breaking news
Dussehra 2025
-
ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి
వేములవాడఅర్బన్: దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు శనివారం పున ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో కళాశాల అధ్యాపకులు వారికి ఫైన్ వేశారు. పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆలస్యంగా బుధవారం రావడంతో ఒక్కొక్కరికి ఒక్కో రంగుడబ్బా కొని అప్పగించాలని హుకూం జారీ చేశారు. దూరం నుంచి వచ్చామని తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా అధ్యాపకులు వినిపించుకోకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై కళాశాల వైస్ప్రిన్సిపాల్ అనురాధను ‘సాక్షి’ వివరణ కోరగా కళాశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందునా వారిలో క్రమశిక్షణ పెంచాలని తాము రంగుడబ్బాలు తీసుకురావాలని ఫైన్గా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చిన రంగు డబ్బాలతోనే కళాశాల, పాఠశాల ఆవరణలో పెయింటింగ్ వేయిస్తామని స్పష్టం చేశారు. -
సైకిల్ కొంటాం.. రుణం ఇవ్వండి
ఝరాసంగం(జహీరాబాద్): సైకిల్ కొనుక్కుంటాం.. మాకు రుణం ఇవ్వండి. తాకట్టుగా తమ వద్ద ఉన్న బంగారం పెడుతామని చిన్నారులు బ్యాంకు మేనేజర్ను కోరారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మండల పరిధిలోని బర్దీపూర్కు చెందిన దేవాన్ష్, రహస్య తల్లి సునీతతో కలిసి దసరా సెలవులలో అదే గ్రామంలోని కెనరా బ్యాంకుకు వెళ్లారు. వారి తల్లి.. బ్యాంకులో మహిళా సంఘం డబ్బులు తీసుకునేందుకు వచ్చారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారన్న విషయం తెలుసుకున్న చిన్నారులు.. బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్లి.. ఆడుకునేందుకు సైకిల్ కొనుక్కుంటాం.. డబ్బులు ఇవ్వండని అడిగారు. ఆశ్చర్యానికి గురైన మేనేజర్.. తాకట్టుగా ఏం పెడతారని ప్రశ్నించగా.. తమ దగ్గర భూమి ఉంది.. బంగారం కూడా ఉందని సమాధానం ఇచ్చారు. మేనేజర్ నవ్వుతూ చిన్నారులను తిరిగి ఇంటికి పంపించారు. -
వాహన అమ్మకాలకు పండుగ జోష్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ ప్రారంభం భారత ఆటోమొబైల్ రంగానికి తిరుగులేని ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 34% పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వెల్లడించింది. సెప్టెంబర్ 22 వరకు మందకొడిగా సాగిన అమ్మకాలు, జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చాక విక్రయాలు అనూహ్య రీతిలో పెరిగాయి. వెరసి సెప్టెంబర్లో అన్ని విభాగాలు కలిపి మొత్తం 18,27,337 వాహన విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెల 17,36,760 యూనిట్లతో పోలిస్తే ఇవి 5.22% అధికంగా ఉన్నాయి. నవరాత్రుల పండుగ తొమ్మిది రోజుల్లో వాహన విక్రయాలు 34% పెరిగి 11,56,935 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో 8,63,327 వాహనాలు అమ్ముడయ్యాయి. ‘‘భారతీయ ఆటోమొబైల్ రిటైల్ పరిశ్రమకు 2025 సెపె్టంబర్ అత్యంత ప్రత్యేకమైన నెల నిలిచింది. కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు దిగి వస్తాయని అంచనాలతో కస్టమర్లు మూడో వారం వరుకూ కొనుగోళ్ల జోలికెళ్లలేదు. అయితే సెపె్టంబర్ 22 తర్వాత జీఎస్టీ 2.0 రేట్లు అమల్లోకి రావడం, నవరాత్రి ఉత్సవాలు ఒకేసారి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్ని విభాగాల్లో విక్రయాలు, డెలివరీలు వేగంగా పుంజుకున్నాయి’’ అని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్ తెలిపారు. విభాగాల వారీగా వృద్ధి ఇలా... → ప్యాసింజర్ విక్రయాలు గతేడాది సెపె్టంబర్తో పోలిస్తే 2,82,945 యూనిట్ల నుంచి ఏకంగా 5.80% పెరిగి 2,99,396 కు చేరాయి. భారీ కొనుగోళ్లు, అందుబాటు ధరల కారణంగా నవరాత్రుల్లో 2,17,744 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నవరాత్రి విక్రయాలు 1,61,443తో పోలిస్తే ఇవి 35% అధికం. → ద్వి చక్ర వాహనాల రిజి్రస్టేషన్లు 7% పెరిగాయి. ఈ సెపె్టంబర్లో మొత్తం 12,87,735 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 12,08,996 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగపు ఎంక్వైరీలు ఇప్పట్టకీ బలంగా ఉన్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగ ఆఫర్లు, డిమాండ్ పెరగడంతో నవరాత్రిలో అమ్మకాలు 36% పెరిగి 8,35,364 యూనిట్లకు చేరాయి. → త్రి చక్రవాహన రిటైల్ అమ్మకాలు 7% క్షీణించి 98,866కు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సెపె్టంబర్ అమ్మకాలు 1,06,534 యూనిట్లుగా ఉన్నాయి. అయితే నవరాత్రి అమ్మకాల్లో 25% వృద్ధి నమోదైంది. మొత్తం 46,204 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది దసరా సీజన్ విక్రయాలు 37,097గా ఉన్నాయి. → వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు సెపె్టంబర్లో 70,254 యూనిట్ల నుంచి 3% పెరిగి 72,124 యూనిట్లకు చేరుకున్నాయి. రుణవితరణ పెరగడంతో నవరాత్రి అమ్మకాల్లో 15% వృద్ధి సాధించి మొత్తం 33,856 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సెపె్టంబర్లో ట్రాక్టర్ అమ్మకాలు 64,785 యూనిట్లుగా ఉన్నాయి. ఒక్క నవరాత్రుల్లోనే 21,604 ట్రాక్టర్ల విక్రయాలు జరిగాయి. అక్టోబర్ అమ్మకాలపై మరింత ఆశాభావం ‘‘జీఎస్టీ 2.0 రేట్ల తగ్గింపు అన్ని ఆదాయ వర్గాలలో కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచింది. సానుకూల వర్షాలు, బలమైన ఖరీఫ్ పంటలు గ్రామీణ ఆదాయాలను మెరుగుపరిచాయి. ధంతేరాస్, దీపావళి పండుగల సీజన్లో ఇదే సానుకూల వాతావరణం కొనసాగొచ్చు. తగ్గిన ధరలు, ఆకట్టుకునే ఆఫర్లు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. భారతీయ చరిత్రలోనే ఈ పండుగ సీజన్ అత్యుత్తమ రిటైల్ సీజన్గా నిలిచే అవకాశం ఉంది’’ అని ఫాడా విశ్వాసం వ్యక్తం చేసింది. ఈవీ కార్ల అమ్మకాలు రెండింతలు ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ విక్రయాలు ఈ ఏడాది సెపె్టంబర్లో 15,329 గా నమోదయ్యాయి. గతేడాది (2024) ఇదే నెలలో నమోదైన 6,191 ఈవీ కార్ల విక్రయాలతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు అధికమని వాహన డీలర్ల సమాఖ్య (ఫాడా) తెలిపింది. ఈవీ రేసులో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ ఈవీ కార్ల అమ్మకాలు 62% వృద్ధి చెంది 3,833 నుంచి 6,216 కు చేరాయి. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ 3,912 ఈవీ కార్లను అమ్మింది. గతేడాది సెప్టెంబర్లో విక్రయించిన 1,021 యూనిట్లతో పోలిస్తే ఇవి మూడింతలు అధికం. మహీంద్రా అమ్మకాలు 475 యూనిట్ల నుంచి ఏకంగా 3,243కు చేరాయి. అలాగే బీవైడీ ఇండియా 547 యూనిట్లు, కియా ఇండియా 506 యూనిట్లు, హ్యుందాయ్ మోటార్ ఇండియా 349 యూనిట్లు, బీఎండబ్ల్యూ ఇండియా 310 యూనిట్లు, మెర్సిడస్ బెంజ్ 97 యూనిట్లను విక్రయించాయి. ఇటీవల భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టెస్లా సైతం 64 కార్లను విక్రయించింది. -
దుర్గాష్టమి వేడుకల్లో మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
-
బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ నిశ్చితార్థం (ఫోటోలు)
-
‘గడ్డం’ బ్రదర్స్ దూరం.. దూరం!
మంచిర్యాల జిల్లా: దసరా వేడుకల వేళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురువారం రాత్రి ఆసక్తికర, ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటు చేసుకుంది. విజయదశమి వేడుకల్లో భాగంగా సింగరేణి తిలక్ స్టేడియంలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్తో పాటు ఆయన సోదరుడు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. రాత్రి 7.15గంటల ప్రాంతంలో మంత్రి వివేక్ స్టేడియంకు రాగా.. ఎమ్మెల్యే వినోద్ పాల్గొనకపోవడం సభికులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతసేపటి తర్వాత మంత్రి వివేక్ తన ప్రసంగం ముగించి 7.35గంటలకు మందమర్రిలో నిర్వహించే రాంలీల కార్యక్రమానికి హాజరు కావాలంటూ సభికులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసి వేదిక దిగి వెళ్లిపోయారు. మంత్రి వెళ్లిపోయిన విషయాన్ని కొందరు సమాచారం ఇవ్వడంతో అరగంట తేడాతో ఆయన సోదరుడు వినోద్ మైదానానికి చేరుకున్నారు. అప్పటివరకు బాలికల సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులు కదలకుండా చూశారు. తమ్ముడు హాజరైన కార్య క్రమానికి అందుబాటులో ఉండి కూడా ఎమ్మెల్యే హాజరు కాకపోగా.. క్యాంపు కార్యాలయానికి వెళ్లి అన్నను తమ్ముడు కలువకపోవడం సభికులు, పుర ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ సంఘటన తోబుట్టువుల మధ్య నెలకొన్న అసమ్మతికి నిదర్శనమని పలువురు పేర్కొనడం గమనార్హం. ఇద్దరి మధ్య ఎందుకు పొరపొచ్చాలు వచ్చాయో తెలియ దు కానీ ముఖ్య అతిథులుగా హాజరు కావాలి్సన వినోద్, వివేక్ దూరం దూరంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వీరి తీరుపై పురప్రజలు పలు రకాలుగా చర్చించుకోవడం వినిపించింది. ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణులను కూడా గందరగోళానికి గురి చేసి చర్చనీయాంశంగా మారింది. -
కర్నూలు : దేవరగట్టు బన్నీ ఉత్సవం..కర్రలతో కొట్టుకున్న భక్తులు (ఫొటోలు)
-
పెద్ది లుక్తో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన రామ్ చరణ్ (ఫొటోలు)
-
ఉగ్ర తాండవం..అనిర్వచనీయం..
‘దసరా అంటేనే మహిళల అపూర్వ శక్తికి పట్టం కట్టే అద్భుతమైన పండుగ. అందుకే ప్రతీ మహిళా ఈ పండుగతో మనసారా మమేకమవుతుంది’ అంటున్నారు ప్రముఖ సినీనటి అర్చన. దసరా పండుగ నేపథ్యంలో ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. నాకు అమ్మవారి పట్ల ఉన్న ఎనలేని భక్తి ఇప్పటిది కాదు. ముఖ్యంగా దుర్గామాత, సరస్వతీ దేవి రూపాలు అంటే చాలా ఇష్టం. సినిమాల్లో దేవీ పాత్రలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఈ దసరా నాకెందుకు ప్రత్యేకం అంటే ప్రస్తుతం నేను చేస్తున్న కర్మస్థలం అనే సినిమా. ఈ సినిమా కోసం నేను గతంలో ఎన్నడూ చేయని విధంగా అమ్మవారి ఉగ్రరూపం ధరించి తాండవం చేశాను. మహిషాసుర మరి్ధని మూర్తి ఎదురుగా చేసిన ఆ నాట్యం మరిచిపోలేని అనుభూతి అందించింది. మాతా తుల్జాభవాని తాకిన చీరను నాకు ఆ సన్నివేశంలో ధరింపజేశామని ఆ సినిమా యూనిట్ ఆ తర్వాత నాకు చెప్పారు. (చదవండి: శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..) -
తెలంగాణ సాంస్కృతికోత్సవం.. అలయ్ బలయ్
అలయ్ బలయ్.. ఒక ఆలింగన వేడుక.. అందరం బాగుండాలనే ఆకాంక్ష.. కులమతాలకు అతీతంగా, పారీ్టలు, సిద్ధాంతాలు, భావజాల సంఘర్షణలను పక్కన పెట్టి ‘మనమంతా ఒక్కటే’ననే సమైక్యత భావన స్ఫూర్తిని అందజేసే పండుగ.. ఆనందోత్సాహాలతో చేసుకొనే దసరా ఉత్సవాలకు ముగింపు వేడుక.. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకల మాదిరే అలయ్ బలయ్ కూడా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణకే ప్రత్యేకమైన వంటకాలతో, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించే కళారూపాలకు వేదికగా నిలుస్తోంది. రెండు దశాబ్దాలుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈనెల 3వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 20వ సంవత్సర అలయ్బలయ్ ఉత్సవాలు జరుగుతాయి. ప్రస్తుత హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఈ వేడుకలను 2005లో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు ఘనంగా నిర్వహించే అలయ్ బలయ్ ఉత్సవాలకు ఆయన కూతురు బండారు విజయలక్ష్మి ఆరేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది..ఈ ఉత్సవం ‘మాయమైపోతున్న మనిషిని’ నిలబెట్టింది. ఆ మనిషి చుట్టూ అల్లుకున్న సామాజిక బంధాలకు, అనుబంధాలకు విలువనిచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవానికి పట్టం కట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ఉద్యమకారులు, రాజకీయ పారీ్టలు, నాయకులందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు అలయ్బలయ్ ఎంతో దోహదం చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ క్రియాశీలమైన నేతగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న బండారు దత్తాత్రేయ పారీ్టలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ ‘దత్తన్న’గా చేరువయ్యారు. ఆ సమైక్యతాభావాన్ని సంఘటితం చేయాలనేదే దత్తన్న ఆకాంక్ష కూడా.. అందుకే ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ కనీసం 10 వేల మందిని ఆయన సాధరంగా ఆహ్వానిస్తారు. మాన్యుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరినీ ఆయన స్వయంగా స్వాగతిస్తారు.600 మందికి పైగా కళాకారులు.. అలయ్బలయ్ 20 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బండారు విజయలక్ష్మి తెలిపారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఆలయ్బలయ్ కార్యనిర్వాహక కమిటీ నెల రోజులుగా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన సుమారు 600 మందికి పైగా కళాకారులు తరలి వస్తారు. బతుకమ్మ, బోనాలు, పోతరాజులు, సదర్ ఉత్సవాలతో పాటు ఆదివాసీ, గిరిజన సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈసారి వేడుకల్లో అతిథులకు వడ్డించేందుకు 85 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశాం. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు వడ్డించనున్నాం. తెలంగాణకే ప్రత్యేకమైన అంబలి, జొన్న గట్క, సర్వపిండి, మలీదముద్దలు, తలకాయ, బోటి, మటన్, చికెన్లలో రకరకాల వెరైటీలతో పాటు పచ్చిపులుసు, రకరకాల ఆకుకూరలు, కూరగాయలతో చేసిన శాఖాహార వంటలను కూడా వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – బండారు విజయలక్ష్మి (చదవండి: శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..) -
కేటీఆర్ దసరా శుభాకాంక్షలు.. వీడియో విడుదల
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు కలగాలని ఆకాంక్షించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి. దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు.. ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు’ అని వీడియో పోస్టు చేశారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి.దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.… pic.twitter.com/o0k5tk9OW6— KTR (@KTRBRS) October 2, 2025 -
శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..
దేశవ్యాప్తంగా నాటక సమాజంలో దుర్గాదేవి పాత్రలో అనేక మంది ప్రాచుర్యం పొందారు. ముఖ్యంగా ‘మహిషాసుర మర్దిని’ నాటకంలో బుచ్చి లక్ష్మి చేసిన అభినయం, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా సురభి కమలాబాయి, సురభి రమణ వంటివారు దేవి శక్తిరూపాన్ని రంగస్థలంపై జీవంతో నింపారు. గ్రామీణ జాతర, యక్షగానం, బుర్రకథలు, హరిదాసు పాటల్లోనూ దుర్గమాత రూపాన్ని అనేక మంది మహిళలు అత్యంత భక్తితో ప్రదర్శించారు. సినీమాల్లోనూ పెద్ద హీరోయిన్లు అమ్మవారి పాత్రలను పోషించి పాత్రలో జీవించారు. నాట్యకళల్లో (కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ) పలువురు మహిళా నర్తకీమణులు దుర్గమ్మ ప్రతిరూపాలుగా మెరిశారు. కూచిపూడిలో ‘మహిషాసుర మర్థిని’ తారంగములో దుర్గాదేవి ఆవిష్కరణ చేశారు. దేవి శక్తిరూపాన్ని శిల్పసుందరంగా, ఆధ్యాత్మికంగా ప్రదర్శించిన వారిలో శోభానాయుడు, అలేఖ్య పుంజల, యామిని కృష్ణమూర్తి తదితరులు ఎందరో దుర్గామాత శక్తి, వీరత్వాన్ని ఆవిష్కరించిన గొప్ప నర్తకీమణులుగా పేరొందారు. వెండితెర ‘వేల్పులు’.. ‘మాయాబజార్’ ‘చూడామణి’ ‘శకుంతల’ వంటి చిత్రాల్లో భక్తిపాత్రలు పోషించిన అంజలీదేవి దేవి, శక్తి రూపంలో కూడా తెరపై జీవించారు. అదేవిధంగా బి.సరోజాదేవి, జమున, కాంచనమాల పురాణ గాధా చిత్రాలలో దుర్గాదేవి పాత్రలు ధరించారు. ఆ తర్వాతి తరంలో శ్రీవిద్య, జయసుధ, జయప్రద, రమ్యకృష్ణ, రాధ, భానుప్రియ వంటి హీరోయిన్లు అమ్మవారిలా భక్తుల మనసులు గెలుచుకున్నారు. సౌందర్య, మీనాక్షి శేషాద్రి కూడా నవరాత్రి, మహిషాసుర మర్దిని అంశాలతో రూపొందిన పాటలు, సన్నివేశాలలో శక్తిమాత రూపాన్ని ఆవిష్కరించారు.అమ్మవారు పూనినట్టే.. సురభి కళాకారిణిగా పాతాళభైరవి అనే నాటకంలో అమ్మవారి పాత్ర పోషించడం మరుపురాని జ్ఞాపకం. ఆ పాత్ర అభినయం అయిపోయిన తర్వాత చాలాసేపు అదే భావనలో ఉండిపోయా.. అంతగా లీనమవ్వడం మరే పాత్రలోనూ జరిగేది కాదు. – నిర్మల, సురభి నాట్యకళాకారిణి.ఆ అనుభూతి సాటిలేనిది... నర్తనశాల, భక్త ప్రహ్లాద, మహిషాసుర మర్దిని.. ఇలా ఎన్నో నాటకాల్లో అమ్మవారి పాత్రలు పోషించాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రదర్శనల్లో పాల్గొన్నాను. ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలో నా ప్రదర్శనలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా 100కిపైగా నాటకాల్లో అమ్మ రూపాలను అభినయించాను. ఎన్నిసార్లు ఆ పాత్ర పోషించినా, తనివి తీరదు ఆ అనుభూతిని వర్ణించలేం. – వెంగమాంబ, రంగస్థల నటి (చదవండి: శ్రీ శారదాంబికా నమోస్తుతే!) -
శ్రీ శారదాంబికా నమోస్తుతే!
భారతదేశంలో ఉన్న అపురూపమైన సరస్వతీ దేవి ఆలయాల్లో ఒకటి శృంగేరీ శారదాదేవి ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో తుంగానదీ తీరంలో ఆదిశంకరులు స్థాపించిన దక్షిణామ్నాయపీఠం శృంగేరి. ఈ పీఠాధిష్ఠాత్రి కూడా ఆమే. శారదాదేవి ఇక్కడ నెలకొని ఉండటానికి ఒక వృత్తాంతం ఉంది. ఒక శాపవశాత్తూ బ్రహ్మా సరస్వతులిద్దరూ మండనమిశ్ర, ఉభయభారతులై భూమిపై జన్మించారు. ఆదిశంకరులతో జరిగిన వాదంలో మండనమిశ్రులవారు ఓడిపోయి సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులనే పేరిట శృంగేరీ పీఠాధిపతిగా ఆదిశంకరులవారిచే నియమితులయ్యారు. ఉభయభారతీదేవి సాక్షాత్తు సరస్వతీస్వరూపమని తెలిసి ఉన్న శంకరులవారు ఆమెను అక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు.శంకరుల విన్నపంతో ఉభయభారతీదేవి శారదాదేవిగా శృంగేరీలో కొలువు తీరింది. నిజానికి ఈ అమ్మవారి మూలరూపం చందనవిగ్రహం. అయితే ఈ విగ్రహాన్ని విద్యాశంకరుల ఆలయంలో ప్రతిష్ఠించి, తరువాతి కాలంలో ఇక్కడ స్వర్ణవిగ్రహరూపంలో పూజలందుకుంటోంది. శారదాదేవి రూపం స్వస్తికాసనంలో కూర్చుని కుడిచేతితో చిన్ముద్ర (జ్ఞానముద్ర)ను చూపుతూ, ఎడమచేతిలో పుస్తకం ధరించి ఉంటుంది.వెనుక కుడిచేత్తో జపమాలను, ఎడమచేత్తో అమృతకలశాన్ని ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారికి వెనుక చిలుక కూడా ఉంటుంది. అఖండ విద్యాప్రదాయిని అయిన ఈ దేవి దర్శనంతో మనలోని అజ్ఞానపు మాలిన్యాలు తొలగి విజ్ఞానపు కాంతులు వెలుగొందుతాయి. చిన్ముద్ర, పుస్తకం, జపమాల, అమృత కలశం మొదలైనవన్నీ క్షయం లేనివనీ అవిద్యను రూపుమాపే విజ్ఞానపు సాధనాలనీ తెలుసుకోవాలి.– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి (చదవండి: పైడితల్లికి ప్రణమిల్లి..!) -
సంకల్పమే శక్తి స్వరూపం..!
పల్లెటూరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుకుంటుంది. కానీ ఎన్నో అడ్డంకులు. ఆటంకాలు. ఆడపిల్లకు అవసరమా అని ప్రశ్నలు. అయితే సంకల్పమే శక్తిగా ఆ అమ్మాయి అనుకున్నది సాధిస్తుంది. ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్న ‘కన్యాకుమారి’లో హీరోయిన్ గీత్ షైనీతన సంకల్పాల గురించి దసరా దాండియా గురించి చెబుతున్న విశేషాలు. ‘నేను చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదువుకున్నాను. స్కూలు ఫస్ట్ వచ్చాను. కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకున్నాను. అయినా సరే నా కోరికలు ఏవీ మీరు పట్టించుకోలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానంటే డిగ్రీలో చేర్పించారు. ఇంత తెలివి పెట్టుకుని చీరల కొట్టులో సేల్స్గర్ల్లా చీరలు అమ్ముకుంటున్నాను’ అని తల్లిదండ్రులను, అన్నయ్యను నిలదీసి తన వేదనను చెప్పుకుంటుంది కన్యాకుమారి అనే అమ్మాయి ‘కన్యాకుమారి’ సినిమాలో.కన్యాకుమారిది ఒకటే కల. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనేది. కాని ఇంటి పరిస్థితులు, అమ్మాయి అనే కారణంతో చదివించక΄ోవడం... ఇవన్నీ ఆమె కలలను సగంలోనే తుంచేస్తాయి. కాని కన్యాకుమారి తన కలను లోలోపల సజీవంగా ఉంచుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తి ప్రేమను గౌరవిస్తూనే, రైతుగా ఉండాలనే అతని అభిలాషను గౌరవిస్తూనే తన లక్ష్యం తీవ్రతను అందరికీ తెలియచేసి హైదరాబాద్కు వెళ్లి సాఫ్ట్వేర్ కోర్సులు చేయడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికాకు కూడా వెళ్లి వచ్చి అప్పుడు పెళ్లి చేసుకుంటుంది.ఇటీవల ఇలాంటి పట్టుదల ఉన్న అమ్మాయి కథ తెలుగులో లేదు. అందుకే ఓటీటీలో ‘కన్యాకుమారి’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ పాత్ర పోషించిన గీత్ సైనీకి ప్రేక్షకులు ఫుల్మార్కులు వేస్తున్నారు. గీత్తో సంభాషణ:మీ పేరు తెలుగు పేరనిపించడం లేదు.గీత్ సైనీ: మా పూర్వికులది రాజస్థాన్. మా తాతల కాలంలోనే అదిలాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. అదిలాబాద్లో నేను పుట్టి పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్లో మా కుటుంబం సెటిల్ అయ్యింది. మా నాన్న టీచర్. అమ్మ హౌస్ వైఫ్. యాక్టింగ్ మీద ఆసక్తి ఎలా?జ: స్కూల్లో బాగా అల్లరి చేసేదాన్ని. టీచర్లను ఇమిటేట్ చేసి ఫ్రెండ్స్ను నవ్వించేదాన్ని. డాన్సర్ కావాలనుకున్నాను. అయితే టెన్త్ క్లాస్ అయ్యాక అందరు ఫ్రెండ్స్ నా ఆటోగ్రాఫ్ బుక్లో ‘నువ్వు మంచి నటివి అవుతావు’ అని రాశారు. వారు రాసింది చూశాక నేను నటిని కావాలనుకునే కోరిక నాలో నా చుట్టూ ఉందనిపించింది. తొలి అవకాశం ఎలా వచ్చింది?జ: నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాను. థర్డ్ ఇయర్లో ఉండగా కాలేజీ ఈవెంట్లో డాన్స్ చేస్తే ఒక సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసి ‘అల’ అనే షార్ట్ఫిల్మ్ కోసం నన్ను సంప్రదించారు. అయితే ఈ అవకాశం వచ్చినట్టు నాన్నకు చెప్పే ధైర్యం లేక మెసేజ్ చేశాను– ఇలా చాన్స్ వచ్చింది... నో చెప్పేశాను అని. నాన్న కాసేపటికి ఫోన్ చేసి ‘మంచి డైరెక్టర్ అంటున్నావు కదా బేటా చేయి’ అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను.తొలి సినిమా అవకాశం?జ: సృజన్ అట్టాడ తన ‘పుష్పక విమానం’ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన ఇస్తే నా ఫ్రెండ్ నా ఫొటోలు పంపింది. అలా ఆ సినిమాలోని రెండు ఫిమేల్ లీడ్ క్యారెక్టర్లలో ఒకటిగా చేశాను. అయితే సృజన్ తీయబోతున్న ‘కన్యాకుమారి’ లో నాకు హీరోయిన్ చాన్స్ వస్తుందనుకోలేదు. శ్రీకాకుళం అమ్మాయిగా మారి ఆడిషన్ ఇచ్చాక ఆయన సంతృప్తి చెంది ఈ అవకాశం ఇచ్చారు. కన్యాకుమారి పాత్రను ఎలా ఓన్ చేసుకున్నారు?జ: నేను బయట మామూలుగా చాలా కామ్గా ఉంటాను. ఎవరైనా బాగా పరిచయమైతే ఇక నా వాగుడు తట్టుకోవడం కష్టం. ఆ లోపలి మనిషిని ఈ పాత్ర కోసం బయటకు తెచ్చాను. ఆడపిల్లలు తమ రెక్కలను పూర్తిగా సాచాలి. సీతాకోక చిలుకల్లా ఎగరాలి. అందుకే పోస్టర్లో సీతాకోక చిలుక ఉంటుంది. అలాంటి గట్టి పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అందులో చీరల పేర్లన్నీ చెప్పే క్లిప్ బాగా వైరల్ అవుతోంది. చిన్నపుడు మీరు దసరా ఎలా జరుపుకునేవారు?జ: ఆదిలాబాద్లో మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సరిహద్దు ప్రాంతం కాబట్టి. దసరా వస్తే బాగా దాండియా ఆడేవాళ్లం. బతుకమ్మ కూడా ఆడేదాన్ని. కన్యాకుమారి షూట్ సమయంలో శ్రీకాకుళంలో ఉన్నప్పుడు దసరా వచ్చింది. అక్కడ దసరా సందడి వేరేగా అనిపించింది. వీధి వీధికి దుర్గ మంటపాలు, కోలాటం... చాలా సందడి చేశాం అందరం.నేటి అమ్మాయిలకు ఏం చెబుతారు?జ: ఏ సందర్భంలోనూ ఓటమి ఒప్పుకోవద్దు. కల ముగిసిపోయిందని అనుకోవద్దు. మరుగున పడ్డ లక్ష్యాలను తిరిగి సజీవం చేసుకుని పోరాడాలి. ఏదో ఒకరోజుకు గెలుస్తాం.– సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి (చదవండి: Vijayadashami: స్త్రీ శక్తే విజయ దశమి..) -
స్త్రీ శక్తే విజయ దశమి..
అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తే, ఏడాదంతా శుభప్రదంగా... జయకరంగా ఉంటుందని శాస్త్రోక్తి. బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు త్రిమూర్తులనీ, వారికి సృష్టిస్థితి లయకారులనీ పేరు. వీరు ముగ్గురూ తామే ఆ కార్యక్రమాలని నిరాటంకంగా చేసేస్తున్నారా అంటే వారికి విలువ, అస్తిత్వం ఆధిక్యమనేవి తమ తమ భార్యల వల్లనే కలుగుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే బ్రహ్మకి గుడి, పూజలు లేకపోయినా, ఆయన నోట దాగిన ఆ సరస్వతి కారణంగానే ఆయనను పూజిస్తారు.అదేతీరుగా శ్రీహరికి గుర్తింపూ విలువా లక్ష్మీదేవి వల్లనే. శ్రీవేంకటేశ్వరుడు కన్పించేది కూడా ఎనలేని విలువైన ఐశ్వర్యం వెనుకనే. ఆయన్ని భక్తజనం కొలిచేది కూడా ఐశ్వర్యం కోసమే. అంటే కేవలం ధనం కోసమే కాదు... అది పదవి, అధికారం, జీవితానికి సంబంధించి లేదా ధనానికి సంబంధించిన వాటికోసం అదేవిధంగా శక్తి లేని శివుడు ఏ ప్రయోజనాన్నీ చేకూర్చలేడట. అందుకే అర్ధనారీశ్వర రూపంలో ఆయన ఉన్నాడు. కేవలం తమ తమ భార్యల ద్వారా గుర్తింపు ఈ త్రిమూర్తులకీ ఉండడమే కాదు– తమ తమ భర్తలకు కష్టం వచ్చినప్పుడు రక్షించి ఒడ్డెక్కించింది కూడా తమ తమ భార్యలే. అందుకే వీరికి త్రిశక్తులని పేరు. ఈ త్రి శక్తి దేవతల సమష్టి పండగే విజయ దశమి.జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు? శ్లోకం: శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనంజమ్మి చెట్టును సంస్కృతంలో శమీవృక్షం అంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు శమీ పూజ చేసి లంకకు వెళ్లి విజయం సాధించాడని రామాయణ గాథ చె΄్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లేటపుడు తమ ఆయుధాలను, ధనుర్బాణాలను శవాకారంలో మూటలా కట్టి ఆ మూటను శమీవృక్షం పై ఉంచి తాము అజ్ఞాత వాసం వీడే వరకు వాటిని జాగ్రత్తగా కాపాడాలని జమ్మి చెట్టుకు నమస్కరించి వెళ్ళారట. తిరిగి అజ్ఞాత వాసం వీడిన అనంతరం జమ్మిచెట్టుకు పూజలు చేసి చెట్టు పై నుండి ఆయుధాలు తీసుకుని యుద్ధంలో కౌరవులను ఓడించారని మహా భారతకథ చెపుతోంది. నాటి నుండి నేటి వరకు విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని అందరి నమ్మకం. విజయ దశమి రోజున నక్షత్ర దర్శన సమయాన జమ్మిచెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి పైన పేర్కొన్న శ్లోకం చదివి చెట్టుకు ప్రదక్షిణ చేసిన తరువాత ఆ చెట్టు ఆకులు తెంపుకుని పెద్ద వారికి ఇచ్చి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది నేటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది.ఆయుధ పూజలోని ఆంతర్యం?అజ్ఞాతవాస ముగింపులో విజయ దశమి నాడు పాండవ మధ్యముడు విజయుడు జమ్మిచెట్టు మీదున్న ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీయుజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన పనిముట్లకు కృతజ్ఞతా పూర్వకంగా పూజలు చేసి తమ జీవితం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధపూజ. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమ వృత్తికి సంబంధించిన పుస్తకాలను పూజలో పెట్టడం ఆనవాయితీ. ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం కాని పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయడం, ఏదైనా కొత్త అంశాలను ఆరంభించడం ఈనాటి ఆచారాలలో ఒకటి. పాలపిట్ట దర్శనం ఎందుకు?పురాణ గాథల్లోకి వెళితే పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని తిరుగు ప్రయాణమై తమ రాజ్యానికి వెళుతున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనం కావడం జరిగిందని, నాటి నుండి వారి కష్టాలు తొలగిపోయి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడంతోపాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారట. అందుకే పాండవులకు కలిగిన శుభాలు పాలపిట్టను చూస్తే అందరికి కలుగుతాయని ప్రజల నమ్మకం. అందుకే విజయ దశమి రోజు లపిట్ట దర్శనం కోసం గ్రామాల్లో సాయంత్రం వేళ జమ్మి పూజ అనంతరం పంట పొలాల వైపు ప్రజలు ఆడ, మగ తండోపతండాలుగా వెళతారు. పాలపిట్ట దర్శనం చేసుకుని ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు. – డి.వి.ఆర్.(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
అమ్మవారిలా... ఐరన్ నారిలా...
