Dubbing movies
-
Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ
స్ట్రయిట్ చిత్రాలు 236... డబ్బింగ్ సినిమాలు 70... మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్కి దక్కడం మరో ఆనందం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్ హిట్.. మోర్ ఫట్గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి... స్టార్ హీరోలు కొందరు ‘హిట్ హిట్ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్ రేంజ్, చిన్న రేంజ్ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్ కేసరి’తోనూ మరో హిట్ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఈ ఏడాది ఓ హిట్.. ఓ ఫట్ పడ్డాయి. ‘సలార్: సీజ్ఫైర్’తో ప్రభాస్కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్ మూవీ ‘దసరా’ బ్లాక్బస్టర్గా నిలిచింది. అలాగే శౌర్యువ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ ‘హాయ్ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్ లవ్స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ హిట్తో జోష్గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్గా కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‡హిట్గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్లో సక్సెస్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్రామ్ ‘డెవిల్’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రయిట్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’, పాయల్ రాజ్పుత్ ‘మంగళవారం’, నవీన్ చంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ల ‘మ్యాడ్’, తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్ సెల్వన్ 2’, విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్ ‘2018’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. ఫట్ అయిన ఆ చిత్రాల గురించి.. ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపోందింది. హీరో రామ్–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్లో కొత్త చాప్టర్ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపోందిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవ్ మోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్ ‘రామబాణం’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, నిఖిల్ ‘స్పై’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, సుధీర్ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
ఇయర్ రౌండప్ 2022: హిట్ బొమ్మలివే...
దాదాపు 275 (స్ట్రెయిట్, డబ్బింగ్) చిత్రాలు... 20 శాతం హిట్స్తో 2022 ముగియనుంది. గత ఏడాది కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది థియేటర్స్కి లాక్ పడలేదు. అయితే కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే సందేహం నడుమ సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ప్రేక్షకులు సినిమా పట్ల తమకు ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు. కానీ విజయాల శాతం మాత్రం ఇరవైకి అటూ ఇటూగానే ఉంది. కాగా స్ట్రెయిట్ చిత్రాలే కాదు.. అనువాద చిత్రాలూ మంచి వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2022 ‘హిట్ బొమ్మ’ (చిత్రాలు)లను చూద్దాం. బంగార్రాజుల సందడి వాసివాడి తస్సాదియ్యా... అంటూ సంక్రాంతికి పెద్ద బంగార్రాజు (నాగార్జున), చిన్న బంగార్రాజు (నాగచైతన్య) జనవరి 14న ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చారు. కల్యాణŠ కృష్ణ దర్శకత్వంలో దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్తో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ నెల దాదాపు 17 చిత్రాలు వచ్చాయి. టిల్లుగాడు.. దంచి కొట్టాడు ఫిబ్రవరిలో ఇరవై చిత్రాలు విడుదలైతే విజయం శాతం రెండు అనే చెప్పాలి. దాదాపు రూ. 