-
అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓయూ ఫేక్ సర్క్యూలర్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అరెస్ట్పై బుధవారం ఆయన స్పందించారు. అధికారం శాశ్వతం కాదని, తప్పకుండా మేము బదులు చెబుతామన్నారు. వడ్డీతో సహా చెల్లించే సమయం వస్తుందని తెలిపారు. క్రీషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సర్క్యులర్ తప్పుడు అయితే తాను చంచల్ గూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధమని అన్నారు. ఒకవేళ సర్క్యులర్ నిజమని తాము రుజువు చేపిస్తే సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమి కాదని, దైర్యంగా ఎదుర్కొంటామని, తమది ఉద్యమ పార్టీ అని కేటీఆర్ అన్నారు.‘‘బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది. అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి, బయట తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్ను నిపుణుల ముందు పెడతాం. ఏదీ ఒరిజినల్? ఏదీ డూప్లికేటో తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్గూడలో ఉండాలో తేలిపోతది. క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా..! చేయని తప్పుకు క్రిశాంక్ను జైల్లో వేశారు. క్రిశాంక్ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకో. సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పండి. ఏ తప్పు చేయని క్రిశాంక్ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా’’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.ఓయూ పేరిట ఫేక్ సర్క్యూలర్ను సోషల్ మీడియాలో సర్యూలేట్ చేసిన కేసులో మన్నె క్రిశాంక్పై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలులో ఉన్నారు.క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను చంచల్ గూడ జైలుకు వెళ్ళడానికి సిద్దం.. నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? - రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/Eq0BjbD3tx— BRS Party (@BRSparty) May 8, 2024 -
అక్కరకురాని సుట్టాలెందుకు.. కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తనకు రాజకీయంగా జన్మనిచ్చిందే సిరిసిల్ల అని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. అలాగే, రాముడు అందరి వాడు.. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, కేటీఆర్ సోమవారం సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేత కార్మికుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నాం. సిరిసిల్ల పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుకున్నాం. మీరు నన్ను ఇక్కడ గెలిపించినా.. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి విజయం సాధించింది. మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో గెలిచింది.ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి?. అబద్ధాలు చెబితే డిజిటల్ ప్రపంచంలో ఒక్క నిమిషంలో దొరికిపోతారు. కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నామో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను పట్టుకుని కాంగ్రెస్ నాయకులు అనేక మాటలు, బూతులు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాక ఒక లెక్క అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తీరు. కేసీఆర్ మళ్లీ కావాలనుకుంటే మే 13వ తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించండి.. తెలంగాణలో శాసించే అధికారం వస్తుంది.బీజేపీ నేతలు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు. రాముడు అందరివాడు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న దేవాలయాలు బీజేపీ పుట్టకముందు నుంచే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లపై పన్నులు వేసి మోదీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. మళ్లీ అబ్కీ బార్ 420 అంటున్నాడు. అక్కరకురాని చుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి. నాకో జోడీ దారు దొరికితే.. రాష్ట్రం, కేంద్రంపై పోరాడే శక్తి వస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలవుతుందని.. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు జైలుకెళ్లిందని, వారు కూడా జైలుకు వెళ్లకతప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. తీన్మార్ మల్లన్న కేసీఆర్ దోపిడీపై పోరాటం చేశాడని, ఆయన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జీఓ 46తో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత దానిపై అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ వేసి రద్దు చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించిన తీన్మార్ మల్లన్ననల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తన కుటుంబం పేర ఇప్పటివరకు రూ.కోటీ 50 లక్షల ఆస్తులు ఉన్నాయని చెప్పారు.తన భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నదని, ఆమె ఒప్పుకున్నాకే ఆమె పేరు మీద ఉన్న కోటిన్నర ఆస్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరున రాసి ఇస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశంతో ఆస్తులను అప్పగించినట్టు చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు ఆయన నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్నపై 56 కేసులు రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లలో తనపై 56 కేసులు ఉన్నాయని తన ఎన్నికల అఫిడవిట్లో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తన పేరుతో రూ.16.34 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉండగా, తన భార్య పేరుతో రూ.17.66 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.3 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.50 లక్షల విలువలైన వ్యవసాయేతర భూమి, రూ.50 లక్షల విలువైన నివాస గృహం ఉన్నట్లు తెలిపారు. రూ.31.29 లక్షల అప్పులు ఉన్నట్టు వివరించారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు ఊహించని షాక్ తగిలింది. విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెల్లడించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నికపై కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విఠల్కు రూ.50వేలు జరిమానా కూడా విధించింది.అయితే, 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నామినేషన్ విత్ డ్రా చేయలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల అనంతరం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఇదే సమయంలో ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరోవైపు.. విఠల్ లాయర్ అభ్యర్థనతో తీర్పును కోర్టు.. నాలుగు వారాలు సస్పెండ్ చేసింది. -
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని.. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డే ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.దిల్లీ సుల్తాన్లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని, వారి ఆటలు సాగనివ్వనంటూ రేవంత్ హెచ్చరించారు. బలహీనవర్గాల కులగణన చేస్తున్నామని. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతామన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని రేవంత్ మండిపడ్డారు. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 2021లో జనగణన చేయాల్సి ఉన్నా.. అమిత్షా కుట్ర చేసి నిలిపివేయించారంటూ ధ్వజమెత్తారు.పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా ఆదిలాబాద్కు ఏమీ చేయలేదని రేవంత్ మండిపడ్డారు. -
ఈసీ మా ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని.. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాముడి ఫొటోతో ఓట్లడిగిన వారిపై చర్యలేవీ? కేసీఆర్పై మాత్రం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటారంటూ మండిపడ్డారు‘‘మతపరమైన రిజర్వేషన్లపై డైరెక్ట్గా ప్రచారం చేస్తున్న బీజేపీపై ఎందుకు మాట్లాడటం లేదు. మోదీ మాట్లాడిన మాటలకు నడ్డా సమాధానం ఇవ్వాలని తల తోక లేకుండా మాట్లాడింది ఎన్నికల సంఘం. అమిత్ షా రాముడు పటం పట్టుకొని ప్రచారం చేస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. అధికారం కోసం ఎన్నికలలో రాముడ్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మోదీ, అమిత్ షా వాళ్ల బీజేపీ నేతలు ఇలా చేస్తుంటే ఇప్పటికీ చర్యలు తీసుకోరు. కానీ కేసీఆర్ ఒక్క మాట అన్నందుకు ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు.రైతుల సమస్యలు చెప్తూ మాట్లాడారు. చేనేత కార్మికుల గురించి కేసీఆర్వా రి బాధలు చెప్తూ భావోద్వేగంతో ఒక్క మాట అన్నారు. ఇలా చిన్న మాట అన్నందుకు 48 గంటలు నిషేధం విధించింది. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్పైనా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పై 8 సార్లు ఫిర్యాదు చేశాం. కానీ చర్యలు లేవు. కేసీఆర్ తల నరకండి అంటే ఎందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం లేదు. 27 సార్లు పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. -
‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన కామెంట్స్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్లో తాను, సీఎం రేవంత్, హరీష్ రావు కూడా బాధితులేనని ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, బండి సంజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చర్చలో లేకుండా డైవర్ట్ చేశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కార్చడానికి కరీంనగర్కు చెందిన మంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. రాధాకిషన్ రావు చెప్పిన అంశాలను పోలీసులు రికార్డు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్లో నేను కూడా బాధితుడినే, నాతో పాటు రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే.కరీంనగర్లో ప్రతిమ హోటల్లో 341 గదిలో ఉండి రాధా కిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావు ఇంట్లో ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా జరిగింది. ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు వ్యవహారాలన్నీ అశోక్ రావు చూస్తున్నారు. రాజేందర్ రావుకు కాంగ్రెస్ టికెట్ రావడానికి ప్రధాన కారణం మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. కరీంనగర్ మంత్రి ద్వారా మధ్యవర్తిత్వం వర్తించారు. కోట్ల రూపాయల నిధులు చేతులు మారాయి. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలకు కూడా పైసలు ఇచ్చారు. ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావును ఇతర మంత్రుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కేసీఆర్ కొడుక్కు తెలియకుండానే సిరిసిల్లను ఫోన్ ట్యాపింగ్ కేంద్రంగా పెట్టుకున్నారా?. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది. అమెరికాలో అశోక్ రావు కూతురు ఇంట్లో ప్రభాకర్ రావు ఉంటున్నారు. ఇక్కడ అశోక్ రావు ఇంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటున్నారు. నయీం కేసు మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కారుస్తున్నారు.ప్రభాకర్ రావు ఇచ్చిన డబ్బులు కరీంనగర్ మంత్రి ద్వారా ఢిల్లీ వరకు ముట్టాయి. ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరపాలి. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో జరిగిన తతంగం రేవంత్ రెడ్డికి తెలియకవచ్చు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం వస్తుంది. కరీంనగర్తో పాటు ఇతర లోక్సభ నియోజవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపినట్లు అనుమానం వస్తుంది’ అని కామెంట్స్ చేశారు. -
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ను బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు రేవంత్రెడ్డిపై సీఈవోకు బీఆర్ఎస్ నేతలు బుధవారం(మే1) ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేత బీఆర్ఎస్పై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా పవర్ కట్ ఘటనను ఉదాహరిస్తూ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. కాగా, కాం గ్రెస్ ఫిర్యాదుతో ఈసీ కేసీఆర్పై ఇప్పటికే చర్య తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారాన్ని ఆపాలని ఆదేశించింది. -
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే గోదాట్లో వేసినట్లే: కేసీఆర్
సాక్షి, భద్రాద్రికొత్తగూడెంజిల్లా: ప్రాణమున్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పోరాడతానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్తగూడెంలో(ఏప్రిల్30) నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచార రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు. ఫ్రీ బస్సు పెట్టి ఈ ప్రభుత్వం ఆటో కార్మికులను ఆగం చేసిందని మండిపడ్డారు. మోదీ, రేవంత్ ఒక్కటేనని వారికి ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. ‘కొత్తగూడెంను జిల్లా చేయడానికి కారణం మారుమూల గిరిజన, ఆదివాసీలకు న్యాయం జరగాలని, పాలన అందాలని జిల్లా చేశాం. కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్తో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని చూస్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు.రైతు బంధు 15వేలు ఇస్తామని అన్నారు, కానీ ఇప్పుడు ఒక్క రూపాయి అయిన ఇచ్చాడా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500, రూ. 2 లక్షల రుణమాఫీ ఇలాంటి హామీలు అటకెక్కాయి. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు. ఇప్పుడు కరెంట్ లేనే లేదు. పినపాక లాంటి నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ, గిరిజన గూడేలకు మిషన్ భగీరథ రావట్లేదు. వేల మందికి పోడు పట్టాలు ఇచ్చినం.గిరిజనులకు, మైనారిటీలకు గురుకులాలు పెట్టి విద్యలో సమూల మార్పు తెచ్చాం. ఓవర్సీస్ స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు నిలిచిపోయాయి. గిరిజన బిడ్డల కోసం కోట్ల రూపాయల ఖర్చుతో గిరిజన భవనాలు కట్టించాం. సింగరేణి బిడ్డలకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, బోనస్లు ఇచ్చాం. సింగరేణిని ముంచే పనిలో చోటే భాయ్ రేవంత్ రెడ్డి, బడే భాయ్ నరేంద్ర మోదీ ఉన్నారు. పదేళ్ల క్రితం గద్దెనెక్కిన మోదీ భేటి పడావ్ భేటి బచావ్ ఏమైంది. నరేంద్రమోదీ దుర్మార్గ పాలన, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గోదావరి నదిని ఇచ్చంపల్లి నుంచి వేరే రాష్ట్రాలకు తరలించే కుట్ర చేస్తున్నారు. విద్యావంతులు, యువకులు ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్రంలో జీవన్మరణ సమస్య ఏర్పడింది. తెలంగాణను నాశనం చేసే పని మోదీ చేస్తున్నా రేవంత్ ఎందుకు మాట్లాడట్లేదు. తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టాలి అని చెప్తే నేను ఒప్పుకోలేదు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికులను రోడ్డున పడేశారు. గురుకులంలో కరీంనగర్లో బాలిక చనిపోతే రేవంత్ నోరు మెదపడం లేదు. కేంద్రం, రాష్ట్రం మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన, హిందు ముస్లిం గొడవలు లేకుండా శాంతిభద్రతలతో రాష్ట్రాన్ని పరిపాలించాం. కాంగ్రెస్- బీజేపీ రెండు ఒక్కటే అని ముస్లిం సోదరులు గమనించాలి. బీఆర్ఎస్ ఒక్కటే మతసామరస్యం కాపాడుతుంది’ అని కేసీఆర్ అన్నారు. -
సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడను: సీఎం రేవంత్
సాక్షి, భూపాలపల్లి జిల్లా: హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తానెప్పుడూ కేసులకు భయపడనని అన్నారు. అమిత్షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని, అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీభవన్కు పంపించి, తనను అరెస్ట్ చేయాలని ఆదేశించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులే కాదు, సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడనని స్పష్టం చేశారు. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.భూపాలపల్లి జిల్లా రేగొండలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలిగా కడియం కావ్యాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జయశంకర్ ఊరును గత ప్రభుత్వం గ్రామపంచాయతీగా చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే కాషాయ పార్టీ 400 సీట్లు కావాలని అంటోందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపణలు గుప్పించారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. -
బీఆర్ఎస్ గెలిచే ఎంపీ సీట్లు అవే: కేసీఆర్
ఖమ్మం,సాక్షి: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పని గోవిందా అని బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. ఖమ్మంలో సోమవారం(ఏప్రిల్29) రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు.‘తల లేని బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు తెలంగాణ ప్రజల్ని నూకలు తినమన్నాడు. తెలంగాణలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి,ముగ్గురు ఎంపీలు ఉండి వృథా. మోదీ గోదావరి నీళ్లను ఎత్తుకు పోతా అంటుంటే తెలంగాణ బీజేపీ నోరు మెదపడం లేదు. వరిలో పంజాబ్ను తలదన్నే స్థాయిలోకి తెలంగాణను తీసుకెళ్లా. నేను గోదావరిలో మన వాటా ఇచ్చే వరకు చుక్క నీరు తీసుకెళ్లనివ్వనన్నాను.బీఆర్ఎస్ 12 పార్లమెంటు స్థానాలు గెలవబోతోంది. గోదావరి,కృష్ణా జలాలతో పాటు అనేక హక్కులు సాధించడం కోసం బీఆర్ఎస్ అవసరం.ఆమరణ నిరహర దీక్ష చేసిన సమయంలో ఖమ్మం ప్రజలు,న్యూ డెమోక్రసీ నేతలు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.మేం దళారి వ్యవస్థ లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి..అడ్డగోలు హామీలు ఇస్తున్నాడు.దళిత బంధు,రైతు బంధు అడిగితే కాంగ్రెస్ చెప్పుతో కొడతా అంటుంది.నేటి ప్రభుత్వంలో కరెంట్ కోతలున్నాయి.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క.ఉస్మానియా హస్టల్లో కనీస సదుపాయాలు లేకుండా చేశాడు.డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని సీఎం మాట తప్పాడు. భద్రాచలం రామయ్య మీద,యాదాద్రి నర్సన్న మీద ఒట్లు వేయడం తప్ప సీఎం ఏమి చేయడం లేదు. నన్ను రకరకాలుగా దుర్భాషలాడుతున్న ముఖ్యమంత్రి నీ భాష ఇదేనా.జైళ్లకు,తోక మట్టలకు కేసిఆర్ భయపడడు. బీజేపీ వాళ్లే చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తెల్లారి ముఖ్యమంత్రి బీజేపీలోకి జంప్ కొడతాడని అంటున్నారు.వారి మాటలకు రేవంత్ ఖండన ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియదు.పదేళ్లలో ఒక్క ఎకరా ఎండనివ్వలేదు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకు వచ్చాను. ఖమ్మం పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి.దేశం,రాష్ట్రం యువతది.ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా.ఇక్కడి నుంచే పోరాటం మొదలవ్వాలి.గత ప్రభుత్వ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ మెడికల్ కాలేజి వచ్చింది’అని కేసీఆర్ అన్నారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి గుత్తా అమిత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గార్ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్.జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్… pic.twitter.com/4YkyrxJvSy— Telangana Congress (@INCTelangana) April 29, 2024 ఇదిలా ఉండగా, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్.. బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ స్థానం ఆశించారు. భువనగిరి లేదా నల్లగొండ స్థానం ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు.. గుత్తా సుఖేందర్ కూడా త్వరలోనే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని సమాచారం. -
ఈటల గెలుపుపై మల్లారెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై ఆ కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈటల రాజేందర్ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది ఆయన వ్యూహమని తెలిపారు.బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగమవుతున్నారని, ఆయన వ్యాక్యాలు సీరియస్గా తీసుకోవద్దని తెలిపారు. మల్కాజ్గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్కు కూడా తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి,నేషనల్ మీడియాలో ప్రధాని మోదీకి ఓటేయ్యండి అంటూ చెబుతున్నారని విమర్శించారు. త్వరలో రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి వెళతారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు ప్రతి ఇంట్లో కేసీఆర్ను తలుచుకోని రోజు లేదని అన్నారు. అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు. చదవండి: కోమటిరెడ్డి.. మాటలు జాగ్రత్త: కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు‘రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాల సినిమాలు చూపిస్తున్నాడు. దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు. కొండంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు.2014లో బడే బాయ్ బడా మోసం చేశారు. అనేక హామీలు ఇచ్చిన మోదీ ఏవీ చేయలేదు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోదీ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది . మమ్మల్ని 10 నుంచి 12 సీట్లతో గెలిపించండి. కాంగ్రెస్ మెడలు వంచుతాం.కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు. వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు కడియం. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. నేడు నాగర్కర్నూల్కుశనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. -
ప్రజలు కేసీఆర్నే కోరుకుంటున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, తమను ఎవరెంత కించపరచినా కుంగిపోమని చెప్పుకొచ్చారు. ఎన్నో పోరాటాలతో, లక్ష్యంతో తెలంగాణ సిద్ధించిందని గుర్తు చేశారు. కాగా, నేడు బీఆర్ఎస పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కృషి చేశారు. కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని చూశారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ది సాధ్యం అని 2014లో ప్రభుత్వం వచ్చింది. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం పార్టీ, ప్రభుత్వం రెండు పని చేశాయి. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించింది. కానీ, దురదృష్టవశాత్తూ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యం. ఇప్పుడు ప్రజలు మళ్లీ కేసీఆర్నే కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఎవరెంత కించపరిచినా మేము కుంగిపోము. 24ఏళ్లలో మాకు ఇచ్చిన గౌరవం, అభిమానానికి ధన్యవాదాలు. వందల మంది రాష్ర్ట సాధన కోసం ప్రాణాలు వదిలారు. మీ స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాము’ అని వ్యాఖ్యలు చేశారు. -
నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కోడ్ దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని శుక్రవారంపిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలతో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు.జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ భవన్లో కేటీ రామారావు పార్టీ జెండాను శనివారం ఉదయం 9 గంటలకు ఆవిష్కరించనున్నారు. -
ఈటలా.. నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతున్నాయి. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మల్లారెడ్డిలు ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ఈటలను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన వద్దకు వెళ్లి నువ్వే గెలుస్తున్నవన్నా అంటూ చేసిన వైరల్గా మారాయి.ఈటలను అలింగనం చేసుకోవడమే కాక, ఫోటో తీయండయ్య అన్న తోటి అంటూ ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి పట్నం సునితా మహేందర్రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్న తరుణంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం చర్చాంశనీయంగా మారింది. -
హరీశ్రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీశ్రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అంటూ సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హరీశ్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు.. రాజీనామా లేఖ అలా ఉండదు.. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు’’ అని ఎద్దేవా చేశారు.స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు. హరీశ్ తెలివి ప్రదర్శిస్తున్నారు.. ఆయన తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుంది.. హరీశ్..ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ను కచ్చితంగా స్వీకరిస్తున్నాం.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. నీ రాజీనామా రెడీగా పెట్టుకో’’ అంటూ రేవంత్ సవాల్ విసిరారు.రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్ జోకర్ అయ్యాడు:మంత్రి కోమటిరెడ్డిమరోసారి రాజీనామా లేఖ పేరుతో హరీశ్రావు డ్రామాలు చేస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. హరీశ్ బీఆర్ఎస్లో ఉద్యోగి మాత్రమే. ఆగస్టు 15లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశాం. హరీశ్రావుకు పర్సనాలిటీ పెరిగింది కానీ.. బుర్ర మాత్రం పెరగలేదు. నీ దగ్గరకు పని కోసం వస్తే మంత్రిగా ఒక్క పని చేయకలేకపోయావు. రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్రావు జోకర్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి దుయ్యబట్టారు.హరీశ్రావుది దొంగ రాజీనామా. మీరు దొంగ దీక్షలు చేసినట్లు ఇప్పుడు చేస్తే నడవదు.ఇవాళ మళ్లీ మోసం చేయానికి వచ్చిండు.. నువ్వు డ్రామాలు ఆడితే ప్రజలు పట్టించుకోరు.. నువ్వు కేసీఆర్ కింద గులాం గిరి చేయాలి తప్ప నిన్ను ఎవరు పట్టించుకోరు.. 20 ఎండ్ల కింద 76 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దమ్ముంటే మెదక్లో డిపాజిట్ తెచ్చుకో.. బీఆర్ఎస్ పార్టీ జూన్ 4 నుంచి దుకాణం బంద్ అవుతుంది. కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేశారా?. తెలంగాణా వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తా.. లేకుంటే నా మెడ మీద తలకాయ ఉండదు అన్నాడు.. నువ్వు తీసుకోలేదు తలకాయ మమ్మల్ని తీయమంటావా? లేకుంటే దళితులను తీయమంటావా?’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. -
చూస్తూ ఊరుకోం.. యుద్ధం చేస్తాం: కేసీఆర్
సాక్షి,మహబూబ్నగర్: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వమని బతిమాలినా ప్రధాని పట్టించుకోలేదని అందుకు బీజేపీకి ఓటు వేయాలా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. మహబూబ్నగర్లో శుక్రవారం(ఏప్రిల్26) జరిగిన బస్సు యాత్ర రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు. కేెంద్రం నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేసిందని విమర్శించారు. ‘కొత్త రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల బీజేపీ ఇవ్వలేదు. మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ చెప్పినా నేను అంగీకరించలేదు. బడేబాయ్..మోడీ..చోటా భాయ్ రేవంత్ రెడ్డికి ఓటు వేసినా వేస్ట్. రైతుల మోటార్లకు మీటర్లు కచ్చితంగా పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. తెచ్చిన తెలంగాణ కళ్లముందే నాశనం అయితుంటే చూసి ఊర్కోం. యుద్ధం చేస్తాం. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఏకమై ప్రాంతీయపార్టీలను దెబ్బతీయాలని చూస్తున్నాయి.దేవుని పేరు చెప్పి ఒకరు..దేవుని మీద ఒట్టు పెట్టి ఒకరు ఓటు అడుగుతున్నారు. రాష్ట్రంలో రైతుబందు,రైతుబీమా ఉంటుందో లేదో తెలియని అయోమయ పరిస్దితి నెలకొంది. అందరం ఏకమై ప్రభుత్వం మెడలు వంచాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. -
ఆగస్టు 15 డెడ్లైన్.. నేను రాజీనామాకు రెడీ: రేవంత్కు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దీంతో, ఎన్నికల వేళ మరోసారి పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. కాగా, మాజీ మంత్రి హరీష్ సంగారెడ్డిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. అలాగే, సీఎంకి కూడా సవాల్ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి.. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణ మాఫీ చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అలాగే రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయకపోతే.. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?. తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడదాం. నేను చర్చకు వస్తాను. రేవంత్ చర్చకు వచ్చే దమ్ముందా?’ అని కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా.. మీరు రండి అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాంఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చెయ్యి..ఆగస్ట్ 15 లోపు పూర్తిగా ఆరు గ్యారంటీలు అమలు… pic.twitter.com/jUVKakgdYf— Telugu Scribe (@TeluguScribe) April 24, 2024Video Credit: Telugu Scribeఇదే సమయంలో సీఎం రేవంత్కు హరీష్ రావు కౌంటరిచ్చారు. ‘నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. గతంలో కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9 కల్లా అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట తప్పడం, పూటకో పార్టీ మారడం మీ నైజం. 120 రోజులు దాటినా మీ గ్యారెంటీలు ఏమయ్యాయి?. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వలేదు? రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15,000 సహాయం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యానికి రూ.500 బోనస్ ఏది?. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కరెంట్ ఇవ్వడం కూడా కాంగ్రెస్కు చేతకావడం లేదు: కేసీఆర్
మిర్యాలగూడలో రోడ్ షో ముగించుకుని సూర్యాపేట బయలుదేరిన కేసీఆర్మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ: కేసీఆర్మిర్యాలగూడలో కేసీఆర్ ప్రసంగంఅడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీరైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి అంటాడురైతులు చెప్పులు కూడా గట్టిగానే ఉన్నాయని కాంగ్రెస్ నేతలకు చెప్పాతెలంగాణ వచ్చాక పంటలు ఎండాయంటే ఇదే తొలిసారి.కరెంట్ కోతలెందుకు వస్తున్నాయి? ఎక్కడికి పోయింది కరెంట్? ఎందుకు ప్రజలను బాధపెడుతున్నారు.కరెంట్ను ఇవ్వడం కూడా చేతకావడం లేదా?.మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు లేదు? అది మీ చేతకాని తనం కాదా?కేసీఆర్ను తిట్టడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకుంది.ధాన్యం కొనడం లేదని రైతులు చెబుతున్నారు.తప్పకుండా తెలంగాణలో మన రాజ్యమే వస్తది.1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువు కాంగ్రెస్సే.21 ఏళ్ల క్రితం కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశా. నాలుగైదు నెలల క్రితం ధీమాతో ఉన్న రైతులు ఈరోజు బాధతో ఉన్నారు.ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ జిల్లాకు చెందినవారే. వీళ్లంతా కలిసి కృష్ణా నదిని కేఆర్ఎంబీకి పంపించారు.బీఆర్ఎస్ హయాంలో 18 పంటలకు నీళ్లిచ్చాం. రైతు బీమా ఉంటదో ఉండదో తెలవదు.కరెంట్ కనిపించకుండా పోయింది.రైతు బంధు ఐదెకరాలకే అంటున్నారు.ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనడం లేదని రైతులు నాతో అన్నారు. కేంద్రం గతంలో ధాన్యం కొననంటే మెడలు వంచి కొనిచ్చాంకల్యాణ లక్ష్మీ కింద తులం బంగారు ఇస్తామన్నారు. ఇంతవరకు లేదురెండు లక్షల రుణమాఫీ ఏమైంది?పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తే ప్రభుత్వం మెడలు వంచుతాం.కేసీఆర్ను చర్లపల్లి జైలుకు పంపిస్తా అంటున్నారు. వీటికి కేసీఆర్ బయపడతాడా?అంబేడ్కర్ పుణ్యమా అని తెలంగాణ వచ్చింది.125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కడితే. జయంతి ఒక్కరు పోలేదు. మిర్యాలగూడ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రరోడ్ షోలో పాల్గొని రాజీవ్ చౌక్ లో కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్న కేసీఆర్ కాసేపట్లో మిర్యాలగూడకు చేరుకోనున్న కేసీఆర్మిర్యాలగూడ బైపాస్ నుంచి రాజీవ్ గాంధీ కూడలి వరకు ర్యాలీరాజీవ్ గాంధీ కూడలిలో ప్రసంగిచనున్న కేసీఆర్నల్లగొండ జిల్లా: బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్తూ మార్గమధ్యలో నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ వద్ద ఆగిన మాజీ సీఎం కేసీఆర్ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కేసీఆర్తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్రకేసీఆర్ బస్సు వెంట భారీ కార్ల కాన్వాయ్ ర్యాలీమొదటిసారిగా తెలంగాణ భవన్ సౌత్ గేట్ నుంచి కేసీఆర్ బస్సు యాత్రసాక్షి, హైదరాబాద్/నల్గొండ: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్ ర్యాలీ నడుమ బయల్దేరారు. తెలంగాణ భవన్ సౌత్ గేట్ నుంచి ఆయన కాన్వాయ్ బయల్దేరడం విశేషం. సాయంత్రం 4గం. మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. రైతుల కోసం, రాష్ట్రం కోసం 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు. తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్షోలలో పాల్గొంటారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకొని, అక్కడ రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి, అక్కడ కూడా రోడ్షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం భువనగిరికి చేరుకొని, సాయంత్రం రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడే బస చేస్తారు. -
డీజే రాజయ్య
-
ఖబర్దార్ కడియం
-
రాష్ట్రంలో రెండు కాంగ్రెస్లు
జహీరాబాద్: రాష్ట్రంలో రెండు కాంగ్రెస్ పార్టీలు నడుస్తున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఒకటి రాహూల్ గాంధీ కాంగ్రెస్ అయితే, మరొకటి రేవంత్రెడ్డి కాంగ్రెస్గా వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, రేవంత్ ఎజెండా వేరు, రాహుల్ ఎజెండా వేరుగా ఉందన్నారు. గుజరాత్ మోడల్ను పీఎం మోదీ ఎదుట రేవంత్ పొగిడారని, రాహుల్ మాత్రం గుజరాత్ మోడల్ డొల్ల అని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, ఆయన రాజకీయ పునాదులు ఆర్ఎస్ఎస్తో ఉన్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఏ కాంగ్రెస్కైనా మూడో స్థానమే దిక్కు అని హరీశ్ జోస్యం చెప్పారు. కేరళ సీఎం, సీపీఎం నేత పినరయి విజయన్ను రేవంత్ బీజేపీ తొత్తు అని విమర్శించారని, సీపీఎం ఏనాడైనా బీజేపీతో కలుస్తుందా? అని హరీశ్ ప్రశ్నించారు. అబద్ధాల్లో రేవంత్, భట్టి పోటీ అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పోటీ పడుతున్నారని హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన ఈద్మిలాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతిపై ప్రియాంక గాంధీ మాట ఇచ్చారని,, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిందని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క మాత్రం తాము నిరుద్యోగభృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదని నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడారని ఆరోపించారు. తాజాగా రైతుల రుణమాఫీపై భట్టి విక్రమార్క నాలుక మడత పెట్టారని విమర్శించారు. ఇది రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులను ఘోరంగా అవమానించడమేనని విమర్శించారు. ఏపీలో బాబు మాదిరే.. ఇక్కడ కూడా ఆంధ్రలో టీడీపీ, బీజేపీ కలిశాయని, అదే విధానం మేరకు చంద్రబాబు మిత్రుడు ఇక్కడ బీజేపీతో మిలాఖత్ అయ్యారని హరీశ్రావు సీఎం రేవంత్నుద్దేశించి విమర్శించారు. బీజేపీని వ్యతిరేకిస్తూ వచి్చంది బీఆర్ఎస్సేనని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ వచ్చాకే బీజేపీ బలపడుతోందన్నారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తోందని హరీశ్ ఆరోపించారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య
సాక్షి కార్టూన్ 10-05-2024
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
Advertisement