call girl
-
కాల్ గర్ల్గా నటించడం గౌరవంగా ఉందన్న శోభిత (ఫోటోలు)
-
కాల్గర్ల్ను బుక్ చేసుకున్నారు.. చివర్లో ఊహించని ట్విస్ట్, ఏమైందో తెలుసా?
బనశంకరి(బెంగళూరు): బెంగళూరు నగరంలో కాల్గర్ల్ పేరుతో డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు పట్టుకుని కటకటాల వెనుక నెట్టారు. కేసుకు సంబంధించి యువతితో పాటు మొత్తం ఏడుగురిని బేగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 17న అర్ధరాత్రి బన్నేరుఘట్ట రోడ్డు దేవర చిక్కనహళ్లి వద్ద యువతితో మంజునాథ్, రజనీకాంత్ నిలబడ్డారు. ఈ సమయంలో అక్కడికి నాలుగు బైకుల్లో వచ్చిన గ్యాంగ్ కారును డీకొట్టారని మంజునాథ్, రజనీకాంత్తో గొడవకు దిగారు. అనంతరం కొద్దిక్షణాల్లో వచ్చిన మరికొందరు వీరి కారులోనే కిడ్నాప్ చేశారు. కోళిఫారం గేట్ వద్ద మంజునాథ్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ విషయం అలర్ట్ అయిన పోలీసులు సమాచారం ఆధారంగా అపహరణకు గురైన రజనీకాంత్ను కాపాడారు. ప్రముఖ ఆరోపి తిరుమలేశ్తో పాటు నవీన్, కెంపరాజు, ముఖేశ్, మంజునాథ్, దలి్వర్సావుద్, యువతిని అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో యువతి కాల్గర్ల్ అనే విషయం తెలిసింది. కిడ్నాపర్లకు సమాచారం ఇచ్చిన ముఠా యువతి: మంజునాథ్, రజనీకాంత్ యువతిని బుక్ చేశారు. అర్దరాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో కిడ్నాప్నకు గురయ్యారు. యువతి ముందే వీరు ఉన్న స్థలం గురించి కిడ్నాపర్లకు సమాచారం అందించింది. ముగ్గురు కలిసి నిర్జీన ప్రాంతంలో ఉండగా వచ్చిన ముఠా ఇద్దరిని అపహరించారు. మంజునాథ్, రజనీకాంత్ ముందు యువతి కూడా అపహరణకు గురైనట్లు నటించింది. అన్ని అనుకున్న ప్రకారం యువతి, ఆమె గ్యాంగ్ ఇద్దరిని అపహరించారు. కానీ కారు కోళీఫారం గేట్ వద్దకు వెళ్లగానే మంజునాథ్ తప్పించుకుని పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి కిడ్నాప్ విషయం తెలిపాడు. అపహరించిన కిడ్నాపర్లు మండ్య, మైసూరు ద్వారా నంజనగూడుకు వెళ్లారు. రజనీకాంత్ విడుదలకు రూ.5 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కిడ్నాపర్లు అందరిని బేగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి భర్తకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్య.. అసలేం జరిగింది? -
HYD: కాల్ గర్ల్ కోసం వెతికి వెతికి.. అడ్డంగా బుక్కయ్యాడు
క్రైమ్: కాల్గర్ల్ కోసం ఆన్లైన్లో వెతికిన ఓ టెక్కీ.. అడ్డంగా బుక్కయ్యాడు. మాయమాటలకు మోసపోయి.. రెండు లక్షల దాకా సొమ్ము పొగొట్టుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని చందానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే సదరు వ్యక్తి.. డిసెంబరు చివరివారంలో ఆన్లైన్లో ఎస్కార్ట్ సర్వీస్ ద్వారా కాల్గర్ల్ కోసం వెతికాడు. ఓ వెబ్సైట్లో కనిపించిన లింకు క్లిక్ చేయగానే ఒక నెంబర్ దొరికింది. ఆ నెంబర్ ద్వారా వాట్సాప్ ఛాటింగ్ కోసం యత్నించాడు. పటేల్ ఛార్మి పేరుతో పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి.. అమ్మాయిల ఫొటోలు పంపాడు. అయితే.. బుకింగ్ కోసం ముందుగా రూ.510 చెల్లించాలని కోరాడు. ఆ తర్వాత మరో రూ.5,500 పంపాలన్నాడు. మరోసారి మేసేజ్ చేసి.