5 కోట్లతో రూపొంది, 30 కోట్ల వరకూ వసూళ్లను దంచి కొట్టాడు ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే నిర్మాత దాదాపు రూ. 80 కోట్లతో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ Mð.. చంద్ర దర్శకత్వంలో నిర్మించిన ‘భీమ్లా నాయక్’ 150 కోట్లకు పైగా రాబట్టింది. ఇంకా రవితేజ ‘కిలాడి’, మోహన్బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’తో పాటు మరికొన్ని చిత్రాలొచ్చాయి. ఆర్ఆర్ఆర్... రికార్డ్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న వచ్చింది. దాదాపు రూ. 550 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు 1150 కోట్ల వసూళ్ల రికార్డుని సాధించింది. ఇదే నెలలో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’తో పాటు మరో పది చిత్రాల వరకూ రిలీజయ్యాయి. నిరాశతో ఆరంభమైన వేసవి ఏప్రిల్లో దాదాపు 15 సినిమాలు విడుదలైతే ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలు పెద్దగా లేవు. అలా వేసవి నిరాశతో ఆరంభమైంది. వరుణ్ తేజ్ ‘గని’, తండ్రీకొడుకులు చిరంజీవి– రామ్చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. సర్కారుకీ.. ఫన్కీ విజయం మహేశ్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాట’ మే 12న విడుదలైంది. దాదాపు రూ. 60 కోట్లతో మహేశ్బాబు, అనిల్ సుంకర, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సుమారు 200 కోట్లు వసూ లు చేసింది. ఇక వినోద ప్రధానంగా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ‘ఎఫ్ 3’ మే 27న రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దాదాపు రూ. 70 కోట్లతో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా సుమారు 130 కోట్లు రాబట్టింది. మేలో మరో 7 చిత్రాలు రిలీజయ్యాయి. ‘మేజర్’ హిట్తో.. ఒక్క ‘మేజర్’ హిట్తో జూన్ సరిపెట్టుకుంది. హీరో అడివి శేష్ టైటిల్ రోల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో మహేశ్బాబు ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొంది, 65 కోట్ల వసూళ్లు రాబట్టింది. జూన్లో దాదాపు 20 చిత్రాలు రిలీజయ్యాయి. హిట్ లేని నెల జూలైలో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, రామ్ ‘వారియర్’, రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’... ఇలా దాదాపు 20 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు హిట్ చేసిన సినిమాలు ఏవీ లేకుండా పోయాయి. . అదిరింది ఆగస్ట్ ఆగస్టులో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ బంపర్హిట్స్గా నిలిచాయి. కల్యాణ్రామ్ హీరోగా నటించగా, ‘బింబిసార’తో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో నందమూరి కల్యాణ్రామ్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 70 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొందిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘సీతారామం’ 100 కోట్ల వసూళ్లకు చేరువలో నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్తో అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘కార్తికేయ 2’ 120 కోట్లు రాబట్టింది. ఒక్క హిందీ భాషలోనే ఈ చిత్రం సుమారు 50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదే నెలలో విడుదలైన నితిన్ ‘మాచర్ల నియోజకగర్గం’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రాల వసూళ్లు తడబడ్డాయి. ఒకే ఒక్క విజయం... ఇక సెప్టెంబరులో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్తో ఎస్ఆర్. ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్బాబు నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇంకా ఈ నెలలో దాదాపు పాతిక చిత్రాలు రిలీజయ్యాయి. స్వాతిముత్యానికి విజయం అక్టోబర్ నెలలో వచ్చిన ‘స్వాతిముత్యం’ హిట్గా నిలిచింది. దాదాపు రూ. 