Dalit rights
-
బీజేపీ దళిత వ్యతిరేకి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్లో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడం పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తంచేశారు. దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడే బాధ్యత కలిగిన కమిషన్లో ఖాళీలను భర్తీ చేయకపోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండు కీలక పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటే అధికార బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. దళితుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని గుర్తుచేశారు. కమిషన్ను ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చడం రాజ్యాంగంపై, దళితుల సామాజిక హక్కులపై ప్రత్యక్షంగా దాడి చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలని, కమిషన్లో ఖాళీలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ అచేతనంగా మిగిలిపోతే దళితులు సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదులపై ఎవరు స్పందించారని ప్రశ్నించారు. -
ప్రణయ్ హత్య కేసు నిందితులు బెయిల్పై విడుదల
వరంగల్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్కుమార్, ఖరీం ఆదివారం బెయిల్పై విడుదలయ్యారు. వీరికి హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా నిందితుల బంధువులు ఆ ఉత్తర్వులను శనివారం రాత్రి తీసుకురావడంతో విడుదల ఆదివారానికి వాయిదా పడింది. ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు 8.20 గంటలకు మారుతీరావు, శ్రవణ్కుమార్, ఖరీంలను విడుదల చేశారు. ఈ ముగ్గురిపై గత ఏడాది సెప్టెంబర్ 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముగ్గురు వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం వీరు రెండు నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్ మంజూరు చేయద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్లు కోర్టుకు విన్నవించడంతో బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఆ తర్వాత తిరిగి బెయిల్ కోరుతూ నిందితులు ముగ్గురూ ఇటీవల హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ముగ్గురిని విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఎన్.మురళీబాబు తెలిపారు. విడుదలైన వెంటనే నిందితులు రెండు వాహనాల్లో తమ బంధువులతో కలసి వెళ్లిపోయారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలి అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య డిమాండ్ చేసింది. తన కుమార్తె అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ప్రణయ్ను హత్య చేయించిన మారుతీరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని సమాఖ్య అధ్యక్షుడు ఆనందరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల ప్రభుత్వం ప్రణయ్ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి ఎలాంటిహాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
దళితులపై దాడులను నియంత్రించండి..
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున డీజీపీకి వినతి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలోను, దళితుల హక్కులను కాపాడే చట్టాలను అమలు చేయడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డీజీపీ నండూరి సాంబశివరావును శుక్రవారం కలిసి రాష్ట్రంలో దళితులపైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత ప్రజా ప్రతినిధులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని, దళితులకు రక్షణ కల్పించాలని నాగార్జున వినతిపత్రం సమర్పించారు. -
కోటా విధానం మారదు
ప్రధాని మోదీ స్పష్టీకరణ ♦ దళితుల హక్కును ఎవరూ లాగేసుకోలేరు ♦ గిట్టనివారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ♦ అంబేడ్కర్ పీడితవర్గాల గొంతుక, ఆయన విశ్వమానవుడు న్యూఢిల్లీ: దళితుల, బడుగు వర్గాల రిజర్వేషన్ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. వారి హక్కును ఎవరూ లాగేసుకోలేరన్నారు. దీనిపై గిట్టనివారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్లవారి హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్కింగ్తో రా జ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ను పోల్చా రు. మోదీ సోమవారమిక్కడ అంబేడ్కర్ జాతీయ స్మారక నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అనంతరం స్మారక ఉపన్యాసం చేశారు. ‘మేం అధికారంలో ఉన్నంత వరకు దళితులు, బడుగువర్గాల రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పూ వాటిల్లదు. అయితే రాజకీయాలు చేసే వారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆరోపించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడూ కోటాను రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణాలను బీజేపీ చాలా ఏళ్లు పాలించినా కోటాకు కోత వేయలేదన్నారు. తానిదివరకే చెప్పినట్లు.. అంబేడ్కరే మళ్లీ వచ్చినా మీ హక్కును లాగేసుకోలేరని చెప్పారు. దేశంలో అంబేడ్కర్ స్మారకాన్ని నిర్మించడానికి 60 ఏళ్లు ఎందుకు పట్టింద న్నారు. ఆస్తిలోనూ, ఇతర చాలా అంశాల్లోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన హిందూ కోడ్ బిల్లుకు మద్దతు లేకపోవడంతో నెహ్రూ కేబినెట్లో న్యాయ మంత్రిగా ఉన్న అంబేడ్కర్పదవికి రాజీనామా చేశారన్నారు. ఇది ప్రజలకు తెలియకుండా వక్రీకరించారన్నారు. మహిళలకు సమాన హక్కులేనప్పుడు తాను మంత్రివర్గంలో ఉండలేనని చెప్పారని, దీంతో ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. అంబేడ్కర్ను దళితులపాలిట క్రీస్తు అని మాత్రమే చెబితే అది అన్యాయమే అవుతుందని, ఆయన అన్నిరకాల పీడిత వర్గాల గొంతుకగా ఉన్నారని, ఆయన విశ్వమానవుడు అని పేర్కొ న్నారు. దేశ సముద్రమార్గ బలంపై అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగానే పార్లమెంటులో జలమార్గాల బిల్లును ప్రవేశపెట్టామన్నారు. 2014లో కాంగ్రెస్ ఓటమిని ప్రస్తావిస్తూ... ‘మేమిక్కడ ఉండటం వారికి ఇష్టం లేదు. మ మ్మల్ని ఇక్కడ చూస్తే వారికి జ్వరం వస్తుంది. నియంత్రణ కోల్పోతారు.అబద్ధాలు చెబుతారు’ అని అన్నారు. ఇప్పటిదాకా ఆరుసార్లు అంబేడ్కర్ స్మారకోన్యాసం నిర్వహిస్తే ప్రధాని ప్రసంగించడం ఇదే మొదటిసారన్నారు. అంబేడ్కర్కు అన్యాయం అంబేడ్కర్కు ఎంతటి అన్యాయం జరిగిందో, అది ఎవరు చేశారో అందరికీ తెలుసని మోదీ అన్నారు. ‘ముంబైలోని ఇందు మిల్లుపై నిర్ణయాన్ని గత ప్రభుత్వాలు ఇంతకాలం ఎందుకు పెండింగ్లో పెట్టాయి. లండన్లో ఆయన నివసించిన ప్రాంతం విషయంలోనూ అదే జరిగింది. ఇన్నాళ్లు వారేం చేయకపోగా మమ్మల్నే నిందిస్తున్నారు. మా తర్వాత అధికారంలోకి వచ్చే వారి మనసుల్లో అంబేడ్కర్ ఉండరు. అందుకే అలీపూర్ రోడ్డులో అంబేడ్కర్ నివసించిన ఇంటిని స్మారకంగా నిర్మించే కార్యాన్ని 2018 మార్చి నాటికల్లా పూర్తిచేస్తాం’ అని అన్నారు. 2018, ఏప్రిల్ 14న ఈ స్మారకాన్ని తానే ప్రారంభిస్తానని మోదీ చెప్పగా, సభికులు భారత్ మాతా కీ జై అని నినదించారు. ఈ భవనం ఢిల్లీలో విశిష్టంగా నిలిచిపోతుందని, ప్రపంచంలోనూ ఒక ఐకాన్గా నిలుస్తుందన్నారు. దళితుల మాదిరే అగ్రకులాల వారిని కూడా అంబేడ్కర్ తనవారిగానే భావించారన్నారు.