coal case
-
మన్మోహన్ సింగ్ను విచారించాలి: దాసరి
-
మన్మోహన్ సింగ్ను విచారించాలి: దాసరి
న్యూఢిల్లీ : జిందాల్ గ్రూప్నకు బొగ్గు గనులను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగే కేటాయించారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ...కోల్ గేట్ స్కాంకు సంబంధించి సీబీఐ కోర్టులో లిఖితపూర్వకంగా సోమవారం అఫిడవిట్ దాఖలు చేశారు. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ను నిందితుడిగా చేర్చాలంటూ మధుకోడా చేసిన వాదనను దాసరి నారాయణరావు కూడా సమర్థించారు. బొగ్గు కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, జిందాల్ గ్రూపునకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులు మన్మోహన్ సింగ్ చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మన్మోహన్ను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని దాసరి పేర్కొన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ మాజీ ఎంపీ అయిన దాసరి నారాయణరావు 2006-09 మధ్యకాలంలో మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో బొగ్గు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే జిందాల్ తప్పుడు సమాచారం ఇచ్చి గనులు దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. 2008లో జార్ఖండ్లోని బీర్భూమ్లో అమరకొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాకును జేఎస్పీఎల్, గగన్ స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీలకు కేటాయించారు. కాగా కోల్ గేట్ స్కాంలో దాసరి నారాయణరావుతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దాసరితో పాటు 14 మందికి కూడా బెయిల్ మంజూరు అయింది. -
ఆయనకు సమన్లు జారీ చేయండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు సమన్లు జారీ చేయాలని జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా ఓ పిటిషన్ లో కోరుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మన్మోహన్సింగ్ సహా, మరో ఇద్దరికి సమన్లు జారీ చేయాలని మధుకోడా తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 28 న జరగనుంది. బొగ్గ క్షేత్రాల అక్రమ కేటాయింపుల కేసులో కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్, మధు కోడా, కేంద్ర మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావు, మాజీ కోల్ సెక్రటరీ హెచ్సీ గుప్తా తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై చార్జ్షీట్ కూడా నమోదైంది. అయితే మధుకోడా సహా 8 మంది నిందితులకు ప్రత్యేకకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరుచేసింది. ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాక్ల కేటాయింపులో మధుకోడా సహా, మిగిలిన నిందితులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని కోర్టు పేర్కొంది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మన్మోహన్ సింగ్ తన అభిప్రాయాలను కోర్టు ముందుంచిన సంగతి తెలిసిందే. -
దాసరిపై చార్జిషీటు
-
దాసరిపై చార్జిషీటు
బొగ్గు కుంభకోణంలో అభియోగాలు నమోదు చేసిన సీబీఐ నవీన్ జిందాల్, మధుకోడాలపై కూడా న్యూఢిల్లీ: అమరకొండ ముర్గదాంగల్ బొగ్గు బ్లాకు కేటాయింపు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావుపై సీబీఐ బుధవారం అభియోగాలు నమోదు చేసింది. వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సహా మొత్తం పది మందిపై, ఐదు సంస్థలపై చార్జిషీటు దాఖలైంది. జార్ఖండ్లోని బీర్భుమ్ జిల్లాలో ఉన్న అమరకొండ ముర్గదాంగల్ బొగ్గు బ్లాకును 2008లో దాసరి బొగ్గుశాఖ సహాయమంత్రిగా ఉండగా జిందాల్ గ్రూపునకు చెందిన జేఎస్పీఎల్, జీఎస్ఐపీఎల్లకు కేటాయించారు. ఈ కేటాయింపులో అవకతవకలు జరిగాయని, జార్ఖండ్ ప్రభుత్వం ఇతర సంస్థలను తప్పించి జిందాల్ సంస్థల పేర్లను మాత్రమే సిఫారసు చేసిందని సీబీఐ అభియోగపత్రంలో ఆరోపించింది. జేఎస్పీఎల్, జీఎస్ఐపీఎల్ సంస్థలకు వెయ్యి మెగావాట్ల చొప్పున విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడానికి క్యాప్టివ్ మైనింగ్ కింద ఈ కేటాయింపులు జరిగాయి. ఇలాంటి ప్లాంట్లను నెలకొల్పడానికి తమ సంసిద్ధత, గతంలో తమకు జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల విషయంలో జిందాల్ గ్రూపు వాస్తవాలను దాచిందని సీబీఐ ఆరోపించింది. కేంద్ర విద్యుత్ శాఖ వ్యతిరేకించినా కేటాయింపులు జరిగాయని పేర్కొంది. కేటాయింపులపై నిర్ణయం తీసుకొనే ‘స్క్రీనింగ్ కమిటీ’ని ప్రభావితం చేసేందుకే బొగ్గుశాఖ సహాయమంత్రి హోదాలో దాసరి జిందాల్ గ్రూపు సంస్థలకు అనుకూలంగా లేఖ రాశారని పేర్కొంది. 120-బి (నేరపూరిత కుట్ర), 420 (చీటింగ్), అవినీతి నిరోధక చట్టంలోని ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఈ చార్జిషీటు విచారణార్హత గురువారం నిర్ణయం తీసుకుంటానని సీబీఐ కోర్టు జడ్జి భరత్ పరాశర్ చెప్పారు. కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా, జ్ఞాన స్వరూప్ గార్గ్, సురేష్ సింఘాల్, రాజీవ్ జైన్, గిరీష్కుమార్ సునేజా, ఆర్.కె.సరాఫ్, కె.రామక్రిష్ణ ప్రసాద్లపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే జిందాల్ సంస్థలతో పాటు దాసరికి చెందిన సౌభాగ్య మీడియాపై కూడా చార్జిషీటు దాఖలైంది.