8 కోట్లతో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బెల్లంకొండ గణేష్ హీరోగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబరు 5న విడుదలైంది. ఇదే నెలలో రిలీజైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫర్వాలేదనిపించింది. నాగార్జున ‘ది ఘోస్ట్’ కూడా ఇదే నెల వచ్చింది. ఇదే నెల 21న విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’, విశ్వక్సేన్ ‘ఓరి..దేవుడా..’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కల్లో తడబడ్డాయి. చిన్న సినిమాకి పెద్ద విజయం సమంత టైటిల్ రోల్ చేసిన ‘యశోద’ నవంబరు 11న విడుదలైంది. హరి–హరీష్ దర్శకత్వంలో దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్తో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక చిన్న సినిమా ‘మసూద’ రూ. 10 కోట్ల బడ్జెట్లోపు రూపొంది, 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంగీత, తిరువీర్ ముఖ్య తారలుగా సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరులో విడుదలైన దాదాపు 20 సినిమాల్లో అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో..’, అల్లరి నరేశ్ చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీ కం’లకు ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. ‘హిట్’కి హిట్ జూన్లో ‘మేజర్’ హిట్ అందుకున్న అడివి శేష్కు డిసెంబరులో ‘హిట్ 2’ రూపంలో మరో హిట్ లభించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో దాదాపు రూ. 12 కోట్లతో నాని నిర్మించిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ఖిలాడి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ ఈ నెల 23న విడుదలైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే ‘కార్తికేయ 2’తో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ డిసెంబరు 23నే విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల లెక్క రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇంకా నెలాఖరున ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అనువాదం అదిరింది ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాల జోరు కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆ చిత్రాల విశేషాల్లోకి వెళితే... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ముఖ్య తారలుగా సుమారు రూ. 20 కోట్లతో రూపొందిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ అన్ని భాషల్లో దాదాపు 350 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని టాక్. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్తో రూపొందిన ‘కేజీఎఫ్ 2’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 కోట్లు సాధించిందని టాక్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సీనియర్ నటుడు కమల్హాసన్ నటించిన ‘విక్రమ్’ సుమారు 100 కోట్లతో రూపొంది, దాదాపు 450 కోట్లు వసూలు చేసిందని భోగట్టా. అలాగే కె. కిరణ్ రాజ్ దర్శకత్వంలో రూ. 20 కోట్లతో రూపొంది, 100 కోట్లకుౖ పెగా వసూళ్లు సాధించింది ‘777 చార్లి’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ రూ. 16 కోట్లతో రూపొంది, 450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇవన్నీ ప్రపంచవ్యాప్త లెక్కలు కాగా తెలుగులో లాభాలిచ్చిన చిత్రాలుగా నిలిచాయి. (వసూళ్ల వివరాలన్నీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం) -
తెలుగులో సాయి పల్లవి మలయాళ చిత్రం