‘‘మనలో లక్ష్మి, పార్వతి, దుర్గ... ఈ అమ్మవార్లు అందరూ ఉన్నారు. అయితే వాళ్లు ఉన్న సంగతి మనం గ్రహించాలి. మనలోని ఆ శక్తిని ఉపయోగించుకుని అనుకున్నది సాధించాలి. అమ్మాయిలు అనుకోవాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ లేదు’’ అని రాశీ ఖన్నా అన్నారు. సౌత్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ నార్త్ బ్యూటీ ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.→ ఢిల్లీలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి ‘రామ్లీలా’కి వెళ్లేవాళ్లం. అక్కడ రావణ దహనం చూసేవాళ్లం. చెడు అంతం అవుతుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. దసరా అంటే చెడు పై మంచి గెలవడం. అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మంచి గెలవాలి. → హీరోయిన్ అయిన తర్వాత ఇంతకు ముందులా స్వేచ్ఛగా పబ్లిక్లోకి రావడం కుదరదు కాబట్టి, ఇంట్లోనే ఉండి పూజ చేస్తున్నాను. మాకు నార్త్లో నవరాత్రికి చిన్న పిల్లలను అమ్మవారిలా భావించి, పూజించడం అలవాటు. చిన్న చిన్న అమ్మాయిలు అమ్మవారిలా డ్రెసప్ అయి, వేరే వాళ్ల ఇంటికి వెళతారు. అక్కడ వాళ్లు ఈ పిల్లలను అమ్మవారిలా భావించి, పూజ చేస్తారు. నా చిన్నప్పుడు నేను అలా వేరేవాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని. అలా అలంకరించుకుని వెళ్లడం నాకు ఇప్పటికీ ఓ తీపి గుర్తులా మిగిలి పోయింది. ఈ నవరాత్రికి నా బ్రదర్వాళ్లు మా ఇంటికి వచ్చారు. నేను మా ట్రెడిషన్ని ఫాలో అయి, నా మేనకోడలిని అమ్మవారిలా అలంకరించి, పూజ చేశాను. అందుకే ఈ నవరాత్రి నాకు స్పెషల్.→ పూరీ, హల్వా మాకు పండగ స్పెషల్. ఉడకబెట్టిన శెనగలను కూడా ప్రసాదంగా పెడతాం. హల్వా చేయడం కష్టం అంటారు కానీ నాకు చాలా ఈజీ. పండగకి నేను హల్వా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.∙మహిళలు ఒకరినొకరు స పోర్ట్ చేసుకోవాలి. అయితే కొందరు అమ్మాయిలు వేరే అమ్మాయిలను స పోర్ట్ చేయరు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు... బయట కూడా స పోర్ట్ చేయనివాళ్లు ఉన్నారు. చాలామంది ‘స్త్రీవాదం’ అని అమ్మాయిలకు ఏదో న్యాయం చేసేట్లు మాట్లాడతారు. కానీ ‘ఫేక్ ఫెమినిజమ్’ని కూడా చూశాను. అమ్మాయిలే ఇలా ఉంటే.. మగవాళ్లు స పోర్ట్ చేయాలని ఎలా ఆశిస్తాం. మహిళలందరం ఒకరినొకరు స పోర్ట్ చేసుకుని, ఎదగాలి. → జీవితంలో ధైర్యంగా ఉండే అమ్మాయిలను, పిరికివాళ్లను చూస్తాం. అయితే పిరికిగా ఉన్నారని తప్పుబట్టను. ఎందుకంటే మనం ఎలా ఉండాలనేది మన ఇంటి పెంపకం కూడా నిర్ణయిస్తుందని నా అభి ప్రాయం. ఒకవేళ వాళ్ల అమ్మ అలా పిరికిగా ఉండి ఉంటారు. ఆమెని చూసి వాళ్లు అలా ఉంటారేమో. కానీ నా జీవితంలో చాలామంది పవర్ఫుల్ ఉమెన్ ఉన్నారు. మా అమ్మ, బామ్మ, నా ఫ్రెండ్స్... ఇలా నా చుట్టూ ఉన్నవాళ్లందరూ శక్తిమంతులే. అందుకే నేనూ వాళ్లలా స్ట్రాంగ్ లేడీలా ఉంటున్నా. లక్ష్మి, దుర్గా, పార్వతి... ఈ అమ్మవార్లందరూ మనలోనే ఉన్నారు. అయితే మనం తెలుసుకోగలగాలి. ‘నా వల్ల ఏమీ కాదు’ అని కొందరు ఫిక్స్ అయి పోతారు. మన పవర్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. → 50 ఏళ్ల క్రితం స్త్రీలు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనూ కొందరు స్త్రీలు ఎందరికో ఆదర్శంగా నిలిచే పనులు చేశారు. కానీ ఇప్పుడు అనుకున్నది సాధించే పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అఫ్కోర్స్ అమ్మాయిలు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వెనక్కి లాగడానికి ప్రయత్నించేవాళ్లు ఉంటారు. వాళ్లని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. → స్కూల్లో ఫంక్షన్స్ కోసం నేను దుర్గా మాతలా అలంకరించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఘాగ్రా వేసుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, జుట్టు విరబోసుకుని... మొత్తం అలంకరణ అయ్యాక అద్దంలో చూసుకున్నప్పుడు తెలియని ఫీలింగ్ కలిగేది. ఆ గెటప్లో ఉన్నప్పుడు పవర్ఫుల్గా అనిపించేది.→ సినిమాల్లో అమ్మవారి క్యారెక్టర్ చేయాలని ఉంది. అయితే అమ్మవారి గెటప్ అంటే ఆషామాషీ కాదు. ఆ గెటప్లో ఉన్నంతవరకూ నిష్ఠగా ఉండాలి. భక్తితో ఉండాలి. అమ్మవారి క్యారెక్టర్ చేయాలనే నా కల నెరవేరే అవకాశం వస్తే మాత్రం శ్రద్ధాభక్తులతో చేస్తాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనలో మంచి ఉంటే మనకు అదే వస్తుందని నా నమ్మకం. నా లైఫ్లో నాకు చాలాసార్లు ఇది అనుభవమైంది. దసరా సందేశంలానే... చెడుపై మంచి గెలవడం అనేది జరిగే తీరుతుంది. నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు ఉన్నప్పుడు న్యాయానికి స్థానం ఉంటుంది.– డి.జి. భవాని -
పాలపిట్టలు.. ప్రాకృతిక శోభలు
దసరా అంటే ఆయుధాల పూజ మాత్రమే కాదు బంతి పూల సింగడీ పూజ. లేఎండ తగిలిన పచ్చగడ్డి భూతల్లికి వేసే ఆవిరి ధూపం. మెట్ట ప్రాంతాల సౌరభం. స్త్రీలు ఎర్రమట్టితో అలికే ఇంటి ముంగిలి కళ. చెరువులు నిండి, వాగులు పొంగే కాలం. ప్రతి ఊరిలో పట్టనలవిగాని సంబరం... ‘దసరా’ గురించి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న చెబుతున్న విశేషాలు.దసరా పండుగ మా దక్షిణ తెలంగాణ లో గొప్పగా జరుపుకుంటాం. దుందుభి, కృష్ణ నదుల నడిమధ్యన ఉండే ప్రాంతం మాది. చిన్నప్పుడు దసరా వస్తే ఊళ్లో ‘అమ్మా వినవే జామి’... అని జమ్మిచెట్టు మీద కట్టిన జానపద పాటలు స్త్రీల నోటి నుంచి వినిపించేవి. జమ్మి చెట్టు మీద పాండవులు ఆయుధాలు దాచడం, వాటిని కిందకు దించాక అర్జునుడు యుద్ధం చేసి గెలవడం ఈ విరాట పర్వం అంతా ప్రజలకు ఇష్టంగా మారిన గాథ. అందుకే దసరాకు పాడుకుంటారు. దసరా సమయంలో యక్షగానం ఊరూరా ఉంటుంది. కొన్ని చోట్ల శశిరేఖా పరిణయం ఆడతారు. దసరా పండుగ ప్రాకృతిక శోభ నిండి ఉన్నప్పుడు వస్తుంది. భూమాత వానకు తడిసి, ఎండ తగలడం వల్ల అంత తడిగా, పొడిగా కాకుండా మెత్తగా ఉంటుంది. వేరుశనగ బుడ్డలు అప్పుడప్పుడే గింజ గట్టి పడుతూ ఉంటాయి. జొన్న, సజ్జ, రాగి, కంది పొలాలు పంటతో మురిసి పోతూ ఉంటాయి. అలసందలు ఆ సమయంలోనే కోతకు వస్తాయి. పెసర, బీర తీగలు, కాకర పాదులు, చిక్కుడు చెట్లు కళకళలాడుతుంటాయి. నా చిన్నప్పుడు మాకున్నది మూడు నాలుగు ఎకరాలే అయినా మా చేనులో చిన్న గుడిసె ఉంటే అక్కడే ఉండేవాణ్ణి. పంటలు పండిన పొలాల మీదకు గువ్వలు వస్తాయి. వాటిలో పాలపిట్టను చూసి సంతోషపడేది. పండగ రోజు మాత్రమే కాదు.. ఆ సీజన్లో ఎప్పుడు పాల పిట్ట కనపడినా ఎంతో సంతోషం కలుగుతుంది. దానిని చూడటం శుభకరం అని భావిస్తారు. దసరా నాటికి వానలు పడి చెరువులు నిండి ఉంటాయి. వాగులు పారుతుంటాయి. చేపలు ఎదురెక్కుతుంటాయి. నల్ల తుమ్మలు నిండుగా గాలికి ఊగుతుంటాయి. వలస పక్షులు వాలుతాయి. పండగ సమయంలో దేవతలు, యక్షులు పక్షుల రూపంలో వచ్చి వాలుతాయని అనుకునేది. అందుకే ‘తిప్ప తీగల వీణ మీటుతూ రాగమాలికలు పాడే పిట్టలు’ అని రాశాను. తెలంగాణలో దసరా పండగకు తప్పనిసరిగా ఆడబిడ్డలను పదిరోజుల ముందే తీసుకు వస్తారు. స్త్రీలు ఎర్రమట్టి తెచ్చి ఇల్లంతా సుందరంగా అలుక్కుంటారు. ఆ ఎర్రమన్ను తెచ్చుకునే సమయంలో స్త్రీలు కదిలి వస్తుంటే చూసి పిల్లలందరం పండగ కళ రాబోతున్నదని కేరింతలు కొట్టేవాళ్లం. దసరా సమయానికే సీతాఫలం చెట్లు విరగకాసి ఉంటాయి. మా చిన్నప్పుడు వాటిని కాల్చుకుని తినడం గొప్ప ఆహారం. ఎన్ని తినేవారమో లెక్కే లేదు. దసరా అంటే పూల పండగ. సమయంలో ఊరిలో, ఇళ్లలో, పొలాల గట్ల మీద బంతి పూలు పూస్తాయి. వాటిని తెచ్చి మామిడాకులు, పోక పూలు అన్ని కలిపి ప్రతి ఇంటి దర్వాజాలకు, ద్వారబంధాలకు కళాత్మకంగా కట్టి శోభను తీసుకు వస్తారు. దసరా అంటే బరిలో గెలిచిన ఆయుధ పూజ మాత్రమే కాదు బంతిపూల సింగడి పూజ. దసరా సమయంలో నేలంతా రకరకాల గడ్డి మొలిచి ఉంటుంది. ఎండ తగిలినప్పుడు సూర్యకిరణాల తాపంతో వీటి నుంచి సన్నటి ఆవిరి లేచి భూతల్లికి ధూపం వేసినట్టు ఉంటుంది. ఆ గడ్డి మీదుగా వీచే గాలిలోని వాసన ఎంతో అద్భుతంగా ఉంటుంది. పండగ రోజు జమ్మి కోసం వెళ్లడం... దానికి బండ్లు కట్టడం అదో ఉత్సవం. నా చిన్నప్పుడు నా స్నేహితులు నాగయ్య, మల్లయ్య, బుచ్చయ్య, అంజయ్య, కూర్మయ్య మా మేనమామ నరసింహయ్య మేమందరం తప్పనిసరిగా కలిసేవాళ్లం. మేం మాత్రమే కట్టుగా ఉండి పొలాల వెంట తిరిగేవాళ్లం. ఈ కాలంలోనే ఈత కల్లు మొదలవుతుంది. నురగ పడుతది. దసరా పండగలో తినడం, సంతోషంగా గడపడం ప్రజలకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. దసరా దశ దిశలా సంతోషాలు తెచ్చే పండుగ. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని వైఎస్ జగన్ అన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.‘‘చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు.#Dussehra— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025 -
వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబో.. ఈ దసరా అదిరిపోవాలంతే!
పండగ అంటేనే ఇంటిల్లి΄ాదీ కలిసి నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జరుపుకోవడం. ఆ ఆనందాన్ని ఈ దసరా సందర్భంగాప్రత్యేకమైన దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, స్వీట్తో ఆస్వాదిద్దాం. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే భాగంగా స్పెషల్ వంటకాల తయారీ గురించి చెఫ్ గోవర్ధన్ మనకు వంటిల్లులో వివరిస్తున్నారు. కద్దూ కా ఖీర్ (సొరకాయ పాయసం)ఈ పాయసం ఒక రిచ్, క్రీమీ డెజర్ట్. ప్రత్యేక పండుగ సందర్భాల్లో, విందుల్లో వడ్డించడానికి అద్భుతంగా ఉంటుంది. కావలసినవి: సొరకాయ తురుము (గింజలు లేకుండా) – 500 గ్రా.లు; నీళ్లు – 500 మి.లీ; పాలు – 500 మి.లీ; యాలకుల పొడి – బీ టీ స్పూన్; వెనిల్లా ఎసెన్స్ – 10 మి.లీ; పంచదార – 250 గ్రా.లు (లేదా రుచికి తగినంత); పిస్తా – 50 గ్రా.లు; బాదం – 50 గ్రాములు; మిల్క్మేడ్ – 400 మి.లీ; కోవా – 250 గ్రా.లు; ఆకుపచ్చ ఫుడ్ కలర్ – 5 గ్రా.లు; బాస్మతి బియ్యం (నానబెట్టి, మెత్తగా రుబ్బినది) – 200 గ్రా.లు; నెయ్యి – 100 గ్రా.లు; రోజ్వాటర్ – 15 మి.లీ + 30 మి.లీ నీళ్లు; జీడిపప్పు – 50 గ్రా.లు;తయారీ: ∙తురిమిన సొరకాయను 500 మి.లీ నీళ్లలో ఉడికించాలి. అవసరమైతే నీళ్లు వడకట్టాలి; ∙ఒక మదపాటి పాన్లో ఉడికిన సొరకాయ తరుగు, పాలు, మిల్క్మేడ్, కోవా వేసి సన్నని మంటపై ఉడికించాలి; ∙నానబెట్టి, రుబ్బిన బాస్మతి బియ్యప్పిండి వేసి, మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి; ∙యాలకుల పొడి, వెనిల్లా ఎసెన్స్ చక్కెర, పిస్తా, బాదం, జీడిపప్పు వేసి బాగా కలపాలి; ∙నెయ్యి, రోజ్వాటర్ (నీటితో కలిపినది) వేసి కలపాలి; ∙గ్రీన్ ఫుడ్ కలర్ని రెండు టేబుల్ స్పూన్ల నీటిలో కలిపి, మిశ్రమంలో వేసి కలపాలి ∙ఈ కద్దూ క ఖీర్ ను వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయవచ్చు.చంపారణ్ మటన్ కర్రీ మాంసాహారులకు దసరా రోజున తప్పనిసరిగా మాంసాహార వంటకాలు తినడం ఆచారం. ఇది బీహార్లోని చంపారణ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వంటకం. మసాలా రుచులు, సువాసనలు దీని ప్రత్యేకత. కావల్సినవి: మటన్ (బోన్తో) – 1 కేజీ; ఆవ నూనె – 30 మి.లీ; నెయ్యి – 50 గ్రా.లు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – 300 గ్రా.లు; ఉప్పు – తగినంత; కారం – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – 2 టీ స్పూన్లు; ఉల్లి΄ాయ (సన్నగా తరిగినది) – 1; జీలకర్ర పొడి – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; కాశ్మీరి మిర్చి పొడి – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – అర నిమ్మకాయ; సోంపు పొడి – టీ స్పూన్; గరం మసాలా పొడి – 2 టీ స్పూన్లు; లవంగాలు – 12; మిరియాలు – 15; దాల్చిన చెక్క – 4 చిన్న ముక్కలు; బిరియానీ ఆకులు – 6; పుదీనా – కట్ట; కొత్తిమీర – కట్ట; పచ్చి మిర్చి (చీల్చినవి) – 4.తయారీ: ∙మ్యారినేట్ చేయడానికి ఒక గిన్నెలోకి మటన్ను తీసుకోవాలి ∙అందులో పెరుగు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ జీలకర్ర ΄పొడి , టీ స్పూన్ ధనియాల ΄ పొడి వేసి బాగా కలిపి, అరగంట సేపు అలాగే ఉంచాలి ∙ఒక పాత్రలో ఆవనూనె వేసి వేడి చేయాలి ∙అందులో దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిరియానీ ఆకు వేసి వేయించాలి ∙మ్యారినేట్ చేసిన మటన్ వేసి ఉడికించాలి. అవసరమైతే నీళ్లు వేసుకోవచ్చు.(పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే! )మసాలా కోసం... మరో పాత్రలో నెయ్యి వేడి చేసి, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి ∙ఉడికిన మటన్ను ఈ మసాలా మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙తరువాత సోంపు పొడి, గరం మసాలా, కాశ్మీరీ మిర్చి పొడి, నిమ్మరసం వేసి కలపాలి ∙చివరగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి అలంకరించాలి ∙ఈ చంపారణ్ మటన్ కర్రీని వేడిగా అన్నం లేదా రోటీతో వడ్డించాలి. కాబూలీ బిర్యానీ ఈ కాబూలీ బిర్యానీ ప్రత్యేకత – శనగపప్పు, బాస్మతి బియ్యం, మసాలాల కలయికతో వచ్చే రుచిని ఆస్వాదించాల్సిందే!(ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!)కావల్సినవి: శనగపప్పు – 500 గ్రా.లు (నానబెట్టి ఉడికించాలి); బాస్మతి బియ్యం – 500 గ్రా.లుమ్యారినేట్కి... నూనె – 50 మి.లీ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన ఉల్లిపాయ – 100 గ్రాములు; కారం – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూన్; ఉప్పు – తగినంత; జీలకర్ర పొడి – టీ స్పూన్; ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా పొడి – టీ స్పూన్; నెయ్యి – 50 గ్రా.లు; నిమ్మరసం – అర నిమ్మకాయ; పుదీనా (తరిగినది) – ఒక కట్ట; కొత్తిమీర (తరిగినది) – ఒక కట్ట; పచ్చిమిర్చి (చీల్చినవి) – 4; పెరుగు – 200 గ్రాములు;అన్నం వండటానికి... నీళ్లు – 3 లీటర్లు; బిరియానీ ఆకు – 3; షాజీరా – టీ స్పూన్; దాల్చిన చెక్క – 4 చిన్న ముక్కలు; యాలకులు – 6; లవంగాలు – 6; జాపత్రి – 2; పచ్చిమిర్చి (చీల్చినవి) – 4; పుదీనా (తరిగినది) – ఒక కట్ట; కొత్తిమీర (తరిగినది) – ఒక కట్ట; ఉప్పు – తగినంత;తయారీ: ∙ శనగపప్పు నానబెట్టి, ఉడికించాలి; ∙బియ్యాన్ని వేయించి పక్కన పెట్టాలి.మ్యారినేట్కి... ∙పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయ, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర΄ పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నెయ్యి, నిమ్మరసం, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, చీల్చిన పచ్చిమిర్చి వేసి కలపాలి ∙ఈ మిశ్రమంలో ఉడికించిన శనగపప్పు వేసి కనీసం 30 నిమిషాల సేపు మ్యారినేట్ చేయాలి.బిర్యానీ తయారీ.. ∙3 లీటర్ల నీటిలో బిరియానీ ఆకులు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి మరిగించాలి. అందులో వేయించిన బాస్మతి బియ్యం వేసి ముప్పావు వంతు వరకు ఉడికంచాలి అదనపు నీరు వడకట్టేయాలి.లేయరింగ్కి... ∙ఒక పాత్రలో అన్నం, మ్యారినేట్ చేసిన శనగపప్పు మిశ్రమాన్ని పొరలుగా వేసుకోవాలి ∙తక్కువ మంటపై (దమ్లో) 10–15 నిమిషాలు ఉంచాలి ∙కొత్తిమీర, పుదీనాతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. -
ఏవండీ దసరా పండుగకు నెక్లెస్ కొంటారా..!
రాయవరం: ‘ఏవండీ దసరా పండుగకు నెక్లెస్ కొంటారా..’ అంటూ గారాలు పోతున్న భార్యల వైపు భర్తలు బేల చూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగారం ధర చూస్తే బేర్మనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల మార్కుకు చేరుకుంది. బంగారం ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తున్నాయి. కదం తొక్కుతున్న కాంచనానికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పుత్తడితో పాటుగా తానూ ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా వెండి ధరలు కూడా విర్రవీగుతున్నాయి. స్వర్ణం వైపు చూడాలంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం వివాహాల సీజన్ తిరిగి ప్రారంభం కావడంతో వివాహాలు నిర్వహించే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే భయం భయంగా షాపుల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఇంతింతై వటుడింతై అన్నట్లుగా...పసిడి, వెండి ధరలు ఇంతింతై వటుడింతై అన్న చందంగా పెరుగుతున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. జనవరి నెలలో 10 గ్రాముల బంగారం రూ.80 వేల వరకు పలకగా, జూలై నాటికి రూ.లక్షకు చేరుకుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరుగుతూ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.1.20 వేలకు చేరుకుంది. ఆగస్టు, సెప్టెంబరు నెలలో సుమారు 10 గ్రాములకు రూ.20 వేల వరకు పెరిగింది. ఇదిలా ఉంటే వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి ధర రూ.92 వేలు పలుకగా, జూన్లో రూ.1.10 లక్షలు, జూలైలో రూ.1.11 లక్షలు, ఆగస్టులో రూ.1.11 లక్షలు ఉన్న కేజీ వెండి ధర నేడు రూ.1.50 లక్షలకు చేరింది. వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి అదే తరహాలో లాభాలు వచ్చాయి. బంగారంతో పాటుగా వెండి ధర కూడా పరుగులు తీస్తూనే ఉంది. త్వరలోనే కేజీ రూ.2 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలున్నాయి.మదుపరుల ముందుచూపే కారణమా?పసిడి, వెండి ధరలు పెరుగుదలకు బులియన్ మార్కెట్ విశ్లేషకులు పలు రకాల కారణాలు పేర్కొంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్, గాజా మధ్య జరుగుతున్న యుద్ధంతో పాటుగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావంతో పసిడి ధర రోజు రోజుకు పరుగులు తీస్తోంది. దీనికితోడు బంగారంపై పెట్టుబడి సురక్షితంగా భావిస్తున్న మదుపరులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణంగా వర్తకులు భావిస్తున్నారు.జిల్లాలో పరిస్థితి ఇదీ..కరోనా తర్వాత బంగారం వ్యాపారం బాగా తగ్గిపోయినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. అంతకుముందు వారానికి ఆరు రోజులు వ్యాపారం సాగగా, ఇప్పుడు వారానికి నాలుగు రోజులు మాత్రమే వ్యాపారం సాగుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. పెద్ద షాపుల్లో రోజుకు 500 గ్రాముల వరకు అమ్మకాలు జరుగుతుండగా, చిన్న షాపుల్లో 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి 2,500 వరకు బంగారం విక్రయాల షాపులున్నాయి. ఉమ్మడి జిల్లాలో కరోనాకు ముందు రోజుకు 20 కేజీల చొప్పున బంగారం అమ్మకాలు జరగ్గా, ప్రస్తుతం 15 నుంచి 18 కేజీల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. సీజన్ బట్టి ఈ అమ్మకాలు అటూఇటూగా ఉంటాయి. బంగారంతో పాటుగా వెండి అమ్మకాలు కూడా తగ్గాయి. ఆరు నెలల క్రితం వెండి కిలో రూ.50వేలు ఉండగా, ఆరు నెలల కాలంలో రూ.1.50 లక్షలకు చేరింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో వెండిని ఎలక్ట్రానిక్స్, సాంకేతిక అవసరాలకు ఉపయోగించడం, ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడంతో బంగారం, వెండి ధరలు ఊహించని పెరుగుదల కన్పించి ఆల్టైమ్ రికార్డుకు వాటి ధరలు చేరుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.లాభాలు కళ్ల చూస్తున్న బడాబాబులుబంగారం ధర పెరగడంతో బడా బాబులు లాభాలు కళ్ల జూస్తున్నారు. ధర పెరుగుతుందన్న ముందుచూపుతో పలువురు మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. వడ్డీ వ్యాపారం చేసే వారు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో 100 గ్రాముల వంతున బిస్కెట్లు కొన్నారు. మరికొందరు 50 నుంచి 70 కాసుల మధ్య వడ్డాణం వంటి వస్తువుల్ని తయారు చేయించుకున్నారు. ప్రస్తుతం ధర రూ.లక్ష దాటడంతో వీరందరిలో జోష్ నెలకొంది. పెట్టిన పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం వరకు లాభాలను చూశారు. -
వైభవంగా శ్రీవారి రథోత్సవం..గోవిందనామస్మరణతో మారుమోగిన తిరుమల (ఫొటోలు)
-
ఒంగోలులో ఘనంగా శ్రీ కనకదుర్గ కళార గ్రామోత్సవం (ఫొటోలు)
-
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!
విజయవాటిక యందు విజయదుర్గ నామమున నున్న జగదంబ కోమలాంగి సిరులు కురిపించు, భగవతిసింధుతనయ! కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!హస్తముల పుష్పశరమును, అంకుశమ్ము, నెన్నుదుట కాంతి జిమ్మెడి నేత్రమొకటి, విశ్వజనని లలితగా వెలసినట్టి కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!అష్టభుజములు ధరియించి దుష్టులైన రక్కసుల గర్వమణచిన రౌద్రమూర్తి! సర్వమంగళదాయిని జగము లేలు కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!అక్షమాల అలరుచుండ హస్తమందు పుస్తకమును దాల్చి వేరొక హస్తమందు, కమలమందున కూర్చున్న కల్పవల్లి! కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!పాయసాన్నంబు నిండిన పాత్రతోడ ‘అన్నపూర్ణ’వై కృపగాంచు కన్నతల్లి! భక్తులకు వరము లొసంగు భాగ్యరాశి కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!– డా. జంధ్యాల పరదేశి బాబు, విశ్రాంత తెలుగు ఆచార్యులు ‘91219 85294 -
విజయాలను ఒసగే విజయదశమి అంతరార్థం ఇదే..!
ఈ విజయదశమికి ఆత్మజ్ఞానాన్ని మన జీవితాలలో ఉదయించన్నవ్విండి అని పిలుపునిచ్చారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశింకర్. విజయదశమిని మనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకింటున్నాం, నిజానికి ఈ యుద్ధం మంచికి, చెడుకి మధ్య కాదు. వేదాంత పరంగా చూసినప్పుడు, బయట ప్రపంచంలో కనిపించే ద్వైతభావనపై అనంత వ్యాప్తమై ఒకటిగా మాత్రమే ఉన్న సత్యం సాధించే విజయిం అది. శుద్ధచైతన్య స్వరూపమైన జగన్మాతే అన్ని రూపాలు, నామాలలో న్నిండి ఉంది. ఈ విధంగా అంతట నిండి ఉన్న ఒకే ఒక్క దైవత్వాన్ని అన్ని రూపాలలోనూ దర్శించగలగటమే ఈ పండుగ పరమార్థం. దైవీభావనకు, ఆసురీభావనకు జరిగే ఈ యుద్ధం బయట ప్రపంచంలో మాత్రమే కాదు, అది మన మనసులో ఎపుుడూ జరుగుతూనే ఉంది. విజయదశమినాడు రావణుడి బొమ్మను దహనం చేయటం మనం చాలాచోట్ల చూస్తున్నాం. రావణుడు అహంకారానికి చిహ్నం. అహం అంటే 'నేను వేరు' అనే తప్పుడు భావన. దాంతో వాళ్ల చుట్టూ వాళ్లే గోడలు కట్టుకుంటాం. ఆ అహంకారన్ని అణిచేందుకు వాళ్లకంటే వేరుగా మరొకరు (నేను వేరు, అతడు/ఆమె వేరు అనే భావన) కావాలి. ఆత్మవిశ్వాసానికి ఆ అవసరం లేదు. తాము ఇతరుల కంటే గొప్పవాళ్లమని అహంకారులు అనుకుంటారు. ఇక రాముడు ఆత్మజ్ఞానాన్నకి ప్రతీక. శ్రీరాముడు ఆత్మను, ఆత్మజ్ఞానాన్ని కూడా సూచిస్తాడు. వ్యక్తిలో ఆత్మజ్ఞానం (రాముడు) ఉదయించినపుడు, లోపల ఉన్న అహంకారం, చెడు భావన రూపంలో ఉన్న రావణుడు సంపూర్ణంగా నశించిపోతాడు. దీనికి సూచనగా ఈరోజు మనం మనలో ఉన్న చెడు భావనలను జ్ఞానం అనే అగ్నికి ఆహుతి ఇస్తాం (సమర్పిస్తాము). ఆ విధంగా సమర్పించటం వల్ల మన అంతరంగ వికాసం ఆరంభం అవుతుంది. మనలో అద్భుతమైన ఆనందం పెలులబుకతుంది, అది మనకే కాక సమాజమంతటికి మంచి చేస్తుంది. ఈ సంత్సర కాలమంతా సేకరించుకుపి మన మనసులో పేరుకున్న ఇష్టాఇష్టాలు, రాగద్వేషాలపై మనం విజయిం సాధించటాన్ని ఈ విజయదశమి రోజు సూచిస్తుంది. దైవీభావనల ఎఱుక మనలో కలిగినపుడు అది నిజమైన విజయం. అపుడు మన జీవితంలో శాంతి, ఆనందం, సౌభాగ్యం కలుగుతాయ. చెడు భావనలు మనలను ఆక్రమించుకున్నప్పుడు మనం దుుఃఖాన్ని, కష్టాలనును అనుభవిస్తాము. అందుకే వేదకాలంలో ప్రజలు ఒకర్నొకరు పలకరించుకనేటపుుడు “ఆరోగ్యమస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు” (మీరు ఆరోగ్యంగా, తృప్తిగా ఉండాలి, మీ కార్యాలు శుభకరంగా జరగాలి) అన్న చెప్పేవారు. రావణ వినాశనం అనేది తిరుగులేని రామబాణంతో మాత్రమే జరుగగలదు. అదే విధంగా అన్నిరకాలైన చెడుభావనలు, మానసిక చాంచల్యాలపై ఆత్మజ్ఞానంతోనే విజయిం సాధించగలం. సరే, మరి ఈ ఆత్మజ్ఞానాన్ని పిందటిం ఎలా? (హిందీలో) విశ్రామ్ మే రామ్ హై (విశ్రాంతి లో రాముడు ఉన్నాడు) అన్న చెపునటులగా, ప్రగాఢమైన విశ్రాంతి ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. ఈనాటి సమాజంలో మనం చూస్తున్న అలజడులన్నిటికీ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత లేకపోవటమే కారణం. “నే నెవరు?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతే కాదు, మీరు ఎవరు కాదు అని కూడా అడగిండి. “నేను ఈ శరీరాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు...” ఇలా విచారించి చూసినపుడు చివరికి ఏం మిగులుతిందో గమన్నించిండి! ఈ విధంగా మన స్వస్వభావాన్ని గమనించుకోవటం అనేది మన ఆత్మను ఉత్తేజపరచి మనలో సింతృప్తిని పెంపొందిస్తుంది. ఒక మనిషి మనసులో ఈ ప్రశ్నలు రేకెత్తిన మరుక్షణమే అతని జీవితంలో కష్టాలు, చెడు భావనలు అంతరించిపోవట ఆరంభమవుతుంది. అయితే, ఎంత విచారించినా సరే మళ్ళీమళ్ళీ మన మనసు వేసే చిక్కుముళ్లలో మనం పడుతూనే ఉంటాం. ఇవి మనకు మనమే వేసుకుంటున్న బంధాలు. ఈవిధమైన గందరగోళ స్థితినే యోగులు మాయ అపి పిలిచారు. ఈ మాయ నుంచి బయటపడేందుకే మనక ధ్యానం అవసరం. అందుకే, ఈ ముసుగును తొలగించుకునేందుక అనేక మార్గాలు సూచించారు: మనం పండుగలు, ఉత్సావాల జరుపుకుంటాము, జగన్మాతను ఆరాదిస్తాం, దైవం మనలోపలే ఉన్నదని, అంతే కాక విశ్వమంతా స్వచ్ఛమైన చైతన్యంగా నిండి ఉన్నదని మనకు మనమే గుర్తుచేసుకుంటాం. ఈ సమస్త విశ్వం ఆ ఏకైక చైతన్యపు లీల. దీన్నే మనం పదేపదే తప్పక గుర్తు చేసుకోవాలి అని అన్నారు గురుదేవ్ రవిశంకర్.(చదవండి: నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..) -
దేవీనవరాత్రులు.. దుర్గమ్మను దర్శించుకున్న ప్రియాంక చోప్రా (ఫోటోలు)
-
మహిళల్లోనే మహాశక్తి
‘‘మనందరిలో ఓ దుర్గా మాత ఉంది. ఆ శక్తిని మనం గ్రహించగలిగితే మనం ఏదైనా సాధించగలం. స్త్రీలు అనుకుంటే ఎలాంటి సవాల్ని అయినా అద్భుతంగా ఎదుర్కొంటారని నా నమ్మకం’’ అంటున్నారు పూజా హెగ్డే(Pooja Hegde). సౌత్–నార్త్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఆమె ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు...ఈ నవరాత్రి రోజుల్లో మా కుటుంబం మొత్తం శాకాహారులుగా మారిపోతాం. ఈ పండగ అప్పుడు కుదిరితే గుడికి వెళతాను. లేకపోయినా నాకు తరచూ గుడికి వెళ్లడం అలవాటు. మన ఎనర్జీ లెవల్స్ బాగుండటానికి మనం గుడికి వెళ్లడం మంచిది అని నా అభిప్రాయం. గుడిలో కాలు పెట్టగానే తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం క్షేమంగా ఉండటానికి ఆ ఎనర్జీ పనికొస్తుంది. అందుకే గుడికి వెళ్లడాన్ని నేను బాగా నమ్ముతాను. → నవరాత్రి టైమ్లో ఉపవాసం ఉండను కానీ నాకు ఫాస్టింగ్ అంటే నమ్మకం. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఉపవాసం ఉండేవారు. తొమ్మిది రోజులు కేవలం నీరు మాత్రమే తీసుకునేవారు. అంత కఠినమైన ఉపవాసం ఆచరించేవారు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ‘అంగారిక సంకష్ట చతుర్ది’ నాడు, మహా శివరాత్రికి తప్పకుండా ఫాస్టింగ్ చేస్తాను. → చాలా సంవత్సరాలుగా నేను దాండియా ఆడలేదు. ఓ పదేళ్ల క్రితం నా స్నేహితులతో కలిసి దాండియా ఆడటానికి వెళ్లాను. గర్బా డ్యాన్స్ పోటీ జరుగుతోందని అక్కడికి వెళ్లాక తెలిసింది. ఈ కాంపిటీషన్ కోసం కొన్నిగ్రూప్స్ సభ్యులు ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి మరీ పాల్గొంటారని తెలిసి, ఆశ్చర్యపోయాను. వాళ్ల డ్యాన్స్ నిజంగా అద్భుతం. నేను కూడా ఒక గ్రూపులోకి వెళ్లి, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. → ప్రతి మహిళలోనూ ఓ శక్తి ఉంది. మనలో ఆ శక్తి స్వరూపిణి దుర్గా మాత ఉందని గ్రహించాలి. నవరాత్రి అంటే మనలో ఉన్న ఆ దేవిలోని పలు షేడ్స్ని సెలబ్రేట్ చేయడమే. మన లోపల ఉన్న దైవిక స్త్రీత్వాన్ని గుర్తించడమే. అయితే నేనిప్పటివరకూ గమనించినంతవరకూ స్త్రీలకు ఏదైనా సవాల్ ఎదురైతే అద్భుతంగా అధిగమించే నేర్పు వారికి ఉందని తెలుసుకున్నాను. కానీ మనకు మనంగా పరిష్కరించుకోగలుగుతాం అనే విషయం మనకు అర్థం కావాలి. లోపల దాగి ఉన్న ఆ శక్తిని గుర్తించి ముందుకెళితే మన వల్ల కానిది ఏదీ లేదు.→ నవరాత్రి సమయంలో నాకు బాగా నచ్చినది ‘హవన్’ (హోమం). హవన్లో బియ్యం, నువ్వులు, ధాన్యాలు, నెయ్యి వంటివి సమర్పించి, ఆ దుర్గా మాత ఆశీర్వాదాన్ని కోరతాం. హవన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు వెచ్చగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మామూలుగా నవరాత్రి అప్పుడు బంధువులు ఇంటికి వస్తుంటారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ‘హవన్’కి మాత్రం అందరూ హాజరవుతారు. అలాగే పసుపు ఆకు తింటాం. ఆ ఆకు నుంచి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. నా చిన్నప్పటి తీపి గుర్తుల్లో ఇదొకటి.→ మా ఇంట్లో తొమ్మిది రోజులు పండగను చాలా శ్రద్ధగా చేస్తాం. ఇందాక నవరాత్రి సమయంలో ఆచరించేవాటిలో నాకు ‘హవన్’ ఇష్టం అని చె΄్పాను కదా. అష్టమి రోజున అది చేస్తాం. మేం లక్ష్మీ పూజ కూడా బాగా చేస్తాం. అలాగే ‘మాంజో లిరెట్టా గట్టి’ అని వంటకం చేస్తాం. కొబ్బరి తురుము, బెల్లం కలిపి ముద్దలా కలిపి, పసుపు ఆకులో పెట్టి ఉడికిస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓ పట్టు పడుతుంటాను. → దసరా అనగానే మనకు చెడుపై మంచి గెలుపు అనేది గుర్తొస్తుంది. నా వరకూ నా చుట్టూ ఉన్న చెడు గురించి, చెడు చేసేవాళ్ల గురించి అస్సలు పట్టించుకోను. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడంపైనే దృష్టి పెడతాను. వందకు వంద శాతం పని చేయడం... మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లడం... ఈ రెంటినీ ఫాలో అవుతాను. అప్పుడు ఎన్నో రెట్లు రూపంలో మంచి మన వద్దకు వస్తుందని నమ్ముతాను. ఇక చెడు చేసిన వారి గురించి ఆలోచించకుండా... మానవులకు అతీతమైన ‘ఉన్నత శక్తి’కి వదిలేస్తాను.నవరాత్రి సమయంలో మా ఇంట్లో బాగా భజనలు చేస్తాం. నా చిన్నప్పట్నుంచి ఇప్పటివరకూ ఒకే పద్ధతిలోనే పండగ జరుపుకుంటూ వస్తున్నాం. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు. కానీ మన ఆచారాలను మనం ఎప్పుడూ ఒకేలా పాటించాలి. ఇప్పుడు వర్క్ షెడ్యూల్స్ వల్ల నేను చాలా పండగలను మిస్సవుతున్నాను. అయితే ఏ మాత్రం వీలు కుదిరినా పండగలప్పుడు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తాను.– డి.జి. భవాని -
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జోరు వర్షంలోనూ ఆగని గర్భా నృత్యం..!
దసరా వేడుక కొన్ని చోట్ల విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ సంప్రదాయలకు అనుగుణంగా జరిగే పూజ ఆచారాల కారణంగానే అవి వార్తల్లో నిలుస్తాయి. కొన్ని చోట్ల గర్భా, దాండియా వంటి నృత్యాలతో జరుపుకుంటే..మరికొన్ని చోట్ల నైవేద్యాల పరంగా విశిష్టతను కలిగి ఉంటాయి. జనసందోహంతో ఘనంగా జరుపుకుంటున్న పండుగ సమయంలో అనుకోని అతిథిలా వర్షం వస్తే..అబ్బా ఎంత పనిచేసిందంటూ..తల తడవకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని సమీపంలోని చెట్ల వద్దకు, లేదా ఇళ్లు/షెడ్డు వద్దకు వస్తాం. కానీ ఈ వ్యక్తి పండుగ సంబరం ఆగకూడదు..ఆ సరదా పోకూడదనుకున్నాడేమో అంతటి జోరు వర్షంలోనూ అలా గర్భా నృత్యం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే దటీజ్ గర్భా పవర్ అన్నట్లుగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడమే కాదు, నెటిజన్లను తెగా ఆకర్షించింది. ఆ వీడియోలో చత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి సంప్రదాయ బ్లాక్ కలర్ డ్రస్ ధరించి, కుండపోత వర్షంలో కూడా ఆగకుండా గర్భా నృత్యం చేస్తున్న కమనీయ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, గుజరాత్ నవరాత్రి వేడుకలకు పెట్టింది పేరు. పైగా ఇక్కడ జరిగే గర్భా రాత్రులు అత్యంత ప్రజాదరణ కలిగినవి. రంగురంగుల సంప్రదాయ దుస్తులతో చేసే గర్భా నృత్యాలు ప్రజలందర్నీ అమితంగా ఆకర్షిస్తాయి. అందులోనూ ఈ ఏడాది పదిరోజులు కాకుండా పదకొండు రోజుల కావడంతో మరింత వైభవోపేతంగా చాలాపెద్ద పెద్ద గర్భారాత్రులు నిర్వహిస్తున్నారు కొందరు. View this post on Instagram A post shared by Parth Suri (@parth_suri) (చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ..) -
తిరుమల బ్రహ్మోత్సవాలు..సూర్యప్రభ వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..
ఇప్పుడు బనానా ఏఐ నయా ట్రెండ్తో ఏది రియల్, ఏది ఫేక్ పోటో/వీడియోనో గుర్తించడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేసింది. అందులోనూ శరన్నవరాత్రుల సమయంలో ఇలాంటి కమనీయ దృశ్యం కంటపడితే..దుర్గమ మహిమ లేక ఇది నమ్మదగినది కాదో అన్న సందేహాలను లేవనెత్తింది భక్తుల్లో. చివరికి అది ఫేక్ కాదని తేలాక..ఒక్కసారిగా 'మా దుర్గ' అన్న నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఇంతకీ ఏంటా అపురూపమైన దృశ్యం అంటే..ఒక దుర్గమ్మ ఆలయం వెలుపల కాపలా కాస్తున్న సింహం వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. మొదట చూడగానే అందరూ ఏఐ మాయ అనుకున్నారు. కానీ దాని గురించి సాక్షాత్తు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ షేర్ చేయడంతో అది రియల్ అని నమ్మారు. ఆ దైవిక దృశ్యం చూడటం అదృష్టం అన్నంతగా బావించారు నెటిజన్లు. ఒక్కసారిగా నెట్టింట ఆ ఆలయానికి ఆ సింహం రక్షణగా ఉందేమో అనే చర్చలు లేవనెత్తాయి. అయితే ఇది గిర్ అడవిలోనిదని, అక్కడ చాలా దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయని, వాటికి కాపలాగా ఈ సింహలు ఉంటాయని ఓ నెటిజన్ పోస్ట్లో పేర్కొన్నాడు. అంతేగాదు గిర్ అటవీ ప్రాంతంలో తిరిగే ఈ సింహాలు మానవులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని అన్నారు. అవి గుజరాత్లోని సౌరాష్ట్రా ప్రాంతంలో కనిపించే అరుదైన సింహ జాతిగా అని పేర్కొనన్నారు నెటిజన్లు. ఇక ఆ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలకు ఆ వన్య ప్రాణులకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఆ వీడియో హైలెట్ చేస్తోందని అన్నారు. కాగా, భారతదేశంలో సింహాల జనాభా 2020లో 674 కాగా, 2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 70 శాతంపైగా సింహాల సంఖ్య పెరిగిందని ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.What a divine sight. Look like that lioness is guarding the temple !! pic.twitter.com/bBlxlmKD4m— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2025 (చదవండి: అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..! మతసామరస్యాన్ని ప్రతీకగా..) -
విదేశీ పూలతో వింతగా..!
తెలంగాణలోనే అత్యంత ఖరీదైన బతుకమ్మను పేర్చి కూకట్పల్లికి చెందిన పలువురు అబ్బురపరుస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన గుండాల అర్చన విదేశాల నుంచి పూలను తెప్పించి గత మూడేళ్లుగా వింతగా బతుకమ్మను పేరుస్తున్నారు. మొదట తామర పువ్వు ఆకారంలోనూ, రెండో ఏడాది హంస ఆకారంలోనూ, ఈ ఏడాది ఏనుగు బొమ్మలతో కూడిన బతుకమ్మను పేర్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈసారి బతుకమ్మ కోసం థాయిలాండ్ ఆర్చిడ్స్, సింగపూర్ రోజెస్, బ్యాంకాక్ కాచెన్స్, బెంగళూరు బెజస్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ నుంచి జిప్సోమియా పూలను తెప్పించినట్లు చెబుతున్నారు. ఆకట్టుకున్న ‘భక్తి శక్తి’ నవరాత్రుల అర్థాన్ని బెంగళూరుకు చెందిన కూచిపూడి కళాకారులు నృత్యరూపకంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సంగీత నృత్యోత్సవాలు– బతుకమ్మ సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నాట్య గురువు వీణా మూర్తి విజయ్ శిష్య బృందం భక్తి శక్తి పేరిట ప్రదర్శించిన కూచిపూడి దృశ్యాంశాలు వీక్షకులను సమ్మోహన పరిచాయి. పవిత్ర జలం, రంగోలి, ధూపం, దీపం, జాజ్రాలతో వేదికను శుద్ధి చేసే నృత్యం ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా నర్తకి శ్యామక్రిష్ణ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నవదుర్గ తోలుబొమ్మలాట ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, ఆర్ వినోద్ కుమార్ పలువురు కళాకారులు పాల్గొన్నారు. (చదవండి: విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!) -
తిరుమల : అత్యంత వైభవంగా స్వర్ణరథోత్సవంలో శ్రీవారు (ఫొటోలు)
-
అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..!
