Chief Minister meeting
-
కోర్ క్యాపిటల్ శంకుస్థాపన సభకు వచ్చి.. అష్టకష్టాలు
-
సభకు వచ్చి.. వర్షంతో అష్టకష్టాలు
-
సభకు వచ్చి.. వర్షంతో అష్టకష్టాలు
కోర్ క్యాపిటల్కు శంకుస్థాపన అంటూ లింగాయపాలెంలో ఆర్భాటంగా నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఆ తర్వాత అష్టకష్టాల పాలయ్యారు. సరిగ్గా సభ ముగిసే సమయానికి ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షం కురిసింది. వర్షం కారణంగా ఆ ప్రాంతం మొత్తం బురదగా మారడంతో అక్కడకు వచ్చిన వాహనాలన్నీ బురదలో ఇరుక్కుపోయాయి. వాహనాలను తీయడానికి వీలు కాలేదు. ముఖ్యమంత్రి సభ ముగిసి, వీఐపీలు అందరూ అక్కడినుంచి వెళ్లగానే తాము తీసుకొచ్చిన జనాన్ని ఎమ్మెల్యేలు, అధికారులు ఎక్కడికక్కడే వదిలేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థినులను అక్కడకు తరలించారు. దాంతో ఇళ్లకు ఎలా వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో వేలాది మంది డ్వాక్రా మహిళలు అక్కడే చిక్కుకుపోయారు. వాళ్లను తిరిగి వాళ్ల స్వగ్రామాలకు చేర్చడానికి కనీసం అక్కడినుంచి బస్సులు కూడా ఏర్పాటుచేయకపోవడంతో.. నడిరోడ్డుపై మహిళలు నానా ఇబ్బందులు పడ్డారు. స్కూలు పిల్లలు, మహిళలు సమీపంలో ఉన్న చెట్ల వద్దకు వెళ్లి వాటికింద తలదాచుకున్నారు. ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో కొంతమంది కన్నీరు మున్నీరయ్యారు. స్కూలు పిల్లల వరకు అయితే వర్షాన్ని ఆస్వాదించారు గానీ.. పెద్దవాళ్లు ఇబ్బందులు పడ్డారు. రాత్రి ఏడు గంటల సమయంలో కూడా చాలామంది మహిళలు అక్కడే చిక్కుకుపోయారు. -
కరువుపై ఏం చేద్దాం?
నేడు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు, మండుతున్న ఎండలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్లో సదస్సు నిర్వహించనున్నారు. ప్రధానంగా ఏడు అంశాలతో ఈ సమావేశం ఎజెండాను ఖరారు చేశారు. వడగాడ్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, వాతావరణ పరిస్థితులు-వ్యవసాయ సంబంధిత అంశాలు, తాగునీటి సరఫరా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖకు సంబంధించిన అంశాలు ఇందులో చర్చించనున్నారు. ఖమ్మం మినహా తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ, డెయిరీ డెవలప్మెంట్, విపత్తుల నిర్వహణ శాఖ, వాతావరణ శాఖ అధికారులు ఇందులో పాల్గొననున్నారు. వడదెబ్బ మృతులకు ఏపీ ప్రభుత్వం గత ఏడాది నుంచే రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం పెంపు.. చెల్లింపులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కరువుతో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదు. పెట్టుబడి సాయంగా ఇచ్చే పరిహారం పంపిణీకి రూ.989 కోట్ల నిధులు కావాలి. కానీ కేంద్రం కేవలం రూ.791 కోట్లు విడుదల చేసింది. దీంతో సరిపడేన్ని నిధులు లేకపోవటంతో ఈ ఫైలు ముందుకు కదలడం లేదు. రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపైనా సమావేశంలో చర్చించనున్నారు.