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7,800 పంపమన్నాడు. కక్కుర్తితో సదరు ఐటీ ఉద్యోగి కూడా వివిధ సందర్భాల్లో డబ్బులు పంపుతూ పోయాడు. అలా.. మొత్తం రూ.1.97 లక్షలు పంపినట్లు చెబుతున్నాడు. చివరకు.. అంతా మోసం అని గుర్తించి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి స్కామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. -
కాల్గర్ల్ అంటూ ఇంటర్నెట్ లో ప్రచారం
► చిత్రహింసకు సిద్ధంగా ఉండు! ► ఇంటర్నెట్లో కాల్గర్ల్గా ప్రచారం ► ఘరానా వ్యక్తి కోసం పోలీసుల గాలింపు సాక్షి, బెంగళూరు : తనతో వివాహానికి అంగీకరించలేదనే అక్కసుతో ఒక దంతవైద్యురాలి సెల్ఫోన్ నెంబరును కాల్గర్ల్ అంటూ ఇంటర్నెట్లో పెట్టాడో ప్రబుద్ధుడు. వరుసగా అసభ్య కాల్స్ రావడంతో బాధితురాలు బెంబేలెత్తిపోయింది. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దంతవైద్యురాలిగా పని చేస్తున్న మహిళ గతంలో మనస్పర్ధల కారణంతో భర్త నుంచి విడిపోయింది. తరువాత మరో సంబంధం కోసం మ్యాట్రిమోని వెబ్సైట్లో తన ఫోటో, మొబైల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలో రాంకీ (పేరు మార్చాం) అనే వ్యక్తి మ్యాట్రిమోనీ ద్వారా పరియమయ్యాడు. దీంతో వైద్యురాలు రాంకీ వివరాల గురించి ఆరా తీయగా తగిన సంబంధం కాకపోవడంతో వైద్యురాలి తల్లితండ్రులు అతనితో వివాహానికి ఒప్పుకోలేదు. అయితే కొద్ది రోజుల అనంతరం అతడు బాధితురాలికి ఫోన్ చేసి వివాహం గురించి ప్రస్తావన తేగా తమ తల్లితండ్రులు అంగీకరించలేదని వివాహం కుదరదంటూ తెలిపింది. అంతటితో ఊరుకోని దుండగుడు తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి చేశాడు. ఇలాంటి పిచ్చి వాగుడు కట్టిపెట్టాలని ఆమె వారించి, మరోసారి తనకు ఫోన్లు చేయవద్దని, లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఫోన్ చేసి మరీ... దీంతో కొద్ది రోజుల పాటు ఊరికే ఉన్న రాంకీ జనవరి మొదటి వారంలో గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి హింసను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలంటూ చెప్పి ఫోన్ కట్ చేశాడు. మరుసటి రోజు నుంచి వివిధ రకాల నంబర్ల నుంచి అనేక మంది వ్యక్తులు ఆమెకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకిలా ఫోన్ చేస్తున్నారంటూ బాధితురాలు వారిని ప్రశ్నించగా కాల్గర్ల్ నంబర్ అంటూ ఒక వ్యక్తి నంబర్ ఇచ్చాడని తెలిపారు. మరి కొంతమంది తమకు ఇంటర్నెట్లో నంబర్ లభించిందంటూ తెలిపారు. ఎందుకిలా జరిగిందో బాధితురాలు ఆలోచించగా రాంకీఐ అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం విభాగం దర్యాప్తును ప్రారంభించింది. -
‘కాల్ గర్ల్’గా మారిన తెలుగు హీరోయిన్!
‘నచ్చావులే’ సినిమాతో తెలుగువారిని పలుకరించిన హీరోయిన్ మాధవీలత. ఆ తర్వాత అడపాదడప సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు షార్ట్ ఫిలింస్ పై దృష్టి పెట్టింది. త్వరలో రానున్న ‘ఆన్ మోనాస్ బర్త్ డే’ షార్ట్ ఫిలింలో ఆమె ‘కాల్ గర్ల్’ పాత్ర పోషించనుంది. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం టీజర్ ను తాజాగా యూట్యూబ్ లో విడుదల చేశారు. అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్రదేశంలో నడుచుకుంటూ వస్తున్న మాధవీలతను ఇందులో చూపించారు. మరో సీన్ లో కారులో చిన్నారితో మాట్లాడుతూ ఆమె కనిపించారు. ఆమె, ఆమె ఏడేళ్ల కొడుకు ఇతివృత్తంగా ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కినట్టు చిత్రవర్గాలు తెలిపాయి. గ్రిప్పింగ్ ప్లాట్ తో తెరకెక్కినట్టు కనిపిస్తున్న ఈ షార్ట్ ఫిలిం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇందులో తన పాత్ర గురించి అడుగగా.. ‘కాల్ గర్ల్’ పాత్ర పోషించడం సవాల్ తో కూడుకున్నదని, అందుకే తాను ఈ పాత్రకు ఒప్పుకున్నానని మాధవీలత తెలిపింది. అయితే, ప్రస్తుతం పెద్దగా తన చేతిలో సినిమా ఆఫర్లు లేకపోవడంతోనే ఆమె షార్ట్ ఫిలింలో నటించడానికి ఒప్పుకున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తోంది. -
స్వర్గసుఖాలను చూపిస్తానని నిలువుదోపిడీ..
బెంగళూరు: హైదరాబాద్కు చెందిన ఓ ‘కాల్గర్ల్’ బెంగళూరులో తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడిని బురిడీ కొట్టించింది. స్వర్గసుఖాలను చూపిస్తానని చెప్పి అతన్ని నిలువుదోపిడీ చేసింది. బాధితుడి స్నేహితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సదరు నాయకుడితో పాటు అతని స్నేహితుడు కూడా పోలీసులకు అందుబాటులో లేక పోవడం గమనార్హం. వివరాలు...తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడొకరు వ్యాపార సంబంధ పనుల పై ఈనెల 25న బెంగళూరుకు వచ్చారు. చామరాజనగర్కు చెందిన రిత్విక్ శెట్టి సదరు నాయకుడికి బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్ట్రోడ్లో ఉన్న ఓ ఫైవ్స్టార్ హోటల్లో రాజా పేరుతో రూమ్ బుక్ చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ కాస్ట్లీ కాల్గర్ల్ను కూడా విమానంలో రప్పించి ఆయన చెంతకు చేర్చారు. సదరు కాల్గర్ల్ తన దగ్గరకు వెచ్చిన వెంటనే ‘తమిళనాడు నాయకుడు’ హోటల్లోని తన రూంకు తీసుకువెళ్లారు. కొద్ది సేపటి తర్వాత మద్యం తీసుకురావడానికి సదరు నాయకుడు హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చారు. ఇరవై నిమిషాల తర్వాత మద్యం తీసుకుని రూమ్కు వెళితే అక్కడ హైదరాబాద్కు చెందిన కాల్గర్ల్తో పాటు టేబుల్ పై ఉంచిన బంగారు గొలుసు, నగదు, ఐపాడ్ కనిపించలేదు. పరిస్థితిని తన స్నేహితుడైన రిత్విక్శెట్టికి ఫోన్లో చెప్పి స్వస్థలానికి వెళ్లిపోయారు. దీంతో రిత్విక్శెట్టి స్థానిక జీవన్ బీమా నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిత్విక్ ఫోన్లో ఉన్న నంబర్లను అనుసరించి సదరు కాల్గర్ల్ హైదరాబాద్కు చెందిన యువతిగా గుర్తించారు. ఆ యువతి పై ఇప్పటికే ఇలాంటి మూడు కేసులు హైదరాబాద్లోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైనట్లు తెలుసుకున్నారు. అంతేకాకుండా హోటల్లోని వీడియో ఫుటేజీలను అనుసరించి సదరు యువతి బెంగళూరులో సదరు నాయకుడితోపాటు అతని రూమ్లోకి వెళ్లినట్లు నిర్థారణకు వచ్చారు. మరింత సమాచారం కోసం రిత్విక్కు, సదరు నాయకుడికి ఫోన్ చేస్తుంటే స్విచ్ఆఫ్ అని సమాధానం వస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క కాల్తో.. కోరినమ్మాయి మీ ముందుకు..!!