దుర్గా పూజ హిందూ పండుగ అని తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం హిందూ–ముస్లిం మత సామరస్యంతో జరుపుకోవడంలో ప్రసిద్ధి చెందింది. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లా కొంటైలోని కిషోర్నగర్ గర్ రాజ్బరి వద్ద జరుపుకుంటున్న స్వర్ణదుర్గాదేవి పూజలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని మొదటగా అక్కడి పీర్లకు ఇస్తారు. ఆ తర్వాతే రాజకుటుంబీకులు స్వీకరిస్తారు. భక్తులకు పంచిపెడతారు. ఇలా దాదాపు 300 సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ పూజకు దూర్రప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. హిందూ–ముస్లిం సామరస్యం ఒక ప్రధాన లక్షణం, ఇక్కడ విగ్రహ నిమజ్జనానికి ముందు ముస్లిం పీర్లకు దేవత ప్రసాదాన్ని అందిస్తారు. ముందుగా పూజ సమయంలో ఒక ఉత్సవం జరుగుతుంది, ఈ ఉత్సవంలో కూడా స్థానిక హిందువులతోపాటు ముస్లింలు కూడా పాల్గొంటారు. వీరితోపాటు ఇతర మతాల వారు కూడా పూజలోపాలు పంచుకుంటారు, స్వర్ణదుర్గమ్మకు జీడిపప్పు భోగంపూజ సమయంలో అమ్మవారికి పండ్లు, తీపి పదార్థాలను నివేదిస్తారు. వీటితోపాటు వేయించిన జీడిపప్పు, ఇంట్లో తయారు చేసిన జున్ను, చక్కెరతో వండిన ప్రత్యేక భోగాన్ని నివేదిస్తారు.(చదవండి: ‘విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!) -
‘విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!
సాధారణంగా అమ్మవారికి భక్తులు రకరకాల నైవేద్యాలను వండి ప్రసాదాలను సిద్ధం చేయడం సంప్రదాయం. అయితే ఇక్కడ మాత్రం అమ్మవారు తన నైవేద్యాన్ని తనకు నచ్చిన విధంగా తానే వండుకుంటుంది. అందుకోసం నాణ్యమైన సరుకులు, మసాలా దినుసులు, వంట చెరకు, వంటపాత్రలు సమకూరిస్తే సరి΄ోతుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, పశ్చిమ బెంగాల్ ఝార్గ్రామ్లోని చిల్కిగఢ్ రాజభవనంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం ఇది.స్థానికంగా ‘విరామ భోగ్‘ అని పిలుచుకునే అష్టమి రోజున అమ్మవారు తనకు సమర్పించిన నైవేద్యాన్ని తానే స్వయంగా వండుతుందని నమ్ముతారు. చిల్కిగఢ్ రాజభవనంలో, అష్టమి పూజ పూర్తయిన తర్వాత, ఆలయ ప్రధాన పూజారి ఒక కొత్త మట్టి కుండలో నీరు, బలి మాంసం, ఇతర పదార్థాలను నింపుతాడు. పూజారి మేక బలి మాంసంతో ఏకాంతంగా వంటగదిలోకి ప్రవేశిస్తాడు. సంప్రదాయం ప్రకారం, మాంసాన్ని కొత్త మట్టి కుండలో ఉంచుతారు. దానిలో వివిధ మసాలా దినుసులు కలుపుతారు. తరువాత, మూడు కట్టెలను పొయ్యిలో ఉంచుతారు. ఆ మట్టి కుండను సాల్ చెట్టు ఆకులతో కప్పి, గదిలో పొయ్యిపై పెట్టి, కుండ పక్కన ఒక కొయ్య గరిటె ఉంచుతారు. పొయ్యిలో మూడు కట్టెలు వెలిగించిన తర్వాత, గది బయటి నుండి తాళం వేస్తారు. నవమి రోజు ఉదయం, పూజారి రాజభవనం నుండి తాళం తీసుకుని వచ్చి, ఆ వంటగది తలుపు తెరిచి చూసి, అమ్మవారికి ‘భోగ్‘గా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతాడు. అమ్మవారే స్వయంగా వచ్చి ఈ భోగ్ను వండుకుంటుందని విశ్వాసం. ఈ విషయాన్ని చిల్కిగఢ్ రాజ్బరి ప్రస్తుత వారసుడు తేజసచంద్ర దేవ్ ధబల్దేవ్ స్వయంగా తెలియజేశారు. అమ్మవారు తమ పూర్వికులకిచ్చిన సూచనల మేరకు ఈ విధంగా చేస్తున్నట్లు తెలియజేశారు. (చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
96 ఏళ్లుగా కళాప్రదర్శన
ముంబైలో జరిగే దుర్గా పూజ సాంస్కృతిక వైభవానికి, భక్తికి చిహ్నంగా నిలుస్తోంది. బొంబాయి దుర్గా బారి సమితి ప్రారంభం 1930ల నాటిది. అప్పట్లో బెంగాలీల చిన్న సమావేశంగా ప్రారంభమైన ఈ ఉత్సవం ఇప్పుడు గొప్ప కళా ప్రదర్శనగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా వారు మట్టి, ఎండుగడ్డితో చేసిన పర్యావరణ అనుకూలమైన విగ్రహాన్ని తయారు చేశారు. అక్టోబర్ 1చ మహానవమి నాడు కుమారీపూజ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ధునుచి నాచ్, 2న మహాదశమి నాడు సిందూర్ ఉత్సవ్ జరుగుతుంది, తరువాత గిర్గామ్ చౌపట్టిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ‘ఇది మతపరమైన వేడుక మాత్రమే కాదు, సాంస్కృృతిక కళా ప్రదర్శన కూడా‘ అని చైర్పర్సన్ మితాలి పోద్దార్ అన్నారు. ‘కోల్కతాకు చెందిన ప్రఖ్యాత కళాకారులు స్థానిక యువతతో కలిసి ప్రదర్శనలు ఇస్తారు. ఇది భవిష్యత్ తరాలకు కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం కోసం కూడా. అందుకే మేం ప్రతి సంవత్సరం, పర్యావరణ అనుకూల విధానంతో సంప్రదాయాన్ని పాటిస్తాం–‘ అని చెబుతున్నారామె. వేడుకలతోపాటు పేదపిల్లలకు స్కాలర్షిప్లు, ఆసుపత్రులకు వైద్యపరికరాల విరాళాలు – వంటివి కూడా ఉంటాయి‘ అని మితాలి పేర్కొన్నారు.(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ నృత్యాలు, అమ్మవారి అవతారాలకు ప్రత్యేక పూజలు, రావణ దహనం.. ఇలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఎన్నారై జంట చేసిన పాడు పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ప్రధానంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో హైలైట్ అవుతుంటుంది. ఇది దేవీ దుర్గాను ఆరాధిస్తూ.. వృత్తాకారంగా(సర్కిల్) నృత్యం చేస్తుంటారు. గర్భా నృత్యం భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందాన్ని ప్రతిబింబించే కళారూపం. అలాంటి నృత్యంలో పాల్గొన్న ఓ జంట ముద్దులతో నలుగురిలో హద్దులు దాటేసింది.గుజరాత్ వడోదరలో జరిగిన గర్బా వేడుకలో ఓ ఎన్నారై జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యునైటెడ్ వే గర్భా పేరిట నిర్వహించిన వేడుకల్లో.. ప్రతీక్ పటేల్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గర్భా చేస్తూ అత్యుత్సాహంలో ముద్దులు పెట్టుకున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. అది కాస్త వైరల్ కావడంతో సనాతన్ సంత్ సమితి తీవ్రంగా స్పందించింది. ధార్మిక భావాలను దెబ్బతీశారంటూ ఆ జంటపై అటలదారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయ్యింది. అయితే విమర్శల నేపథ్యంలో ఆ జంట స్పందించింది. చేసిన పనికి లిఖితపూర్వక క్షమాపణ ఇచ్చింది. ఇది మా తప్పే. ఇంతలా విమర్శలు వస్తాయని అనుకోలేదు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గత 16 సంవత్సరాలు ప్రతీక్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తాజా వీడియోపై విమర్శల నేపథ్యంలో ఆ జంట దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.The NRI couple has issued a formal apology after their kissing video at a Garba event in Vadodara went viral.The couple were called to the police station, they are Australian nationals of Indian origin. They issued a written apology.#GarbaControversypic.twitter.com/GiaLSsLY6V— ShingChana😯 (@BaanwraDil) September 28, 2025 -
నాటు కోళ్లకు ఫుల్ గిరాకీ
విశాఖపట్నం: దసరా పండుగ సందర్భంగా నాటుకోళ్లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. సాధారణంగా దసరా సమయంలో కేవలం రూ.10 నుంచి రూ.25 మాత్రమే పెరిగే ధర ఈసారి ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగింది. మటన్కు దీటుగా ధరలు పెరిగినప్పటికీ, దసరా మొక్కుల కోసం వినియోగదారులు నాటుకోళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పాత డెయిరీఫారం వద్ద ఉన్న నాటుకోళ్ల సంతలో ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.900కు చేరింది. మంగళ, బుధవారాల్లో ఇది రూ.1,000కు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం దీని ధర రూ.800 మాత్రమే ఉండేది. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను పెంచేశారు. 40 ఏళ్ల నాటుకోళ్ల సంత పాత డెయిరీఫారం వద్ద సుమారు 40 సంవత్సరాల నుంచి నాటుకోళ్ల సంత జరుగుతోంది. ప్రారంభంలో కోడి రూ.20, రూ.30కే విక్రయించేవారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతుంటారు. నగరంలో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండటం వల్ల దసరా సందడి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలకు నాటుకోళ్లతో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. గాజువాక, ఆటోనగర్, గోపాలపట్నం, అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా జనాలు ఇక్కడికి వస్తారు. గిరిరాజు కోళ్లతో జాగ్రత్త నాటుకోళ్ల మాదిరిగానే కనిపించే ‘గిరిరాజు’ కోళ్లను కొందరు వ్యాపారులు అధిక ధరకు అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. గిరిరాజు కోళ్ల ధర కిలో రూ.400 మాత్రమే ఉంటుందని, కానీ నాటుకోడి ధరతో వాటిని విక్రయిస్తున్నారని వారు చెప్పారు. గిరిరాజు కోళ్లు పొట్టి కాళ్లతో, దట్టమైన వెంట్రుకలతో ఉంటాయని, వాటి బరువు ఒకటిన్నర కిలోలకు మించి ఉండదని తెలిపారు. నాటుకోడి కావాలనుకునేవారు ఈ తేడాలను గమనించి, తెలిసినవారిని తీసుకెళ్లి కొనుగోలు చేయాలని వారు సూచించారు. -
అక్టోబర్ 2నే దసరా.. మద్యం, మాంసం అమ్మితే కఠిన చర్యలే!
దసరా పండుగపై తెలంగాణలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 2న దసరా పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు గాంధీ జయంతి కూడా ఉంది. దీంతో.. మద్యం, మాంసం ప్రియులకు అసమంజస పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో.. హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2న జీహెచ్ఎంసీ పరిధిలోని ఎద్దులు, గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. జీహెచ్ఎంసీ చట్టం–1955లోని విభాగం 533 (బి) ప్రకారం ఈ నెల 24న జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఆ మేరకు సోమవారం జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధిత అధికారులందరూ సహకరించాలని, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. -
వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..
ఎన్నో దుర్గమాత ఆలయాలు చూసుంటారు. కచ్చితంగా అక్కడ ఇచ్చే బలులకు నేలంతా రక్తసికమై ఎర్రటి సింధూరలా మారిపోతుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ ఆలయంలో రక్తమే చిందించని సాత్విక బలి సమర్పిస్తారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయం ఎన్నేళ్ల నాటిదో తెలిస్తే విస్తుపోతారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ కట్టడం తీరు భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. దసరా సదర్భంగా ఈ ఆలయ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ దుర్గమాతా ఆలయం అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం.. వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం. ఇది బీహార్ రాష్ట్రంలోని, కైమూర్ జిల్లా, కౌర అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ముండేశ్వరి మాతగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. దీనిని ముండేశ్వరి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు. వారణాసికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంఆ పేరు రావడానికి కారణం..ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. ఈ పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయం అనే పేరు వచ్చింది. అయితే ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకు వారాహి మాతగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. ఈ ఆలయాన్ని100ఏడి లో నిర్మించారు. విచిత్రమైన బలి ..ఇక అమ్మవారికి సమర్పించే బలి అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఇలాంటి బలి ఏ ఆలయంలో కనిపించదు. ముందుగా అమ్మవారికి బలి ఇవ్వదలుచుకున్న మేకను ముండేశ్వరి మాత ముందుకు తీసుకువస్తారు. దాని మెడలో ఒక పూల దండ వేయగానే ఏదో మూర్చ వచ్చినట్లు పడిపోతుంది. కాసేపటికి పూజారి ఏవో మంత్రాలు చదువుతూ బియ్యం గింజలు వేయగానే తిరిగి ఆ మేక యథాస్థితిలోకి వస్తుంది. దాన్ని తిరిగి భక్తుడికి ఇచ్చేస్తాడు పూజారి. ఇక్కడ అమ్మవారికి రక్తం చిందించని, ప్రాణం తీయని సాత్విక పద్ధతిలో బలిని ఇవ్వడమే ఈ ఆలయం విశిష్టత. ఈ అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులుచేత నీరాజనాలు అందుకుంటోంది.(చదవండి: శ్రీలంక టూర్..బౌద్ధ రామాయణం) -
భాగ్యనగరంలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు
శరన్నవరాత్రుల సందర్భంగా పూజ్య గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవాళ సోమవారం(సెప్టెంబర్ 29, 2025) నుంచి మూడు రోజుల పాటు నవరాత్రి హోమాలను నిర్వహిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు స్వామి సూర్యపాద, స్వామి శ్రద్ధానందల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 28వ తేదీ ఆదివారం ఉదయం గం. 8.30 ల నుంచి శ్రీ మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్య హోమం, వాస్తుహోమం అనంతరం ప్రసాద వితరణ తదితరాలను ఘనంగా జరిగాయి. కాగా, ఈ రోజు సాయంత్రం 5గం.ల నుంచి స్వామి సూర్యపాద గారిచే ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం, సామూహిక లలితా సహస్రనామ పారాయణ, కుంకుమార్చన, మహాలక్ష్మి హోమం, శ్రీ సుదర్శన హోమం, అనంతరం ప్రసాద వితరణ ఉంటాయి. అలాగే ఈ వేడుకులో పాల్గొనదలిచని భక్తులందరికీ ఉచితప్రవేశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. (చదవండి: చిత్తూ చిత్తుల బొమ్మ..శివుని ముద్దుల గుమ్మ) -
దేవి నవరాత్రులు.. అమ్మవారి సేవలో శ్యామల (ఫొటోలు)
-
చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన.. రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే.. రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన.. వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే.. వెంకటేశుడెదురాయే నమ్మో.. అంటూ సాగే తెలంగాణ బతుకమ్మ పాటలు వింటే.. ఎన్ని తరాలు మారినా బతుకమ్మ పండుగ సంస్కృతిని ప్రతిబింబించడంలో తన ప్రశస్తిని చాటుకుంటూనే ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ.. క్రమంగా భాగ్యనగరంలో తన ఘనతని చాటుకుంటూ.. ప్రకృతి పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. నగరంలో బతుకమ్మ అంటే ప్రతి పువ్వూ, ప్రతి ఆకూ.. ఊరి నుంచే తరలి రావాలి.. అంటే పల్లెకూ.. పట్నానికీ మధ్య సాంస్కృతిక వారధిగా మన బతుకమ్మ నిలుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నగరం బతుకమ్మ సంస్కృతిని తనలో ఇముడ్చుకుంది. ఇక్కడి విభిన్న సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన వారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ బతుకమ్మ పాటలకు శృతి కలుపుతున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ అధికారులే కాకుండా సినీతారలు, ఇతర రంగాల ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సారి వేడుకల్లో మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాత బతుకమ్మ ఆడడం విశేషం. ఈ పండుగ ముగింపుకు చేరడంతో సోషల్ మీడియా కూడా పూలు, పట్టు పరికిణి కట్టుకున్నట్టుగానే కలర్పుల్ సందడి కనిపిస్తోంది. బతుకమ్మ ఆటల వీడియోలు, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో, విల్లాల్లో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒకప్పటిలా నగరం మూగబోకుండా సాంస్కృతిక సందడిని భవిష్యత్తు తరాలకు అందించడం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. (చదవండి: శ్రీలంక టూర్.. బౌద్ధ రామాయణం..) -
దుర్గా పూజలో బాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
#DussehraVibes : దీప్తి సునైనా పండగ వైబ్స్ (ఫొటోలు)
-
దసరా సంబరాలకు వేళాయే.. రైళ్లు,బస్సులు కిటకిట (ఫొటోలు)
-
ఓం శ్రీ శారదాయై నమః
దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు ఈమెను ఆరాధన చేస్తారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... అన్నిటికీ ఈమే అధిష్ఠాన దేవత. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ; పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, హంసను అధిరోహించిన రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకధాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. సరస్వతీ ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుంది. సకల చరాచరకోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి ఈమెది.సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో అమ్మను పూజించాలి.శ్లోకం: యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.మంత్రం: ’ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వత్యై నమ:’ అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. సరస్వతీదేవి ప్రీతిగా ఈ రోజున పుస్తకదానం చేయాలి. సరస్వతీ ద్వాదశ నామాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి. నైవేద్యం: దధ్యాన్నం అంటే పెరుగన్నం, చక్కెర పొంగలి నివేదన చేయాలి.విశేషం: బెజవాడ కనకదుర్గమ్మకు నేడు సర స్వతీ మహాసరస్వతీ దేవి -
జయీభవ... విజయీభవ...
‘ఏదయా మీ దయా మా మీద లేదు... ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు’ అని స్కూలు పిల్లలు... అయ్యవార్లు తమవెంట రాగా ఇంటింటి ముందు పాడటం ముగించి, ‘జయీభవ... విజయీభవ’ అని గాఠ్ఠిగా నినదించి, సిద్ధంగా ఉంచుకున్న బాణాలను వాకిలి మీదకు సంధిస్తారు. ఆ బాణాలకు ఆకులు, పువ్వులు కట్టి ఉండటం వల్ల అవన్నీ రాలి వాకిలి ఆకుపచ్చటి కాంతులీనుతుంది. ఏ ఇల్లయినా పచ్చగా బతకడానికి మించిన విజయం ఏముంటుంది సంఘంలో? దసరా ఆకాంక్ష అది.తెలంగాణలో పండగనాడు ఆకులు నిండిన జమ్మికొమ్మను ఊరిలోకి తెచ్చి, నాటి, పూజ చేస్తారు. పూజ చాలాసేపు సాగినా ప్రజలు ఓపికగా ఉండి, ముగిశాక భక్తి ప్రపత్తులతో జమ్మి ఆకులను తీసుకుని, ఒకరికొకరు ఇచ్చుకుని అలాయి బలాయి చెప్పుకుంటారు. ఎంతో సంతోషభరితమైన సన్నివేశం అది. జమ్మి ఆకును ‘జమ్మి బంగారం’ అంటారు. పాండవులు తమ ఆయుధాలను దాచడానికి యోగ్యంగా భావించిన జమ్మిచెట్టు, జమ్మి ఆకు విజయానికీ, శుభానికీ చిహ్నం. జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎదుర్కొని జయం పొందడం, చెడును తరిమి శుభానికి స్వాగతం చెప్పడం దసరా ఆకాంక్ష.మనిషి పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనిషిని కాపాడుతుంది. భూతలం మీద ఇద్దరిదీ కదా హక్కు. దసరానాడు ఆకాశవాసం చేసే పక్షులకు కృతజ్ఞత చెప్పే ఆనవాయితీ ఉంది. తెలంగాణలో పాలపిట్టను దర్శించడం అత్యంత శుభసూచకం. పండుగ రోజు ఊరి యువకులు ఊరి చుట్టూ తిరుగుతూ, వాగులూ వంకల్లో, అడవుల వరకూ వెళ్లి కొమ్మలపై గుట్టుగా ఉన్న పిట్టలను ‘పాలా.. పాలా.. ’ అని పిలుస్తూ చప్పట్లు చరిచి ఎగిరేలా చేస్తారు. ఆ ఎగిరిన పక్షుల్లో పాలపిట్టను పోల్చి, దర్శించుకుని సంతోషపడతారు. కాని పాలపిట్ట కనపడటం అంత సులభం కాదు. విజయం మాత్రం సులభంగా దక్కుతుందా? ప్రయత్నం సాగించాలి. ఆశావహ దృక్పథంతో ప్రయత్నం సాగించమని చెప్పేది కూడా దసరా ఆకాంక్ష. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరిస్తే ఆ పూల అమరికలోని సౌందర్యమే కడు శుభసూచకం. పూలు పూసే చెట్లున్నాయంటే ఊరిలో సజీవత, వర్ణాలు ఉన్నట్టే. ఇక బతుకమ్మ చుట్టూ తిరిగి పాటలు పాడటం జీవన భ్రమణాన్ని అంగీకరించి కొనసాగించడం. బృందం లేకుండా భ్రమణం సాగదు. సాటి మనిషిని తోడు చేసుకుని జీవనాన్ని జయించమనడం దసరా ఆకాంక్షే.‘స్త్రీలతో నాకు భయం లేదు. పురుషుడి చేతిలో మరణం లేని వరమివ్వు’ అని కోరాడు మహిషాసురుడు. ఈ పురుష అహమే మహిషత్వం. పశుత్వం. అందుకే శక్తి స్వరూపిణి అయిన జగన్మాత తొమ్మిది రోజులు పద్దెనిమిది బాహువులతో మహిషాసురుడిపై విరుచుకుపడింది. మహిషారుసురుడిని అంతమొందించడం అంటే పురుషాహంకారాన్ని అంతమొందించడం. కాని మనిషి గుణంలో మరుపు ఉంటుంది. వెనుకటి పాఠాలను మరచి పాత పాటనే పాడుతుంటుంది. అందుకే ప్రతి ఏటా నవరాత్రులు వస్తాయి. ప్రతి ఏటా స్త్రీ శక్తిని చాటుతాయి. ప్రతి ఏటా మనిషిలోని సకల అహాలను హెచ్చరిస్తాయి. ప్రకృతి ముందు మనిషి శక్తి ఏపాటి? కాస్తంత వినమ్రుడవై ఉండటం కూడా విజయమే అని చాటడం దసరా ఆకాంక్ష. పిల్లా పాప, చెట్టూ చేమా, గోడ్డూ గోదాలతో ఆకాశం నుంచి కురిసే వాన, భూమిన పండే పంట... వీటితో సుఖంగా బతకవలసిన మనిషి... అలా బతికేందుకు విశ్వగతులు, ప్రకృతి శక్తులు సకల సహకారాలు అందిస్తుండగా తల ఎగరేస్తూ తనకు తానే ఎన్నో మహిషాసురులను సృష్టించుకుంటున్నాడు. గిల్లికజ్జాలు, తకరార్లు, ఆధిపత్య ధోరణి, ఈర‡్ష్య, అసూయ, ఆడంబరం, విద్వేషం, తీవ్ర వ్యసనాలు, మూఢ విశ్వాసాలు, మూక స్వభావం... ఎన్నెన్ని ఇవాళ పచ్చటి ఇంటికి నిప్పు పెడుతున్నాయో, స్వీయ మనోదేహాలకు ఖేదం కలిగిస్తున్నాయో నిత్యం ప్రసార మధ్యమాలు చూపుతూనే ఉన్నాయి. అయినా సరే దున్నపోతు మీద వర్షం కురిసిట్టే ఉంటోంది. వివేచన లేని చోట అసురత్వం, అసురత్వం వెంట చీకటి, చీకటి నుంచి ఓటమి, ఓటమి నుంచి దుఃఖం ఈ జీవన భ్రమణమా? తీరొక్క పూల బతుకమ్మ పాట వంటి జీవన భ్రమణమా? ఏది కావాల్సింది? హేతువు కలిగిన హితంలోకి, వికాసానికి పాదుకొలిపే జ్ఞానంలోకి మనిషి జాగరూకుడై నడిచిననాడు, ఫుస్తకాన్ని జమ్మి బంగారంలా పంచుకున్ననాడు... ప్రతి జాతి ముంగిట్లోకి, ప్రతి ఇంటి వాకిట్లోకి విజయాలు పిల్లల నవ్వుల్లా వచ్చి పడతాయి. ధ్వానాలు వెల్లువెత్తుతాయి. జయీభవ... విజయీభవ! -
దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్
ప్రతీ ఏడాది ముంబైలో జరిగి దసరా ఉత్సవాలు, దుర్గా పూజలో బాలీవుడ్ హీరోయిన్లు ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీ. ముఖ్యంగా కాజోల్ , రాణి ముఖర్జీ ఈ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటూ బంధుజనంతో కలివిడిగా తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కానీ ఏడాది ఉత్సవాల్లో వారిద్దరూ తీవ్ర భావోద్వాగానికి లోనయ్యారు. అటు తన తండ్రి తరువాత అయాన్ ముఖర్జీ దుర్గా పూజ ఉత్సవాల్లో తొలిసారి పాల్గొన్నారు. తమ సమీప బంధువు, అత్యంత ఆప్తుడైన నటుడు దేబ్ ముఖర్జీ ఈ ఏడాదితమ మధ్య లేకపోవడమే ఇందుకు కారణం. ఆయనను గుర్తు చేసుకుని ఆయన మేనకోడళ్ళు నటీమణులు కాజోల్ , తనీషా రాణీ ముఖర్జీ భావోద్వాగానికి లోనయ్యారు. ఈ దృశ్యలు ఆన్లైన్లో దర్శనిమిచ్చాయి. ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండల్ ఘనంగా దేబ్ ముఖర్చీ ఈ ఏడాది లేరు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చిత్రనిర్మాత,బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ. ఫ్యామిలీ అంతా ప్రేమగా 'దేబు కాకా' అని పిల్చుకునే దేబ్ ముఖర్జీ మార్చి 14, 2025న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ ఏడాది తమ కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఉత్సవాలను కలిసి ప్రారంభించారు కాజోల్, రాణీ ముఖర్జీ తనీషా ముఖర్జీ తదితర కుటుంబ సభ్యులు నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్ను ఆవిష్కరించారు.రాణి ముఖర్జీ కుటుంబం యొక్క దుర్గా పూజ 2025 కి సహ-నిర్వాహకురాలిగా ఉన్నారు.‘‘అయిగిరి నందిని’’అనే స్తోత్రం మధ్య కాజోల్, రాణి దుర్గా మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమ్మవారిని చూడగానే ఇద్దరూ భక్తితో చేతులో జోడించి నమస్కరించారు. అనంతర అటు అమ్మవారి రూపాన్ని చూసి, ఇటు దివంగత దేబ్ ముఖర్జీని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. VIDEO | Mumbai, Maharashtra: Actors Kajol and Rani Mukherjee witness the unveiling of the Goddess' idol at the North Bombay Sarbojanin Durga Puja Samiti. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/EgP2o1xVOH— Press Trust of India (@PTI_News) September 27, 2025ఈ సందర్భంగా తనీషా మాట్లాడుతూ"మా కుటుంబానికి ఇది కొంచెం విచారకరమైన సమయం, కొంచెం ఉత్సాహంతో పాటు, ఈ సంవత్సరం మా కుటుంబంలో ముగ్గురు ఆప్తులను కోల్పోయాం. ప్రతి సంవత్సరం దుర్గా పూజను నిర్వహించే మా దేబు కాకా (దేబ్ ముఖర్జీ) ఇక లేరు, ఈసారి పూజకు హాజరు కావడం కొంచెం కష్టంగానే అనిపించింది. అయినా గానీ ఆయన కలను ముందుకు తీసుకెళ్తున్నందున చాలా ఆనందంగా కూడా ఉంది." అన్నారు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official) -
దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!
మనలోని పది రకాల దుర్గుణాలను నాశనం చేసి, విజయానికి గుర్తుగా దసరా వేడుకను జరుపుకుంటారు. మన జీవితాల్లోని ప్రతికూలతను నాశనం చేయడానికి, మంచితనాన్ని స్వీకరించడానికి ఆహ్వానించే రోజు. అంతటి ప్రత్యేకతలు గల రోజులలో ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి, మన ఇంటిని స్వర్గధామంగా మార్చే కొన్ని సులువైన దసరా అలంకరణలివి..1. పూల తేరుఏ పండగలోనైనా అలంకరణలో ప్రధానంగా మన కళ్లకు కట్టేది పూల తోరణాలు. పూలనే తేరుగా చేసే బతుకమ్మ వేడుకలు కాబట్టి, ఇంట్లోనూ వివిధ రకాల పూల అమరిక వేడుక రోజులను హైలైట్ చేస్తుంది. 2. థీమ్ ప్రాజెక్ట్దసరా రోజుల్లో మనకు ప్రధానంగా కనిపించేది అమ్మవారి అలంకరణ. ఎరుపు, పసుపు, పచ్చ రంగులు వచ్చేలా సృజనాత్మకతను దశ విధాల థీమ్ ప్రాజెక్ట్తో గృహాలంకరణను చేపట్టవచ్చు. 3. జత చేసిన రంగుల ఫ్యాబ్రిక్ కాటన్, సిల్క్, బాందినీ, గోటా పట్టీ.. ఫ్యాబ్రిక్తో తయారుచేసిన హ్యాంగింగ్స్, బీడ్స్, కర్టెన్స్.. వంటివి అలంకరణలో ఉపయోగించవచ్చు. 4. అద్దాలుడైమండ్, స్క్వేర్, చిన్నా పెద్ద అద్దాలను అమర్చిన వాల్ హ్యాంగింగ్స్ను అలంకరించవచ్చు. అట్టముక్కలను కట్చేసి, రంగు కాగితాలను, అద్దాలను అతికించి, ఈ డిజైన్స్ ఏర్పాటు చేయవచ్చు. 5. ఫర్నిషింగ్ రాజస్థానీ, గుజరాతీ హస్తకళా వైభవాన్ని తలపించే ఫర్నిషింగ్ అంటే కుషన్ కవర్స్, టేబుల్ రన్నర్స్ను ఈ వేడుకకు సరైన కళను తీసుకువస్తాయి. 6. దాండియా కళ నవరాత్రి రోజుల్లో దాండియా వేడుకను తలపించేలా ప్లెయిన్ వాల్పైన కాగితంతో దాండియా బొమ్మలు, వుడెన్ స్టిక్స్తో అలంకరించవచ్చు. 7. కార్నర్ కళలివింగ్రూమ్ లేదా డైనింగ్ హాల్లో ఒక కార్నర్ ప్లేస్ను ఎంపిక చేసుకొని, ఆ ప్రాంతాన్ని బొమ్మల కొలువు, దేవతామూర్తుల విగ్రహాలు, పువ్వులు, దీపాలతో అలంకరణను ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఇంటికి పండగ కళ ఇట్టే వస్తుంది.8. ఇత్తడి, రాగి పాత్రలుపండగ రోజుల్లో కుటుంబ వారసత్వంగా వచ్చిన ఇత్తడి, రాగి పాత్రలు, కలప వస్తువులను అలంకరణలో ఉపయోగించవచ్చు. 9. రంగోలీ మ్యాట్స్పండగ రోజుల్లో ఇంటి ముందు, లోపల అందమైన రంగోలీని తీర్చిదిద్దడం చూస్తుంటాం. రంగోలీని తీర్చిదిద్దేంత సమయం లేదనుకునేవారు ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన రంగోలీ మ్యాట్స్ను ఇంటి లోపల, గోడల పక్కన అలంకరించవచ్చు. 10. టెర్రకోట బొమ్మ లేదా ఇండోర్ ప్లాంట్స్టెర్రకోటతో తయారైన అమ్మవారి తల ఉన్న బొమ్మలు తక్కువ ధరలో మార్కెట్లో లభిస్తాయి. వీటిని సెంటర్ టేబుల్ లేదా కార్నర్ టేబుల్పైన ఉంచి, పువ్వులను అలంకరించవచ్చు. ఇండోర్ ప్లాంట్స్తోనూ అలంకరణలో ప్రత్యేకత తీసుకు రావచ్చు. ఎన్నార్ (చదవండి: ఈ బామ్మ రూటే వేరు..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్) -
బతుకమ్మ వేడుకలు
మొదటి రోజున అమ్మవారిని శ్రీ బాలాత్రిపురసుందరీదేవి రూపంలో గులాబిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం సమర్పిస్తారు.రెండో రోజున శ్రీ గాయత్రీదేవి రూపంలో నారింజరంగు చీరతో అలంకరిస్తారు. కొబ్బరి అన్నం, అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.మూడో రోజున శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో నీలిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా మినప వడలు, పులిహోర సమర్పిస్తారు.నాలుగో రోజున శ్రీ కాత్యాయనీదేవి రూపంలో పసుపురంగు చీరతో అలంకరిస్తారు. పాయసం, రవ్వకేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.ఐదో రోజున శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో గులాబిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, రవ్వకేసరి సమర్పిస్తారు.ఆరో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవి రూపంలో పసుపురంగు చీరతో అలంకరిస్తారు. రవ్వకేసరి, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.ఏడో రోజున శ్రీ మహాచండీదేవి రూపంలో బంగారురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా కట్టుపొంగలి సమర్పిస్తారు.మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి రూపంలో తెలుపురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పాయసం, శాకాన్నం సమర్పిస్తారు.దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి రూపంలో ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా కదంబం సమర్పిస్తారు. మహర్నవమి రోజున శ్రీ మహిషాసురమర్దిని రూపంలో నీలిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా చక్కెరపొంగలి సమర్పిస్తారు.చివరిగా విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి రూపంలో ఆకుపచ్చ చీరతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం సహా మహానైవేద్యాన్ని సమర్పిస్తారు.దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ తొమ్మిది రోజుల వేడుకలు దసరా నవరాత్రులకు ఒకరోజు ముందుగానే, భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. బతుకమ్మ వేడుకల్లో రంగురంగుల పూలతో బతుకమ్మను వాకిళ్లలో కొలువుదీర్చి; బాలికలు, మహిళలు బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడతారు.బతుకమ్మ వేడుకల తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఈ రోజున బియ్యంపిండి, నువ్వులు కలిపిన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ. ఈ రోజున చప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు.మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యంగా సమర్పిస్తారు.నాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ. ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.ఐదో రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజున నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు.ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజున నైవేద్యం ఏమీ సమర్పించరు.ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఈ రోజున బియ్యంపిండిని బాగా వేపి, వేపకాయల్లా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు.ఎనిమిది రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ. ఈ రోజున ఐదురకాల నైవేద్యాలను సమర్పిస్తారు. బతుకమ్మ వేడుకలు ముగిశాక విజయదశమి నాడు దసరా పండుగను ఊరూరా ఘనంగా జరుపుకొంటారు. శమీవృక్షానికి– అంటే, జమ్మిచెట్టుకుపూజ చేస్తారు. ఒకరికొకరు జమ్మి ఆకులను ‘బంగారం’గా ఇచ్చుకుని, అభినందనలు తెలుపుకుంటారు. విందు వినోదాలతో దసరా పండుగను ఆనందంగా జరుపుకొంటారు. -
Vijaya Dashami: సర్వం శక్తిమయం!
ఆదిశక్తి అయిన అమ్మవారిని ఆరాధించడం తరతరాల సంప్రదాయం. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని శరన్నవరాత్రులలో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వీటినే దసరా నవరాత్రులని అంటారు. ‘దేవీభాగవతం’ వంటి పురాణగాథల ప్రకారం ఆదిశక్తి దుర్గాదేవిగా ఆవిర్భవించి, రక్తబీజ, చండ ముండ, శుంభ నిశుంభ, మహిషాసురాది రాక్షసులను సంహరించింది. దుష్టసంహారానికి ప్రతీకగా నవరాత్రులలో చివరి రోజున విజయ దశమినాడు దసరా పండుగను జనాలు వేడుకగా జరుపుకొంటారు.దసరా నవరాత్రులలో పూజాదికాలు శాక్తేయ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. సింధులోయ నాగరికత కాలం నుంచి శాక్తేయ సంప్రదాయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. సింధులోయ నాగరికతలో మొదలైన శాక్తేయ సంప్రదాయం దేశం నలువైపులకు విస్తరించింది. ఇందులో భాగంగానే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. వీటితో పాటు యాభైఒక్క శక్తిపీఠాలు ఉన్నాయి. దేవీ భాగవతం నూట ఎనిమిది శక్తిపీఠాలను పేర్కొంది. వీటిలో కొన్ని భారతదేశంతో పాటు పాకిస్తాన్, టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఉన్నాయి. ఈ శక్తిపీఠాలు ఏర్పడటానికి మూలంగా దక్షయజ్ఞం గాథను చెబుతారు. శక్తిపీఠాల మూలగాథఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం తలపెట్టాడు. ఈ యజ్ఞానికి సమస్త దేవతలను, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను, మునిగణాలను ఆహ్వానించాడు. కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు. తండ్రి మాటను కాదని సతీదేవి శివుడిని పెళ్లాడింది. అందువల్లనే దక్షుడు కూతురిని, అల్లుడిని తాను నిర్వహించే యాగానికి ఆహ్వానించకుండా విస్మరించాడు. పుట్టింటి వేడుకకు పిలుపుతో పనేముంది అనుకుని సతీదేవి భర్త వారిస్తున్నా పట్టించుకోకుండా ప్రమధగణాలను వెంటబెట్టుకుని దక్షయజ్ఞానికి వెళ్లింది. ఆమెను చూసిన దక్షుడు ఆమెను, శివుడిని దారుణంగా నిందించాడు. శివనింద భరించలేని సతీదేవి యోగాగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. సతీ వియోగంతో శివుడు జగద్రక్షణ బాధ్యతను మానేశాడు. ఆమె మృతకళేబరాన్ని భుజం మీద మోసుకుంటూ దిక్కుతోచక తిరగసాగాడు. శివుడిని తిరిగి కార్యోన్ముఖుడిని చేయాల్సిందిగా దేవతలందరూ విష్ణువుకు మొరపెట్టుకున్నారు. సతీ కళేబరం చెంత ఉన్నంత వరకు శివుడు యథాస్థతికి రావడం అసాధ్యమని తలచిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, ఆమె శరీరాన్ని ఖండించాడు. సతీదేవి ఖండితావయవాలు భూమ్మీద ఒక్కోచోట చెల్లాచెదురుగా పడ్డాయి. అవి పడిన చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వీటిలోని ప్రధానమైన పద్దెనిమిది శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తింపు పొందాయి. స్కాంద పురాణం వంటి పురాణాల ప్రకారం యాభైఒక్క శక్తి పీఠాలు ఉన్నాయి. దేవీభాగవతం ప్రకారం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల గురించి చాలామందికి తెలుసు. మిగిలిన శక్తిపీఠాలలో కొన్ని విశేషమైనవి, విలక్షణమైనవి ఉన్నాయి. వీటిలో కొన్ని అరుదైన శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం.మహామాయ పీఠం – జమ్ము కశ్మీర్మహామాయ శక్తిపీఠం జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా అమర్నాథ్లో ఉంది. ఇది గుహాలయం. బయటి నుంచి చూడటానికి సాధారణమైన కొండగుహలా కనిపిస్తుంది గాని, లోపల పురాతనమైన మహామాయ విగ్రహం ఉంటుంది. అమర్నాథ్లో శివాలయం పొందినంతగా ఇది ప్రసిద్ధి పొందలేదు. అమర్నాథ్ యాత్రికుల్లో చాలామంది ఈ మహామాయ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది సతీదేవి గొంతు భాగం పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇది పార్వతీపీఠంగా ప్రసిద్ధి పొందింది.దాక్షాయనీ పీఠం – టిబెట్దాక్షాయని శక్తిపీఠం టిబెట్లో ఉంది. కైలాస పర్వతానికి సమీపాన మానస సరోవరానికి చేరువలో ఉన్న ఒక మంచుకొండ మీద ఈ శక్తిపీఠం ఉంది. మానస సరోవరం వద్ద వెలసినందున దీనిని మానసా శక్తిపీఠం అని కూడా అంటారు. సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాల కథనం. గోపురంలా కనిపించే శిఖరం కింద సహజంగా ఏర్పడిన గుహలోని పురాతన దాక్షాయని విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. గండకీ చండీ పీఠం – నేపాల్గండకీ చండీ శక్తిపీఠం నేపాల్లో ఉంది. హిమాలయ సానువుల్లో గండకీ నదీ తీరానికి చేరువలో ముస్తాంగ్ పట్టణానికి సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రమైన ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలోనే గండకీ చండీ ఆలయం కూడా ఉంది. సతీదేవి ముఖ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో పురాతన శాక్తేయ సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటుంటారు.సావిత్రీ పీఠం – హరియాణాసావిత్రీ శక్తిపీఠం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్లో ద్వైపాయన సరోవరం ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోనే కురుపాండవ సంగ్రామం జరిగిందనే మహాభారత కథనం అందరికీ తెలిసినదే! కురుక్షేత్రలో వెలసిన సావిత్రీ శక్తిపీఠం స్థానికంగా భద్రకాళి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల విజయం కోసం శ్రీకృష్ణుడు ఇదే శక్తిపీఠంలో అమ్మవారిని అర్చించాడట! యుద్ధానంతరం పాండవులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి, కానుకగా గుర్రాలను సమర్పించారట! ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేతి చీలమండ పడినట్లు పురాణాల కథనం. దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి.గాయత్రీ పీఠం – రాజస్థాన్గాయత్రీ శక్తిపీఠం రాజస్థాన్లోని అజ్మేర్ నగరానికి చేరువలో ఉన్న పుష్కరక్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మణికట్లు పడ్డాయని పురాణాల కథనం. అందువల్ల ఈ శక్తిపీఠాన్ని మణిబంధ పీఠం, మణివేదిక ఆలయం అని కూడా ఉంటారు. గాయత్రీ మంత్రసాధనకు ఈ శక్తిపీఠం అత్యుత్తమ క్షేత్రమని, ఇక్కడ చేసే గాయత్రీ మంత్రసాధన శీఘ్రంగా ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర క్షేత్రంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది.దేవగర్భ పీఠం – హిమాచల్ప్రదేశ్దేవగర్భ శక్తిపీఠం హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా పట్టణంలో ఉంది. ఇక్కడ వెలసిన దేవగర్భదేవినే వజ్రేశ్వరి అని, స్థానికులు కాంగ్రాదేవి అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ స్తనభాగం పడినట్లు పురాణాల కథనం. వజ్రేశ్వరిని దుర్గాదేవి ఉగ్రరూపంగా భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలోని విలువైన సంపదను మహమ్మద్ ఘజనీ దోచుకున్నాడు. ఆ తర్వాత 1905లో సంభవించిన భూకంపంలో ఆలయ నిర్మాణం బాగా దెబ్బతినడంతో తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రీతిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి.త్రిపురసుందరీ పీఠం – త్రిపురత్రిపురసుందరీ శక్తిపీఠం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉదయపూర్ పట్టణంలో ఉంది. చిన్న కొండపై ఉన్న ఈ ఆలయ నిర్మాణం కూర్మాకృతిలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని కూర్మపీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి రూపంలో కొలువై కనిపిస్తుంది. సతీదేవి కుడిపాదం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో అసోంలోని కామాఖ్య పీఠం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంగా త్రిపురసుందరీ పీఠం ప్రసిద్ధి పొందింది.భవానీ పీఠం – బంగ్లాదేశ్భవానీ పీఠం బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ్ వద్ద చంద్రనాథ్ కొండపై ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ఛత్తల్ భవానీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు చంద్రశేఖరుడిగా కొలువై ఉండటంతో ఈ ప్రదేశం చంద్రకాంత్ ధామ్గా కూడా ప్రసిద్ధి పొందింది. సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకలు ఈ శక్తిపీఠంలో ఘనంగా జరుగుతాయి.శివానీ పీఠం – ఉత్తరప్రదేశ్శివానీ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా రామ్గిరిలో ఉంది. ఇక్కడ కామదగిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ఉన్న అనేక ఆలయాల్లో పురాతనమైన శివానీ పీఠం కూడా ఉంది. సతీదేవి కుడి స్తనభాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. రామాయణ కథనం ప్రకారం సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ చిత్రకూట పర్వతంపైనే కొన్నాళ్లు గడిపారట! కామదనాథుడి పేరిట శివుడు వెలసిన కొండ కావడంతో ఈ కొండకు కామదగిరి అనే పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం.హింగ్లాజ్ పీఠం – పాకిస్తాన్హింగ్లాజ్ శక్తిపీఠం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మర్కన్ తీరంలో ఉన్న హింగ్లాజ్ పట్టణంలో ఉంది. హింగ్లాజ్ నేషనల్ పార్కలో ఉన్న కొండ పైభాగంలో ఉన్న గుహలో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇక్కడి దేవతను హింగ్లాజ్ దేవి అని, హింగులా దేవి అని అంటారు. సతీదేవి లలాట భాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. పాకిస్తాన్లోని హిందువులతో పాటు మన దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దసరా నవరాత్రులతో పాటు వసంత నవరాత్రి వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. మహామాయ పీఠం – జమ్ము కశ్మీర్మహామాయ శక్తిపీఠం జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా అమర్నాథ్లో ఉంది. ఇది గుహాలయం. బయటి నుంచి చూడటానికి సాధారణమైన కొండగుహలా కనిపిస్తుంది గాని, లోపల పురాతనమైన మహామాయ విగ్రహం ఉంటుంది. అమర్నాథ్లో శివాలయం పొందినంతగా ఇది ప్రసిద్ధి పొందలేదు. అమర్నాథ్ యాత్రికుల్లో చాలామంది ఈ మహామాయ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది సతీదేవి గొంతు భాగం పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇది పార్వతీపీఠంగా ప్రసిద్ధి పొందింది.దాక్షాయనీ పీఠం – టిబెట్దాక్షాయని శక్తిపీఠం టిబెట్లో ఉంది. కైలాస పర్వతానికి సమీపాన మానస సరోవరానికి చేరువలో ఉన్న ఒక మంచుకొండ మీద ఈ శక్తిపీఠం ఉంది. మానస సరోవరం వద్ద వెలసినందున దీనిని మానసా శక్తిపీఠం అని కూడా అంటారు. సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాల కథనం. గోపురంలా కనిపించే శిఖరం కింద సహజంగా ఏర్పడిన గుహలోని పురాతన దాక్షాయని విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. గండకీ చండీ పీఠం – నేపాల్గండకీ చండీ శక్తిపీఠం నేపాల్లో ఉంది. హిమాలయ సానువుల్లో గండకీ నదీ తీరానికి చేరువలో ముస్తాంగ్ పట్టణానికి సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రమైన ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలోనే గండకీ చండీ ఆలయం కూడా ఉంది. సతీదేవి ముఖ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో పురాతన శాక్తేయ సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటుంటారు.సావిత్రీ పీఠం – హరియాణాసావిత్రీ శక్తిపీఠం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్లో ద్వైపాయన సరోవరం ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోనే కురుపాండవ సంగ్రామం జరిగిందనే మహాభారత కథనం అందరికీ తెలిసినదే! కురుక్షేత్రలో వెలసిన సావిత్రీ శక్తిపీఠం స్థానికంగా భద్రకాళి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల విజయం కోసం శ్రీకృష్ణుడు ఇదే శక్తిపీఠంలో అమ్మవారిని అర్చించాడట! యుద్ధానంతరం పాండవులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి, కానుకగా గుర్రాలను సమర్పించారట! ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేతి చీలమండ పడినట్లు పురాణాల కథనం. దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి.గాయత్రీ పీఠం – రాజస్థాన్గాయత్రీ శక్తిపీఠం రాజస్థాన్లోని అజ్మేర్ నగరానికి చేరువలో ఉన్న పుష్కరక్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మణికట్లు పడ్డాయని పురాణాల కథనం. అందువల్ల ఈ శక్తిపీఠాన్ని మణిబంధ పీఠం, మణివేదిక ఆలయం అని కూడా ఉంటారు. గాయత్రీ మంత్రసాధనకు ఈ శక్తిపీఠం అత్యుత్తమ క్షేత్రమని, ఇక్కడ చేసే గాయత్రీ మంత్రసాధన శీఘ్రంగా ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర క్షేత్రంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది.దేవగర్భ పీఠం – హిమాచల్ప్రదేశ్దేవగర్భ శక్తిపీఠం హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా పట్టణంలో ఉంది. ఇక్కడ వెలసిన దేవగర్భదేవినే వజ్రేశ్వరి అని, స్థానికులు కాంగ్రాదేవి అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ స్తనభాగం పడినట్లు పురాణాల కథనం. వజ్రేశ్వరిని దుర్గాదేవి ఉగ్రరూపంగా భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలోని విలువైన సంపదను మహమ్మద్ ఘజనీ దోచుకున్నాడు. ఆ తర్వాత 1905లో సంభవించిన భూకంపంలో ఆలయ నిర్మాణం బాగా దెబ్బతినడంతో తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రీతిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి.త్రిపురసుందరీ పీఠం – త్రిపురత్రిపురసుందరీ శక్తిపీఠం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉదయపూర్ పట్టణంలో ఉంది. చిన్న కొండపై ఉన్న ఈ ఆలయ నిర్మాణం కూర్మాకృతిలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని కూర్మపీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి రూపంలో కొలువై కనిపిస్తుంది. సతీదేవి కుడిపాదం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో అసోంలోని కామాఖ్య పీఠం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంగా త్రిపురసుందరీ పీఠం ప్రసిద్ధి పొందింది.భవానీ పీఠం – బంగ్లాదేశ్భవానీ పీఠం బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ్ వద్ద చంద్రనాథ్ కొండపై ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ఛత్తల్ భవానీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు చంద్రశేఖరుడిగా కొలువై ఉండటంతో ఈ ప్రదేశం చంద్రకాంత్ ధామ్గా కూడా ప్రసిద్ధి పొందింది. సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకలు ఈ శక్తిపీఠంలో ఘనంగా జరుగుతాయి.శివానీ పీఠం – ఉత్తరప్రదేశ్శివానీ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా రామ్గిరిలో ఉంది. ఇక్కడ కామదగిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ఉన్న అనేక ఆలయాల్లో పురాతనమైన శివానీ పీఠం కూడా ఉంది. సతీదేవి కుడి స్తనభాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. రామాయణ కథనం ప్రకారం సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ చిత్రకూట పర్వతంపైనే కొన్నాళ్లు గడిపారట! కామదనాథుడి పేరిట శివుడు వెలసిన కొండ కావడంతో ఈ కొండకు కామదగిరి అనే పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం.హింగ్లాజ్ పీఠం – పాకిస్తాన్హింగ్లాజ్ శక్తిపీఠం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మర్కన్ తీరంలో ఉన్న హింగ్లాజ్ పట్టణంలో ఉంది. హింగ్లాజ్ నేషనల్ పార్కలో ఉన్న కొండ పైభాగంలో ఉన్న గుహలో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇక్కడి దేవతను హింగ్లాజ్ దేవి అని, హింగులా దేవి అని అంటారు. సతీదేవి లలాట భాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. పాకిస్తాన్లోని హిందువులతో పాటు మన దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దసరా నవరాత్రులతో పాటు వసంత నవరాత్రి వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలుదేశ విదేశాల్లో పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. దసరా వేడుకల సందర్భంగా పలుచోట్ల వీథుల్లో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోను, తెలంగాణలో ఆలంపురంలోని శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలోను ఈ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈసారి దసరా వేడుకలు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజైన సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అక్టోబర్ 2న విజయదశమి నాటితో దసరా నవరాత్రులు పూర్తవుతాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని రోజుకో అవతారంలో రోజుకో తీరులో అలంకరిస్తారు. రోజుకో ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని నవరాత్రులలో చేసే అలంకరణలు, నైవేద్యాల వివరాలు: -
నృత్యార్చనం
దేశవ్యాప్తంగా ఆలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ టెంపుల్ డ్యాన్సర్గా పేరుతెచ్చుకుంది విజయవాడవాసి కూచిపూడి నృత్యకారిణి కావ్య కంచర్ల. దసరా నవరాత్రుల సందర్భంగా తన విద్యార్థులతో కలిసి అమ్మవారి రూ పాలను వివిధ ఆలయాలలో నృత్యరూపకాలుగా ప్రదర్శిస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే కేరళ తరంగ్లో పాల్గొని విజేతగా నిలిచారు. గిన్నిస్బుక్ రికార్డ్లోనూ చోటు సం పాదించారు. నృత్యం ద్వారా తమ శక్తిని ఎలా ప్రదర్శిస్తారో ఈ సందర్భంగా వివరించారు.‘‘దసరా నవరాత్రులలో అంతటా అమ్మవారే కనిపిస్తుంటారు. ఇక విజయవాడలోనే కొలువైన అమ్మవారికి చేరువలో ఉంటూ నృత్యం ద్వారా సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్న వివిధ ఆలయాలకు ముందుగానే అప్లికేషన్స్ ఇచ్చాం. వారు ఇచ్చిన టైమ్ ప్రకారం నృత్యం ప్రదర్శనలు ఇస్తున్నాం. అలసట తెలియదునవరాత్రుల మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆరు ప్రదర్శనలు ఇచ్చాం. అమ్మవారి మీద ఎన్నో గీతాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో గీతాన్ని ఒక్కో ఆలయంలో మాకు ఇచ్చిన సమయం వరకు ప్రదర్శన ఇస్తున్నాం. పూర్తయ్యాక పెద్ద వయసున్నవారు కూడా ఏమాత్రం సంకోచించకుండా మమ్మల్ని కలిసి ‘ఆ అమ్మవారే నృత్యం చేస్తున్నారా అనే భావన కలిగింది’ అని చెప్పినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఒక తొంభై ఏళ్ల బామ్మగారు ప్రదర్శన పూర్తయ్యాక వచ్చి తన చిన్నప్పుడు నేర్చుకున్న ఆలాపన ఇప్పుడు గుర్తుకు వచ్చిందని భావయుక్తంగా పాడి వినిపించారు. ‘ఆ అమ్మవారు ఈ రూపంలో నాకు కనిపించారు’ అని పొంగిపోయారు. ఇలాంటి ఎన్నో అనుభూతులను ప్రతిసారీ మేం పొందుతుంటాం. మా దగ్గర నృత్యం నేర్చుకునే విద్యార్థులు కూడా ‘అమ్మవారి నృత్యంలో అలసట ఎందుకు రాదు’ అని అడుగుతుంటారు. నృత్యం ఒక యాక్టివిటీ కాదు దైవికంగా ఎంత దగ్గరవుతుంటామో ఈ నృత్యం మాకు స్పష్టం చేస్తుంటుంది. విజయవాడ అంటేనే అమ్మవారు. దసరానవరాత్రుల్లో ఆలయాల్లో మేం నృత్యం చేయడం అంటే అమ్మకు దగ్గరగా ఉన్నట్టే. ఒక భక్తి పూర్వక ప్రార్థన. మా నృత్యాన్ని అమ్మ చూస్తుంది అనే భావనతోనే చేస్తాం. ‘ఎంతసేపు నృత్యం చేసినా అలసటగా ఎందుకు అనిపించడం లేదు?’ అని మా విద్యార్థులు అడుగుతుంటారు. ఆధ్యాత్మికంగా అమ్మవారికి దగ్గరగా ఉంటే మరేమీ తెలియదు. అమ్మవారి ప్రతి రూపం మనకు ప్రేరణ ఇచ్చే పాఠమే. మన జీవన విధానానికి ఎంతగానో తోడ్పడేదే. ఆ శక్తిని మేం నృత్యం ద్వారా ప్రదర్శించడమే కాదు మేమూ పొందుతుంటాం. సేవ చేస్తున్న కొద్దీ శక్తి పెరిగేదే. శ్రీశైలం, తిరుపతి, శిరిడీ, మహానంది, భద్రాచలం, హరిద్వార్, కేదార్నాద్, బదిరీనాద్... ఇలా మనదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. వందల, వేల మంది ముందు ప్రదర్శనలు ఇస్తుంటాం కాబట్టి ధైర్యం పెరుగుతుంది. మధురమైన మాటతీరు, ఏకాగ్రత.. ఇలా ఎన్నో పాజిటివ్ అంశాలు పెరుగుతాయి. రోజూ సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆనందం కలుగుతుంది. వీటన్నింటి వల్ల జీవనశైలి కూడా బాగుంటుంది.బీఎస్సీ కంప్యూటర్స్లో డిగ్రీ, నృత్యంలో డిప్లొమా చేశాను. మా అమ్మ మాధవికి కూచిపూడి నృత్యం అంటే చాలా ఇష్టం. నాలుగేళ్ల వయసు నుంచి నాకు నృత్యం నేర్పించారు. ఐదేళ్ల వయసు నుంచి ప్రదర్శనలు ఇస్తున్నాను. అకాడమీ పెట్టి, నృత్యసేవను కొనసాగిస్తూ ఉండాలని మా నాన్న కల. నాన్న వెంకట రత్నకుమార్ కరోనాలో మాకు దూరమయ్యారు. నాన్న కలను నెరవేర్చడానికి ‘పంచమవేద’ అకాడమీ ద్వారా కృషి చేస్తున్నాను. జాతీయ స్థాయి నృత్య పోటీ అయిన కేరళ తరంగ్లో పాల్గొన్ని విజేతగా నిలిచాను. ఇప్పటి వరకు 1500 కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. గ్రూప్గా చేసిన శతనృత్య యాగంలో పాల్గొనే అవకాశం రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు దక్కింది. ఎంతో సాధన చేస్తూ శక్తిని పెంచుకోవడానికే ఈ నృత్య సేవ చేస్తున్నాను’ అని వివరించారు ఈ నృత్యకారిణి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పాక్లో మిన్నంటిన నవరాత్రి సంబరాలు, గార్బా, దాండియా సందడి
దసరా నవరాత్రి ఉత్సవాలు ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దసరా వేడుకలను నిర్వహించుకుంటారు. దేశంలోని అనేక నగరాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే పాకిస్థాన్లోని కరాచీ నగరంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట విశేషంగా నిలిచాయి.పాకిస్తాన్లో నివాసం ఉంటున్న ఇండియన్ ప్రీతం దేవ్రియా ఈ వీడియోను షేర్ చేశారు. అక్కడి భారతీయ భక్తులు గర్బా, దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరాచీ నుండి మరొక వీడియో, ధీరజ్ షేర్ చేసిన మరో వీడియోలు కూడా దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఇవిద్యుత్ దీపాలతో అలంకరించిన ఒక వీధిలో దుర్గామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం విశేషం. ముస్లింలు ఎక్కువగా నివసించే పాక్లో నవరాత్రి సంబరాలు ప్రత్యేకంగా నిలిచాయి. వ సోషల్ మీడియా వినియోగదారులు పాకిస్తాన్లోని హిందూ సమాజం గురించి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఉత్సుకతతో స్పందించారు.పాకిస్తాన్లో శాకాహారులు , జైనులు ఉన్నారా అని అడిగినప్పుడు, ప్రీతమ్ దేవ్రియా ఉన్నారని ధృవీకరించారు. ఈ వేడుకలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు. పలువురు వారికి "నవరాత్రి శుభాకాంక్షలు" అందించారు. View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) -
ఆది పరాశక్తి సాక్షిగా..ఆపరేషన్ సింథూర్
దేశవ్యాప్తంగా దేశభక్తి పెల్లుబుకేలా చేసిన ఆపరేషన్ సింథూర్ ఇప్పుడు దైవభక్తిలో సైతం మిళితమయ్యాయి. గత వినాయక చవితి ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా అనేక మండపాలు ఇదే థీమ్ను ఎంచుకోగా ఈ సంవత్సరం దుర్గా పూజ వేడుకలు లోతైన భక్తి జాతీయతా వాదాన్ని మిళితం చేశాయి, ప్రతీ సంవత్సరం గొప్ప కళాత్మకత సామాజిక స్పృహ కలిగిన థీమ్లకు ప్రసిద్ధి చెందిన సెంట్రల్ కోల్కతాలోని దుర్గా పూజ కమిటీ, తన 56వ సంవత్సరపు నవరాత్రి వేడుకల్ని కూడా అంతే వైవిధ్యంగా నిర్వహిస్తోంది. భారతదేశ సాయుధ దళాల ధైర్యం త్యాగాలకు నివాళులర్పించడానికి ‘ఆపరేషన్ సింథూర్‘ థీమ్తో ఒక భారీ వైవిధ్య భరిత మండపాన్ని ఆవిష్కరించింది. సెంట్రల్ అవెన్యూను రవీంద్ర సరణిని కలిపే చారిత్రాత్మక ప్రదేశం తారా చంద్ దత్తా వీధిలోని ఈ శక్తి ప్రతిబింబ మండపం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.ప్రముఖ చిత్ర, కళాకారుడు దేబ్శంకర్ మహేష్ రూపొందించిన ఈ పండల్లో థీమ్కు ప్రాణం పోసే అనేక ఆకర్షణీయమైన కళాకృతులు కొలువుదీరాయి ఈ మండపం ప్రాంగణంలో , సందర్శకులు భారత ఆర్మీ ట్యాంకులు క్షిపణుల సజీవ ప్రతిరూపాలను సందర్శించవచ్చు. ఈ థీమ్ ముఖ్యాంశం దేశంలోని ఇద్దరు ధైర్యవంతులైన మహిళలు, భారత సైన్యానికి కీర్తిని తెచ్చిన కల్నల్ సోజియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యాజ్మా సింగ్లకు నివాళిగా కూడా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. అక్కడ కొలువుదీరిన వారి విగ్రహాలు సైన్యంలో మహిళల బలం నాయకత్వానికి శక్తివంతమైన చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ మండపంలో కొలువు దీరిన దుర్గాదేవి విగ్రహాన్ని శిల్పి కుష్ధ్వా బేరా సృష్టించారు.ఈ సందర్భంగా యంగ్ బాయ్స్ క్లబ్ చీఫ్ ఆర్గనైజర్ రాకేష్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ‘దుర్గా పూజ మాకు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది ప్రజలను కలిపి ఉంచే భావోద్వేగం. ప్రతి సంవత్సరం, సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, మా పెవిలియన్ ద్వారా లోతైన సందేశాన్ని అందించే థీమ్ను కూడా ఎంచుకోవడానికి మేం ప్రయత్నిస్తాం.‘ అని చెప్పారు. ‘‘ఈ సంవత్సరం థీమ్, ‘ఆపరేషన్ సింథూర్‘, ధైర్యం అంకితభావంతో మన దేశాన్ని రక్షించే మన దేశ సైనికులకు మా గౌరవప్రదమైన సమర్పణ. ఈ సంవత్సరం పండుగ ద్వారా, మేం వారి శౌర్యాన్ని వేడుకగా జరుపుకుంటున్నాము సందర్శకులలో మన సైనిక శక్తి పట్ల గర్వం దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యం’’ అంటూ వివరించారు.ఈ సందర్భంగా యంగ్ బాయ్స్ క్లబ్ యూత్ ప్రెసిడెంట్ వికాంత్ సింగ్ మాట్లాడుతూ, ‘ మన దేశాన్ని అచంచలమైన అంకితభావంతో రక్షించే మన సైనికుల ధైర్యం త్యాగానికి ఇది మా సెల్యూట్ . ఈ సంవత్సరం థీమ్ మన సాయుధ దళాల లోని ధైర్యవంతులైన పురుషులు మహిళలకు నివాళి’’ అని చెప్పారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు : కల్పవృక్ష వాహనంపై స్వామివారి వాహన (ఫొటోలు)
-
పండుగకు చుక్క, ముక్క లేనట్లే.!
దసరా పండుగంటే అందరికి సంబరమే. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన వస్తుంది. దీంతో మద్యం, మాంసాహార ప్రియులు ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో వివిధ శుభకార్యాలు, పండుగలు, ఫంక్షన్లు ఏదైనా.. మాంసం, మద్యం లేనిదే కిక్కు ఉండదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇది ఓ ఆనవాయితీగా వస్తోంది. ఇక దసరా అంటేనే ఏ పండుగకి లేనంత జోష్ ఉంటుంది. ఇదే రోజు చుక్క, ముక్క ఉండాల్సిందే. మద్యంతో పాటు మటన్, చికెన్ కావాల్సిందే.జోగిపేట(అందోల్): అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదే రోజు దసరా పండుగ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం విక్రయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం దుకాణాలు మూసి వేయడం ఆనవాయితీ. అయితే అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు. ఆ రోజున చాలామందికి చుక్క లేనిదే ముద్ద దిగదు. అందుకోసం పండుగ రోజు ఎట్లా అని మద్యం, మాంసం విక్రయాలపై తర్జన భర్జన పడుతున్నారు.విక్రయాలపై సందిగ్ధం..దసరాకి మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే. పండుగ వేళ గొర్రె పొట్టేళ్లు, మేక పోతుల మంసానికి డిమాండ్ ఉంటుంది. నాటు, పారం కోళ్లు, చేపలకు కూడా మస్తు గిరాకీ ఉంటుంది.ప్రతి రోజు కోట్లలో.. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజు రూ.10 కోట్ల వరకు, నెలకు సుమారుగా రూ.275 కోట్ల వరకు లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. అయితే ఒక్క దసరా రోజే ప్రతి యేట సుమారు రూ.20 కోట్లకు పైగా అమ్మకాలు జరిగి భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ సారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడం, మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. దీంతో మద్యం అమ్మకాలపై, రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.మటన్షాపులకు అనుమతివ్వండి ప్రతి సంవత్సరం దసరా రోజు మటన్, చికెన్ షాపుల్లో గిరాకీ ’ఉంటుంది. పండుగ రోజు విక్రయాలు జరగకపోతే ఆర్థికంగా నష్టపోతాం. అధికారులు స్పందించి అనుమతులివ్వాలి. పండుగ రోజు వందలాది మంది మార్కెట్కు మాంసం కోసం వస్తుంటారు. – శేఖర్, మాంసం వ్యాపారిమద్యం విక్రయాలు జరగవు దసరా, గాంధీ జయంతి ఒకేసారి రావడంతో వైన్స్, బార్ షాపులు ప్రభుత్వ ఆదేశాల మేరకు బంద్ ఉంటాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి మద్యం అమ్మకాలు జరగకుండా చూడాలి. – హరికిషన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్ -
ఎన్నికల తర్వాత ‘సోనార్ బంగ్లా’కు పునర్ వైభవం
కోల్కతా: పశ్చిమబెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రం కోల్పోయిన ‘సోనార్ బంగ్లా’(బంగారు బెంగాల్)పునర్వైభవాన్ని సాకారం చేయాలని దుర్గామాతను కోరుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట్రం మరోసారి సురక్షితంగా, సుసంపన్నంగా మారాలని, నోబెల్ గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ కల సాకారం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్తర కోల్కతాలోని సంతోష్ మిత్ర స్క్వేర్లో ఏర్పాటైన దుర్గా పూజ మంటపాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల అనంతరం బంగారు బెంగాల్ కలను సాకారం చేసే ప్రభుత్వం ఏర్పాటు కావాలని దుర్గా మాతను కోరుకున్నా. మరోసారి మన బెంగాల్ శాంతియుతం, సుసంపన్నం, సురక్షితంగా రూపుదిద్దుకుంది. విశ్వకవి రవీంద్రుడు కన్న కలలు సాకారమయ్యేలా రాష్ట్రాన్ని నిర్మించుకుందాం’అని ఆయన పిలుపునిచ్చారు. దుర్గా పూజ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ వాసులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల నవరాత్రి వేడుకలు బెంగాల్, భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ ముఖ్యమైనవే. బెంగాల్లో ఈ గొప్ప సంప్రదాయాన్ని యావత్ ప్రపంచం ఎంతో ఆనందంతో చూస్తోంది. తొమ్మిది రోజుల పాటు, బెంగాల్లోని ప్రతి ఒక్కరూ శక్తి ఆరాధనకు తమను తాము అంకితం చేసుకుంటారు’అని ఆయన అన్నారు. ‘దుర్గా పూజ పండుగ బెంగాల్ను కొత్త శిఖరాలకు నడిపించాలి, రాష్ట్రం అభివృద్ధి చెంది, మన నేత నరేంద్ర మోదీ ఊహించిన అభివృద్ధి చెందిన భారతదేశం కలను మనం సాకారం చేసుకోగలగాలి’అని అమిత్ షా చెప్పారు. ‘పండగ వేళ రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విచారకరం. వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను’అని ఆయన అన్నారు. అనంతరం అమిత్ షా సాల్ట్లేక్ ప్రాంతంలో బీజేపీ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసిన దుర్గా పూజ మంటపాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 205వ జయంతి సందర్భంగా నివాళులరి్పంచారు.అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ టీఎంసీ ఎన్నికల తర్వాత సోనార్ బంగ్లా సాకారం కావాలన్న హోం మంత్రి వ్యాఖ్యలపై టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ‘అమిత్ షా సోనార్ బంగ్లాను గురించి మాట్లాడుతున్నారా? సోనార్ బిహార్, సోనార్ గుజరాత్, సోనార్ మహారాష్ట్ర లేక యూపీ సాకారమయ్యాయా? నిధులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఇస్తున్నారు కదా?’అని అభిషేక్ వ్యాఖ్యానించారు. ‘ముందుగా మాకు రావాల్సిన రూ.2 లక్షల కోట్ల నిధుల విషయం అడగండి. నేను అబద్ధమాడుతున్నానని అమిత్ షా అంటే, వాస్తవాలు, గణాంకాలతో వస్తా, చర్చ ఎక్కడైనా రెడీ’అని సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ.2 లక్షల కోట్ల నిధులను నిలిపేసి, రాష్ట్రానికి చెందిన మహనీయులను నిర్లక్ష్యం చేసిందన్నారు. కోల్కతాలోని విద్యాసాగర్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం 2019లో బీజేపీ ర్యాలీ సమయంలో విరిగిపోగా ఆ పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. -
ప్రపంచంలోనే అతి పురాతనమైన రాంలీలా ఇది..! ఎక్కడంటే..
దసరా వేడుకల్లో భాగంగా ఉత్తరభారతదేశం ఢిల్లీ తప్పనిసరిగా రాంలీలా ప్రదర్శన జరుగుతుంది. మన సంస్కృతికి అద్దం పట్టే ఈ ఇతిహాసం చెడుపై మంచి ఎప్పటికైనా గెలవాల్సిందే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే కాదు సత్ప్రవర్తనతో మెలిగేందుకు దోహదపడుతోంది. అలాంటి రాంలీల ప్రదర్శన ఎప్పుడు మొదలైంది..? ఎవరు ప్రారంభించారు..? అంటే..ఈ రాంలీలా 485 ఏళ్ల క్రితమే కాళీలో ప్రారంభమైందట. వారణాసిలో జరిగే చిత్రకూట్ రాంలీలా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాంలీలా అట. 16వ శతాబ్దంలో 1540 ఆ సమయంలో జరిగిందట. ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతోందట. 16వ శతాబ్దంలో తులసీదాస్ రామచరితమానస్ని అవధి భాషలో రాశారు. ఆయన వారణాసిలో కూర్చొని రామ ధ్యానం, ఆయన కథ వినిపిస్తుండేవాడట. తనకు రామదర్శనం ఎప్పుడవుతుందని కుతుహలంగా ఎదురుచూసేవాడట. ఒకనొక సందర్భంలో అస్సీఘాట్లో తులసీదాస్ రామకథ చెబుతుండగా రాముడు, సీత, లక్ష్మణ సమేతంగా వెళ్తున్నట్లు దర్శనం పొందుతాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన శిష్యుడు మేఘ భగవత్ ఈ రాంలీలా ప్రదర్శన సంప్రదాయాన్ని ప్రారంభించాడు. జనులంతా తులసీదాసు మాదిరిగా రాముడి అనుగ్రహానికి పాత్రులు కావాలనే ఉద్ధేవ్యంతో భగవత్ దీన్ని ప్రారంభించాట. వాస్తవానికి మేఘ భగవత్ రాంలీలా ప్రదర్శన వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందింపబడినప్పటికీ.. రాంలీలాని సంస్కృతంలోనే ప్రదర్శిస్తారట. అందువల్లే తులసీదాస్ రాసిన రామచరిత మానస్ ప్రసిద్ధికెక్కిందని చరిత్రకారులు చెబుతున్నారు.ఎన్నో విశేషాలు..ఇక్కడ రాంలీలా సుమారు 22 రోజులపాటు కొనసాగుతుందట. ముకుట్ పూజతో ప్రారంభమవుతుందట. రాముడు, లక్ష్మణుడు, సీత, ధరించే (ముకుట్)కిరీటాలకి పూజ చేయడంఓత ప్రారంభమవుతుంది. అంతేగాదు ఆ కిరీటాలు శతాబ్దాల నాటివని చెబుతుంటారు. అక్కడ ఈ వేకుడ కోసం చాలా పెద్ద ఆచారాన్ని నిర్వహిస్తారు అక్కడ. ఆ కిరీటాలను అలా పూజ చేసి పవిత్రంగా మార్చడంతో వాటిని ధరించిన మానవులు దేవతా స్వరూపులుగా కనిపిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. మరో ఆసక్తికరమైన ఘట్టం ఏంటంటే..నక్కటైయగా పిలిచే ఊరేగింపు. ఇది 12వ రోజు జరుగుతుంది. అప్పుడు శూర్పణఖ ఎపిసోడ్ని ప్రదర్శిస్తారు. పంచవటిలో రాముడి అందానికి మోహవశురాలైన ఘట్టం అత్యంత ముగ్ధమనోహరంగా జరుగుతుందట. అక్కడ కాశీ వీధులన్ని తిరుగుతూ నిర్వహిస్తారట ఆ సన్నివేశాన్ని. అంతేగాదు ఈ రాంలీలా నాటక ప్రదర్శన కోసం స్వచ్ఛందంగా దుకాణాలను బంద్ చేసి ప్రజలంతా గుమిగూడి మరి తిలికిస్తారట. అంత విశేషాలతో కూడుకున్నది అ చిత్రకూట్ రాంలీలా. (చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..) -
దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..
దసరా అంటేనే తొమ్మిది రోజుల పండుగ. రోజుకో విధంగా అమ్మవారిని అలంకరించుకుని.. జగన్మాత శరణు అంటూ ఉపవాసాలతో కొలుచుకుంటారు భక్తులు. కొన్ని ప్రాంతాల్లో నవరాత్రుల్లో రాత్రి సమయంలో దాండియా, గర్భా, కోలాటం వంటి డ్యాన్స్లతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇలా మంచి మ్యూజిక్ లయబద్ధంగా డ్యాన్స్లు చేస్తూ చాలామంది ప్రాణాలను కోల్పోయారు. మరికొందరూ కాలి గాయాల బారినడ్డారు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉత్సాహంగా..హెల్దీగా పండుగను జరుపుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.దసరా సరదా పదిలంగా ఉండాలంటే..సాయం సమయంలో చేసే నృత్యాల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండమని చెబుతున్నారు సూరత్కి చెందిన ఆర్థోపెడిక్. రాత్రుళ్లు భక్తితో అమ్మవారి అనుగ్రహం పొందేలా గంటలతరబడి డ్యాన్స్లు చేస్తుంటారు. దాంతో కాలి గాయాలు బారిన పడటం లేదా, చీలమండలం, మోకాలు వంటి సమస్యలు తలెత్తేందుకు దారితీస్తాయి. మరికొందరికి..జనం సముహం ఎక్కువగా ఉండి శ్వాసకు అంతరాయం లేదా, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలా జరగకుండా సంతోషభరితంగా, ఆరోగ్యప్రదంగా పండుగ వాతావరణం ఉండాలంటే..ఈ చిట్కాలను ఫాలోకండి అని చెబుతున్నారు వైద్యులు. హెల్దీగా ఉండేలా..హైడ్రేటెడ్గా ఉండేలా కేర్ తీసుకోవాలి. మనతోపాటు ప్రోటీన్ బార్లు కూడా తీసుకెళ్లాలి. అలాగే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా కేర్ తీసుకోండి. జిమ్కి వెళ్లడం, స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా, బల శిక్షణకు సంబంధించిన వర్కౌట్లు వంటివి ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం అని సూచించారు. పెయిన్ కిల్లర్స్కి దూరం..ఇప్పటికే ఏదైనా గాయం లేదా కాలి సమస్య ఉంటే..నొప్పి నివారణ మంందులు తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు. అన్ని నొప్పి నివారణ మందులు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. సుమారు 4 నుంచి 5 గంటలు గర్భా నృత్యం చేస్తున్నప్పుడూ డీ హైడ్రేషన్కి గురవ్వతారు ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు. శరీరం మాట వినండి..గర్భా సమయంలో శరీరంలో ఏ భాగం నుంచి అయినా నొప్పి వస్తే..ఆగిపోండి. కాస్త ఇబ్బందికరంగా ఉన్నా..డ్యాన్స్ చేసే సాహసం చెయ్యొద్దు అని సూచిస్తున్నారు. తక్షణమే సమీప వైద్యలును సంప్రదిస్తే..సురక్షితంగా ఉంటారని అన్నారు. View this post on Instagram A post shared by Krunal Shah (@dr.krunal_shah_) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!) -
'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!
టెక్నాలజీ ఎన్నో ఆలోచనలకు తెరతీస్తుంది. సాంకేతిక సాయంతో దూరంగా ఉన్న తమ వాళ్లను తమవద్దకు చేర్చుకునేలా కొందరు భలే ఉపయోగిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఈ టెక్నాలజీని మన సంతోషాలకు, సంబరాలకు అనుగుణంగా మార్చుకుంటూ..ఇలా కూడా వాడుకోవచ్చా అని విస్తుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే..అసలేంటి కథ అంటే..విదేశాల్లో నివశించే చాలామంది భారత్లో జరిగినట్లు సంస్కృతి సంపద్రాయలకు అనుగుణంగా సంబరంగా జరిగే పండుగలను మిస్ అవుతుంటారు. ఒకవేళ అక్కడ భారత కమ్యూనిటీలంతా ఒకచోట చేరి చేసుకున్న మన దేశంలో ఉన్న మాదిరి ఆనందమైతే మిస్ అయిన వెలితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉండే పండుగ కోలాహలం, సందడి..అక్కడ ఉండదు. అత్యంత నిశబ్దంగా జరిగిపోతుందంతే. అలా ఉసురుమనుకుండా హాయిగా ఎంజాయ్ చేసేలా..సరికొత్త మార్గాన్ని పంచుకున్నాడు కంటెంట్ క్రియేటర్, నటుడు విరాజ్ ఘేలాని. ఈ నవరాత్రిని తన ఇద్దరు ఎన్ఆర్ఐ స్నేహితుల మిస్ అవ్వకుండా..వారి ఫోటోలను చెరో చేతిలో పెట్టుకుని సంబరంగా గర్భా డ్యాన్స్ చేశాడు. తన స్నేహితులు మిస్ అవ్వకుండా వాళ్లు కూడా ఎంజాయ చేస్తున్నారనిపించేలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నవరాత్రిని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నా, అలాగే తన స్నేహితులు ఈ పండుగ మిస్ అయ్యానని బాధపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు నటుడు విరాజ్ వీడియోలో. మీరు ఇలాంటి డిజిటల్ గర్భాలో పాల్గొనేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నవాళ్లు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు అని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లలో చాలామంది తమ దేశానికి దూరంగా ఉన్నమనే ఫీల్తో ఉన్నవాళ్లందరి మనసులను తాకింది ఈ వీడియో. కానీ మరికొందరూ బాస్ భారత్లో తొమ్మిది రోజులే గర్భా డ్యాన్స్ చేస్తారు, అదే కాలిఫోర్నియాలో నెలల తరబడి ఆ డ్యాన్స్ చేస్తామంటూ వ్యంగంగా పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా ఈ ఆలోచన మాత్రం అదుర్స్. చిన్న చిన్న పొరపచ్చలు సైతం ఇలా మనవాళ్లని భాగస్వామ్యం చేస్తే బాంధవ్యం బలపడటమే కాదు వాళ్లు ఖుషి అవుతారు. View this post on Instagram A post shared by Viraj Ghelani (@viraj_ghelani) (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
నాలుగో రోజు నవరాత్రుల పూజలో యాంకర్ లాస్య.. (ఫొటోలు)
-
అక్కడ దసరా విజయదశమి నుంచే ..
మన దేశంలో ఈ దసరా పండుగ పలు సంప్రదాయాలకు అనుగుణంగా విభిన్నంగా చేసుకుంటుంటారు. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇదే పండుగ పర్యాటక ప్రేమికులు ఇష్టపడే హిమచల్ప్రదేశ్ కులుమనాలిలోని కులు లోయలో ఎలా జరుగుతుందో తెలిస్తే విస్తుపోతారు. ఈ పండుగను అక్కడ అత్యంత విచిత్రంగా నిర్వహిస్తారు. అన్నిచోట్ల నవరాత్రులు విజయదశమితో ముగిస్తే..అక్కడ ఆ రోజు నుంచి మొదలవుతాయట. ఇదేంటని అనుకోకండి. ఎందుకంటే అందుకు ఓ పెద్ద స్టోరీనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం చకచక చదివేయండి..కులు లోయలో జరిగే ఈ పండుగ ప్రపంచంలోని ప్రత్యేకమైన పండుగలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. మనకు దసరా పాడ్యమి నుంచి మొదలై విజయ దశమితో మగుస్తాయి. కానీ ఈ కులు లోయలో విజయదశమి రోజు నుంచి మొదలై.. సరిగ్గా వారం రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఇది 375 ఏళ్ల నాటి పండుగ అట. సింపుల్గా చెప్పాలంటే సుమారు 17వ రాజా జగత్ సింగ్ ఆధ్వర్యంలో రూపుదొద్దుకుందట. అలా అప్పటి నుంచి అదే ఆచారంలో నిర్వహిస్తున్నారట ఈ దసరా వేడుకని. ఈ పండుగ వెనుకున్న ఆసక్తికర కథేంటంటే..శాపం నుంచి వచ్చిన పండుగ..పురాణ కథనాల ప్రకారం..దుర్గా దత్ అనే బ్రహణుడు వద్ద ముత్యాల గిన్నె ఉంది. అది అందరిని అమితంగా ఆకర్షించేది. గిన్నె గురించి కులు లోయ రాజు రాజా జగత్ సింగ్కి తెలుస్తుంది. అలాంటి వస్తువులు తనలాంటి వాళ్ల వద్ద ఉండాలన్న అహకారంతో తన భటులకు వెంటనే దాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజు సైనికులు ఆ దుర్గా దత్ అనే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి ధౌర్జన్యం చేసి మరి తీసుకువెళ్లే సాహసం చేస్తారు భటులు. దాంతో ఆ బ్రహ్మణుడు కోపంతో ఆ భటులతో ఆ గిన్నె కోసం ఆ రాజే స్వయంగా వచ్చి తీసుకోవాలని చెబుతాడు. దీని కోసం మా రాజు గారు రావాలంటావా నీకెంత ధైర్యం అంటూ ఆ బ్రహ్మణుడిని అతడి కుటుంబాన్ని అతడి ఇంటిలోనే సజీవదహనం చేసేస్తారు సైనికులు. అయితే ఆ బ్రహ్మణుడు దుర్గాదత్ చనిపోతూ.. నీ దురాశకు తగిన ఫలితం అనుభవిస్తావంటూ రాజుని శపిస్తాడు. అది మొదలు రాజు జగత్సింగ్కి ఆ బ్రహ్మణుడి కుటుంబ సభ్యుల ఆత్మలు కలలోకి వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఫలితంగా రాజుకి కంటిమీద కునుకు కరువై రోజురోజుకి అతడి ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ వార్త రాజ్యమంతా దావానలంలా వ్యాపిస్తుంది. ఇది తెలుసుకున్న కృష్ణ దత్(పహారి బాబా) అనే బైరాగి రాజుని కలిసి తక్షణమే రాముడి శరణు కోరమని సూచిస్తాడు. దాంతో రాజు రఘనాథుడుని ఆహ్వానించేందుకు కులు లోయ చుట్టుపక్కల ఉండే గ్రామ దేవతలందరిని ఆహ్వానిస్తాడు. ఆ గ్రామ దేవతలను సుమారు 300కి పైగా పల్లకిలపై ఘనంగా తీసుకువచ్చి సమావేశపరిచి..రాముడి కరుణ పొందుతాడు. అలా ఏటా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రజారంజకంగా పాలన సాగించాడు. అలా ఆ రాజు శాపం నుంచి విముక్తి పొందాడు. ఆ రాజు ఈ పండుగను సరిగ్గా విజయ దశమి రోజున నుంచి గ్రామ దేవతలను ఆహ్వానించడం మొదలుపెట్టాడు. అలా మొదలైన ఆచారం నేటికి నిరాటంకంగా అదే సంప్రదాయంలో జరుగుతుండటం విశేషం. ఎలా జరుగుతుందంటే..ఈ పండుగను వారం రోజులపాటు నిర్వహిస్తారు. అక్టోబర్ 2 నుంచి మొదలై ఈ నెల 8తో ముగుస్తుంది. అంటే విజయదశమి రోజున ప్రారంభమై, ఒక వారం తర్వాత కులులోని ధల్పూర్ మైదానంలో ముగుస్తుంది. కాలినడకన పల్లకీల్లో చుట్టుపక్కల గ్రామ దేవతలను తీసుకురావడం అనేది రోజుల తరబడి సాగుతుందట. అది కూడా డ్రమ్స్, నృత్యాలతో సాదరంగా ఆ గ్రామ దేవతల్ని కులు రాజ్యానికి తీసుకువచ్చి దేవతలందరి సమావేశ పరిచి రాముడని ఘనంగా సత్కరిస్తారట. అన్ని చోట్ల విజయదశమి రోజున రావణ దహనం వంటివి నిర్వహిస్తే..ఇక్కడ రాముడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకునేందుకు గ్రామదేవతలను పిలవడం విశేషం. (చదవండి: కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో నవరాత్రి పూజలు..) -
అంబానీ నవరాత్రి ఉత్సవాలు:నీతా, రాధికా గార్బా డ్యాన్స్తో సందడి
-
నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ శైలితో ఆకట్టుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థానీ టై-డై టెక్నిక్ సాంప్రదాయ దుస్తులలో అమ్మ వారి ఆరాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ చిత్రాలను సోషల్ మీడియాలో సందడిగామారాయి.దుర్గాదేవి తొమ్మిది రూపాలను సూచించే బహుళ వర్ణ బనారసి పింక్ లెహంగా చోళిలో అత్యంత సుందరంగా కనిపించారు. దీనిపై వివిధ రకాల బట్టలతో ప్యాచ్వర్క్, క్లిష్టమైన జరీ వర్క్, సంక్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహంగాలో భారీ లేస్వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కర్ట్కు మ్యాచింగ్గా ప్యాచ్వర్క్ , బంగారు జరీ వర్క్తో పింక్ బ్లౌజ్ను ఆమె ఎంచుకున్నారు. గులాబీ , నారింజ రంగు లెహెరియా ప్రింట్ దుపట్టాతో నీతా అంబానీ లుక్మరింత ఎలివేట్ అయింది. మల్టీ లేయర్డ్ డైమండ్స్, ఆకుపచ్చ పచ్చ నెక్లెస్తో పాటు స్టేట్మెంట్ చెవిపోగులు, మాంగ్ టికా, రంగురంగుల గాజులు, హెవీరింగ్ను ధరించారు. ఈ కాస్ట్యూమ్స్ను ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ JADE మోనికా అండ్ రిష్మా రూపొందించారు. నీతా అంబానీ లుక్కు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. గుజరాత్ ఆత్మ నుండి ప్రేరణతో పవిత్రమైన మూలాంశాలు ,శక్తివంతమైన కచ్చి వస్త్రాలతో కూడిన దైవిక నేపథ్యంలో నీతా అంబానీ లుక్ సజీవంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. (Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్)అంతేకాదు అంబానీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఐలైనర్, కోల్-ఐడ్, మస్కారా-కోటెడ్ లాషెస్, బ్లష్డ్ బుగ్గలు, రేడియంట్ హైలైటర్, న్యూడ్ లిప్స్టిక్తోపాటు, మిడిల్-పార్టెడ్ బన్ హెయిర్స్టైల్ , నుదిటిపై ఎర్రటి బొట్టు తదితర వివరాలను అందించారు. (సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు)నెటిజన్ల స్పందనసోషల్ మీడియా వినియోగదారులు ఆమె సొగసైన స్టైలింగ్ను ప్రశంసించారు. నవరాత్రి క్వీన్కు అవార్డు నీతా అంబానీ జీకి దక్కుతుంది. ఎలిగెంట్ రాయల్, చాలా అందంగా ఉన్నారంటూ కొనియాడటం విశేషం. -
శరీరంపై జాగ్రత్తేనా.. మరి ఆత్మ! యా దేవీ సర్వ భూతేషు...
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆదిశక్తి అనేక అవతారాలు తీసుకోవడం జరిగింది. అందుకు ప్రతీకగానే అమ్మను దేవీ నవరాత్రులలో నవ దుర్గలుగా ఆరాధిస్తాము. నవరాత్రులుగా మనం జరుపుకునే 9 రోజులు అతి ముఖ్యమైన పవిత్రమైన పర్వదినాలు. అతి రౌద్ర రూపిణి, రాక్షస సంహారిణి అయిన దుర్గాదేవి ఈ రోజులలో తన విజయోత్సవంతో అతి కరుణామయిగా, ప్రసన్న వదనంతో ఉంటుంది. తనను నమ్ముకుని, సంపూర్ణ సమర్పణతోను, భక్తి ప్రపత్తులతోను ఆరాధిస్తున్న తన భక్తుల కోరికలను నెరవేరుస్తుందనేది ప్రగాఢ విశ్వాసం. మానవులలో సూక్ష్మ ధర్మాలు శక్తుల రూ΄ాలలో వుంటాయి. అయితే భగవంతుడు మనలో స్థిరపరచిన ధర్మాలను మనం తప్పుతూ వుండడం వలన అంటే ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకోవడం వలన మానవుడు అనేక ఇబ్బందులకు, సమస్యలకు లోనవడం జరుగుతోంది. మానవ శరీరంలోనే వున్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి, శ్రీ మహా కాళీ శక్తుల ద్వారా ఆ దేవియే అంతర్గతంగా మనకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తోంది. ‘‘యాదేవి సర్వ భూతేషు’’ అంటే ఆమెయే అన్ని ప్రాణులలోనూ వుంది. ప్రత్యేకించి దేవి నవరాత్రులలో దేవీ మహాత్మ్యంలో వివరించిన సప్తశతీ శ్లోకాలలో దేవీసూక్తం తప్పక చదవాలి. దానిలో ఒక విశిష్టత వుంది. ఉదాహరణకు ‘‘యాదేవి సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్థితా’’ నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై, నమోనమః’’అంటే దేవి మనుష్యులలో శాంతి రూపంలో వుంటుందని. ఆమె మన లోపల, బాహ్య పరంగాను శాంతిని ప్రసాదించింది. ఆమె అనుగ్రహించిన ఆ శాంతిని మనం సాధించాలి. ఆస్వాదించాలి. అలా మనం వుండగలుగుతున్నామా? లేదా? అని మనం పరిశీలన చేసుకోవాలి. మరొకటి – యాదేవి సర్వ భూతేషు ప్రీతి రూపేణా సంస్థితా ...’’ ప్రీతి అంటే ప్రేమించే గుణం. ప్రేమించే గుణం మానవులకు అనుగ్రహించ బడింది. ప్రేమంటే మంగళకరమైన, ధర్మబద్ధమైన, ఏ కోరిక, ఏ కామం, అసూయలు లేకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇతరులను ప్రేమతో చూడటం. కానీ మానవులలో పేరుకు పోయి ఉన్న అసూయ అనే పనికిమాలిన గుణం వలన ప్రేమించే గుణానికి విరుద్ధంగా ప్రవర్తించడం వలననే దేవికి ఆగ్రహం తెప్పిస్తున్నాం. సమస్యలు కోరి తెచ్చుకుంటున్నాం. అలాగే –‘‘యాదేవి సర్వ భూతేషు క్షమా రూపేణా సంస్థిత .. ’’ అని చెప్పబడింది. క్షమాగుణం అంటే ఇతరుల తప్పులను మన్నించడం. ఆ క్షమించడం మీ హృదయం నుండి రావాలి. ఎవరో మీ పట్ల అమర్యాదగా, అసభ్యంగా, క్రూరంగా ప్రవర్తిస్తారు లేదా వారి స్వలాభం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. అయితే దేవి మనలో స్థిరరపరచిన ఆ క్షమాశక్తిని మనం ఉపయోగిస్తున్నామా ? లేదా? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘‘యా దేవీ సర్వ భూతేషు: నిద్రారూపేణాసంస్థితా .. ‘‘మీరు అలసిపోయినప్పుడు, నిద్ర పోలేనప్పుడు ఆమె మీకు నిద్రను ప్రసాదిస్తుంది. మీకు సేద తీరుస్తుంది. ఆమెకు మిమ్మల్ని విశ్రాంతి పరిచే శక్తి వుంది. ఇదంతా మనలోని నాడీ వ్యవస్థ ద్వారా ఆమె చేయిస్తుంది. ‘‘యాదేవీ సర్వ భూతేషు భ్రాంతి రూపేణా సంస్థితా ...’’ ఆమె మిమ్మల్ని మాయలో పడేస్తుంది. ఎందుకంటే వారలా భ్రాంతిలో పడితే గాని ఆమె పిల్లలమైన మనం ఆమె గురించి ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేము. స్త్రీలకు, పురుషులకు ఈ మాయా, ఈ భ్రాంతి రకరకాలుగా కలగజేస్తుంది. మరొక శక్తి. ‘‘యాదేవీ సర్వ భూతేషు లజ్జా రూపేణా సంస్థితా ...’’ అని. లజ్జ అంటే సిగ్గు కాదు. మీ శరీరం గురించిన ఒక విధమైన అవమానం. మనకు భగవంతుడు చక్కని శరీరాన్ని ప్రసాదించాడు. స్త్రీలయినా, పురుషులయినామనం మన కళను ఉపయోగించి దానిని సందర్భానికి తగినట్లుగా చక్కటి వస్త్ర ధారణతో అలంకరించుకోవాలి.‘‘యాదేవీ సర్వ భూతేషు క్షుధా రూపేణా సంస్థితా ...’’ మనకు ఆకలిని ప్రసాదించేది కూడా ఆ దేవియే. మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రోజుల్లో సన్నగా ఉండటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. లేక మరేదైనా కారణాల వలన మీరు తినవలసినంత ఆహారం తినడం లేదు. ప్రత్యేకించి శక్తి స్వరూపిణులైన స్త్రీలు ఆహారం చాలా తక్కువగా తీసుకుంటున్నారు. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మీ జీవిత ధ్యేయం కేవలం శరీరం గురించి జాగ్రత్త తీసుకోవడమే కాదు. ఆత్మ గురించి జాగ్రత్త పడడం, ఆత్మసాక్షాత్కారం పొంది ఆత్మ స్వరూపులుగా వ్యక్తీకరింపబడడమే మీ ధ్యేయం కావాలి. మీరు దేవీ సూక్తం పూర్తిగా చదవండి. దేవి ప్రసాదించిన ఈ గుణాలన్నీ మీలో అంతర్గతంగా ఉన్నాయా? లేవా? అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ దేవీ నవరాత్రులలో దేవీసూక్తం, దేవీ అధర్వ శీర్షం, అర్గళా స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం, మన శరీరంలోనూ, సూక్ష్మ శరీరంలోని అంగాం గాలలో ఉంటూ మనల్ని సంరక్షిస్తూ ఉన్న ఎందరో దేవీ దేవతలను ఆరాధించే దేవీ కవచం లాంటి ఎన్నో దేవిని ప్రసన్నం చేసుకునే సంస్కృత శ్లోకాలు, స్తుతులు ఉన్నాయి. వాటిని కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా వాటి భావార్థం తెలుసుకుని చదవడం చాలా మంచిది. ప్రస్తుత పరిస్థితులలో చాలామంది ఆమె ప్రసాదించిన ఈ ధర్మాలను ఏవేవో కారణాలు చెప్పుకుని ఆచరించడం మానుకున్నారు. అందుచేత వ్యక్తిగతపరంగా కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించాలి.చదవండి: మిలన్ ఫ్యాషన్వీక్ : రొటీన్గా కాకుండా బోల్డ్ లుక్లో మెరిసిన ఆలియావీటిని మీ కుండలినీ జాగృతి ద్వారా, ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా మీరు తిరిగి జాగృత పరచుకోవాలి. ఈ ప్రపంచాన్ని కలియుగ ధర్మం ప్రభావాలనుండి రక్షించాలనుకుంటే అది కేవలం మీ ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారానే సాధ్యమవుతుంది. మనలోనే నిక్షిప్తమై వున్న కుండలినీ శక్తి జాగృతమై సహస్రారం దగ్గర ఛేదించు కుని వచ్చి బాహ్యంగా వున్న పరమాత్ముని పరమ చైతన్య శక్తితో అనుసంధానం కావడమే ఆత్మ సాక్షాత్కారం.ఇదీ చదవండి: Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆవిష్కరించిన సహజ యోగా ధ్యానసాధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో సాధకులు ఈ నవరాత్రి పర్వదినాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. – డాక్టర్ పి.రాకేష్( శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి (ఫొటోలు)
-
#Dussehra2025 : వైభవంగా శ్రీశైలం దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
కార్పొరేట్లకూ దసరా జోష్!
కోల్కతా: దసరా నవరాత్రి వేడుకలను కంపెనీలు మార్కెటింగ్ మంత్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ సందర్భంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ, వినియోగదారులకు మరింత దగ్గరయ్యే దిశగా మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా దుర్గా పూజలను పెద్ద ఎత్తున నిర్వహించే పశ్చిమబెంగాల్ వంటి ప్రాంతాల్లో థీమ్డ్ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నాయి. టీపొడి, వ్యక్తిగత సంరక్షణ నుంచి ఫ్యాషన్, పాదరక్షలు, లైటింగ్, సాంకేతికత వరకు.. బ్రాండ్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు ఆవిష్కరణలకు సంప్రదాయాన్ని జోడిస్తున్నాయి. పండుగల రోజుల్లో షాపింగ్కు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుంటారు. అందులోనూ దసరా రోజుల్లో ఖరీదైన కొనుగోళ్లు ఎక్కువగా నమోవుతుంటాయి. ఈ సమయంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలతో విక్రయాలను పెంచుకోవడమే కాకుండా, వినియోగదారులతో దీర్ఘకాల భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కంపెనీలు చూస్తుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘పండుగ కార్యక్రమాలు బ్రాండ్ల నిర్మాణానికి కీలకం. వినియోగదారుల సెంటిమెంట్ గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో వారితో అనుబంధానికి వీలు కలి్పస్తాయి’’అని పర్సనల్కేర్ బ్రాండ్ జోయ్ సీఎంవో పౌలోమీ రాయ్ తెలిపారు. మింత్రా జబాంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రీమియం ఎతి్నక్ వేర్ లేబుల్ ‘సౌరాగ్య’ను మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో కలసి రూపొందించింది. సౌరవ్ విజన్ అయిన అసలైన బెంగాలీ ఫ్యాషన్ ఈ భాగస్వామ్యానికి మూలమని మింత్రా అధికార ప్రతినిధి చెప్పారు. దీంతో సౌరవ్ గంగూలీ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టయిందన్నారు. ఇమామీ గోధుమ పిండి దసరా ముందు గోధుమ పిండి బ్రాండ్ను విడుదల చేయడం ద్వారా ఇమామీ ఆగ్రోటెక్ స్టేపుల్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన చెక్కీ ఫ్రెష్ ఆటా పిండితో రూపొందించిన దుర్గామాత విగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. పశి్చమబెంగాల్ కళ, సంస్కృతిని ప్రతిబింబిస్తూ టాటా టీ కంపెనీ టాటా టీ గోల్డ్ బ్రాండ్ ప్రచారాన్ని చేపట్టింది. ఐదుగురు బెంగాలీ కళాకారులు రూపొందించిన డిజైన్లతో లిమిటెడ్ ఎడిషన్ టాటా టీ గోల్డ్ను విడుదల చేసింది. ఈ డిజైన్లు దుర్గా పూజల ప్రత్యేకతను చాటనున్నాయి. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ సైతం దసరా సందర్భంగా తన ఫారŠూచ్యన్ బ్రాండ్ను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. సంప్రదాయ వేడుకలు, సంబరాల్లో పాలు పంచుకునేందుకు పండుగలు అవకాశం కలి్పస్తాయని కంపెనీ సేల్స్ జాయింట్ ప్రెసిడెంట్ ముకేశ్ మిశ్రా తెలిపారు. కొత్త ఉత్పత్తులు, ప్రచారాలతో తమ విక్రయాలు పెంచుకోవడమే కాకుండా, వినియోదారులకు చేరువ అయ్యేందుకు ఈ సీజన్ను ఒక చక్కని అవకాశంగా భావిస్తూ ముందుకు వెళుతున్నాయి. -
75 రోజుల దసరా!
డెబ్బై అయిదు రోజుల పాటు జరిగే దసరా పండగ (Dussehra) ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ బస్తర్లో కొనసాగుతోంది. ‘జోగీ బిథాయి’ సంప్రదాయంలో భాగంగా హల్బా తెగకు చెందిన ఒక యువకుడు సాధువు వేషధారణతో దంతేశ్వరీ ఆలయంలో భూమికి ఆరు అడుగుల దిగువన, జ్యోతి ఎదురుగా తొమ్మిది రోజుల పాటు పీఠంపై కూర్చుంటాడు. ఈ యువకుడు ఎనిమిది రోజులు ఉపవాసం ఉంటాడు.‘జోగి బిథాయి’ సంప్రదాయానికి 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులో పాత్ జత్ర, దేరి గడాయి, కాంచన గడాయి సంప్రదాయాలు ఉంటాయి. మవల్లి ఆలయంలో పూజారి దీపం వెలిగించడంతో దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఒక ఖడ్గాన్ని ఆలయంలో పెట్టి పూజలు చేస్తారు. ఈ పురాతన సంప్రదాయాన్ని ఇటలీకి చెందిన ఇద్దరు యువకులు డాక్యుమెంట్ చేశారు.‘ఇక్కడి ప్రజలు నిరాడంబరం గా, స్నేహంగా ఉంటారు. ఇక్కడ దసరా పండగ రకరకాల సంప్రదాయలతో కన్నుల పండుగగా జరుగుతుంది’ అంటున్నాడు ‘జోగి బిథాయి’ సంద్రాయాన్ని వీడియో డాక్యుమెంట్ చేసిన యువకులలో ఒకరైన డేనియల్. ప్రపంచంలో జరిగే అతి పెద్ద దసరా వేడుకలలో ‘జోగి బిథాయి’కి ప్రత్యేక గుర్తింపు ఉంది.చదవండి: Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్ -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
దేవి నవరాత్రులు: నవ దుర్గలు... వర్ణాలు
దేవీ నవరాత్రులు వచ్చాయి. ఈ తొమ్మిది రోజులూ భక్తులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు పెట్టి నృత్య గానాలు చేసి భక్తి పారవశ్యంలో ఓలలాడుతుంటారు. అయితే అమ్మవారికి రోజుకో నైవేద్యం పెట్టినట్లే రోజుకో రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అంతేకాదు, తాము కూడా ఆ రంగు వస్త్రాలను ధరించి, అమ్మవారి అనుగ్రహాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నవరాత్రులలో ఇప్పటికే రెండు రోజులు గడచిపోయాయి. మిగిలిన రోజుల్లో అయినా అమ్మవారిని ఆమెకు ఇష్టమైన రంగులతో అలంకరిద్దాం. అమ్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. 1. శైలపుత్రి: మొదటి రోజున అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. శైలపుత్రి అలంకారం బలానికి, శక్తికి ప్రతీక అయితే, ఎరుపు రంగు అభిరుచికి, ధైర్యానికి సూచిక. నైవేద్యం: పులిహోర, కట్టు పొంగలి2. బ్రహ్మచారిణి: నీలం రంగునీలవర్ణం నిశ్శబ్దానికి, ప్రశాంతతకు, భక్తికి ప్రతీక అయితే, బ్రహ్మచారిణి అమ్మవారు క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడేలా చేసి, ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. నైవేద్యం: కొబ్బరి అన్నం, పాయసాన్నం3. చంద్రఘంట: భక్తులు చంద్రఘంటాదేవిని సౌందర్యానికి, సాహసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ అమ్మను ఆరాధించడం వల్ల భయం, ప్రతికూలతలు తొలగుతాయని నమ్ముతారు. ఈ రోజున సంతోషానికి, సానుకూల భావనలకు చిహ్నమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు.నైవేద్యం : క్షీరాన్నం, దద్దోజనం, గారెలు4. కూష్మాండ: ఈ అలంకారంలో అమ్మవారు సాక్షాత్తూ ఈ విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల ఏ పనినైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు అలవడతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించే ఆకుపచ్చ రంగు ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. ఆకుపచ్చ వృద్ధికి, ఉపశమనానికి సంకేతంగా నిలుస్తుంది. నైవేద్యం : దద్దోజనం, క్షీరాన్నం5. స్కందమాత: స్కందుడు అంటే కార్తికేయుడు అంటే కుమారస్వామి. అమ్మవారిని స్కందమాతగా ఆరాధించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగడంతోపాటు ధైర్యం కూడా లభిస్తుంది. ఈ అమ్మవారికి ధూమ్రవర్ణం అంటే బూడిదరంగు ఇష్టం. బూడిద రంగు సమతుల్యతకు, స్థిరత్వానికి, తెలివితేటలకూ చిహ్నం. నైవేద్యం : కేసరి, పరమాన్నం, దద్దోజనం6. కాత్యాయని: ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడంతో΄ాటు సమస్యలను ఎదుర్కొనే శక్తి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. కాత్యాయనీ దేవికి ఇష్టమైన నారింజ రంగు ధైర్యానికి, జిజ్ఞాసకు, పరివర్తనకూ ప్రతీక. నైవేద్యం : చక్కెర పొంగలి, క్షీరాన్నం7. కాళరాత్రి: దుర్గాదేవి రౌద్రరూపానికి ప్రతీకగా కాలరాత్రి అమ్మవారిని సంభావిస్తారు. ఈ అమ్మవారి ఆరా«దనతో భయాలు తొలగి, దేనినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం కలుగుతుందంటారు. ఈమెకు ప్రీతికరమైన తెలుపు రంగు స్వచ్ఛతకు, ప్రశాంతతకూ ప్రతీక. నైవేద్యం : కదంబం, శాకాన్నం8. మహాగౌరి: సంతోషానికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అయిన ఈ అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. గులాబీరంగు వస్త్రాలను ధరించడం వల్ల కరుణ భావనలు కలుగుతాయి. మనసుకు ప్రశాంత చేకూరుతుంది. నైవేద్యం : చక్కెర పొంగలి9. సిద్ధిదాత్రి: ఈ అమ్మవారి ఆరాధన వల్ల అతీంద్రియ శక్తులు సిద్ధిస్తాయని, విజ్ఞానం, సంపద చేకూరతాయని భక్తుల విశ్వాసం. ఈమెకు ప్రీతికరమైన ఊదారంగు శక్తికి, ఆధ్యాత్మికతకు, ఆశయ సాధనకూ తోడ్పడుతుంది, నైవేద్యం : పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు.రంగులు.. మానసిక ప్రభావంఏ రోజుకు నిర్దేశించిన రంగును ఆ రోజున వాడటం వల్ల మనసుకు ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలతోపాటు మనస్తత్వ నిపుణులు కూడా చెబుతారు. – డి.వి.ఆర్. (చదవండి: 'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్) -
వారెవ్వా గర్భా..
సాక్షి, హైదరాబాద్ దేవీ నవరాత్రులను పురస్కరించుకుని దాండియా, కోలాటం, గర్భా నృత్యాలతో ప్రాంగణాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా మారాయి. విస్టా కన్వెన్షన్ అండ్ రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన ‘రంగ్ థాలి’ ఆకట్టుకుంటోంది. ఇందులో గుజరాతీ సంప్రదాయ గర్భా నృత్యాలు కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల దుస్తులు, ఆకట్టుకునే వేషధారణలో యువతీ యువకులు చేస్తున్న దాండియా, కోలాటాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఫిఫ్త్ అవెన్యూ ఈవెంట్ మేనేజ్మెంట్, రంగోలి మార్కెటింగ్, అగర్వాల్స్ ప్యాకర్స్ మూవర్స్, డీఆర్ఎస్ స్కూల్, దోడియా ఆగ్రోటెక్ సంస్థల ఆధ్వర్యంలో ‘రంగ్ థాలి’ సీజన్–4 కనువిందు చేస్తోంది. అక్టోబర్ 1 వరకూ రాత్రి 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే నృత్యాలు అహూతులను విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. సుమారు నాలుగు వేల మంది ప్రతిరోజూ సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక నృత్యరీతులను ప్రదర్శిస్తున్నారు.చదవండి: వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన పాపులర్ నటుడు -
కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో..
విభిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలతో మినీ భారత్ను తలపిస్తోంది హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ. విభిన్న ప్రాంతాలకు చెందిన వారు విభిన్న రీతుల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి కలసికట్టుగా నవరాత్రులు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యాణ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు అగర్వాల్ కుటుంబీకులు, మరాఠాలు, కన్నడిగులు, బెంగాలీలు తమతమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన కన్నడిగులు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జియాగూడ, అత్తాపూర్, సికింద్రాబాద్, గుల్జార్హౌజ్, మామ జుమ్లా పాటక్, చార్కమాన్, కోకర్వాడీ, చెలాపురా, ఘాన్సీబజార్, జూలా, కూకట్పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కన్నడిగులు దసరా వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దుర్గామాత చిత్రపటం వద్ద నల్లరేగడి మట్టిలో నవధాన్యాల విత్తనాలను వేస్తారు. ఇవి మొలకెత్తడంతో తొమ్మిది రోజుల పాటు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవధాన్యాల మొలకలు పెరిగిన ఎత్తు అమ్మవారి కటాక్షానికి కొలమానంగా భావిస్తారు. కన్నడిగుల అష్టమి కడాయి.. దుర్గాష్టమి సందర్భంగా గోధుమ పిండితో అమ్మవారి ఆభరాలను తయారు చేస్తారు. వీటిని కడాయిలో వేసి వేపుతారు. అమ్మవారి పుస్తె, మట్టెలు, జడ వంటి ఆభరణాలను తయారుచేసి అమ్మవారి విగ్రహం చుట్టు వేలాడదీస్తారు. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చే బంధు మిత్రులకు వీటిని అందజేసి దసరా శుభాకాంక్షలు చెబుతారు. ఉపవాసం అనంతరం.. తొమ్మిది రోజుల ఉపవాసం అనంతరం విజయ దశమినాడు జమ్మిచెట్టు పూజతో పాటు చెరుకుగడ, బంగారం ఇస్తూ ఆలింగనం చేసుకుంటారు. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. బెంగాలీలకు ఐదు రోజులే.. పశ్చిమబెంగాల్కు చెందిన బెంగాలీలు దసరా ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇదే వారి ప్రధాన పండుగ. దుర్గామాతను ప్రతిష్టించిన నాటి నుంచి నాలుగు రోజుల వరకూ ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ దశమి రోజు నిమజ్జనం చేస్తారు. కోల్కతాలో దుర్గామాత వద్ద మేకలను బలిస్తామని.. ఇక్కడ మాత్రం తొమ్మిది రకాల వేర్వేరు ఫలాలను ప్రసాదంగా పెడతామని తెలిపారు. మొదటి రెండు రోజులు శాకాహారం, మిగిలిన రెండు రోజులు మాంసాహారం భుజిస్తారు. అగర్వాల్ ఉపవాస దీక్షలు.. ఉత్తర భారతీయులైన అగర్వాల్ కుటుంబీకులు తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేస్తారు. గోడకు పటం వేసి గోధుమలు, జోన్నలు మట్టి కుండలో పెడతారు. మొలకెత్తిన విత్తనాల ఆకులను విజయదశమి రోజు తలపాగలో, చెవులపై ధరించి పాదాభివందనం చేస్తారు. విజయ దశమి నాడు 2–8 ఏళ్ల వయసున్న తొమ్మిది మంది బాలికలను ప్రత్యేకంగా పూజించి తాంబూలం సమరి్పస్తారు. ఈ సందర్భంగా పూజా తాలీ పోటీలు నిర్వహిస్తారు. ఐక్యతకు నిదర్శనం.. మేము ఉత్తర భారతీయులమైనప్పటికీ దశాబ్దాలుగా నగరంలో జీవిస్తూ కలసిమెలసి ఉత్సవాలు చేసుకుంటున్నాం. దసరా వేడుకను ఘనంగా జరుపుకుంటాం. ఇది శక్తి, ఐక్యతకు నిదర్శనం. శ్రీరాముని విజయమైనా, దుర్గామాత పూజ అయినా రెండూ శక్తి ఆరాధన రూపాలే. – పంకజ్ కుమార్ అగర్వాల్, హైదరాబాద్ కుంభమేళా అగర్వాల్ సమితి అధ్యక్షులు కోల్కతా మాదిరిగానే.. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కోల్కతాలో నిర్వహించినట్లుగానే ఇక్కడా నిర్వహిస్తాం. ఐదు రోజులపాటు బెంగాలీ మాతను పూజించి, అనంతరం హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తాం. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – జగన్నాథ్ అడక్, బెంగాలీ యంగ్ స్టార్ అసోసియేషన్ అధ్యక్షులుకలిసి మెలిసి ఉత్సవాలు ఏన్నో ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన మేమంతా ఇక్కడ కలిసి మెలసి ఉత్సవాలు చేసుకుంటాం. ఇది నిజాం కాలం నుంచి వస్తోంది. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా..ఉత్సవాలను మాత్రం మా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్నాం. ఇక దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్రంలో ఎలా నిర్వహిస్తారో..అదే పద్ధతిలో ఇక్కడా నిర్వహిస్తున్నాం. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. – డాక్టర్ నాగ్నాథ్ మాశెట్టి, టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షులు -
నటి శివానీ నగరం దసరా స్పెషల్..ఆ నమ్మకంతోనే ముందుకు
‘‘దుర్గా మాతని శక్తి స్వరూపిణి అంటారు. ప్రతి స్త్రీలోనూ అంతర్లీనంగా దుర్గా మాత ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే ఎలాంటి క్లిష్టమైన సవాల్ను ఎదుర్కొనాల్సి వచ్చినా బలంగా, ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నారు... సక్సెస్ అవుతూ, వారిని వారు సంరక్షించుకోగలుగుతున్నారు. స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే దసరా మహిళలందరికీ పెద్ద పండగ’’ అని అన్నారు యువ నటి శివానీ నాగారం. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయం అయ్యారు శివానీ. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. తెలుగు తెరపై ఈ మధ్య మెరిసిన నవ తారల్లో తెలుగమ్మాయి శివానీకి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. విజయోత్సాహంలో ఉన్న శివానీ దసరా, బతుకమ్మ పండగ విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. మా కుటుంబానికి ‘దసరా’ చాలా పెద్ద పండగ. మేం అందరం కలిసి చాలా సందడిగా దసరా నవరాత్రులను చేసుకుంటాం. అలాగే బతుకమ్మ పండగను కూడా సెలబ్రేట్ చేస్తాం. రంగు రంగుల పువ్వులు సేకరించి, మా కుటుంబంలోని మహిళలతో పాటు అ పార్ట్మెంట్లోని మహిళలందరం కలిసి బతుకమ్మ ఆడతాం. దసరా అనగానే నాకు అమ్మవారు గుర్తుకు వస్తారు. మనకు ఉన్న చెడు వెళ్లిపోయి మనల్ని అమ్మవారు గుడ్ డేస్, గుడ్ స్ట్రెంత్తో ఆశీర్వదిస్తారు. మేం ఆ రోజు బంగారం కొంటాం. తొమ్మిదో రోజు ఆయుధ పూజ చేస్తాం. మా ఇంట్లో ఉన్న కార్లు, బైక్లకు పూల మాల వేసి, పూజలు చేస్తాం. ఇంటిని బాగా అలకరించుకుంటాం. బూరెలు, పాయసం, పులిహోర... ఇలా రకరకాల వంటకాలు చేసి, దేవుడికి పూజ చేసి, నైవేద్యం పెడతాం. ఇక నా జీవితంలో దసరా పండక్కి ప్రత్యేకమైన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాను. కొన్ని పండగలకు మా కజిన్స్ మా ఇంటికి వస్తారు. కొన్నిసార్లు మేం వాళ్ల ఇంటికి వెళ్తాం. అలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటాం. దసరా పండగకి సంబంధించి నా స్కూల్ డేస్లో కానీ, కాలేజ్ డేస్లో కానీ ఎలాంటి మైథలాజికల్ క్యారెక్టర్ చేయలేదు. అయితే అవకాశం వస్తే ఆ తరహా పాత్ర చేయాలని ఉంది. ఎందుకంటే ఆ పాత్రలో కొంత మహిళా సాధికారత ఉంటుందని నా నమ్మకం. ఓ నటిగా నాకు స్థిరత్వం, ఓపిక చాలా ముఖ్యం. దసరా అంటే క్లిష్టపరిస్థితులను దాటుకుని, విజయం సాధించడం. అందుకే మనకు ఓపిక, నమ్మకం ఉండాలి. చెడు రోజులను బలంగా ఎదుర్కొని, హుందాగా నెగ్గుకు రాగలగాలి. చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలుకోల్కతాలో దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. నా జీవితంలో ఒక్కసారైనా నేను కోల్కతా వెళ్లి, దుర్గామాత పూజలో పాల్గొనాలని ఉంది. కొన్నిసార్లు నేను హైదరాబాద్లో బెంగాలీ సమితులకు వెళ్తాను. ప్రతి ఏడాది దసరా నవరాత్రుల ఉత్సవాల్లో ఏదో ఒకరోజు తప్పకుండా వెళ్లి, అమ్మ వారిని దర్శించుకుంటాను. అక్కడ దుర్గామాతకు హారతి ఇస్తారు. ఆ సమయంలో బెంగాలీ మహిళలు తెల్లచీర ధరించి, నుదుట ఎరుపు రంగు బొట్టు పెట్టుకుని, డ్యాన్స్ చేస్తుంటే ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి. ఇక దసరా ఫెస్టివల్కి నా కాలేజీ డేస్ నుంచి దాండియా, గర్బా ఆడటం అలవాటు. ఎవరు దాండియా, గర్బా ఫెస్టివల్స్ను ఏర్పాటు చేసినా అక్కడికి మేం గ్రూప్గా వెళ్లి రాత్రంతా ఆడేవాళ్ళం. అంత క్రేజీగా ఉండేది. నాకు అది లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇదీ చదవండి: Janhvi Kapoor అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్ను కట్టిపడేసి : అమేజింగ్ లుక్నేను స్పిరిచ్యువల్ పర్సన్నిబాధగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడనే కాదు... అవకాశం దొరికినప్పుడల్లా దేవాయాలకు వెళ్తుంటాను. గుడిని ఇల్లుగా భావిస్తాను. అలాగే ఇంటిని కూడా దేవాలయంలా అనుకుంటాను. మా కుటుంబ సభ్యులు కూడా అలానే ఉంటారు. నేను ఎక్కడకి వెళ్లినా, ఎక్కడున్నా దేవుడు అక్కడే ఉన్నారని నేను అనుకుంటాను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి నన్ను రక్షిస్తుందని నా నమ్మకం. నన్నే కాదు... అందర్నీ రక్షిస్తుంటుందని భావిస్తాను. ఈ నమ్మకం వల్లే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతాం. ఉపవాసం అంటే స్వీయ నియంత్రణఉపవాసం గురించి ఎవరి వ్యక్తిగత అభి్ర΄ాయాలు వారికి ఉండొచ్చు. దసరా సమయంలో ఇప్పటివరకు నేనైతే ఉపవాసం ఉండలేదు. మా అమ్మ, అమ్మమ్మగార్లు ఉంటారు. అయితే ఉపవాసం చేయడం వల్ల స్వీయ నియంత్రణ కలుగుతుంది. అమ్మవారికి మన వంతుగా ఏదో ఇచ్చిన ఓ సంతృప్తి ఉంటుంది.ఓపికతో ఉండాలి మనకు మనమే స్ఫూర్తిగా నిలవాలంటే ముందు మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇదే మనకు మనం ఇచ్చుకునే మోటివేషన్. ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితం వస్తుందంటారు. సహనంగా ఉంటే ఏ పనైనా సరిగ్గా అవుతుంది. అందుకే నా ఓర్పే నా శక్తి అని నమ్ముతాను. – ముసిమి శివాంజనేయులు -
ఇంద్రకీలాద్రి పరిసరాల్లో చెప్పులతో సంచారం
ఇంద్రకీలాద్రి(విజయవాడ): దసరా ఉత్సవ వేళ ఇంద్రకీలాద్రిపై అపచారం చోటు చేసుకుంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఆలయ, ఉపాలయాల పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు మంగళవారం కాళ్లకు చెప్పులు వేసుకుని తిరిగారు. అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వచ్చే దారిలో నటరాజ స్వామి ఆలయం, గణపతి ఆలయం, పక్కనే శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు కుంకుమార్చన నిర్వహించే ప్రాంగణం, వెనుక వైపు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి. నటరాజస్వామి వారి ఆలయం నుంచి ముగ్గురు వ్యక్తులు నేరుగా కుంకుమార్చన ప్రాంగణం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాల మీదగా లక్ష్మీ గణపతి ప్రాంగణం వైపు చెప్పులతో పరుగులు తీశారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లోకి చెప్పులతో రాకుండా ఘాట్రోడ్డులోని పలు చోట్ల దేవస్థానం స్టాండ్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఆలయ పరిసరాల్లోకి చెప్పులు వేసుకొని రావడమే కాకుండా తాఫీగా పరిసరాల్లో తిరుగుతూ కనిపించారు. ఇటువంటి వారిపై దేవస్థాన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా అంకురార్పణ (చిత్రాలు)
-
'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్
దేవి నవరాత్రులతో యావత్తు దేశం ఆధ్యాత్మిక వాతవరణంతో అలరారుతోంది. ఎటు చూసిన దుర్గామాత నామస్మరణతో మారు మ్రోగిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ భారతదేశ ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా పోస్ట్లో..శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛ భక్తికి నెలవు ఈ తొమ్మిది రాత్రులు అని అన్నారు. పైగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎవరితోచినట్లుగా వారు తమ భక్తి కొలదీ అమ్మను కొలుచుకుంటారు. అయితే వాటితోపాటు ఈ కీర్తనను కూడా వినండి అంటూ భక్తును ప్రోత్సహించారు. దీంతో ఒక్కసారిగా ఆ పాట నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఈ నవరాత్రులు ఏడాదికి రెండుసార్లు జరుపుకోవడం ఆచారం. ఒకటి చైత్రమాసంలో జరుపుకునే శారద నవరాత్రులు కాగా, మరొకటి ఆశ్వీయుజ మాసంలో జరుపుకునే దుర్గా నవరాత్రులు. అయితే ఈసారి దుర్గమ్మను కొలుచుకునేందుకు సంగీతాన్ని కూడా జోడించండి అని భక్తులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అంతేగాదు పండిట్ జస్రాజ్ పాటను షేర్ చేస్తూ ఈ తొమ్మిది రోజులు ఈ పాట వింటూ..అమ్మవారికి కృపకు పాత్రులకండి అంటూ సోషల్మీడియా పోస్ట్ ఎక్స్లో పేర్కొన్నారు. नवरात्रि पर देवी मां की आराधना मन को असीम शांति से भर देती है। माता को समर्पित पंडित भीमसेन जोशी जी का यह भावपूर्ण भजन मंत्रमुग्ध कर देने वाला है…https://t.co/bMydkzyjPp— Narendra Modi (@narendramodi) April 1, 2025 కాగా, మోదీ కూడా ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి దుర్గమ్మ వారిని ధ్యానిస్తానని గతంలో చెప్పారు. అలా చేయడం వల్ల తనలోని శక్తి మరింతగా జాగృతమై మంచి ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి వీలవుతుందని కూడా అన్నారు. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు కూడా భక్తిభావాన్ని పెంపొందించే ఇలాంటి పోస్టులనే మరిన్ని చేయమని మోదీని పోస్ట్లో కోరారు. ఇక పండిట్ పండిట్ జస్రాజ్ దుర్గమ్మపై పాడిన అందమైన పాట ఏంటంటే యాదేవి సర్వభూతేషు.. అంటూ సాగే రమ్యమైన పాట. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై క్లిక్ చేసి ఆస్వాదించండి మరి..!. కీర్తనలు భగవంతునికి చేరువయ్యేలా చేస్తాయా?కీర్తనలు భక్తి మార్గాన్ని చేరుకోవడంలో హెల్ప్ అవుతాయనేది పురాణ వచనం. నవవిధ భక్తుల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నాయి పురాణాలు. అందుకే మోదీజీ ఈ శరన్నవరాత్రులను కీర్తనలు, భజనల సాయంతో అమ్మవారిని కొలుచుకుందామని పిలుపునిచ్చారు. రామదాసు, అన్నమయ్య, కబీర్ దాస్, మీరాబాయి వీరంతా కీర్తనలతో ఆ భగవంతుడుని వశం చేసుకోవడమే కాదు ఆయనకు ప్రీతీపాత్రులైన భక్తులుగా మారిపోయారు. అంతేగాదు ఆధ్యాత్మికత శక్తికి నెలవైనే ఈ భారతవని..ఎందరో విదేశీయులను తనవైపుకి తిప్పుకుని భక్తిమార్గంలో నడిచేలా చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కూడా. (చదవండి: భారత్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంతలా మారిపోయిందా..? విస్తుపోతున్న ఉక్రెయిన్ మహిళ) -
రూ.50 కొట్టండి.. నాటుకోడి, ఫుల్బాటిల్ గెలుచుకోండి
కరీంనగర్రూరల్: దసరా జోష్ను క్యాష్ చేసుకునేందుకు గ్రామాల్లో పలువురు పలు రకాలుగా ఆలోచిస్తున్నారు. రూ.50 చెల్లించి ఒక కూపన్ కొంటే చాలు.. నాటుకోడి, టీచర్స్ మద్యం బాటిల్ గెలుచుకోవచ్చంటూ ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చెర్లభూత్కూర్లో రూ.50 చెల్లించి కూపన్ తీసుకోండి దసరా ధమాకా గెలుచుకోండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొదటి బహుమతిగా నాటుకోడి, టీచర్స్ ఫుల్బాటిల్, రెండో బహుమతిగా బ్లెండర్సై్పడ్ రిజర్వ్ ఫుల్బాటిల్, మూడో బహుమతిగా రాయల్స్టాగ్ ఫుల్బాటిల్ గెలుచుకోండంటూ వాట్సాప్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. చెర్లభూత్కూర్తోపాటు సమీప గ్రామాలు దుబ్బపల్లి, చామనపల్లి, తాహెర్కొండాపూర్, మొగ్ధుంపూర్కు చెందిన వ్యక్తులు కూపన్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
శరన్నవరాత్రులలో మహమాన్విత దుర్గా సప్తశ్లోకి పారాయణం-శృంగేరీ పీఠం
ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అత్యంత శ్రద్ధాభక్తులతో అమ్మవారిని ఆరాధించడం అనూచానంగా వస్తోంది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు, మన దేశం, సమాజం అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ఈ సంవత్సరం శరన్నవరాత్ర మహోత్సవ శుభ సందర్భంలో సెప్టెంబర్ 22, సోమవారం నుంచి అక్టోబర్ 2, గురువారం విజయందశమి వరకూ మార్కండేయ పురాణాంతర్గతమూ, మహా శక్తిసంపన్నమూ అయిన శ్రీ దుర్గాసప్తశతి సంక్షిప్త రూపమైన దుర్గా సప్తశ్లోకీ అనే ఏడు శ్లోకాల స్తోత్రాన్ని ప్రతిరోజూ కనీసం 108 మార్లు పఠించవలసిందిగా శృంగేరీ పీఠం పిలుపునిచ్చింది.భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పైన సూచించిన దుర్గాసప్తశ్లోకి సంకల్ప సహితంగా పారాయణ చేసి కృతార్థులు కావలసిందిగా శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు భక్తులకు సూచించారు.సంకల్పంమమ శ్రీ దుర్గాపరమేశ్వరీ ప్రసాదేన చింతిత సకల మనోరథ సిద్ధ్యర్థం ఆయుర్విద్యా యశోబల వృధ్యర్థం సర్వారిష్ట పరిహార ద్వారా సమస్త మంగళా వ్యాప్తర్థం విశేషతః అస్మిన్ భారత దేశ పరిదృశ్యమాన పరస్పర విద్వేష నివృత్తి ద్వారా ధర్మ శ్రద్ధాలూనామ్ సకల శ్రేయోభివృద్యర్థం ఏతత్దేశ రాజ్య పరిపాలకానాం ధన ధాన్యాది సకల సాంపత్సమృధ్యర్థం శ్రీ దుర్గా సప్త శ్లోకీ పారాయణం కరిష్యేశ్రీ దుర్గా సప్త శ్లోకీఅస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః 1. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సాబలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి 2. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోఃస్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి ।దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యాసర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా ॥ 2 ॥3. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే 4. శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే ।సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే 5. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే ।భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే6. రోగానశేషానపహంసి తుష్టా-రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ ।త్వామాశ్రితానాం న విపన్నరాణాంత్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి 7. సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ।ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ । -
రాజాధిరాజ.. రాజమార్తాండ.. బహుపరాక్!
మైసూరు ప్యాలెస్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. అంబా విలాస్ ప్యాలెస్లో మైసూరు రాజవంశస్తులు వైభవం అంబరాన్ని అంటింది. రాజవంశీకుడు, స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ బంగారు, రత్న సింహాసనం పైన 11వసారి ఆసీనులై దర్బార్ని నిర్వహించారు. ముత్యాలు పొదిగిన సంప్రదాయ పట్టు వస్త్రాలను ఆయన ధరించారు. గండభేరుండ చిహ్నంతో సహా పలు రకాల బంగారు ఆభరణాలతో మెరిసిపోయారు. 12:42 గంటల తరువాత శుభ ముమూర్తంలో రాజవంశానికి చెందిన ఖడ్గాన్ని పట్టుకొని సింహాసనాన్ని అధిష్టించారు. ఈ సందర్భంగా భటులు జయహొ మహారాజా అంటు నినాదాలు చేశారు. మంగళ వాయిద్యాలు మారుమోగాయి, రాజ మార్తాండ సార్వభౌమ, యదుకుల తిలక, యదువీర ఒడెయార బహుపరాక్ బహుపరాక్ అని గట్టిగా స్వాగత వచనాలు పలికారు. నవగ్రహ పూజ:ముందుగా దర్బార్ ప్రాంగణానికి చేరుకున్న యదువీర్ అక్కడే నవగ్రహాలకు పూజలు చేశారు. కొంత సమయం సింహాసనంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి త్రిషిక భర్తకు పాద పూజ చేశారు. ఆపై ఆయన అందరికీ నమస్కరించి ఆనాటి మహారాజుల తరహాలో దర్బార్ని నిర్వహించారు. చాముండికొండ, పరకాల మఠం, నంజనగూడు, మేలుకొటె, శ్రీరంగపట్టణ, శృంగేరిలతో పాటు 23 ఆలయాల నుంచి పురోహితులు తీసుకువచ్చిన పూర్ణ ఫల ప్రసాదాలను స్వీకరించారు. తరువాత పండితులకు చిన్న చిన్న కానుకలను అందజేశారు. అర్ధగంట సేపు దర్బార్ సాగింది. రాజమాత ప్రమోదా దేవి పాల్గొన్నారు. మైసూరు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు సోమవారం నాడిన శక్తిదేవత చాముండేశ్వరి దేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్త కోటికి దర్శనమిచ్చారు. 9 రోజులపాటు అమ్మవారిని రోజుకొక్క అవతారంలో అలంకరిస్తారు. వేలాదిగా భక్తులు దర్శించుకుని తరించారు. ఫలపుష్ప ప్రదర్శన మైసూరు దసరా ఉత్సవాలలో ఫలపుష్ప ప్రదర్శనను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. కుప్పణ్ణ పార్క్లో ఏర్పాటైన ఈ ఫ్లవర్ షో అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫల పుష్ప విన్యాసాలను తిలకించిన సిద్దరామయ్య సంతోషం వ్యక్తంచేశారు. ఉప్పు సత్యాగ్రహం మహాత్మాగాంధీ పోరాటం విగ్రహాలను చూసి వివరాలను తెలుసుకున్నారు. (చదవండి: నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..) -
ఫ్లిప్ సైడ్ వేదికగా దాండియా మస్తీ..
లైవ్ ఢోల్, లైవ్ డీజే ప్రదర్శనలతో ఈ సారి ‘దాండియా మస్తీ–2025’ నగర వాసులను సందడి చేస్తోంది.. జాంటీ హ్యాట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నానకరాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఫ్లిప్ సైడ్ వేదికగా దాండియా వేడుకలు సోమవారం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా నైట్స్, డాన్స్ లైక్ నెవర్ బిఫోర్ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. జాంటీ హ్యాట్ ఈవెంట్స్ వ్యవస్థాపకురాలు దీపికా బాజీ రెడ్డి, నటి అరియానా గ్లోరీ, నటుడు రామ్ కార్తిక్, డీజే కిమ్, డీజే ఫ్లోజా, డీజే వినీష్, డీజే రిషి, డీజే హరీష్, డీజే వివాన్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. దాండియా మస్తీ 2025లో ప్రత్యేక ఆకర్షణలుగా లైవ్ ఢోల్, లైవ్ డీజే ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ భాగస్వాములుకానున్నారు. గర్బా మ్యూజిక్, బాలీవుడ్ ట్విస్ట్, స్టేజ్ సెటప్, థీమ్ డెకర్, స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్స్, ఓపెన్ అరేనాతో పాటు లైవ్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు దీపికా బాజీ రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ బెస్ట్ డ్రెస్, బెస్ట్ డ్యాన్సర్ విజేతలకు సిల్వర్ కాయిన్స్ బహుమతులు, పిల్లలకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. మహిళలకు 1+1 టికెట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాండియా మస్తీ టికెట్లు బుక్ మై షో, 95533 06329, 77023 99188, 97040 0162 నంబర్లలో పొందవచ్చు. ‘ఆరో రియాలిటీ’లో బతుకమ్మ..నగరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హైటెక్ సిటీలోని కోహినూర్ ఆరో రియాలిటీ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పలువురు ఔత్సాహిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. (చదవండి: వయసులకు అతీతం.. ఆధ్యాత్మిక పర్యాటకం..) -
శ్రీశైలంలో వైభవంగా దేవీశరన్నవరాత్రోత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయ దశమి: స్త్రీ శక్తి విజయానికి ప్రతీక
ఈ సకల చరాచర సృష్టిని నడిపించేది శక్తి. ఈ శక్తి లేకుండా త్రిమూర్తులు... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు—తమ కృత్యాలైన సృష్టి, స్థితి, లయాలను నిర్వర్తించలేరు; కదలడం కూడా సాధ్యపడదు. ఆ పరమ శక్తినే అదిశక్తి లేదా పరాశక్తి అంటారు. ఈ శక్తి త్రిగుణాత్మకమైనది—సత్వ, రజస్, తమో గుణాలతో కూడినది. ఈ గుణాలు శక్తిబీజంతో సంయోగమైతే 'స్త్రీ' రూపం ధరిస్తుంది. అటువంటి త్రిగుణమయ శక్తి ఆవిర్భవించి దుష్ట రాక్షస సంహారం చేసిన కాలం శరదృతువు, ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు.హిందూ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి శక్తివంతమైన ఆచారం దసరా! ఇది అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు చేసే మహోత్సవం. ఆ శక్తిస్వరూపిణి సృష్టిలోని సకల ప్రాణకోటికి అమ్మ, అందుకే జగన్మాత. అమ్మవారి రూపంలో దైవాన్ని ఆరాధించడం అనాదికాలం నుంచి వస్తున్న సంప్రదాయం. భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు ప్రధాన స్థానం ఉంది, ముఖ్యంగా దేవీ మహాత్మ్యం (మార్కండేయ పురాణంలోని భాగం)లో వివరించినట్లు, ఆమె దుష్ట సంహారం మరియు శిష్ట రక్షణ కోసం అవతరిస్తుంది.మహాశక్తి అవసరమైనప్పుడు దుష్ట సంహారం చేయడానికి లేదా శిష్ట రక్షణకు అవతరిస్తుంది. జీవులపై ఆమెకు అంతులేని ప్రేమ ఉంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఆమె అవతరణ మరియు రాక్షస సంహారం జరుగుతుంది. ఆ సమయంలో ఆదిపరాశక్తిని పూజించి అనుగ్రహం పొందడం సంప్రదాయం. దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలిగించేందుకు యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు, పారాయణాలు చేశారు. మనుషులు కూడా తమకు తోచిన దీక్షలు పూనుకున్నారు.ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైన మహాకాళి. నిర్గుణ పరాశక్తి మొదటి సగుణ ఆవిర్భావం మహాకాళి, అందుకే త్రిశక్తులలో—మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి—మహాకాళి మొదటిది. సావర్ణి మన్వంతరంలో ఆదిపరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి కారణం మహిషాసురుడు. ఈ తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఏ కాలంలోనైనా అవసరం. మహిషాసురులు—అంటే అహంకారం, కామం వంటి దుర్గుణాలు—ఎప్పుడూ ఉంటాయి. అందుకే మహిషాసుర మర్దిని మహాలక్ష్మి అవసరం ఎప్పుడూ ఉంటుంది.మహిషాసుర సంహార కథ: త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన తేజస్సు అమ్మవారిగా రూపుదాల్చింది. దేవతలందరూ తమ తేజస్సు, ఆయుధాలు సమకూర్చారు. మహిషుడు తన సంహారం కోసమే ఆమె వచ్చిందని తెలిసినా, ఆమెను ప్రలోభపెట్టాలని ప్రయత్నించాడు. ఆమె అంగీకరించకపోవటంతో, కామరూపిగా రకరకాల రూపాల్లో యుద్ధం చేశాడు. దేవి తగిన రూపాలు ధరించి మహిష రూపంలోని రాక్షసుని సంహరించింది. ఇది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున జరిగింది. దీక్ష వహించినవారు దశమి నాడు జగదంబను స్తుతించి, పట్టాభిషేకం చేసి, స్త్రీ శక్తి విజయాన్ని జరుపుకున్నారు. ఆమె వారిని వరం కోరమని చెప్పగా, అవసరమైనప్పుడు కాపాడమని కోరారు. ఆమె తలచినప్పుడు అవతరిస్తానని మాటిచ్చింది.మరొక కథ శుంభ-నిశుంభులది. వారు బ్రహ్మను తపస్సుతో మెప్పించి, అమర, నర, పశు, పక్షి పురుషుల వల్ల చావులేని వరం పొందారు. స్త్రీలు బలహీనులని భావించి, వారి వల్ల భయం లేదని చెప్పారు. ఆ తర్వాత స్వర్గంపై దాడి చేసి, ఇంద్రాసనాన్ని ఆక్రమించారు. దిక్పాలకులు, సూర్య-చంద్రాది దేవతలను ఓడించి, వారి పదవులు గ్రహించారు. దేవతలు బృహస్పతి సూచనతో హిమవత్పర్వతంపై దేవిని శరణు వేడారు. జగదంబ అభయం ఇచ్చింది.ఆ సమయంలో సర్వదేవతలు తమ శక్తులను మాతృకాగణాలుగా పంపారు. ఇవి ఆయా దేవతల ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలతో వచ్చి రక్తబీజ సైన్యాన్ని సంహరించాయి.మాతృకాగణాలు:బ్రహ్మ శక్తి: బ్రహ్మాణి (హంస వాహనం, కమండలు).విష్ణు శక్తి: వైష్ణవి (గరుడ వాహనం, చక్రం).శివ శక్తి: మాహేశ్వరి (వృషభ వాహనం, త్రిశూలం).కుమారస్వామి శక్తి: కౌమారి (మయూర వాహనం, శక్తి).ఇంద్ర శక్తి: ఐంద్రి (ఐరావత వాహనం, వజ్రం).వరాహ శక్తి: వారాహి (మహిష వాహనం, ఖడ్గం).నరసింహ శక్తి: నారసింహి (సింహ వాహనం, చక్రం).వీటికి తోడు వారుణి (పాశం), యామి (దండం), శివదూతి మొదలైనవి దానవులను సంహరించాయి. రక్తబీజుడు రక్త బిందువుల నుంచి కొత్త రాక్షసులు పుట్టించాడు. అప్పుడు అంబిక కాళికను రక్తం తాగమని చెప్పింది. కాళిక రక్తం తాగి, దేవి రక్తబీజుని సంహరించింది. తర్వాత నిశుంభుని తల నరికి, మొండెం కూడా నాశనం చేసింది. శుంభుని మాటలతో యుద్ధానికి ఆహ్వానించి సంహరించింది. ఇది మహా సరస్వతి అవతారం. మాట నైపుణ్యంతో విజయానికి సంకేతం.నవరాత్రులలో లలితా దేవి అవతారం ప్రాధాన్యం. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో వివరించినట్లు, ఆమె సర్వచైతన్య స్వరూపిణి. బండాసురుడు (అజ్ఞానం, మూఢత్వం)ను సంహరించేందుకు అవతరించింది. జీవితం కేవలం భౌతిక సుఖాలే కాదు; చైతన్యం అవసరం. బండతనం మీద చైతన్యం విజయం—విజయదశమి సంకేతం.ప్రాంతీయ వైవిధ్యాలు: బెంగాల్లో దుర్గాపూజ ఘనంగా జరుపుకుంటారు, మహిషాసుర సంహారాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. దక్షిణ భారతంలో బొమ్మల కొలువు (గొల్లు), బతుకమ్మ (తెలంగాణలో పూలను పూజించే పండగ), కుంకుమార్చన, చండీహోమాలు చేస్తారు. ఇవన్నీ సామూహిక ఐక్యత, స్త్రీ శక్తి గౌరవాన్ని పెంపొందిస్తాయి.‘యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.’సమాజంలో మంచి-చెడు సంఘర్షణలో మంచి గెలుస్తుంది. విజయదశమి దానికి ప్రతీక. శరీర అనారోగ్యం, మానసిక దుర్గుణాలు, సామాజిక దురాచారాలు, పర్యావరణ మాలిన్యాలు, స్వార్థం, అహంకారం.. వీటన్నింటి మీద విజయం సాధించడమే విజయ దశమి. ముఖ్యంగా స్త్రీల పట్ల చులకన భావం మీద స్త్రీ శక్తి విజయం. సద్భావనలు పెంపొందించుకునే పవిత్రమైన రోజు ఇది.హిందూ సంస్కృతిలో విజయ దశమి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ఉత్సవం. ఆశ్వయుజ మాసంలో జరిగే ఈ నవరాత్రి ఉత్సవం జగన్మాత శక్తి స్వరూపాన్ని ఆరాధించే సమయం. ఈ పండుగ దుష్ట సంహారం, శిష్ట రక్షణ మరియు స్త్రీ శక్తి విజయానికి ప్రతీక.- చింతా గోపిశర్మ సిద్ధాంతి -
శరన్నవరాత్రులు అమ్మవారి అలంకారాలు- నైవేద్యాలు! (ఫొటోలు)
-
మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆట, పాటలతో బతుకమ్మను పూజిస్తారు. గుజరాతి, రాజస్థానీలు దుర్గాదేవిని పూజించే క్రమంలో దాండియా నృత్యాలు చేస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా కొండాపూర్ శరత్ సిటీమాల్లోని స్నో కింగ్డమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దాండియా సంబురాలను ఒకే వేదికపై చేపట్టారు. ముంచు కొండలు, మంచుతో కప్పిన ప్యాలెస్లు, బ్లాక్ సీల్స్, ఇగ్లూ, ఓక్ చెట్లు, దృవపు ఎలుగుబంట్ల సెట్ల మధ్య ఈ ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఇవి 11 రోజుల పాటు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. రెండో రోజు బతుకమ్మ ప్రత్యేకత..బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో విశిష్టత కలిగి ఉంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా జరుపగా, రెండో రోజు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. రెండో రోజు రంగు రంగుల పూలతో బతుకమ్మను తయారు చేసుకుని గౌరమ్మను తయారు చేసుకుంటారు. అందులో గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఆరోజు అమ్మవారికి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే అటుకులు బతుకమ్మ అని పేరు వచ్చింది. తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ వేడుకలు జరుపుతారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిగా భావించి మహిళలు జరుపుకునే పండుగే ఇది. తొమ్మిది రోజులపాటు ఈ వేడుకులు జరుగుతాయి. ఒకవైపు నవరాత్రులు, మరోవైపు బతుకమ్మను ఘనంగా జరుపుకొంటారు. (చదవండి: సరదా పాటలు..దాండియా ఆటలు..!) -
ఇంద్రకీలాద్రిపై మొదలైన దసరా వైభవం.. దుర్గమ్మ 11వ అవతారంగా కాత్యాయనీ దేవి (చిత్రాలు)
-
దసరా వింత ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!
జగిత్యాల జిల్లా: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు యువకులు ‘దసరా బొనాంజా’ పేరుతో ప్రకటించిన ఆఫర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన ఫ్లెక్లీ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.రూ.150తో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ.. మద్యం, మాసం పేరుతో సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. రూ.150కు ప్రథమ బహుమతిగా మేక, రెండో బహుమతిగా బీర్లు, మూడో బహుమతిగా విస్కీ, నాలుగో బహుమతిగా కోళ్లు, ఐదో బహుమతిగా చీర అని పేర్కొంటూ వెలసిన ఫ్లెక్సీ విస్తుగొలుపుతోంది. స్థానికంగా ఉండే సాయిని తిరుపతి అనే వ్యక్తి ఈ బంపర్ డ్రా నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ నెల మొదటి తేదీన డ్రా తీయనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో ఎగబడి టోకెన్లు కొనుక్కుంటున్న జనాలు. -
సరదా పాటలు..దాండియా ఆటలు..!
దాండియా ఆటలు.. ఆడ.. సరదా పాటలు పాడ అంటూ నగర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలకు ఏర్పాటు జరుగుతున్నాయి. వేడుకలను సంబరంగా నిర్వహించేందుకు పలువురు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. మిగిలిన ఈవెంట్స్కు భిన్నంగా మొత్తం 10 రోజుల పాటు సందడి కొనసాగడమే నవరాత్రి సంబరాల ప్రత్యేకత. ఈ 10 రోజులూ దాండియా–గర్భా నృత్యాల హోరులో నగరవాసులు మునిగితేలనున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ డీజేలు, ఫుడ్ స్టాల్స్తో పాటు ఫ్లీ మార్కెట్స్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సంప్రదాయంతో పాటు ఆధునికతనూ కలగలిపి డిజైన్ చేస్తున్న ఈవెంట్స్ సకుటుంబ సపరివార సమేతంగా అలరించనున్నాయి. క్లబ్స్తో పాటు, ఫంక్షన్ హాల్స్, ఉద్యానవనాలు, ఓపెన్–ఎయర్ వేదికలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఈ దాండియా/గర్భా ఈవెంట్స్కు వేదికలుగా మారనున్నాయి. ప్రధానంగా బ్యాండ్ ప్రదర్శనలు, డీజే, ఫుడ్ స్టాల్స్, వంటివి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. టికెట్ ధరల విషయానికి వస్తే కొన్ని ఈవెంట్స్ బడ్జెట్–ఫ్రెండ్లీగా ఉంటే, సగటున రూ.500 ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏదైనా పెద్ద ఈవెంట్స్, సెలబ్రిటీ ప్రదర్శనలు ఉంటే లేదా ప్రీమియం వేదిక అయితే ధరలు ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఈ ఈవెంట్స్ సెపె్టంబర్ 20 నుంచి ప్రారంభమై, నవరాత్రి ముగిసే వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలో జరిగే కొన్ని కార్యక్రమాల గురించిన సమాచారం ఇది.. ఓపెన్ ఎయిర్ వేడుక.. నగరంలోని అతిపెద్ద ఓపెన్–ఎయిర్ వేదిక అయిన జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్ దాండియా ఉత్సవ్ జరుగుతుంది. ఇది 10 రోజుల పాటు నృత్యం, సంగీతం సహిత వేడుకలను అందిస్తుంది. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6.30 గంటల నుంచి నిర్వహిస్తున్నారు. ఓపెన్–ఎయిర్ సెటప్, లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్, మొత్తం ఫెస్టివ్ అలంకరణతో ప్రాంగణం కనువిందు చేస్తుంది. ఈ బేగంపేట్లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్లో ఎస్కే నవరాత్రి ఉత్సవ్ పేరిట ఈ నెల 22న రాత్రి 7గంటల నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ఢమాల్గా నిర్వాహకులు అభివరి్ణస్తున్న ఈ ఈవెంట్లో డీజే డాన్ సింగ్ ఓ ఆకర్షణ. ఫుడ్, పానీయాలు, బహిరంగ వినోద వేదికలు.. సిద్ధం చేశారు. ఈమాదాపూర్లోని యూలో ఎరీనాలో నవరాత్రి దాండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 22 రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ డీజే మ్యూజిక్ అందిస్తున్నారని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పీర్జాదిగూడలోని శ్రీ పలణి కన్వెన్షన్స్లో ఈ నెల 22న దాండియా మహోత్సవ్ సీజన్ 3 పేరిట నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా అలరించేలా తమ ఈవెంట్ ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ ఈవెంట్ సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది.ఈసారి ఈ ఈవెంట్ను ఫ్లీ మార్కెట్తో మేళవించి అందిస్తున్నారు. బైరమల్గూడలోని ఎడుకంటి రామ్ రెడ్డి గార్డెన్స్లో నిర్వహించే రస్ గర్భా వాల్యూమ్ 7 ఫ్లీ మార్కెట్ అండ్ ఎక్స్పో.. ఓ వైపు నవరాత్రి సంబరాల నృత్యాలతో పాటు షాపింగ్, ఫుడ్.. వంటివి మేళవిస్తోంది. మొత్తం 3 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవం ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది.ఈ ఉప్పల్లోని శ్రీ పళణి కన్వెన్షన్స్లో ఈ నెల 22 రాత్రి 7గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకూ దాండియా సంబరాలు కొనసాగనున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ సంబరాల్లో లైవ్ ఢోల్, డీజే షోస్, ఫుడ్ స్టాల్స్, సెలబ్రిటీల రాక.. వంటివి ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు. ఈనోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో సెలబ్రిటీ దాండియా నైట్స్ నిర్వహిస్తున్నారు. లైవ్ మ్యూజిక్, డీజేలు, సెలబ్రిటీల ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. నవరాత్రి ఉత్సవాలకు పేరొందిన నామ్ధారి గౌరవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శంషాబాద్లోని ఎస్ఎస్ కన్వెన్షన్లో నవరాత్రి ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తరంగ్ నైట్స్ పేరిట దాండియా నైట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4.30గంటలకు ప్రారంభం కానుంది. గర్భా, దాండియా నృత్యాలు, ఫొటోగ్రఫీ అవకాశాలు.. ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయ గర్భాను డిస్కో లైట్లు, ఆధునిక సంగీతంతో మిళితం చేసే డిస్కో దాండియా ఏఎమ్ఆర్ ప్లానెట్ మాల్లో జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఫ్యూజన్ ఈవెంట్ అని నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఈ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షలో 11 రోజుల పాటు డోలా రే డోలా పేరిట నవరాత్రి దాండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. బుకింగ్స్.. ప్లానింగ్స్..ప్రత్యేక రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. కుటుంబ సమేతంగా హాజరయ్యేవారు వేదికల సమాచారం, పార్కింగ్ సౌకర్యం, వాతావరణ పరిస్థితులు వంటి విషయాలు ముందుగా సరిచూసుకుని ప్లాన్ చేయడం అవసరం. ఈ నృత్యాలు చేసే అలవాటు ఉంటే అలసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంటికి దగ్గరలోని ఈవెంట్ ఎంచుకుంటే బెటర్.ఈ కొన్ని ఈవెంట్స్లో థీమ్ నైట్లు ఉంటాయి. కాబట్టి హాజరయ్యే ఈవెంట్కి సంబంధించి థీమ్/డ్రెస్ కోడ్ ఉంటే వాటి వివరాలు ముందుగా తెలుసుకోవడం అవసరం.ప్రస్తుతం వాతావరణ మార్పులు అనూహ్యంగా ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఈవెంట్ రద్దయ్యే పరిస్థితుల్లో సందర్శకులకు ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి.టికెట్ కొనుగోలుకు బుక్ మై షో, హై యాపె, డిస్టిక్ట్, టిక్కెట్స్ 99 వంటి అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించడం మేలు. స్ట్రీట్ కాజ్ పేరిట 21న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాండియా నైట్స్ జరుగనుంది. 22 నుంచి అక్టోబర్ 2 వరకు గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్లో ఢోలా రే ఢోలా పేరిట మెగా ఫెస్ట్. నాగోలు శ్రీరాంగార్డెన్స్లో 27, 28 తేదీల్లో దాండియా ఢోల్ భాజే పేరిట వేడుకలు. నగరంలోని టీబీఏ వేదికగా 22న నవరాత్రి బతుకమ్మ, దాండియా నృత్యాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమాజీగూడ ది పార్క్ హోటల్లో 24 నుంచి అక్టోబర్ 2 వరకు డిస్కో దాండియా. నాగోలు శుభం కన్వెన్షన్ సెంటర్లో 27న నాచో దాండియా పేరిట నవరాత్రి ఉత్సవాలు. బేగంపేట చిరాన్పోర్ట్లో 22 నుంచి అక్టోబర్ 2 వరకూ పది రోజుల పాటు నవరాత్రి ఉత్సవ్ పేరిట హైదరాబాద్ బిగ్గెస్ట్ దాండియా ధమాల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. (చదవండి: ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు..!) -
హైదరాబాద్: 'సెలెబ్రిటీ డాండియా నైట్స్' 9వ సీజన్ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు (ఫొటోలు)
-
నేటి నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి... 375 రకాల ఉత్పత్తులపై తగ్గనున్న ధరలు
-
సొంతూళ్లకు పయనమైన నగర వాసులు
సాక్షి,హైదరాబాద్: దసరా రద్దీ మొదలైంది. విద్యాసంస్థలు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే బస్సులు, రైళ్లలో ఆదివారం ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరో వారం రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లతో పాటు ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లోనూ జనం పల్లెబాట పట్టారు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ఈసారి ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్ మేరకు 100 రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు కోచ్లను ఏర్పాటు చేసి బెర్తుల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ రైళ్లన్నింటిలోనూ ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ వందల్లోకి చేరింది. దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి వంటి వరుస పండుల సీజన్ దృష్ట్యా రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఫిబ్రవరి వరకు పలు రైళ్లలో 150 నుంచి 200 వరకు వెయిటింగ్ లిస్ట్ దర్శనమివ్వడం గమనార్హం. నగర శివార్ల నుంచే.. బతుకమ్మ, దసరా పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని 7,754 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సుమారు 377 స్పెషల్ సరీ్వసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కలి్పంచారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ మేరకు నగర శివార్ల నుంచే ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్, సాగర్రింగ్ రోడ్డు, మెహిదీపట్నం, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. మరోవైపు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నేరుగా హాస్టళ్ల నుంచి ఆయా జిల్లా కేంద్రాలకు నడిపేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ప్రత్యేక బస్సుల్లో 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు చార్జీలు విధించనున్నారు. అన్ని రెగ్యులర్ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు యథావిధిగా ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చర్లపల్లి నుంచే ఎక్కువ రైళ్లు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా పలు రెగ్యులర్ రైళ్లతో పాటు ప్రత్యేక సరీ్వసులను చర్లపల్లి నుంచి నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇవి కాకుండా యథావిధిగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే రైళ్ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేశారు. సాధారణ బోగీల్లో బయలుదేరే ప్రయాణికులు టికెట్ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా యూటీఎస్ మొబైల్ యాప్ సదుపాయాన్ని స్టేషన్లోని వివిధ చోట్ల అందుబాటులో ఉంచారు. అధికారులు ఎంపిక చేసిన కొంతమంది సిబ్బంది మొబైల్ స్కానర్లు కలిగిన జాకెట్లను ధరించి ప్రయాణికుల వద్దకు వచ్చేవిధంగా ఏర్పాటు చేశారు. దీంతో టికెట్ కౌంటర్ల వద్ద క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. -
నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..
