damaged crops
-
త్వరలో పంటల పరిశీలనకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. సాగునీరు అందక భూగర్భ జలవనరులు కూడా అడుగంటిన పరిస్థితిలో రైతులతో ప్రత్యక్షంగా భేటీ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్య టనలో భాగంగా భువనగిరి, ఆలేరు నియోజక వర్గాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులతో భేటీ అవుతారు. ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ పర్యటన ఉంటుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులకు సూచనప్రా యంగా చెప్పారు. అత్యధికంగా బోర్లు వేసి నష్టపో యిన ముషంపల్లి నుంచి ఈ పర్యటన ప్రారంభమయ్యేలా కేసీఆర్ పర్యటన షెడ్యూలు ఉండే అవకాశముంది. కేసీఆర్ పర్యటన షెడ్యూ ల్తోపాటు రూట్మ్యాప్ ఖరారు చేసే బాధ్యతను జగదీశ్రెడ్డికి అప్పగించారు. మొదలైన లోక్సభ నియోజకవర్గ భేటీలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా మంగళవారం భేటీలు ప్రారంభమయ్యాయి. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో సోమవారం రాత్రి మాజీ మంత్రి హరీశ్రావు నివాసంలో కీలక భేటీ జరగ్గా, మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. నల్లగొండ నియోజకవర్గ నేతల సమన్వయ భేటీ కూడా జగదీశ్రెడ్డి నివాసంలో మంగళవారం రాత్రి జరిగింది. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్లో భేటీ జరగనుంది. ఈ భేటీకి కేటీఆర్ హాజరవుతారు. ఇదిలాఉంటే మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి తదితర లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనూ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. -
అకాల వర్షాలు..రైతుల ఆవేదన
-
నకిలీ విత్తన మాఫియా స్వైరవిహారం
• నియంత్రించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది • వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శ • పలు చోట్ల పంటల పరిశీలన.. రైతులకు ఓదార్పు దుగ్గొండి : రాష్ట్రంలో నకిలీ విత్తన మాఫియా స్వైర విహారం చేస్తుందని, దానిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుపాను కారణంగా నేలపాలైందని, చేతికి వస్తుందనుకున్న మిరప పంట నకిలీ విత్తనాలతో నట్టేట ముంచిందన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మొక్కజొన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. స్థానిక రైతులు ఎరుకల రాజమ్మ, గోలి నాగరాజు, అనుముల రాజిరెడ్డి, పెండ్లి శ్రీను పంటలను పరిశీలించి శ్రీకాంత్రెడ్డి చలించిపోయారు. ఎంత పెట్టుబడి పెట్టారు.. వ్యవసాయ అధికారులు ఎవరైనా వచ్చారా.. ప్రభుత్వం నుంచి పరిహారం ఏమైనా అందిందా.. అని అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టామని, వ్యవసాయాధికారులు ఎవరూ కూడా పంట చూడటానికి రాలేదని వారు వివరించారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంట పాడై పోయిన విధానాన్ని వివరిస్తూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరూ అధైర్య పడవద్దని, రైతాంగానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అన్నదాతలు ఏ పంట చేను వద్ద చూసినా నాటి మహానేత వైఎస్సార్నే గుర్తుచేస్తున్నారని చెప్పారు. పంట పోయిన వెంటనే పంట నష్టపరిహారం చెల్లించడం, విత్తనాలను తక్కువ ధరకు అందించిన విధానాన్ని తెలియజేస్తున్నారన్నారు. నాటి వైఎస్ పాలనలో వ్యవసాయం పండుగగా మారితే ఆతర్వాత వచ్చిన పాలకులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. పంట బాగుంటేనే రైతు పండుగ చేసుకుంటాడని రైతు ఏడుస్తున్న సమయంలో బతుకమ్మ పండుగ వచ్చినా రైతుల్లో ఆ వాతావరణం లేదన్నారు. ప్రభుత్వం మాత్రం జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ప్రారంభం అదరాలని చెప్పడం బాధాకరమన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాంత్రెడ్డి వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, రాష్ట్ర , జిల్లా నాయకులు శివకుమార్, భూపాల్రెడ్డి, జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, చల్ల అమరేందర్రెడ్డి, దొంతి కమలాకర్రెడ్డి, బోయిని రాజిరెడ్డి, మండల నాయకులు నునావత్ రమేష్, పుట్టపాక రాజేందర్, ఇజ్జిగిరి కోటిలింగం, కట్టయ్య ఉన్నారు. -
హెలెన్ తుపాను బాధితులకు జగన్ పరామర్శ
-
గోదావరి జిల్లాల్లో హెలెన్ తుపాను బాధితులకు జగన్ పరామర్శ
తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి తోటలు, పంట పొలాలను పరిశీలించి, బాధిత రైతులను జగన్ రామర్శిస్తున్నారు. -
నేలకొరిగిన వరి పంటలను పరిశీలించిన జగన్
అమలాపురం: తుపాను, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఈరోజు జగన్ పర్యటిస్తున్నారు. తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి తోటలు, పంట పొలాలను పరిశీలించి, బాధిత రైతులను జగన్ పరామర్శిస్తున్నారు. అవిడి, ఎన్ చిన్నపాలెం గ్రామాలలో నేలకొరిగిన వరి పంటలను పరిశీలించారు. తుపాను, అకాలవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కళ్యాణి జగన్ను కోరారు. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేతలు అమలాపురం వద్ద జగన్ను కలిశారు. -
లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు