on chandrababu
-
చేనేతను విస్మరించిన చంద్రబాబు
ధర్మవరం: చేనేత రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. సంక్షోభంలో ఉన్న చేనేతరంగాన్ని ఆదుకోవడానికి ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చేనేత ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలని కోరుతూ ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలు మూడోరోజు బుధవారం కూడా కొనసాగాయి. దీక్షలకు మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో కలసి శంకరనారాయణ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ వ్యవసాయం తరువాత అత్యధికమందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ముడిపట్టు రాయితీ, ఎన్హెచ్డీసీ, ఆరోగ్య బీమా తదితర సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి చేనేతలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు మగ్గం షెడ్లు నిర్మించి ఇస్తామని, చేనేత వస్త్రాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. చేనేత కార్మికులకు ఇస్తున్న ముడిపట్టు రాయితీని రూ.600 నుంచి రూ.1,000 పెంచుతున్నట్లు చేనేత దినోత్సవం రోజున ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారన్నారు. ఆరు నెలలు రూ.1000 చొప్పున రాయితీ ఇచ్చి.. ఆ తరువాత పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే చేనేత కార్మికులతో జిల్లా కేంద్రంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రిలేదీక్షల్లో 22వ వార్డు ఇన్చార్జ్ కత్తే పెద్దన్న, మహబూబ్బాషా, శ్రీరామిరెడ్డి, శ్రీనివాసులు, మహమ్మద్రఫి, మధుసూదన్రెడ్డి, దస్తగిరి, చౌడయ్య, బయన్న, రాజా, పెద్దిరెడ్డి, భాస్కర్రెడ్డి, వీరేష్, బాబు, నరేష్, లోకేష్, అమీర్బాషా, ప్రభాకర్రెడ్డి, అక్కులప్ప, శీనా, నారాయణస్వామి, గోపాల్, నారాయణస్వామి, బాబు, పెద్దనాయుడు, నాగరాజు, గంగ, అమరనాథ, జిక్రియ, చంద్ర, లక్ష్మినారాయణ, హుస్సేన్, నాగరాజు, దాసు, లక్ష్మినారాయణ, శ్రీరాములు, గోపినాథ్, శివ, జగన్, పెద్ద చౌడయ్యలు కూర్చున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షులు గడ్డం కుళ్లాయప్ప, కౌన్సిలర్ చందమూరి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో కరువు వెంటాడుతోంది
- రైతు సమస్యలపై మేలో భారీ నిరసన - చేతకాని అసమర్థుడు పల్లె - దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ధ్వజం పుట్టపర్తి అర్బన్ : చంద్రబాబు పదవి చేపట్టిన నాటి నుంచి కరువు వెంటాడుతోందని పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ధ్వజమెత్తారు. పుట్టపర్తి సాయి ఆరామంలో శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటి పంటలు పండక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. ఉపాధి పనులు లేకపోవడంతో కూలీలు, రైతులు వలసబాట పట్టారన్నారు. రెయిన్ గన్లతో పంటలు రక్షిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు ప్రజాధనం వృథా చేశారన్నారు. కేవలం పార్టీ నాయకులను బతికించడానికి నీరు చెట్టు పనులు చేయించి కమీషన్లు పొందుతున్నారన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే పల్లె మంత్రి పదవి ఉన్నంత కాలం పుట్టపర్తి గురించి పట్టించుకోని అసమర్థుడన్నారు. అనంతలో 13 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నా అభివృద్ధిని విస్మరించారన్నారు. సీఎం కేవలం ఎయిర్పోర్టు కోసమే పుట్టపర్తిని వినియోగించుకుంటున్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వాలని ఒక్కరైనా సీఎంను అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజల సమస్యలు పరిష్కారం కోరుతూ మే మూడో వారంలో వేలాది మందితో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ధర్నాకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో పంటలు పూర్తిగా ఎండిపోవడంతో ప్రభుత్వం బీమా, ఇన్పుట్ సబ్సిడీ రెండూ ఇవ్వాలన్నారు. ఏ ఒక్కటి ఇవ్వకున్నా పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టి బీమా కంపెనీపై కోర్టుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ, పుట్టపర్తి మండల, పట్టణ, ఓడీసీ, కన్వీనర్లు గంగాద్రి, మాధవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు లోచర్ల విజయభాస్కర్రెడ్డి, కేశవరెడ్డి, మాధవప్ప, ఈశ్వరరెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు ఏవీ.రమణారెడ్డి, నరసారెడ్డి, కౌన్సిలర్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్లు తిప్పారెడ్డి, చిత్తరంజన్రెడ్డి, చెన్నకృష్ణ, రామ్మోహన్, బీడుపల్లి శ్రీధర్రెడ్డి, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పట్టిసీమపై ఉన్న ధ్యాస పోలవరంపై లేదు : వైఎస్ జగన్