భారతదేశం అంతటా దుర్గమ్మ నవరాత్రుల సంభరాలతో కోలహలంగా మారింది. ఎటుచూసిన శరన్నవరాత్రుల సందడే కనిపిస్తుంది. రేపటి నుంచి మొదలుకానున్న ఈ నవరాత్రుల్లో దుర్గమ్మను ఎంతో భక్తిప్రపత్తులతో కొలుచుకుంటారు. ఇక తొలిరోజు నుంచి దశమి వరకు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా, ఉల్లి, వెల్లుల్లిని లేకుండా ఒంటిపూట భోజనాలతో కఠిన నియమాలను అనుసరిస్తారు. ముఖ్యంగా భవాని మాలధారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతలానో కఠిననియమాలను అనుసరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటారో తెలిసిందే. అంతటి పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల్లో అక్కడ మాత్రం దుర్గమ్మ తల్లికి చేప, చికెన్ వంటి నాన్వెజ్ ఆహారాలనే నైవేద్యంగా నివేదించడమే కాదు అవే తింటారట ఆ తొమ్మిది రోజులు. అదేంటని విస్తుపోకండి. ఇంతకీ అదెంత ఎక్కడో తెలుసా..!.పశ్చిమబెంగాల్లో ఈ విభిన్నమైన ఆచార సంప్రదాయం ఉంది. అక్కడ బెంగాలీల కుంటుంబాలన్నీ నాన్వెజ్ వంటకాలతో ఘమఘమలాడిపోతుంటాయి. అక్కడ ఎక్కువగా మతపరమైన పండుగల్లో చేపలు, మాంసం వంటి వంటకాలు తప్పనిసరిగా ఉంటాయట. అక్కడ ఇలా మాంసాహారాన్ని నివేదించడాన్ని పవిత్రంగా భావిస్తారని చరిత్రకారుడు నృసింహ భాదురి చెబుతున్నారు. బెంగాల్లోని అనేక ఆలయ ఆచారాల్లో మాంసాహారం నివేదించడం ఉంటుందట. ఇక్కడ అమ్మవారి ఉగ్ర రూపమైన కాళి ఆరాధన ఎక్కువగా ఉంటుందట. ఆమెకు మేకబలి, మాంసాన్ని నివేదించడం వంటివి ఉంటాయట. ప్రసాదంగా వాటిని వండుకుని తింటారట. అంతేగాదు వేయించి కూరగాయలు, చేపలు, మాంసం వంటి నైవేద్య సమర్పణ ఉంటుందట. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే కొన్ని ప్రాంతాలకు భిన్నంగా ఉంటుందట. ఇక్కడ శాకాహారాన్ని స్వచ్ఛమైనదిగా భావిస్తే..అక్కడ మాంసాహార సమర్పణను పవిత్రంగా భావిస్తారట. ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..కోషా మాంగ్షో - నెమ్మదిగా వండిన మటన్ కర్రీ, ముదురు, రిచ్ అండ్ లూచీస్ (డీప్-ఫ్రైడ్ పఫ్డ్ బ్రెడ్) తో జత చేసింది. ఇలిష్ మాచ్ - ప్రియమైన హిల్సా, తరచుగా ఆవాలు లేదా వేయించిన బంగారు రంగులో ఉడికించిన వంటకం. బంగాళాదుంపలతో చికెన్ కర్రీ - ఇంట్లో ఇష్టపడేది, తరచుగా వారాంతపు కుటుంబ భోజనంలో భాగం. మటన్ బిర్యానీ, ముఖ్యంగా కోల్కతాలో బంగాళాదుంప ముక్కతో బిర్యానీ పవిత్రమైనదిగా పరిగణిస్తారట.చేపల ఫ్రై, పులుసు: నవరాత్రుల్లో ఇది తప్పనిసరి వంటకం, భక్తులకు ప్రసాదంగా ఇచ్చే రెసిపీ కూడా. (చదవండి: ఢిల్లీలో జరిగే రామ్లీలా నాటకంలో పరశురాముడిగా బీజేపీ ఎంపీ) -
బలాన్నిచ్చే బతుకమ్మ ఫలహారం
తెలంగాణ ఆడపడుచుల్లో ‘బతుకమ్మ’ పండుగ ఆరోగ్యకాంతులను వెలిగిస్తోంది. బతుకమ్మ ఆడిన తర్వాత ‘సద్ది’ పేరుతో ‘ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం’ అంటూ అతివలు ఫలహారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిలో అనేక పోషక విలువలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఆటపాటలు, మానసికోల్లాసమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది. బతుకమ్మ సద్దిలో ‘ఐరన్’.. భారతీయ మహిళల్లో ఐరన్ లోపం కనిపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం పిల్లల్లోనూ ఉంటుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తొమ్మిదిరోజులు తొమ్మిది రకాల ఫలాహారాలను తయారు చేస్తారు. ఇందులో సత్తుపిండి, సద్ద ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు తదితర ఫలహారాలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు.. వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో తీరు పిండి వంట తయారు చేస్తుంటారు. సద్దుల్లో పోషకాలు.. బతుకమ్మ ఉత్సవాలు వస్తే అందరికీ సద్ద ముద్దలు(సజ్జ ముద్దలు) గుర్తుకొస్తాయి. ఈ పేరుతోనే పెద్దబతుకమ్మకు సద్దుల బతుకమ్మ అని పేరు వచి్చందని చెబుతారు. సందె వేళలో చేసే బతుకమ్మ కాబట్టి.. సద్దుల బతుకమ్మ అంటారని మరో చరిత్ర. సజ్జలను పిండిగా పట్టించి బెల్లం కలిపి ముద్దలు చేస్తారు. కొందరు వీటికి నెయ్యి కూడా కలుపుతారు. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ. కార్పోహైడ్రేట్స్ తక్కువ. ప్రొటీన్స్, కాల్షియం అధికంగా ఉంటాయి. త్వరగా జీర్ణం అవుతుంది. దీనికి బెల్లం కలపడంతో ఐరం శాతం పెరిగి మహిళల రుతుక్రమ సమస్యల నివారణ, గొంతు నొప్పి తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. నువ్వుల ముద్దలు.. బతుకమ్మ పండుగలో నువ్వులు ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో ఎమినోయాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్ మెదడును చురుకుగా ఉంచుతుంది. కాల్షియం ఎమకల దృఢత్వాన్ని పెంచుతుంది. పెసర ముద్దలు.. పెసళ్లను ఉడకబెట్టి బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తాయి. కొబ్బరి పొడి... కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నం, పులిహోర ఇటీవల సద్దిగా ఇస్తున్నారు. పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలు కలుపుతున్నారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర కూడా ప్రసాదంగా వాడుతున్నారు. దేశంలో దాదాపు 6 వేల ఏళ్లుగా పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా.. పంటల్లో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పెరుగులో పోషక విలువలు మెండు. అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమరి్పస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్ బి –6, బి12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్తో బసిల్లె అధికంగా ఉంటుంది. అపెండిసైటీస్, డయేరియా, డిసెంట్రీ వంటి వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను లాక్టిక్ యాసిడ్ నాశనం చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ నిరోధక శక్తిని పెంచుతుంది. పల్లిపిండి.. పల్లిపిండి శరీర ఎదుగుదలలో అత్యంత ప్రధానమైనది. అధిక ప్రొటీన్లతోపాటు రుచికరంగా ఉంటాయి. చాలామంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో పోషకాలూ లభిస్తాయి.పోషకాలు పుష్కలం బతుకమ్మ పండుగకు తయారు చేసే సత్తుపిండిలో వ్యాధి నిరోధక శక్తి పెంచే పోషకాలు ఉంటాయి. రుచికరంగా ఉండే సత్తుపిండి పిల్లలకు ప్రొటీన్స్ అందిస్తాయి. కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల ఎదుగుదల.. ఇలా అనేక ఉపయోగాలున్నాయి. సంప్రదాయ పిండివంటలను ప్రతీఒక్కరు తినాలి. బతుకమ్మ ఆరోగ్యాన్ని పంచే ప్రత్యేకమైన పండుగ. – దండె రాజు, ఆర్ఎంవో, గోదావరిఖని జీజీహెచ్ -
తంగేడు పూసింది గునుగు నవ్వింది
చినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు ముత్యం మాదిరిగా గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది.వీధులు.. పూల వనాలురామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలు గా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరి విగా పూసే పూలతో సిబ్బిలో పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. కనిపించని గునుగుగునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు గునుగు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది.ఆడపడుచుల వేడుకబతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు.విభిన్నం బతుకమ్మఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే జిల్లాలోని విభిన్న సాంస్కృతుల కారణంగా బతుకమ్మను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీని వాస్నగర్, రాఘవాపూర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవా యితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావి లాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుమ్మ అనంతరం బావిని పూడ్చుతారు.రాజన్న పాట వినాలి్సందేఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుక మ్మ పాటల స్పెషలిస్ట్. మ హిళలకన్నా మధురంగా పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. సొంత గ్రామంలో బతుక మ్మ పాటలు పాడుతూ.. గుర్తింపు తెచ్చుకున్నాడు.60 ఏళ్లనుంచి ఆడుతున్నమల్యాల: పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది.– ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాలనుదుటి సిందూరం పండుగల్లో ముఖ్యమైంది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ -
Tirumala: శ్రీవారి భక్తులకు మార్గదర్శకాలు
తిరుమలకు బయలు దేరేముందు ఇష్టదేవతలను పూజించుకోవాలి.శ్రీ వారిని దర్శించేముందు పుష్కరిణిలో స్నానంచేసి, ముందుగా వరాహస్వామిని పూజించాలి. ఆ తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించాలి.ఆలయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తూ ‘ఓం శ్రీవేంకటేశాయ నమః’ అని స్మరిస్తూ ఉండాలి.స్వామిపైనే ధ్యాసను ఉంచాలి. తిరుమల సమీపంలో ఉన్న ఆకాశగంగ, పాపవినాశనం తీర్థాలలో స్నానం చేస్తే, సకల పాపాలు హరిస్తాయి. తిరుమలలో ఉన్నప్పుడు సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విధిగా పాటించాలి.తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలి కానుకలు, ముడుపులను ఆలయంలోని స్వామి హుండీలోనే సమర్పించాలి.తిరుమలలో భక్తులు చేయకూడనివిఆలయం చుట్టూ నాలుగు మాడవీథుల్లో పాదరక్షలు ధరించరాదు. ఈ వీథుల్లోనే ఉత్సవమూర్తులు నిత్యం ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తుంటారు.విలువైన ఆభరణాలు, ఎక్కువ నగదు మీ వద్ద ఉంచుకోకూడదు.శ్రీవారి దర్శనం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతో తిరుమలకు రాకూడదు.స్వామి దర్శనం కోసం త్వరపడకుండా మీవంతు వచ్చేవరకు ఆగాలి. ఆలయార్హత లేని సందర్భాల్లో ఆలయంలోకి రాకూడదు. స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో పువ్వులు అలంకరించుకోరాదు. తిరుమల గిరుల్లోని విరులన్నీ స్వామి సేవకే.కాటేజీల్లో నీరు, విద్యుత్ వృథా చేయకూడదు. అపరిచితులను వసతి గృహాల్లోకి అనుమతించరాదు. వారిని నమ్మి, గది తాళాలను ఇవ్వకూడదు.పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు. తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం మొదలైనవి పూర్తిగా నిషేధం. పేకాట, జూదం వగైరాలు పూర్తిగా నిషేధం.శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించరాదు. వారిని ప్రోత్సహించరాదు. దళారుల నుంచి నకిలీ ప్రసాదాలను కొనుగోలు చేయరాదు. ఆలయప్రాంగణంలో ఉమ్మివేయరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధం.వివిధ రాజకీయసభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్లు మొదలైనవి నిషేధం.ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు వంటి పరికరాలు తీసుకువెళ్లరాదు. ఆయుధాలు తీసుకురాకూడదు.జంతువధ నిషేధం.భిక్షుకులను ప్రోత్సహించరాదు.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలన్న నిబంధనను టీటీడీ కచ్చితంగా అమలు చేస్తోంది.పురుషులు ధోవతి–ఉత్తరీయం, కుర్తా–పైజామా... మహిళలు చీర–రవిక, లంగా–ఓణి, చున్నీతో పాటు పంజాబీ డ్రస్, చుడీదార్ ధరించాల్సి ఉంటుంది.స్వచ్ఛంద సేవ ‘శ్రీవారి సేవ’లో పాల్గొనదలచిన వాలంటీర్లు కూడా డ్రెస్కోడ్ను విధిగా పాటించాలి. తొక్కిస లాటలకు, తోపులాటలకు తావులేకుండా ఆలయ అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు సహకరిస్తే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తుంది. తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి దర్శనానుగ్రహాలు పరిపూర్ణంగా లభించాలని కోరుకుందాం. -
కలియుగ వైకుంఠం.. తిరుమల ఆలయం
కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయం. క్రీ.పూ. 12వ శతాబ్దంలో తిరుమలలో శ్రీవెంకటేశ్వర ఆలయం నిర్మితమైంది. 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆలయ గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు.. పవిత్ర వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరచేందుకు వేరువేరు గదులు. లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగది. మొదటి ప్రాకారం..మహాద్వార గోపురంఏడుకొండల్లో కొలువైన వెంకన్న స్వామిని దర్శించుకునే ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ప్రవేశద్వార గోపురమే మహాద్వార గోపురం. పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అని వేరువేరు పేర్లు ఉన్నాయి. పెద్దవాకిలి. తమిళంలో ‘పెరియ తిరువాసల్’ అని కూడా పిలుస్తారు. ఈ మహాద్వారాన్ని గోపురంతో అనుసంధానిస్తూ నిర్మించిన ప్రాకారమే మహా ప్రాకారం అంటారు. వైకుంఠం క్యూ కంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. లోనికి అడుగుపెట్టక మునుపు పైపుల ద్వారా వచ్చే నీటితోనే భక్తులు పాదాలను శుభ్రం చేసుకుని ప్రవేశించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ వాకిలి గోడపై అనంతాళ్వారులు వినియోగించిన గునపం ఇప్పటికీ కనిపిస్తుంది.శంఖనిధి.. పద్మనిధిమహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల్లా పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. వీరే శ్రీవారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. కుడివైపున ఉన్న మరో రక్షక దేవత పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.కృష్ణదేవరాయమండపంమహాద్వారానికి ఆనుకుని లోపలివైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే శ్రీకృష్ణదేవరాయ మండపం. దీనినే ప్రతిమ మండపం అని కూడా అంటారు. ఈ మండపం లోనికి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపున రాణులు తిరుమలదేవి, చిన్నమదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మణ్ణి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు తిరుమల యాత్ర చేసి శ్రీవారికి ఎన్నో కానుకలు సమర్పించారు. అచ్యుతరాయలు తనపేరిట బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు.అద్దాల మండపంప్రతి మండపానికి 12 అడుగుల దూరంలో ఎతై ్తన అధిష్ఠానంపై నిర్మించిన దాన్నే అద్దాల మండపం లేదా ఆయినా మహల్ అంటారు. ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు. ఈ అరలు ఉన్న ప్రాంతాన్ని ప్రసాదం పట్టెడ అంటారు.తులాభారంశ్రీకృష్ణదేవరాయల మండపానికి ఎదురుగా ఉంటుంది తులాభారం. భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణా తులాభారంగా స్వామివారికి సమర్పించుకుంటుంటారు. తులాభారానికి అవసరమైన వస్తు సామగ్రిని భక్తులు తిరుమలకు మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆలయం లోపలే తులాభారంలో వేయాల్సిన వస్తువులకు తగిన నగదు రూపంలో చెల్లిస్తే టీటీడీనే ఆ వస్తువులను సమకూరుస్తుంది.రంగనాయక మండపంకృష్ణదేవరాయ మండపానికి దక్షిణం వైపుగా 108 అడుగల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో శిల్ప శోభితమై విరాజిల్లుతూ కనిపించేదే రంగనాయక మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపం అని పిలుస్తారు. ఒకప్పుడు నిత్యకళ్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలైన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వాచనంతో పాటు స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు.తిరుమలరాయ మండపంరంగనాయక మండపాన్ని ఆనుకుని పడమరవైపున ఉన్న ఎత్తైన స్తంభాలతో, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి ఈ మండపం. ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించారు. స్వామివారికి ‘అన్నా ఊయల తిరునాళ్లు’ అనే ఉత్సవాన్ని నిర్మించే నిమిత్తం క్రీశ 1473లో ఈ మండపాన్ని నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించారు. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.రాజా తోడరమల్లుఅక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉన్న లాలా ఖేమార్ము క్షత్రియ వంశస్థుడు. ఈయన రాజా తోడరమల్లుగా ప్రసిద్ధి పొందాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించేటప్పుడు ధ్వజస్తంభానికి సమీపంలో రాజా తోడరమల్లు, తల్లి మాత మోహనాదేవి, భార్య పితబీబీ విగ్రహాలు స్వామివారికి అభిముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు కనిపిస్తాయి. 17వ శతాబ్దంలో ముస్లిం పాలకుల దాడులు, బ్రిటిష్ దండయాత్రల నుంచి శ్రీవారి ఆలయాన్ని సంరక్షించిన పాలకుల్లో రాజా తోడరమల్లు ఒకరు. నాటి నుంచి వీరి లోహ విగ్రహాలు తిరుమల ఆలయంలో ఉన్నాయి.ధ్వజస్తంభంధ్వజస్తంభ మండపం వెండి వాకిలికి ఎదురుగా చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంలా ఎత్తైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం. ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండి వాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్న ధ్వజారోహణం అంటారు. బలిపీఠంధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారురేకు తాపడం ఉంటుంది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని (అన్నాన్ని) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.క్షేత్రపాలక శిలధ్వజస్తంభానికి ఈశాన్య మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే క్షేత్రపాల శిల అంటారు. ఇది రాత్రి పూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు గుడికి తాళం వేసి తరువాత ఈ శిలపై ఉంచి నమస్కరించి తాళం చెవులను తీసుకెళుతారు. మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులతో గుడి తలుపులు తెరుస్తారు. సంపంగి ప్రాకారంమహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థలవృక్షాలనేవి ఉండటం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం సంపంగి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందున ఇలా పిలువబడుతోంది. కళ్యాణమండపందక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంలో ఈ కళ్యాణమండపాన్ని నిర్మించారు. ఇందులో తూర్పుముఖంగా ఉన్న కళ్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కళ్యాణోత్సవం జరుగుతుంది.ఉగ్రాణంస్వామివారి ప్రసాదాలకు తయారయ్యే ముడిసరుకులు నిల్వ ఉంచే గది. ఇది వాయవ్య మూలగా ఉంటుంది.విరజానదివైకుంఠంలోని పరమ పవిత్రమైన ఈ నది శ్రీవారి పాదాల క్రిందగా ప్రవహిస్తుంటుందని నమ్మకం. ఆలయం లోపలి బావుల్లో ఈ నది నీరు ప్రవహిస్తుందని, అందుకే ఆలయ బావుల్లోని నీరు పరమ పవిత్రమైనదిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వినియోగిస్తుంటారు.నాలుగుస్తంభాల మండపంసంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వనరసింహ రాయలు, ఆయన భార్య, ఇద్దరు కుమారుల పేర స్తంభాలు కట్టించారు.పూలబావిపూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామివారికి ఉపయోగించిన పూలను ఇందులో వేస్తారు. దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్లేటప్పుడు ఎతైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.వగపడి భక్తులు దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది. ముఖ మండపం అద్దాల మండపానికి ముందు భాగంలో ఉంటుంది. కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు ఇక్కడ అందజేస్తారు.రెండవ ప్రాకారం..వెండి వాకిలి.. నడిమి పడికావలి ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండి వాకిలి. నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండి వాకిలి మీదుగా భక్తులు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రవేశ ద్వారమంతటా వెండిరేకు తాపడం చేసినందున దీన్ని వెండివాకిలి అంటారు. ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీవారు పాచికలాడుతున్న శిల్పం ఉంటుంది.విమాన ప్రదక్షిణంవెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అని కూడా అంటారు. సుప్రభాత సేవ జరిగే సమయంలో భక్తులు వెలుపల అంగప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో వెండి వాకిలికి ఎదురుగా శ్రీరంగనాథస్వామి, వరదరాజస్వామి ఆలయాలు ఉంటాయి. ఇంకా ప్రధాన వంటశాల, పూలబావి, అంకురార్పణ మండపం, యాగశాల, నాణేల పరకామణి, నోట్ల పరకామణి, చదనపు అర, విమాన వేంకటేశ్వరస్వామి, రికార్డులగది, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి సన్నిధి, ప్రధాన హుండి, విష్వక్సేనుల వారి ఆలయం మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్లుగా పేర్కొంటారు.బంగారు బావిదర్శనాంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడం ఉంటుంది. ఇందులో నీటినే స్వామి వారి అభిషేకాలకు, ప్రసాదాలకు వినియోగిస్తారు. ఇందులో వైకుంఠంలోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.వకుళాదేవిబంగారుబావి పక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. శ్రీవారి తల్లి. ద్వాపరయుగంలో యశోదాదేవే ఈ కలియుగంలో స్వామివారి కళ్యాణం చూడటానికి వకుళాదేవిగా అవతరించింది.అంకురార్పణ మండపంబంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు. ఇంకా గరుడ, విష్వక్సేన, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.యాగశాలహోమాది క్రతువులు నర్వహించే ప్రదేశం. ఇప్పుడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.సభ అరకైంకర్యాలకై ఉపయోగించే బంగారు, వెండి పాత్రలు, కంచాలు, గొడుగులు ఉంచే ప్రదేశం. ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విసనకర్రలను ఇక్కడే భద్రపరుస్తారు.సంకీర్తన భాండాగారంసభ అర పక్కనే ఈ గది ఉంటుంది. ఇరువైపులా తాళ్లపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్లపాక వంశం వారు రచించిన సుమారు 32వేల సంకీర్తనలను భద్రపరచారు. వేటూరి ప్రభాకర శాస్త్రి, సాధు సుబ్రమణ్యశాస్త్రి వంటి వారి విశేష కృషి వలన ఈ రోజు మనం వాటిని చూస్తున్నాం.భాష్యకార్ల సన్నిధిఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏ కైంకర్యాలు ఏ విధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి. తన 120 సంవత్సరాల కాలంలో మూడు పర్యాయాలు తిరుమలకు మోకాళ్లపై వచ్చారు. అలా వస్తున్నప్పుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ల పర్వతం. నేటికీ కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్లతో ఎక్కుతుంటారు.పోటుప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణంలో ఈ పోటు ఉంది. ఇక్కడ దద్ధోజనం, చక్కెర పొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరాతో పాటు కళ్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్ పాయసం, అప్పం మొదలైనవి తయారు చేస్తుంటారు. ఆనందనిలయ విమానంఆనందనిలయంపై ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు. గరుత్మంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుంచి భూమి మీదకు తీసుకొచ్చారని చెబుతారు. దీని మీద దాదాపు 64 మంది దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నట్లు చెబుతుంటారు. ఈ గోపురంపైనే వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామినే విమాన వెంకటేశ్వరస్వామి అంటారు.రికార్డు గదిస్వామివారి అభరణాల వివరాలు, జమ ఖర్చులు వివరాలను భద్రపరచు గది.వేదశాలరికార్డుల గది పక్కనే వేద పండితులు పఠనం చేసే గది. ఇక్కడ మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.యోగనరసింహస్వామి సన్నిధిరామానుజాచార్యులుచే శ్రీనరసింహాలయం ప్రతిష్ఠితం చేయబడింది. క్రీశ 1330–1360 మధ్య కాలంలో నిర్మించినట్లు పరిశోధకుల అభిప్రాయం. క్రీశ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. అళగియ సింగం (అందమైన సింహం) అని, వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది. చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండటం ప్రత్యేకం. ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.శంకుస్థాపన స్తంభంరాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.పరిమళ అరశంకుస్థాపన స్తంభం నుంచి తిరిగి వచ్చే మార్గంలో ఈ పరిమళ అర ఉంది. స్వామివారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.శ్రీవారిహుండీభక్తులు కానుకలు వేసే ప్రాంతం. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగినా ఇప్పటికీ ఎటువంటి మార్పు చెందని ఒకే ఒక స్థలం. దీని కింద శ్రీచక్రయంత్రం, ధనాకర్షణ యంత్రం ఉన్నాయని నమ్మకం.బంగారు వరలక్ష్మిహుండీ ఎడమగోడపై బంగారు లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఈవిడ భక్తులకు అషై్టశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.కటాహ తీర్థంఅన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టిలాంటి నిర్మాణం. ఇందులో స్వామివారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.విష్వక్సేనహుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ఘంటా మండపంబంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్య ఉన్న ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామివారి సందర్శనకు వేచి ఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు. పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయంలో వీటిని మోగించేవారు. దీనిని ఘంటపని అనేవారట. ఈ గంటలను అనుసరించే స్వామివారి ఆహారసేవలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం తీసుకునేవారట. ప్రస్తుతం రెండూ ఒకేచోటుకు చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం పక్కనే ఉంటాయి.గరుడ సన్నిధిమూలవిరాట్టుకు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారు మండపం. బంగారువాకిలి ఎదురుగా, గరుడాళ్వార్ మందిరం ఉంది. శ్రీవారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో ఉన్న గరుడాళ్వారు దర్శనమిస్తాడు. ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.ద్వారపాలకులుబంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు. మహాలఘు దర్శనం ఇక్కడే చేసుకుంటారు.మూడవ ప్రాకారం..బంగారు వాకిలిశ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లటానికి అత్యంత ప్రధానమైన ఏకైక ద్వారం బంగారు వాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారు వాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీమలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. స్నపన మండపంబంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే స్నపనమండపం. క్రీ.శ. 614లో పల్లవరాణి సామవై ఈ మండపాన్ని నిర్మించి భోగశ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించారట. ఈ స్నపన మండపాన్నే తిరువిలాన్కోయిల్ అంటారు. ఆనందనిలయం జీర్ణోద్ధరణ సమయంలో ఈ మండపాన్ని నిర్మించినట్లు చెబుతారు. ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునికి ఆరోజు పంచాంగం చెప్పే పూజారులు, క్రితం రోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు. రాములవారి మేడస్నపన మండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపులా ఎత్తుగా కనిపిస్తుంది రాములవారి మేడ. తమిళంలో మేడు అంటే ఎతై ్తన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆనంద నిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పేరుపొందింది.శయన మండపంశ్రీవారి గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయన మండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.కులశేఖరపడిశ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరపడి. పడి అనగా మెట్టు, గడప అని అంటారు.ఆనందనిలయంకులశేఖరపడి అనే బంగారు గడప దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. ఈ ఆనందనిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయం అంటారు.శ్రీవేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు)గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిల్చొని ఉన్న శిలాదివ్యమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామి. నిలబడి ఉన్నందున ఈ అర్చామూర్తిని ‘స్థానకమూర్తి’ అంటారు. అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ‘ధ్రువమూర్తి’ అని, ‘ధ్రువబేరం’ అని కూడా అంటారు. శ్రీవారు అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నారు. ఈ మూలమూర్తికి ప్రతినిధులుగా కొలువు శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్ప స్వామి అనే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా సీతారామలక్ష్మణులు, శ్రీకృష్ణ రుక్మిణులు, చక్రత్తళ్వారులు, సాలగ్రామ శిలలు ఉన్నాయి (స్వామివారికి ప్రతిరూపాలుగా వారికి నిత్య అభిషేకాలు జరుగుతుంటాయి)∙ -
Tirumala: ఆ దేవదేవుడికి కునుకే కరువు..!
కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోకవైకుంఠం తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. పూర్వం చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త దివ్యతేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. యేళ్ల తరబడి ఆ స్వామికి కంటిమీద కనుకు కష్టమైపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..!! అవును.. పూర్వం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత మంది భక్తజనం రావటంతో స్వామి దర్శనం కేవలం పగటిపూట మాత్రమే కలిగేది. రానురానూ తిరుమలకొండ మీద సౌకర్యాలు పెరిగాయి. భక్తులు పెరిగారు. క్యూలు పెరిగాయి. వారి వేచి ఉండే సమయం పెరిగింది. ఆ ప్రభావం సాక్షాత్తు మన స్వామి దర్శనం మీద పడిందనటంలో అతిశయోక్తిలేదు. కష్టాలు తొలగాలని కోర్కెల చిట్టాలతో వచ్చే భక్త జనులకు దివ్యాశీస్సులు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే అన్నట్టుగా స్వామి క్షణకాలం కూడా తీరికలేకుండా అనుగ్రహిస్తున్నారనటంలో ఆవంతైనా అనుమానం లేదు. మన స్వామికి కంటి మీద కనుకు లేకపోవడానికి కారణ విశేషాలేమిటో తెలుసుకోవాల్సిందే మరి!!నాటి కుగ్రామం నుండి ప్రపంచ స్థాయి క్షేత్రంగా విరాజిల్లుతూ..1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే నాటికి ఈ క్షేత్రం కుగ్రామమే. కనీసం మట్టిరోడ్డు కూడా లేని దట్టమైన అటవీ ప్రాంతం. తిరుమల కొండకు రెండు ఘాట్రోడ్ల ఏర్పాటుతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగాయి. ఎలాంటి మౌలిక వసతుల్లేని తిరుమలలో ప్రస్తుతం స్టార్ హోటళ్ల స్థాయి సౌకర్యాలు ఏర్పడ్డాయి.ఒకప్పుడు చేతివేళ్లపై లెక్కపెట్టగలిగేలా ఉన్న సిబ్బంది నేడు వేలసంఖ్యకు పెరిగారు. రోజూ వందల సంఖ్యలోపే వచ్చే భక్తులు నేడు 70 వేలు దాటారు. అప్పట్లో వేలల్లో లభించే ఆలయ హుండీ కానుకలు కూడా ఆ మేరకు పెరిగి రూ.2.5 నుండి రూ.3 కోట్లకు చేరుకున్నాయి. రూ.లక్షల్లో ఉన్న స్వామి ఆస్తిపాస్తులు నేడు లక్షన్నర కోట్లరూపాయలకు పైబడ్డాయి. పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామికి నేడు అర్ధరాత్రి దాటినా కూడా కునుకు దొరకని విధంగా భక్తులు పెరిగిపోయారు. ⇒ నాడు దట్టమైన అరణ్యంలో దాగిన తిరువేంగడమే నేడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం. పూర్వం తిరుమలకొండను ‘తిరువేంగడం’ అని, శ్రీవేంకటేశ్వర స్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అనీ కీర్తించేవారు. మహనీయులెందరో..!⇒తిరుమల „ó త్రానికి పల్లవులు, చోళులు, పాండ్యులు, కాడవ రాయరులు, తెలుగుచోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు విశిష్ట సేవ చేశారు. ఆలయ కుడ్యాలపై ఉన్న శాసనాలే ఇందుకు ఆధారం. ఆ తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు, అధికారులు తిరుమలేశుని కొలువులో సేవించి తరిస్తూ ఆయా కాలాల్లో ఆలయ పరిపాలనలో భక్తులకు తమవంతుగా సేవలు, సౌకర్యాలు కల్పించారు. ⇒ఇక ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, అన్నమాచార్యులు, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వంటి వారెందరో ఈక్షేత్ర మహిమను వేనోళ్ల కొనియాడారు. తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని దశదిశలా చాటారు. బ్రిటిష్ చట్టాలపైనే దేవస్థానం పునాదులురెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన తెల్లదొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులేనని చెప్పొచ్చు. దేవస్థానం పాలన కోసం వేసిన పునాదులు వారి కాలంలోనే పటిష్ఠంగా ఏర్పడ్డాయనటానికి టీటీడీ వద్ద లభించే రికార్డులే ఆధారం. ⇒1843 నుండి 1933 వరకు మహంతుల పాలన జరిగింది. ఆలయ పరిపాలన కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆలయ కమిషనర్తోపాటు ధర్మకర్తల మండలి కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టింది. ⇒ చివరి మహంతు ప్రయాగ్దాస్ దేవస్థాన కమిటీకి తొలి అధ్యక్షులుగా 1933 నుంచి 1936 వరకు సేవ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 52 మంది అ«ధ్యక్షులు, స్పెసిఫైడ్ అథారిటీ ప్రత్యేక పాలనాధికారులుగా పనిచేశారు.⇒ధర్మకర్తల మండళ్లలోని చైర్మన్, ఈవోలు ఎవరికి వారు ఆయా కాలాల్లో అవసరాలకు అనుగుణంగా భక్తుల బస కోసం సత్రాలు, కాటేజీలు నిర్మించారు. ప్రయాణ సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. తొలినాళ్లలో పగటిపూటే స్వామి దర్శనం⇒1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత కూడా తిరుమలకు నడిచేందుకు సరిగ్గా కాలిబాట మార్గాలు లేవు. తిరుమల మీద కూడా అలాంటి పరిస్థితులే కనిపించేవి. చుట్టూ కొండలు, బండరాళ్లే కనిపించాయి.⇒కొండకు వచ్చే భక్తులు ఆలయం ఎదురుగా ఉండే వేయికాళ్ల మండపం, ఆలయ నాలుగు మాడ వీథుల్లోని మండపాలు, స్థానిక నివాసాల్లో తలదాచుకునేవారు. అప్పట్లో ఎలాంటి క్యూలు ఉండేవికావు. ⇒మహాద్వారం నుండే గర్భాలయం వరకు వెళ్లేవారు. స్వామిని తనివితీరా దర్శించుకునేవారు. అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రమైన మంచు, చలి ఉండేవి. అందుకే సూర్యుడు కనిపించే సమయంలోనే ఆలయాన్ని తెరిచి ఉంచేవారు. ఘాట్రోడ్ల నిర్మాణంతోనే భక్తుల పెరుగుదల ⇒ఈ పరిస్థితులలో మద్రాసు ఉమ్మడి రాష్ట్ర బ్రిటిష్ గవర్నర్ సర్ ఆర్థ్థర్ హూప్ నేతృత్వంలో ప్రముఖ భారతీయ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘాట్రోడ్కు రూపకల్పన చేశారు.⇒1944 ఏప్రిల్ 10న మొదటి ఘాట్రోడ్డు ప్రారంభమైంది. తొలుత ఎడ్లబండ్లు, తర్వాత నల్లరంగు బుడ్డ బస్సులు (చిన్న బస్సులు) ఈ మొదటి ఘాట్రోడ్డులోనే తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. దీంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ⇒1951 నవంబర్ నెల మొత్తానికి కలిపి శ్రీవారి దర్శనానికి దేవస్థానం బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య 27,938 మంది, 1953, ఏప్రిల్లో 52,014 మంది మాత్రమే. ⇒1961, నవంబర్ మొత్తంగా తిరుమల ఘాట్రోడ్డులో 1,986 కార్లు, బస్సులు, 81 మోటారు సైకిళ్లు తిరిగాయి.⇒తర్వాత 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్రోడ్డుతో తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు మరింత మెరుగుపడ్డాయి.⇒ప్రయాణ సమయం తగ్గింది. నునుపైన తారు, సిమెంట్ రోడ్లు అందుబాటులోకి రావటం, వాటిపై వాహనాలు రివ్వున తిరగటంతో తిరుమలేశుని దర్శించే భక్తుల రాక క్రమంగా పెరుగుతూ వచ్చింది.⇒రెండో ఘాట్రోడ్డు అందుబాటులోకి రావటంతో రోజుకు పదివేల మంది భక్తులు పెరిగారు. టీటీ డీ రవాణా సంస్థ వాహనాల బదులు 10.8.1975 నుండి రెండు ఘాట్రోడ్లపై ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరగటంతో భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 500 ఆర్టీసీ బస్సులు, రోజుకు 3,200 ట్రిప్పులు సాగిస్తూ.. బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. నాడు నిమిషాల్లోనే దర్శనం.. నేడు రోజు పైబడి...∙1933 నుంచి 1970కి ముందు వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు.⇒మొదటి ఘాట్రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 5 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండవ ఘాట్రోడ్డు వచ్చేనాటికి ఈ సంఖ్య రోజుకు సుమారు 10 వేలకు పెరిగింది. ⇒తిరుమలలో పాతపుష్కరిణి కాంప్లెక్స్ నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. దీంతో 1990 నాటికి రోజుకు 20 నుంచి 25 వేలు, 1995కు 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు పెరిగింది.⇒2003 నాటికి రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు. క్యూలైన్లు పెరిగాయి. భక్తుల నిరీక్షణ సమయం రెండు రోజులకు పెరిగింది. 2010 నాటికి రోజువారీ భక్తుల సంఖ్య 60 వేలకు చేరింది.⇒ఇలా 2010 సంవత్సరంలో మొత్తం 2.14 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2011లో 2.43 కోట్లు, 2012లో 2.73 కోట్లు, 2013లో ఈ సంఖ్య 1.96 కోట్లు (సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం), 2014లో 2.26 కోట్లు, 2015లో 2.46 కోట్లు, 2016లో 2.66 కోట్లమంది భక్తులు వచ్చారు. ⇒ఇక ఈ యేడాది 8 నెలలకే సుమారు 2 కోట్లకు చేరగా, ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.⇒స్వామి దర్శనానికి రోజువారీగా పోటెత్తే భక్తులకు ఈ రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 64 కంపార్ట్మెంట్లు చాలటం లేదు. శుక్ర, శని, ఆదివారాల్లో కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో భక్తులు నిరీక్షించటం రివాజుగా మారింది. ⇒పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు రోజుల తరబడి తిరుమలలో నిరీక్షించకుండా 2000 సంవత్సరంలో దర్శనానికి సుదర్శనం కంకణ విధానం, ఆన్లైన్ రిజర్వేషన్ పద్ధతికి రూపకల్పన చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఈ–దర్శన్ కౌంటర్ల ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జితసేవా టికెట్ల కేటాయింపును చేపట్టారు. 2009వ సంవత్సరం నుండి ప్రవాస భారతీయులకు, ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డతోపాటు వారి తల్లిదండ్రులను ‘సుపథం’ ద్వారా అనుమతిస్తున్నారు. ⇒2010వ సంవత్సరంలో అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో నడచి వచ్చే భక్తులకు దివ్య దర్శనం (ప్రస్తుతం టైమ్ స్లాట్ విధానం) ఆరంభించారు.⇒అదే ఏడాదే ఎటువంటి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా టికెట్లు కొనుగోలు చేసేవిధంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆరంభించారు. ప్రస్తుతం ఆ¯Œ లైన్ టైంస్లాట్లో మాత్రమే టికెట్ల అమ్మకం చేస్తున్నారు. ⇒ఆలయ మహద్వారం నుండి (పస్తుతం దక్షిణ మాడవీ«థి నుండి) వికలాంగులు, 65 ఏళ్ల వయసు నిండిన వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులను అనుమతించారు.⇒ఇక సిఫారసులతో రూ.500 టికెట్ల వీఐపీ దర్శనాలు, అన్ని రకాల ఆర్జితసేవా టికెట్లతో ప్రత్యేక దర్శనాలు.. ఇలా అన్ని కేటగిరీల్లోని భక్తులకు ఏదో రూపంలో సుమారు పది రకాలకు పైగా దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది. కోనేటిరాయని కునుకు పదినిమిషాలే! ⇒మహంతుల కాలం (1843 నుంచి 1933)లో తిరుమల ఆలయంలో గర్భాలయ దివ్యమంగళ మూర్తికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. నిత్య ఏకాంత కైంకర్యాలన్నీ నిర్ణీత వేళల్లో సంపూర్ణంగా జరిగేవి.⇒2000వ సంవత్సరం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయి పట్టుమని పదినిమిషాలు కూడా స్వామికి విశ్రాంతి లభించటం లేదు. ⇒ఇక తప్పని పరిస్థితుల్లో లాంఛనంగా తలుపులు వేసి మమ అనిపిస్తున్నారు. ఆగమం ప్రకారం ఆరు గంటలు విరామం, ఏకాంత కైంకర్యాలుండాలి⇒వైఖానస ఆగమం ప్రకారం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి కనిçష్ఠంగా 6 గంటలపాటు విరామం ఉండాలి. అదే స్థాయిలోనే స్వామికి ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి ఏకాంత కైంకర్యాలు ఉండాలని పండితులు చెబుతున్నారు.⇒ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. 24 గంటల్లో కేవలం 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామివారి కైంకర్యాలకు కేటాయిస్తున్నారు. మిగిలిన 20 గంటలపాటు వివిధ రకాల పేర్లతో టికెట్లు కేటాయించి దర్శనం అమలు చేస్తున్నారు. ⇒ఇక నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ పేరుతో పట్టుమని పది నిమిషాలు కూడా స్వామికి విరామం ఇవ్వటం లేదు. ఏకధాటిగా 22 గంటలపాటు స్వామి దర్శనం సాగించే పరిస్థితులు పెరిగాయి. అర్ధరాత్రి దాటాక ఏకాంత సేవ, ఆ వెంటనే సుప్రభాతం నిర్వహిస్తూ స్వామి కైంకర్యాలు నిర్వహించే పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి టీటీడీ అధికారులు చెబుతున్న ప్రధాన కారణం ఒక్కటే. భక్తుల రద్దీ...రద్దీ.. భక్తుల రద్దీకి తగ్గట్టు స్వామి దర్శనం కల్పించవలసిన బాధ్యత ఎంత మేరకు ఉందో, పూర్వం నుండి ఆగమోక్తంగా అమలు చేసే స్వామి కైంకర్యాల్లో కోత విధించటం, స్వామికి విరామం లేకుండా చేయటం సమాజ శ్రేయస్కరం కాదని ఆగమ పండితుల హెచ్చరికల్ని కూడా దేవస్థానం అధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి!! -