మన ప్రేక్షకులకు సాయి పల్లవి తెలుగమ్మాయే. ‘ఫిదా’తో అంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందామె. తొలి చిత్రానికి తెలుగు నేర్చుకోవడమే కాదు... తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగులో గలగలా మాట్లాడుతోంది. సాయి పల్లవి చేసిన తెలుగు సినిమాలు తక్కువే అయినప్పటికీ... ఆమెకున్న అభిమానులు ఎక్కువే. ప్రస్తుతం సాయి పల్లవి పలు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా.. ఓ డబ్బింగ్ చిత్రంతో త్వరలోనే పలకరించనుంది. తెలుగు ప్రేక్షకుల కోసం మలయాళ సూపర్హిట్ చిత్రం ‘అథిరన్’ను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కాగా.. ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్, జి. రవికుమార్ తెలుగులోకి డబ్ చేస్తున్నారు. అనువదిస్తున్నారు. ఆగస్టు చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నామని, త్వరలో తెలుగు టైటిల్ ప్రకటిస్తామని తెలిపారు. -
విడాకులు కావాలి!
ఇండియన్ సినిమా పాపులర్ డైరెక్టర్స్లో ఒకరు తీసిన క్లాసిక్ సినిమాలోని సన్నివేశాలివి. ఈ తమిళ సినిమా తెలుగులో డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులకూ ఫేవరెట్ సినిమాల లిస్ట్లో ఒకటిగా చేరిపోయింది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... మధ్యాహ్నం కావొస్తోంది. బయట వర్షం పడుతోంది. క్లాస్రూమ్లో ప్రొఫెసర్ పాఠాలు చెబుతోంది. దివ్యకు వినాలని లేదు. నాన్న మాటలే ఆలోచనలుగా గిర్రున తిరుగుతున్నాయి. ‘మధ్యాహ్నం పెళ్లిచూపులు చూడ్డానికి వస్తున్నారట. వాడు చెప్పేవన్నీ చేసి, మెప్పించి, వాళ్లు ఓకే చెబితే తలొంచి తాళి కట్టించుకోవాలట’ తనకు తాను చెప్పుకుంటోంది దివ్య. ‘నేనింట్లో ఉంటేనే కదా చూడగలుగుతారు? ఒకవేళ నేను రెండు గంటలకు ఇంటికి వెళ్లకపోతే? నేను వెళ్లడం లేదు. వెళ్లడం లేదు.. వెళ్లడం లేదు..’ అని తనకు తాను సర్దిచెప్పుకొని గట్టిగా నవ్వింది దివ్య. క్లాసయిపోయింది. వర్షం పడుతూనే ఉంది. దివ్య ఇంటికెళ్లొద్దని ఫిక్సయిపోయింది. ఆడింది. పాడింది. రాత్రి అయ్యే వరకూ ఆడుతూనే ఉంది. ఇంటికెళ్లగానే, పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లు వెళ్లిపోయి ఉంటారనుకుంది. కానీ వాళ్లు ఆమె కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.అబ్బాయి దివ్యతో పర్సనల్గా మాట్లాడాలని అడిగాడు. అబ్బాయి పేరు చంద్రకుమార్. ఇద్దరూ ఒక గదిలోకి వెళ్లారు. ‘‘మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు క్షమించమని అడగడం లేదు.ఎందుకంటే నేను చేసింది తప్పు అని నాకనిపించలేదు. నాకిది నచ్చలేదు. ఇలా పిల్లను చూస్కోవడం సంతలో పశువును బేరమాడినట్టు ఉంది.’’ దివ్య తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తూ.. ‘‘నేను మీకు మంచి భార్యను అవుతానని కూడా నేననుకోను.’’ అంది చివరిమాటగా. చంద్రకుమార్ లేచి నిలబడి ఒకే ఒక్క మాట అన్నాడు – ‘‘నువ్వు నాకు నచ్చావు.’’ పెళ్లవ్వగానే చంద్రకుమార్తో ఢిల్లీ వచ్చేసింది దివ్య. ఆమె ప్రపంచం మొత్తం మారిపోయిందిప్పుడు. కొత్త మనుషులు. కొత్త ప్రదేశం. తనకు తానే కొత్తగా కనిపిస్తోంది. భర్త ప్రేమిస్తున్నాడు. కానీ ఆమెకు నచ్చడం లేదు. ఆ ప్రేమ నచ్చడం లేదు. ఇప్పటివరకూ ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యనివ్వలేదు. ‘‘ఇది ఇటుకలు, సిమెంట్తో కట్టబడిన ఒక ఆలయం. అంతే. దీన్నొక ఇంటిగా మార్చడం నీ చేతుల్లో ఉంది..’’అన్నాడు చంద్ర. దివ్య అతను చెప్పే మాటలన్నీ విని కాసేపు ఏం మాట్లాడలేదు. ‘‘నాకు ఇటుకలు, సిమెంటు చాలు.’’ అంది అభావంగా. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఢిల్లీకి వచ్చిన రెండో రోజే చంద్రకుమార్ ఆఫీస్కు వెళ్లిపోయాడు. దివ్య మనసులో ఎన్ని ప్రశ్నలు తిరుగుతున్నాయో, ఆమె తనను ఎందుకు యాక్సెప్ట్ చెయ్యలేకపోతోందో చంద్రకుమార్కు తెలియదు. దివ్యకు మాత్రమే తెలుసది.ఆమెను సంతోషపెట్టడానికి తనేం చేయాలా అని బాగా ఆలోచించాడు. డిన్నర్ పార్టీకి తీసుకెళ్లాడు. పెళ్లికానుకగా ఆమెకు ఏదైనా ఇష్టంగా కొనిపెట్టాలనుకున్నాడు. చంద్రకుమార్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా రాలేదు. ఎదురుగా దివ్య ఏం మాట్లాడకుండా కూర్చొని ఉంది. నిమిషాలు మెల్లిగా సెకండ్ల చుట్టూ తిరుగుతున్నాయి. దివ్య అడిగింది – ‘‘నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా.’’ ‘‘అడుగు,’’ ‘‘నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు?’’ చంద్ర సమాధానం చెప్పడానికి సమయం తీసుకుంటున్న వాడిలా తల కాస్త కిందకు వంచాడు. ఆమె కొనసాగించింది – ‘‘పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేనెన్నో చెప్పాను. అయినా నన్నే ఎందుకు కావాలనుకున్నారు?’’ చంద్ర చాలాసేపు ఆలోచించి చెప్పాడు – ‘‘నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్యా, వదినల నిర్బంధం వల్ల పెళ్లిచూపులకు వచ్చాను. నిన్ను చూసి ఈ పెళ్లంటే నాకిష్టం లేదు.నన్ను క్షమించమని అడుగుదామని నీకోసం ఎదురుచూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత.. నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత.. మాటల్లో చెప్పలేను.. నువ్వు నాకు బాగా నచ్చేశావు.వద్దని చెప్పాలనుకున్న నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేశాను.’’ మళ్లీ చంద్రకుమారే, కాసేపాగి అడిగాడు – ‘‘నీకు ఈ పెళ్లి జరగడం సంతోషమేగా?’’.దివ్య కళ్లు కిందకు దించి చెప్పింది – ‘‘లేదు’’. మళ్లీ ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. నిన్నటి నిశ్శబ్దానికి కొనసాగింపు ఇది. డిన్నర్ పార్టీ అయిపోయింది. రోడ్డు మీద ఒక లాంటి నిశ్శబ్దం. వాళ్లిద్దరి భారాన్నీ మోస్తున్న నిశ్శబ్దం. కారు చిన్నగా వెళుతోంది. చంద్రకుమార్ చూపు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉన్న షాపుల మీదకి మళ్లి వస్తూ, రోడ్డు మీద పడి ఆగిపోతోంది. ఒక షాపు ముందు కారు ఆపాడు చంద్రకుమార్. ఇంతసేపూ దివ్య ఒక్కమాటా మాట్లాడలేదు. కారాపగానే అడిగింది – ‘‘ఎందుకు ఇక్కడ ఆగారు?’’. చంద్ర తన చేతిని దివ్యకు అందిస్తూ, రెండు వేళ్లు తెరిచిపెట్టి ఇందులో ఒకటి ముట్టుకో అన్నాడు. ఎందుకన్నట్టు చూసింది దివ్య. ‘‘ఏదైనా బహుమతి కొనిద్దామని ఉంది. అది బట్టలా, నగలా నిర్ణయం కాలేదు.’’ అన్నాడు. ‘‘నాకేమీ వద్దు.’’ ‘‘పెళ్లయిన తర్వాత మొదటిసారి బయటకొచ్చాం. నిన్ను ఒట్టి చేతుల్తో తీసుకెళ్లడం నాకిష్టం లేదు.’’ ‘‘అదే.. నాకేమీ అవసరం లేదని చెప్పాగా!’’ ‘‘ఏం కావాలన్నా అడుగు,’’ ‘‘ఏదడిగినా కొనివ్వగలరా?’’ అడిగింది దివ్య. చిన్నగా నవ్వాడు చంద్ర. ‘‘నా శక్తికి మించనిదైతే కొనిస్తా’’. ‘‘నాకు విడాకులు కావాలి. కొనివ్వగలరా? అది ఈ కొట్లో కొనివ్వగలరా?’’ అంది దివ్య, అసహనంగా కదులుతూ. మళ్లీ నిశ్శబ్దం. కారు స్టార్ట్ అయింది. ఆ నిశ్శబ్దంలో దాగిన ఓ కథ అప్పటికి దివ్యకు మాత్రమే తెలుసు. ఆమే చెప్పాలనుకొని, ఆ కథ చెబితే తప్ప చంద్రకుమార్కు అదెప్పటికీ తెలియదు. -
'డబ్బింగ్ చిత్రాలు మాకొద్దు బాబోయ్'
బెంగళూరు: డబ్బింగ్ చిత్రాల విడుదలకు వ్యతిరేకంగా కన్నడ చిత్ర పరిశ్రమ శాండిల్వుడ్ మరోసారి గళం విప్పింది. కన్నడ చిత్ర పరిశ్రమలోకి అనువాద చిత్రాలు రాకుండా అడ్డుకోవాలంటూ కన్నడ సినీ కళాకారులు సమష్టిగా నినదించారు. డబ్చింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాండిల్వుడ్ సోమవారం బంద్ పాటిస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో తెలుగు, తమిళ చిత్రాల హవా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కర్ణాటకలో తెలుగు, తమిళ భాషలు మాట్టాడే ప్రజలు ఎక్కవగా ఉండటంతో కన్నడ చిత్రాలకు సమాంతరంగా వీటికి ఆదరణ లభిస్తోంది. ఒక్కోసారి కన్నడ సినిమాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక కన్నడలోకి అనువాదం చేయడం వల్ల తమకు చాలా నష్టం ఏర్పడుతోందంటూ శాండిల్వుడ్ ప్రముఖులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. దీనిపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో డబ్చింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాండిల్వుడ్ మరోసారి నిరసన బాట పట్టింది. -
డబ్బింగ్కు కలిసిరాని 2013