లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ముఖేష్ అంబానీ గత 10 సంవత్సరాలుగా టెలికాం, కన్జ్యూమర్ బిజినెస్ రంగాల్లో వైవిధ్యంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జియో, రిలయన్స్ రిటైల్ సంస్థలను ప్రారంభించారు. అవి భారీగా విజయవంతమయ్యాయి. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు ముడి చమురు శుద్ధి ప్రధాన వ్యాపారంగా ఉంది. జియో, రిటైల్ వ్యాపారాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీ నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు అనంత్ అంబానీ కంపెనీ కొత్త ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ను 2020లోనే ముఖేష్ అంబానీ రుణ విముక్తంగా ప్రకటించారు. కానీ టెలికాం, రిటైల్ రంగాలలో విస్తరణలో భాగంగా ఇటీవల నిధుల సేకరణ జరుపుతోంది. రిలయన్స్ కొత్త ఇంధన వ్యాపారంలో రాబోయే 15 సంవత్సరాలలో 75 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా 3 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నారు. అనంత్ అంబానీ నేతృత్వంలో కంపెనీ 2030 నాటికి గ్రూప్కు 10-15 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెస్తుందని ఇటీవల ఒక విదేశీ సంస్థ అంచనా వేసింది. -
రుణ లక్ష్యాన్ని తగ్గించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని రూ.10,000 కోట్లు కుదించుకుంది. పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడం దీనికి కారణం. భారీ పన్ను వసూళ్ల వల్ల ఉచిత రేషన్ పంపిణీపై అదనపు వ్యయం రూ.44,762 కోట్లు భర్తీ అయ్యే పరిస్థితి నెలకొందని, ఇది కేంద్ర రుణ లక్ష్యాన్ని తగ్గించుకోడానికి సైతం దోహదపడిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విండ్ఫాల్ ట్యాక్స్ కూడా ఖజానాకు లాభం ఒనగూర్చనుందని వివరించింది. 2022–23 బడ్జెట్ రూ.14.31 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలను నిర్దేశించుకుంది. తాజా కేంద్ర నిర్ణయంతో ఇది రూ.14.21 లక్షల కోట్లకు తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–మార్చి మధ్య రూ.5.92 లక్షల కోట్ల (రూ.14.21 లక్షల కోట్లలో రూ.41.7 శాతం) రుణ లక్ష్యాలను జరపాల్సి ఉంది. ఇందులో ఒక్క సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా రూ.16,000 కోట్ల సమీకరణలు జరపనుంది. కాగా, సెప్టెంబర్ 17 నాటికి 30 శాతం అధికంగా (2020–21తో పోల్చి) రూ.8.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. -
Sakshi Cartoon: మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం
మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం -
పుష్కర వేళ.. వసూళ్ల పర్వం
పుష్కర భక్తుల సౌకర్యాల కోసం అంటూ అధికార పార్టీ నేతల వసూళ్లు సమావేశాలు పెట్టి మరీ స్పష్టమైన ఆదేశాలు అధికారులకూ టార్గెట్లు పుష్కరాల పేరు చెప్పి.. అధికార పార్టీ నేతలు అక్రమ వసూళ్లకు తెరతీశారు. స్వచ్ఛంద సంస్థలు, వర్తక, వాణిజ్య సంఘాలు, అసోసియేషన్లు, మద్యం దుకాణాలు, రేషన్ షాపులు.. ఎవ్వరినీ వదలటం లేదు. వసూలు చేసిన సొమ్ముకు లెక్కలూ చూపటం లేదు. అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఓ ముఖ్య నేత తనయుడు, పలువురు ముఖ్య నేతలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. సాక్షి, గుంటూరు : కాదేదీ కలెక్షన్కు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. పవిత్రమైన పుష్కరాల పనుల కోసం విడుదల చేసిన నిధులను ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్ల రూపంలో కొల్లగొట్టిన నేతలు తాజాగా భక్తులకు సేవా కార్యక్రమాల పేరుతో వసూళ్లకు తెర తీశారు. ఈ నెల 12 నుంచి జిల్లావ్యాప్తంగా జరగనున్న పుష్కరాలకు వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. వారి సౌకర్యార్థం అంటూ వ్యాపారులతో పాటు పలు వాణిజ్య సముదాయాలకు, అసోసియేషన్లకు అధికార పార్టీ నేతలు ఇండెంట్లు వేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా స్వచ్ఛందంగా భక్తులకు సహాయసహకారాలు అందించాలనుకుంటున్న స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ వ్యాపార, వర్తక సంఘాలతో పాటు పలు అసోసియేషన్ నేతలను పిలిచి సమావేశాలు పెట్టి మరీ టార్గెట్లు విధిస్తున్నారు. తమ అసోసియేషన్ తరఫున ఫలానా కార్యక్రమం చేపడుతున్నామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఒప్పుకోకుండా తమకే డబ్బు పంపాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం.. సాటి వారికి సేవ చేయాలనే దృక్పథంతో తాము డబ్బు ఖర్చు చేద్దామని భావిస్తుంటే .. అధికార పార్టీ నేతలు ఈ విధంగా ఒత్తిళ్లు చేయటంపై స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వారి మాటకు ఎదురుచెబితే తమ వ్యాపారాలకు ఇబ్బందులు కలిగిస్తారనే భయంతో మిన్నకుంటున్నారు. జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఓ ముఖ్యనేత తనయుడు, పుష్కరాలు జరిగే ప్రాంతాల్లోని అధికార పార్టీ ముఖ్య నేతలంతా దౌర్జన్యంగా కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు టార్గెట్.. అంతటితో ఆగక ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు విధించి మద్యం దుకాణాలు, రేషన్ డీలర్లు, పెట్రోలు బంకులు, కిరోసిన్ హాకర్లు.. ఇలా పలు వర్గాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయా శాఖలకు చెందిన అధికారులు నేరుగా వారికి ఫోన్లు చేసి ఈ నెల 11వ తేదీ సాయంత్రం కల్లా డబ్బులు అధికార పార్టీ ముఖ్య నేతలకు చేర్చాలని హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించి కొందరు కింది స్థాయి అధికారులు అందులో కొంత మొత్తం తమకు పంపాలంటూ బెదిరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక అంతా తలలు పట్టుకుంటున్నారు. లెక్కా పత్రం లేకుండా వసూళ్లు.. పుష్కర యాత్రికులకు అన్నదానం, వసతి సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాల కల్పనకు అంటూ చేస్తున్న ఈ వసూళ్లకు లెక్కలు చూపే పరిస్థితే లేదు. ఎవరెవరి నుంచి ఎంతెంత సొమ్ము అందినదీ.. వాటిని ఏయే సౌకర్యాల కల్పనకు ఉపయోగిస్తారు.. అనే సమాచారం మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. దాతలు తాము అందజేస్తున్న సొమ్ముతో ఎంతమందికి సదుపాయాలు అందిస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. -
పాలకపక్షమా... ఐతే ఓకే!
చెముడు సహకార సొసైటీలో రూ. 97.74లక్షల మేరకు అవకతవకలు జరిగాయి. ఇందులో బినామీ రుణాలే ఎక్కువగా ఉన్నాయి. కొందరికైతే రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపించి మింగేశారు. మరికొందరికి తక్కువ మొత్తాల్లో రుణాలు మంజూరు చేసి రికార్డుల్లో ఎక్కువగా చూపించారు. ఇది ఏడాది క్రితమే వెలుగు చూసింది. కానీ రికవరీకి చర్యలు తీసుకోవడం లేదు. శాఖా పరమైన చర్యలంటూ తాత్సారం చేస్తున్నారు. క్రిమినల్ చర్యలకు పోవడం లేదు. గొట్లాం పీఏసీఎస్లో 1559మందికి సుమారు రూ.కోటి 3 లక్షలు బోగస్ రుణాల కింద అక్రమాలు జరిగినట్టు రెండేళ్ల క్రితమే తేల్చారు. కానీ ఇంతవరకు రికవరీకి చర్యలు తీసుకోలేదు. ఎందుకిలా చేస్తున్నారంటే ఆ రెండు సొసైటీలకూ అధికార పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నందునే. అందుకే వాటి జోలికి పోవడం లేదు. కేసులపై శ్రద్ధ చూపడంలేదు. శాఖా పరమైన ప్రక్రియ పేరుతో తాత్సారం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని పీఏసీఎస్ల్లో అక్రమాలు జరిగితే అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో ఒక్కోచోట ఒక్కోలా వ్యవహరిస్తున్నారు. వారి దృష్టి అంతా ఎంతసేపూ టీడీపీ ప్రత్యర్థుల సొసైటీలపైనే. అధికార పార్టీ ప్రాతినిధ్యం వహిస్తే చర్యలకు వెనుకాడుతున్నారు. విషయం గ్రహించిన ఉన్నతాధికారులు కాసింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో అక్రమాలు తేలినా రికవరీలోనూ... పోలీసు కేసులు పెట్టడంలోనూ అనుసరిస్తున్న వైఖరిపైనా ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. తాజాగా చెముడు సొసైటీలో రూ. 97.74లక్షలు అక్రమాలు తేలినా పోలీసు కేసు పెట్టడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని జిల్లా సహకార అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నించారు. తక్షణమే కలెక్టర్కు పెట్టి చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. సొసైటీలో అక్రమాలు సర్వసాధారణమే... బినామీ రుణాలు, నిధుల దుర్వినియోగం సహకార సంఘాల్లో కొత్తేమీ కాదు. సెక్షన్ 51స్టాట్యుటరీ విచారణ, సెక్షన్ 52, 53పై విచారణలు అనేకం జరిగాయి. ఇటీవల కాలంలో 25 సహకార సంఘాల్లో బినామీల పేరుతో రుణాలు కాజేయడం, నిధుల దుర్వినియోగం, కొనుగోళ్లలో చేతివాటం వంటి అడ్డగోలు కార్యకలాపాలు జరిగినట్టు తేలింది.ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నవి పక్కన పెడితే 51స్టాట్యూటరీ విచారణ 17సొసైటీల్లో జరిగింది. రూ. 2.5కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు తేలింది. ఇందులో ఒక్క చెము డు సొసైటీలోనే రూ. 97.74లక్షల అవినీతి చోటు చేసుకుంది. అక్రమాలు, విచారణ జరిగి ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో రికవరీ జరగడం లేదు. అలాగే 52స్టాట్యూటరీ విచారణ ఏడు సొసైటీల్లో జరిగింది. ఇందులోనూ రూ. లక్షల్లో అవినీతి బయటికొచ్చింది. సెక్షన్ 53 ప్రకారం గొట్లాం పీఏసీఎస్లో విచారణ నిర్వహించి అక్రమాల్ని వెలికి తీశా రు. ఇందులో రూ.కోటి 3లక్షల మేర అక్రమాలు జరిగాయి. ఈ అవినీతికి చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులే కారణమని అధికారులు తేల్చారు. కానీ బతికున్న సొసైటీ డెరైక్టర్లు, అందులో పనిచేసిన ఇతర సిబ్బందిని వదిలేశారు. వాస్తవానికైతే ఈ సొసైటీలో 51స్టాట్యుటరీ విచారణ జరపాలి. ఈ విచారణ జరిగితేనే చట్టబద్ధత ఉంటుంది. బ యటి వ్యక్తులు విచారణ చేపట్టడం ద్వారా మరింతగా అక్రమాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ రకమైన విచారణ జరగలేదు. అధికారుల తీరుపైనే అనుమానాలు న్యాయపరమైన ఇబ్బందులున్న వాటిని పక్కన పెడితే మిగిలిన చోట అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ సొసైటీల్లో అక్రమాలు జరిగినట్టు తేలినా వాటి జోలికెళ్లడం లేదు. చెముడు సొసైటీపై సీబీసీఐడీ విచారణ జరపాలని ఇక్కడ విచారణ జరిపిన అధికారి సిఫార్సు చేశారు. అక్రమాలు రూ. కోటి దాటలేదన్న కారణంగా సీబీసీఐడీ విచారణకు తిరస్కరించారు. కనీసం పోలీసు స్టేషన్లోనైనా కేసు పెట్టలేదు. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అక్రమాలు ఇలా... కొన్ని సొసైటీల్లో భూమి లేని వారిని సభ్యులుగా చేర్చి వారి పేరున రుణాలు తీసుకుని పాలక వర్గ సభ్యులు మింగేశారు. కొన్నిచోట్ల కొందర్ని కౌలు రైతులుగా చేర్పించి, వారి పేరునా, వారికి తెలియకుండా రుణాలు కాజేశారు. కొన్ని సొసైటీల్లో షేర్ కేపిటల్కు సంబంధం లేకుండా రుణాలిిప్పించేసి కుట్ర పూరితంగా నిధులు దుర్వినియోగం చేశారు. సొసైటీలో సభ్యుడిగా చేరితే రూ.300షేర్ కేపిటల్తో పాటు అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆ మేరకే రుణ పరిమితి నిర్దేశిస్తారు. చాలా సొసైటీల్లో అడ్డగోలుగా రుణాలు ఇచ్చేసినట్టు తెలిసింది. కొన్ని సొసైటీల్లో సభ్యుడికి తెలియకుండా సభ్యత్వం చేర్పించి, వారి పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి రుణాలు తీసేసుకున్నారు. -
పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వ రుణ పరపతి