స్వామివారి పాదాల కింద విరాజిల్లిన విరజానది
స్వామివారి పాదాల కింద ప్రవహించే విరజానది ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరజానది అంటారు. వైకుంఠంలోని ఈ దేవనది స్వామి పాదాల కింద ప్రవహిస్తోందంటారు. నదిలో కొంత భాగాన్నే బావి అంటారు. దీన్ని చతురస్రాకారంలో చెక్కిన రాళ్ళతో నిర్మించారు. రాళ్లపై నాలుగు అంచుల్లో వానరులతో కలిసి ఉన్న సీతారామలక్ష్మణులు, హనుమంత, సుగ్రీవులు, కాళీయమర్దనంలో శ్రీకృష్ణుని వేడుకుంటున్న నాగకన్యలు, ఏనుగును అదిలిస్తున్న వేంకటేశ్వరుడు, గరుడుని బొమ్మలు మలిచారు. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు బొమ్మలబావిగా పిలుస్తుంటారు.స్వామి పవిత్ర నిర్మాల్యం పూలబావికే సొంతం అద్దాల మండపానికి ఉత్తర దిశలో ఈ పూల బావి ఉంది. స్వామికి సమర్పించిన తులసి, పుష్ప, పూమాలలను ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు. అందుకే ఆ పవిత్రమైన నిర్మాల్యాన్ని ఎవ్వరూ తిరిగి వాడకుండా ఈ పూలబావిలో వేస్తారు. స్వామికి నివేదించిన అన్ని రకాల నిర్మాల్యం పూలబావి తన ఉదరంలో దాచుకుంటుందని అర్చకులు చెబుతారు. అందుకే దీనికి పూలబావిగా నామం సార్థకమైంది. దీనినే భూ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోవడంతో శ్రీనివాసుని ఆదేశంతో రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం పునరుజ్జీవం పొందిందని చెబుతారు. రంగదాసు మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి స్వామిని సేవించారని పురాణాల కథనం. అభిషేక సేవకు బంగారుబావి నీళ్లువకుళమాత కొలువైన పోటు(వంటశాల) పక్కనే బంగారు బావి ఉంది. స్వామి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపలకు వచ్చిన భక్తులకు ఎదురుగానే ఈ బంగారుబావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్నే వాడతారు. బావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో వర నిర్మించారు. దీనికి బంగారు తాపడం చేసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీతీర్థం, సుందర తీర్థం, లక్ష్మీ తీర్థం అని కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి వంట కోసం మహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారట! త్రైలోక్య దుర్లభాలుశ్రీవారి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శన భాగ్యం, కటాహ తీర్థపానం... ఈ మూడు త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. కటాహ తీర్థం శ్రీవారి హుండీకి వెలుపల ఆనుకుని తొట్టిమాదిరిగా ఎడమ దిక్కున ఉంది. దీన్ని తొట్టి తీర్థమని కూడా అంటారు. స్వామి పాదాల నుండి వచ్చే అభిషేకతీర్థం ఇది. ఈ తీర్థాన్ని స్వీకరించినప్పుడు అష్టాక్షరి లేదా కేశవాది నామాలు లేదా శ్రీవేంకటేశుని నామాలు ఉచ్చరిస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతారు.మోక్షప్రాప్తి కలిగించే పుష్కరిణి పుణ్యస్నానంబ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. శ్రీమహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుండి క్రీడాద్రితోపాటు పుష్కరిణిని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానమాచరించడం వల్ల సకల పాపాలు తొలగి ఇహంలో సుఖ శాంతులతోపాటు పరలోకంలో మోక్షమూ సిద్ధిస్తుందని నమ్మకం. ప్రతి యేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే ఇందులో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.పుష్కరిణిలో ప్రాచుర్యంలోని తొమ్మిది తీర్థాలుముక్కోటి తీర్థాల సమాహారమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ప్రధానంగా తొమ్మిది తీర్థాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. అవి: మార్కండేయ తీర్థం (పూర్వ భాగం), ఆగ్నేయ తీర్థం (ఆగ్నేయ భాగం), యమ తీర్థం (దక్షిణ భాగం), వసిష్ట తీర్థం (నైరుతి), వరుణ తీర్థం (పడమర), వాయు తీర్థం (వాయు భాగం), ధనద తీర్థం (ఉత్తర భాగం), గాలవ తీర్థం (ఈశాన్యం), సరస్వతీ తీర్థం(మధ్య భాగం). «పూర్వం శంఖనుడు అనే రాజు స్వామివారి పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించడం వల్ల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాడట! దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం పొందాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించడంతో వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించి పోగొట్టుకున్నాడట! ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగ రుగ్మతలు పోగొట్టుకుని, భోగభాగ్యాలు సంపాదించుకున్నారని పెద్దలు చెప్పే మాట! -
Tirumala: ఆనంద నిలయం అఖండ తేజోమయం
తనమీద అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని వీడిన విష్ణుమూర్తి భూలోక వైకుంఠమైన వేంకటాచల క్షేత్రానికి విచ్చేశాడు. అక్కడ స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తిగా వెలసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు. స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం. గర్భాలయంపై నిర్మించిన బంగారు గోపురమే ‘ఆనంద నిలయ విమానం’గా ప్రసిద్ధి పొందింది.⇒ శ్రీవేంకటేశ్వరస్వామి వారు గర్భాలయంలో ‘ఉపధ్యక’ అనే పవిత్రస్థానంలో కొలువై నిత్యపూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో మూడు విగ్రహాలుంటాయి. వాటినే ధ్రువమూర్తి, మూలమూర్తి, మూలవిరాట్టుగా కొలుస్తారు. యోగ, భోగ, విరహ రూపాలతోపాటు ‘వీర స్థానక’ విధానంలో నిలబడిన స్వామి ముగ్ధమనోహరంగా ప్రకాశిస్తాడు. స్థిరంగా ఉంటాడు. ఈ విగ్రహాన్నే ఆగమ పరిభాషలో ధ్రువబేరంగా సంబోధిస్తారు. ⇒ సుప్రభాతంతో వేకువజామున 2.30 గంటలకు స్వామిసేవను ప్రారంభించి, తిరిగి రాత్రి 12.30 గంటలకు జోలపాటతో నిద్రపుచ్చుతారు. వైఖానస ఆగమబద్ధంగా తోమాల, అర్చన, కొలువు ఇతర నిత్యసేవా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో మూడుపూటలా అన్నప్రసాదాలు, పిండి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తూ అర్చకులు లోకకల్యాణం కోసం శరణు వేడుతారు. ⇒ పుష్పకైంకర్యంలో భాగంగా సాలగ్రామ హారాలు, శిఖామణి, శంఖుచక్రం, శ్రీదేవి, భూదేవి కంఠహారాలు, అలంకార బిట్లు, 25 రకాల పూలకుచ్చులతో కూడిన సువాసనలు వెదజల్లే పుష్పాలతో స్వామిని అలంకరిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పుష్పకైంకర్యాలు చేస్తారు. నిత్య దిట్టం కింద 300 కేజీల పుష్పాలు వాడతారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలు, ఆస్థాన కార్యక్రమాల కోసం 10 నుంచి 20 టన్నుల వరకు పుష్పాలు వినియోగిస్తారు. ⇒ తననే శరణు వేడండంటూ కటి, వరదహస్తాలతో స్వామి తన పాదపద్మాలను చూపిస్తూ భక్తులకు హెచ్చరికతో కూడిన హితబోధ చేస్తూ దర్శనమిస్తుంటారు. అలాంటి దివ్యమైన బంగారు పాదాలను నిత్యం పుష్పాలు, తులసి సేవిస్తుంటాయి. వేకువజాము సుప్రభాత దర్శనంలో మాత్రమే తులసి, పుష్పాలు లేకుండా దర్శించవచ్చు. ఇక శుక్రవారం అభిషేకం, ఆ తర్వాత దర్శన సమయంలో మాత్రమే బంగారు పాద తొడుగులు లేకుండా స్వామి పాద పద్మాలు (నిజపాద సేవలో) దర్శించవచ్చు. ⇒ ప్రతి రోజూ నిత్యకట్ల అలంకారంలో 120 రకాల ఆభరణాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలు, పర్వదినాల్లో ప్రత్యేక అలంకారాలు చేసేందుకు అదనంగా ఆభరణాలు వాడతారు. రోజూ చేసే అలంకారాన్ని నిత్య కట్ల అలంకారమని, పండుగలు, ఉత్సవాలు, ప్రముఖుల రాక సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారమని అంటారు. స్వామికి వజ్రకిరీటం, శంఖ, చక్ర, వరద హస్తాలు, ప్రత్యేక ఆభరణాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. ⇒ శ్రీ స్వామి, ఉత్సవమూర్తుల అలంకరణలకు వాడే కిరీటాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, ఇతర నిల్వలు దాదాపుగా 11 టన్నులు ఉంటాయి. వీటితోపాటు వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాల నగలు కూడా ఉన్నాయి. ⇒ ఆకాశరాజు కిరీటం, వేంకటాద్రిని పాలించిన రాజులు, బ్రిటిష్ పాలకులు, మహంతులు, భక్తులు సమర్పించే కానుకల వివరాలను నమోదు చేసేందుకు టీటీడీ 19 తిరువాభరణ రిజిస్టర్లు నిర్వహిస్తోంది. ⇒ శుక్రవారం అభిషేకం తర్వాత స్వామికి ఊర్ధ్వపుండ్రాలు (తిరునామం) సమర్పిస్తారు. దీనినే ‘తిరుమామణికాపు’ అంటారు. ఇందుకోసం 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరి సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భాల్లో తిరుమామణికి వాడే ద్రవ్యాలు రెట్టింపు స్థాయిలో వాడతారు. ⇒ అభిషేకం తర్వాత మూలమూర్తికి అంతరీయం (ధోవతి)గా 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగా ధరింప చేస్తారు. ⇒ విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ఇతర సామాజ్య్రాలపై దండయాత్రకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ స్వామివారిని దర్శించుకునేవారు. ఆ సందర్భంగా విలువైన ఆభరణాలు, కిరీటాలు, ఖడ్గాలను బహూకరించారు. మలయప్పకు అలంకరించే గుండ్రని కిరీటం, మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక ఉత్సవాల్లో ఎదపై అలంకరించే పెద్ద పచ్చ రాయలు సమర్పించినవే. ⇒ ఆలయంలోని జయవిజయలు ఉన్న బంగారువాకిలి దాటుకున్న తర్వాత రాములవారి మేడలో ఉండే రహస్య అలమరాలో శ్రీవారికి వినియోగించే ఆభరణాలు భద్రపరుస్తారు. వీటిని ఆలయ డిప్యూటీ ఈవో, పేష్కార్ పర్యవేక్షిస్తారు. ఏ రోజు, ఏ ఉత్సవంలో ఏయే ఆభరణాలు అవసరమో అర్చకుల సూచన మేరకు వాటిని సమకూరుస్తారు. ⇒ శ్రీవారి ఆలయంలో గర్భాలయ మూలమూర్తితోపాటు భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, ఉగ్ర శ్రీనివాసుడు కొలువై ఉన్నారు.⇒ పంచమూర్తులే కాకుండా సుదర్శన చక్రత్తాళ్వార్, సీతారామ లక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు వంటి పంచలోహ మూర్తులు కూడా గర్భాలయంలోనే కొలువై ఉన్నారు. ఇక్కడే దేవతామూర్తులతోపాటు పవిత్ర సాలగ్రామాలు కూడా నిత్య పూజలందుకుంటున్నాయి.∙గర్భాలయానికి ఆగ్నేయం, ఈశాన్య దిశల్లో అటు ఇటుగా ‘బ్రహ్మ అఖండం’ నిత్యదీపారాధన వెలుగుతూనే ఉంటుంది. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ దీపాలను వెలిగించాడని విశ్వాసం.∙రాత్రి పవళింపు సేవ చివరి సమయంలో బంగారు నవారు పట్టె మంచంపై ‘మనవాళ పెరుమాళ్’ (భోగశ్రీనివాసుడు) వేంచేపు చేస్తారు. అదే సమయంలోని గర్భాలయ మూలమూర్తికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి ‘ముత్యాల హారతి’ మంగళ కర్పూర నీరాజనం సమర్పిస్తారు. ∙తెలుగు నూతన సంవత్సరాధి పర్వదినమైన ఉగాది (మార్చి/ఏప్రిల్), ఆణివార ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం (సెప్టెంబరు/అక్టోబరు), వైకుంఠ ఏకాదశి (డిసెంబరు/జనవరి) పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహిస్తారు. ∙కోయిల్ ఆళ్వారు తిరుమంజనం రోజున ఆనంద నిలయం నుంచి మహాద్వారం వరకు శుద్ధ జలంతో శుద్ధి చేస్తారు. ఈ క్రమంలో నీరు, దుమ్ము, ధూళి పడకుండా ఉండేందుకు మూలమూర్తి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళ వస్త్రాన్ని కప్పుతారు. ఈ వస్త్రాన్నే ‘మలైగుడారం’ అని అంటారు. తిరుమంజన సేవలు పూరి ్తకాగానే కురాళం అనే దీర్ఘచతురస్రాకారపు మఖమల్ వస్త్రాన్ని పైకప్పునకు కడతారు.∙గర్భాలయంలో కేవలం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పునకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. ∙తిరుమంజనానికి ముందురోజే ఎక్కువ మోతాదులో నామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారు చేస్తారు. భారీ గంగాళాల్లో సిద్ధం చేసిన ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనంగా పూస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు క్రిమికీటకాలు ఉండకుండా ప్రాకారం పటిష్ఠతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. నిత్యం సుప్రభాతసేవలో స్వామికి గోక్షీర సేవనం, నవనీత హారతి ఇస్తారు. అప్పుడే పితికిన గోవుపాలు, అప్పుడే తీసిన వెన్న, పచ్చకర్పూరపు తాంబూలంతో కూడిన పళ్లెరంతో హాథీరామ్ మఠం మహంతుల సన్యాసి/బైరాగి ఆలయానికి సమర్పించగా హాథీరామ్ మహంతు పేరుతో అర్చకులు ఈ కైంకర్యాలు నిర్వహిస్తారు. -
మాడవీథుల ప్రాశస్త్యం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి ఆలయం 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. స్వామివారి ఆలయం పక్కనే వున్న పుష్కరిణి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అటు తర్వాత లడ్డు కౌంటర్లు, బూందీ కౌంటరు, లడ్డు తయారీ కేంద్రం వంటివి రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండగా వరాహస్వామి ఆలయం మిగిలిన ప్రాంతం కలుపుకొని దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ మాడవీథులు ఏర్పడ్డాయి. తూర్పు మాడవీథి 750 అడుగుల పొడవున; దక్షిణ, ఉత్తర మాడ వీథులు ఎనిమిది వందల అడుగుల పొడవున; పడమటి మాడవీథి 900 అడుగుల పొడవున ఉంటాయి. శ్రీవారి ఆలయం చుట్టూ ఏర్పడిన ఈ మాడవీథులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు తన ఉభయ దేవేరులతో నిత్యం తిరుగాడే ప్రాంతం మాడవీ«థులు. గతంలో వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే స్వామివారి వాహన సేవలు నిర్వహించేవారు. దీనితో మాడవీథుల్లో ఏడాదికి తొమ్మిది రోజులు పాటు మాత్రమే స్వామివారి ఊరేగింపు నిర్వహించేవారు. ఆ తర్వాత వీ«థి ఉత్సవం పేరుతో స్వామివారు నిత్యం మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చేవారు. సహస్ర దీపాలంకరణ సేవను ఆలయం వెలుపలకు మార్చిన తర్వాత ప్రతినిత్యం స్వామివారు దీపాలంకరణ సేవ పూర్తయ్యాక మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఇలా మాడ వీథుల్లో నిత్యం స్వామివారి సంచారం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతుంది.మాడవీ«థుల చుట్టూ ఉన్న నిర్మాణాలను భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2004 నాటికి పూర్తిగా తొలగించి, గ్యాలరీల నిర్మాణం చేపట్టింది. దీనితో మాడవీథుల ఆధునికీకరణ కూడా చేపట్టింది. మాడవీ«థుల్లో భక్తుల తాకిడి పెరుగుతూ రావడంతో 1970 నుంచి టీటీడీ మాడవీ«థులలో ఆంక్షలు విధించడం ప్రారంభించింది. గతంలో వీవీఐపీలు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సమయంలో దక్షిణ మాడవీ«థి గుండా ఆలయం ముందు వరకు వారి వాహనంలోనే చేరుకునేవారు. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం వరకు వాహనంలో విచ్చేసే వీవీఐపీలకు అక్కడి నుంచి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికేవారు. భక్తుల సౌకర్యార్థం అప్పటి ఈవో చంద్రమౌళీశ్వర్ రెడ్డి 1970 ఫిబ్రవరి 22 నుంచి మాడవీ«థులలోకి వాహనాల అనుమతిని నిలిపివేశారు. వీఐపీల కోసం ఆలయం ఎదురుగా టీటీడీ మరో రోడ్డు నిర్మాణం చేపట్టింది. 1996 నుంచి ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వీవీఐపీలు ఈ మార్గం గుండానే మాడవీ«థుల వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, వాహనాలను మాడవీథులలోకి అనుమతించరు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వ్యక్తులు అయినా కూడా బ్యాటరీ వాహనాల ద్వారానే ప్రయాణం చేయవలసి ఉంటుంది. మాడవీథుల్లో భక్తులు పాదరక్షలు ధరించకుండా టీటీడీ 2007 నుంచి నిబంధనలను అమలు చేసింది. నిత్యం స్వామివారి వాహన ఊరేగింపులు జరిగే మాడవీ«థులను అంతే పవిత్రంగా చూడవలసిన బాధ్యత భక్తులపై కూడా ఉందంటూ ఈ నిబంధనలను టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది.∙ -
పువ్వులా పరిమళిద్దాం.. సుద్దాల అశోక్ తేజ
‘‘ప్రతి మనిషి ఒక పువ్వులాంటివాడే. పువ్వు ఉన్నంతసేపు పరిమళాన్నిస్తుంది. మనిషి కూడా ఉన్నన్ని రోజులు ప్రపంచానికి, భూమికి, తన కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి ప్రేమగా, బాధ్యతగా ఉండాలన్నది మానవ జీవితం అయినప్పుడు.. పువ్వు కూడా అంతే. పూస్తుంది... పరిమళాలు పంచుతుంది.. వాడి పోయి రాలి పోతుంది. పూల జీవన తాత్పర్యం, జీవన తాత్వికత అదే. మనిషి కూడా మంచి చేయక పోయినా పర్వాలేదు కానీ, చెడు చేయకూడదు. ఇలా ఓ మంచి సందేశం ఇచ్చే పండుగ బతుకమ్మ’’ అని ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ చెప్పారు. నేడు ‘బతుకమ్మ’ పండుగ ఆరంభం సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.‘‘నాకు ఊహ తెలిసీ తెలియని వయసులోనే మా అమ్మ, అక్కతో పాటు మా నాన్న కూడా బతుకమ్మ కోసం పూలను తీసుకొచ్చేవారు. అలా ఈ పూల పండుగ అయిన బతుకమ్మకి ఇచ్చే ప్రాధాన్యం చిన్న వయసులో నాకు అర్థం అయింది. బతుకమ్మ అనే పేరు పెట్టడంలోనే ప్రజలు చాలా గొప్ప ప్రతిభ పాటించారనిపిస్తోంది. పూలతో అలంకరించి చేస్తారు కాబట్టి పూలమ్మ పండుగ అని కూడా అనొచ్చు కదా? కానీ, అనలేదు. గౌరమ్మ పండుగ, పార్వతీదేవి పండుగ, లక్ష్మీదేవమ్మ పండుగ అనలేదు. ఇవన్నీ పాటలు పాడుతుంటారు. కానీ, బతుకుకు సంబంధించిన ప్రకృతిని పూజించి, ప్రార్థించి, గౌరవించి, ఆరాధించేటటువంటి ఒక పండుగేమో అని అర్థం వచ్చేటట్లు బతుకమ్మ అని పేరు పెట్టారేమో అనిపిస్తుంది. మనిషి బతకాలంటే పంచభూతాలు బాగుండాలి. అది మన శరీరం కావొచ్చు, ఈ ప్రపంచం కావొచ్చు. అసలు మన పండుగలన్నీ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బతుకుతున్న ప్రజలు చేసుకునే పండుగలే. అది దసరా అయినా, సంక్రాంతి అయినా, ఉగాది అయినా. అందులో భాగంగా దసరాకి ముందు వచ్చేదే ఈ బతుకమ్మ పండుగ. → సామాన్యుల పండుగ బతుకమ్మ పండుగలో ఒక గమ్మత్తయిన ఆచారం ఉంది. ఖరీదైన పూలు బతుకమ్మలో వాడరు. పేదవాళ్లు తమ పొలాల్లో, పొలం గట్లల్లో, చెలకల్లో, ఆరు బయట ఊరు చివర ఉన్న ఎక్కడపడితే అక్కడ దొరికే గడ్డి పోగులను, పూలను మాత్రమే వాడతారు. ఈ పూలన్నింటినీ పేర్చినప్పటికీ.. గణపతిని నీళ్లల్లో నిమజ్జనం చేసినట్లు చేయరు. ఒక కార్తీక దీపంలాగా అలల మీద పెట్టి తోస్తారు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరుకోమని. వాళ్ల బతుకులు కూడా ఒక గట్టు మీద నుంచి మరో గట్టుకి చేరడంలోనే జీవితానికి సార్థకత ఉందని భావించడానికే చెరువులో వేసి ‘ పోయిరా బతుకమ్మా..’ అంటుంటారు. ఇలా తమ బతుకులకు తామే ధైర్యం చెప్పుకుంటున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ గట్టు అనేది పుట్టక అయితే ఆ గట్టు అనేది చివర. మధ్యలో అనేకమైన అల్లకల్లోలాలు, గాలులు, అలలు, తుఫానులు, అభ్యంతరాలు, ఆటంకాలు, ఆశాభంగా లు ఉంటాయి జీవితంలో. ఈ పండుగలో కూడా బతుకమ్మని పేర్చి, ఈ చివరి నుంచి అటు తోస్తే అది మెలమెల్లగా వెళుతూ మధ్యలో మునిగి పోతుందా? ఆ గట్టుకు చేరుకుంటుందా? అనేది మనకు తెలియదు కానీ, తమ జీవితాలను తామే ఒక సాంకేతికమైన మార్గంగా సృష్టించుకుని చేసుకుంటారేమో అనిపిస్తుంది నాలాంటివాళ్లకి. → మా ఇంట్లో మనవరాళ్ల దాకా... బతుకమ్మ అనేది ఆడపడుచుల పండుగ. అత్తగారింటికి వెళ్లిన ఆడబిడ్డలందరూ అమ్మగారింటికి వచ్చి బతుకమ్మ, దసరా పండుగ చూసుకుని వెళ్లి పోతుంటారు. ఈ పండుగ గురించి మాకు గుర్తొచ్చేది ఏంటంటే.. పూలను తీసుకురావాలి, పేర్చాలి.. అమ్మ ప్రసాదం చేస్తే తినాలి.. ఇరుగు పొరుగువారికి ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. ఈ సంప్రదాయం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకూ సాగుతూనే ఉంది. మా అమ్మ, అక్కలు, చెల్లెళ్లు్ల, కూతుళ్లు, కోడళ్లు... ఇప్పుడు నా మనవరాళ్ల దాకా వచ్చింది. → చప్పట్ల పండగ బతుకమ్మ అంటే చప్పట్ల పండుగ. ఈ పండుగనాడు సన్నాయిలు, వాయిద్యాలు, మృదంగాలు, డప్పులు కొడుతుంటే మహిళలు బతుకమ్మని చెరువుదాకా తీసుకెళ్లేవారు. కాలప్రవాహంలో మనం చూస్తున్న ఈ దాండియా, డీజేలు మన సంప్రదాయం కాదు. బతుకమ్మ పండుగలో కాలక్రమేణా వస్తున్న మార్పులు సంప్రదాయబద్ధంగా ఉంటే పర్వాలేదు. కానీ, అందులోకి ఈ ఐటెమ్ సాంగ్లను వాయించే వాయిద్యాలు చొరబడొద్దు.. అది కరెక్ట్కాదు..→ ఆ అనుభూతితో పాటలు రాశా! బతుకమ్మ పండుగపైన నేను కూడా చాలా పాటలు రాశాను. చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ ఆడుతుంటే చూసినవాణ్ణి. అలాగే మా అక్కలు, చెల్లెళ్లు, కూతుళ్లు, మనవరాళ్లు ఆడుతుంటే చూసినప్పుడు ఒక అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి, సంప్రదాయం, వారు పాడే పాటల్లోని జానపదం కలిపి ఆ పాట రాస్తున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఆ అనుభూతితోనే పాటలు రాశాను. → తాత్త్విక సందేశం ఇచ్చే పండుగబతుకమ్మ పండుగ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే... మన సంప్రదాయం, మన పూర్వీకులు ఆచరిస్తున్న పద్ధతులు, ప్రేమ, మానవ సంబంధాలు, రక్తసంబంధాలు, ఆడపడుచులు పుట్టింటికి రావడం, ఆ ప్రేమలు ఉన్నాయి. అదే విధంగా మనం పూలను గౌరవించాలి.. పూజించాలి.. పువ్వులకు నమస్కారం చేయాలి. పువ్వులు ఉండాలంటే చెరువులుండాలి.. చెరువులు ఉండాలంటే వానలు ఉండాలి.. వానలు ఉండాలంటే చెట్లు ఉండాలి. చెట్లు పిలిస్తే వాన–వాన కురిస్తే చెట్టు అయినప్పుడు ఈ రెండూ లేకుండా బతుకమ్మ పండుగ లేదు. ప్రకృతి, పర్యావరణం బాగుంటేనే బతుకమ్మ బాగుంటుంది.. బతుకమ్మ బాగుంది అంటే బతుకులు బాగున్నట్టు లెక్క. ఇలా ఓ మంచి సందేశం ఇచ్చే పండుగ బతుకమ్మ. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, గండాలు, సుడిగుండాలు ఉంటాయి.. వాటన్నింటినీ తప్పించుకుంటూ, అధిగమించుకుంటూ మనుషుల్లో అందరం బాగుండడం.. అందులో మనం కూడా ఉండటం అనే తాత్త్విక సందేశం ఇచ్చేదే బతుకమ్మ. → ఆ సంబరం... ఆ సందడి బతుకమ్మ పండుగప్పుడు గతంలో మా అక్కలు, చెల్లెళ్లు ఇంటికొచ్చేవారు. ఇప్పుడైతే నా కూతురు వస్తుంది.. మనవరాళ్లు వస్తారు. మా కోడళ్లు కుదిరితే తల్లిగారి ఇంటికి వెళతారు.. లేదంటే మా ఇంట్లోనే ఉంటారు. నా భార్య కూడా బతుకమ్మ పేర్చడం, ఇరుగు పొరుగువారితో బతుకమ్మ ఆడటం, మా కాలనీలో తాత్కాలిక నీటి కొలను ఏర్పాటు చేసుకుని అందులో బతుకమ్మని వేయడం జరుగుతుంటుంది. లేదా అవకాశం ఉంటే ఎవరితోనైనా పంపించి, నదిలోనో, చెరువుల్లోనో వేయిస్తాం. మా ఊరు సుద్దాలకి వెళ్లి బతుకమ్మ చేసుకుంటే మాత్రం పక్కాగా బతుకమ్మ కుంటలో వేస్తాం. పిత్రమాస నాడు కుంటలో వేస్తాం, సద్దుల బతుకమ్మనాడు చెరువు వద్దకు అందరూ వెళతారు. ఆట పాటల్లో మహిళలు మాత్రమే పాల్గొంటారు. కానీ, పురుషులు మాత్రం వారి వెంట వెళతారు. బతుకమ్మలను అవసరమైతే చెరువు మధ్యలోకి వెళ్లి వదలాల్సి వచ్చినప్పుడు పురుషులు వెళ్లి వదిలే సంప్రదాయం మాత్రం ఉంది.. వాటన్నింటిలో మేము పాల్గొన్నాం. ఇప్పుడైతే మా అబ్బాయిలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు.. వాళ్లు చూసుకుంటారు కానీ, నేను పాల్గొనటం లేదు. నాకు ఐదుగురు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు. వీరందరూ బతుకమ్మ పండగకి తప్పకుండా వస్తారు. అది పిత్రమాస రోజు అయినా లేదంటే సద్దుల బతుకమ్మనాడు అయినా వస్తుంటారు. ఆ సంబురం, ఆ సందడి వేరుగా ఉంటుంది. అది బతుకమ్మలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే నా దృష్టిలో అమ్మాయిలు లేని బతుకమ్మ పండుగ చంద్రుడు లేనటువంటి పౌర్ణమిలాంటిది’’ అని చెప్పారు సుద్దాల అశోక్ తేజ. – డేరంగుల జగన్ మోహన్ -
ఆపదమొక్కులతో తొలగేను చిక్కులు
దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరునికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తూ భక్తితో శరణు కోరుతుంటారు. భక్తి తత్పరులు, కోర్కెలు నెరవేరినవారు, కోర్కెలు నెరవేరాల్సిన వారు ఆపదమొక్కులవాడికి ఎన్నోరకాల మొక్కులు చెల్లిస్తారు. ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించేందుకు నిర్ణీతకాలంలో ప్రత్యేకంగా దీక్షా మార్గాన్ని ఎంచుకుంటారు. భూ శయనం, బ్రహ్మచర్య దీక్ష, ఏకభుక్తం వంటి నియమాలతో తల వెంట్రుకలు తీయకుండా దీక్షను చేపడతారు. పూర్తికాగానే కాలినడకన యాత్రగా తిరుమలకు చేరుకుంటారు. భక్తిశ్రద్ధ్దలతో తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. దివ్యమైన కాలినడకకోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తొలుత చేసేది... నడచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే. కొందరు మోకాళ్లతో, మరికొందరు పొర్లుదండాలతో ఎక్కుతూ మొక్కులు చెల్లిస్తుంటారు. ఇంకొందరు మెట్టు మెట్టుకూ పూజలు, మరికొందరు ప్రతిమెట్టుకూ çపసుపు, కుంకుమ పూసి, కర్పూరం వెలిగిస్తే, మరి కొందరు కొబ్బరికాయలు కొడుతూ తిరుమల కొండెక్కుతారు. రోడ్డు, వాహన సదుపాయాలు లేనిరోజుల్లో కాలిబాటే తిరుమలకు ఏకైక మార్గం. అధునాతనమైన రెండు ఘాట్రోడ్లు ఏర్పడి రోజుకు పదివేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా తిరుమలకు నడిచివెళ్లే భక్తుల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోందంటే ఈ మొక్కుపై భక్తులకు ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో 15 వేలు, సెలవు రోజులు, ఉత్సవాల రోజుల్లో 40 వేల మంది వరకు భక్తులు కాలినడకన కొండెక్కుతున్నారు.‘తల’ నీలాల సమర్పణవెంకన్న మొక్కులో తలనీలాల మొక్కు అత్యంత ప్రధానమైంది. అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా భక్తులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. క్రీ.శ.1830కు ముందు నుండే తలనీలాలు మొక్కుగా చెల్లించే ఆచారం ఉన్నట్టు శాసనాధారం. పుష్కరిణి పుణ్యస్నానం భక్తుల మొక్కులలో పరమ పవిత్రమైంది పుష్కరిణీ స్నానం. బ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానం ఆచరించడంతో సర్వపాపాలు తొలగి, మోక్షం సిద్ధి్దస్తుంది. ప్రతియేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే, ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. వరాహస్వామి దర్శనంతిరుమల క్షేత్రంలో ఆదిదైవం శ్రీ వరాహస్వామి. అందుకే ఈ పుణ్యతీర్థాన్ని ఆది వరాహ క్షేత్రమని పిలుస్తుంటారు. వైకుంఠం వదిలి భూలోకం వచ్చిన శ్రీనివాసునికి వరాహస్వామివారే స్థలాన్ని ప్రసాదించారు. దీనికి ప్రతిఫలంగా భక్తుల తొలి దర్శనాన్ని వరాహస్వామి పొందారు. దానితోపాటు తొలిపూజ, తొలినైవేద్యం వరాహస్వామికే! సామాన్య భక్తుడి నుండి ప్రముఖుల వరకు తొలుత వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీన్ని కొనసాగిస్తేనే ఫుణ్యఫలం దక్కుతుంది. తులా ‘భారం’.. నిలువుదోపిడీ తిరుమలేశునికి భక్తులు తులాభార రూపంలో చిల్లర, బెల్లం, పటిక బెల్లంతో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు ముడుపుల రూపంలో పోగుచేసిన నగదును హుండీలో సమర్పిస్తారు. వెంకన్నను కొలిచే భక్తుల్లో దాదాపుగా పుట్టిన ప్రతి బిడ్డనూ ఏదో ఒక సందర్భంలో స్వామివారికి ఏదో ఒక రూపంలో తులాభారం సమర్పించి మొక్కులు చెల్లిస్తుంటారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అ«ధికారులు కూడా తులాభారం సమర్పిస్తుంటారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి నిలువుదోపిడీ రూపంలో తాము ధరించిన ఆభరణాలన్నిటినీ హుండీలో సమర్పిస్తారు. వెంట తీసుకొచ్చిన నగదు, ఇతర కానుకల్ని కూడా సమర్పిస్తారు. -
కలియుగ దైవానికి కమనీయ బ్రహ్మోత్సవం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వచ్చి, భూలోక వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువుదీరాడు. కన్యామాసం (చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం) శ్రవణా నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వరస్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి! వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట! ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట! తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి.దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం (చెక్కరథం) బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది.అంకురార్పణతో ఆరంభంశ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత దేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.ధ్వజారోహణంఅంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండమీదే కొలువుదీరి ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.పెద్దశేషవాహనంమొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీథులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. భూభారాన్ని వహించేది శేషుడే! శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.చిన్నశేషవాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీ యోగసిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి.హంస వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించి వేరుచేయగల అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు.సింహ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహాన్ని బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహనసేవలోని అంతరార్థం.ముత్యపుపందిరి వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చల్లని ముత్యాలపందిరి కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.కల్పవృక్ష వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీథుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తమకు కాసిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.సర్వభూపాల వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజు అని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.మోహిని అవతారంబ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు.గరుడ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీథుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళరూప దర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు.హనుమంత వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం అవగతమవుతుంది.స్వర్ణ రథంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది.గజవాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.సూర్యప్రభ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీథుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభవాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్య, సంతాన లాభాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.చంద్రప్రభ వాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభవాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు విప్పారతాయి. హృదయాలలో ఆనందం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.రథోత్సవంగుర్రాల వంటి ఇంద్రియాలను మనసు అనే కళ్లెంతో అదుపు చేసే విధంగానే, రథం వంటి శరీరాన్ని రౌతు అయిన ఆత్మ ద్వారా అదుపు చేయాలని తత్త్వ జ్ఞానాన్ని స్వామివారు ఎనిమిదో రోజు ఉదయం తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథసేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉందని భక్తుల విశ్వాసంఅశ్వవాహనంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.చక్రస్నానంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.ధ్వజావరోహణంచక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగరవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాలు వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.శ్రీవారి వాహన సేవల వివరాలు 24–09–2025సాయంత్రం 05:43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.25–09–2025ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం26–09–2025ఉదయం 8 గంటలకు సింహ వాహనం మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం27–09–2025ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంమధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం28–09–2025ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి గరుడ వాహనం29–09–2025 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథంరాత్రి 7 గంటలకు గజ వాహనం30–09–2025ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంరాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం01–10–2025ఉదయం 7 గంటలకు రథోత్సవంరాత్రి 7 గంటలకు అశ్వ వాహనం02–10–2025ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం. -
శ్రీవారి ఆలయ చరిత్ర
తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం. ఎన్నో శతాబ్దాలుగా వెలుగొందుతున్న శ్రీవారి ఆలయం వెనుక ఎంతో చరిత్ర, ఎన్నో స్థలపురాణాలు ఉన్నాయి. రాజుల పాలన నుంచి బ్రిటిష్ పాలకుల చేతిలోకి వెళ్లినప్పటికీ, శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోగలిగింది. వాటిని నేటికీ కొనసాగించగలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శేషాచలంలో ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుమల. కలియుగ వైకుంఠంగా పిలుస్తున్న ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడిగా కొలువై కోరిన కోరికలను తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం. బ్రిటిష్ ఈస్టిండియా పాలన నుంచి ప్రత్యేక బోర్డుగా ఏర్పడే వరకు ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో మద్రాసు ప్రభుత్వం ఏడవ రెగ్యులేషన్ ద్వారా 1817లో శ్రీవారి ఆలయాన్ని ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నియంత్రణలోకి తెచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం ‘బ్రూస్ కోడ్’ రూపొందించారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆలయ పరిపాలనను 1843లో హథీరామ్జీ మఠం మహంతులకు అప్పగించింది. అప్పటి నుంచి 1933 వరకు మహంతుల పాలనలోనే ఆలయం విలసిల్లింది.టీటీడీ పాలక మండలి ఏర్పాటుతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటైంది. అంతకు ముందు మహంతుల పాలనలో ఉన్న ఆలయాన్ని ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం 1933లో టీటీడీకి పాలక మండలి పరిధిలోకి తీసుకురావడం వల్ల మహంతుల వ్యవస్థ ముగిసింది. దీంతో పాలనా వ్యవహారాలు అధికారుల చేతిలోకి వెళ్ళాయి. పాలనా వ్యవహారాలు మారినా, సుదీర్ఘకాలం తిరుమల వ్యవహారాలను పర్యవేక్షించిన మహంతులకు నేటికీ ప్రత్యేక గౌరవం కొనసాగుతోంది. హాథీరామ్జీ మఠంతో అనుబంధంఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని క్రేడల్ క్రేల గ్రామంలో రామానంద మఠం ఉండేది. మఠం అధిపతి అభయ్ ఆనంద్జీ శిష్యుడు హాథీరామ్జీ దేశయాత్రలో భాగంగా వెంకటాచలానికి చేరుకున్నాడు. శ్రీవేంకటేశ్వరుడిని అయోధ్య రాముడి అంశగా భావించి, కొలుస్తూ ప్రసన్నం చేసుకునేవాడు. హాథీరామ్జీ భక్తికి ముగ్ధుడైన శ్రీవారు నిత్యం ఆనందనిలయం దాటి ఆలయానికి సమీపంలోనే ఉన్న హాథీరామ్జీ మఠానికి వచ్చి, ఆయనతో పాచికలాడుతూ, భక్తుడిని గెలిపించి, ఆనందపడేవారనే కథలు ఉన్నాయి.తిరుమలలో శ్రీవారి పేరు తరువాత వినిపించే పేరు విష్వక్సేనుడు. టీటీడీ పాలనా వ్యవహారాలు మహంతుల చేతికి ఈస్టిండియా కంపెనీ అప్పగించినప్పటికీ, ఆలయ నిత్యకలాపాల్లో లోటు లేకుండా చేశారు. అదే సమయంలో పాలనా పగ్గాలు చేతికి తీసుకున్న మహంతులు (çహాథీరామ్జీ బాబా వారసులు) తమ పాలన వ్యవహారాలలో విష్వక్సేనుడి అధికార ముద్రను వాడేవారు. మొదటి మహంతు సేవాదాస్ కాలంలోనే శ్రీవారి పుష్కరిణిలో జలకేళీ మండపోత్సవం పేరిట తెప్పోత్సవం ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి మహంతు బాబాజీ పేరుతో సుప్రభాత సేవలో గోక్షీర నివేదన, నవనీత హారతి సమర్పించే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజూ వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీవారికి సంప్రదాయబద్ధంగా హారతి అందిస్తున్నారు.ఆణివార ఆస్థానం వెనుకవందల సంవత్సరాలు కాలంలో కలిసిపోయినా, తిరుమలలో మాత్రం ఆనాటి ఆచార వ్యవహారలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా కొనసాగిస్తున్నారు. అందులో ఒకటి ఆణివార ఆస్థానం కార్యక్రమం. శాస్త్రోక్తంగా నిర్వహించడంలో టీటీడీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తిరుమలలో ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక పెద్ద కథే ఉంది.ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆర్కాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈస్టిండియా కంపెనీ పాలన సాగించింది. దీంతో 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు ఆలయ పాలన హాథీరామ్జీ మఠం మహంతుల పాలనలో సాగింది. తిరుమల ఆలయానికి మొదటి మహంతుగా1843 జూలై 10న మహంత్ సేవాదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆణివార ఆస్థానం రోజే బ్రిటిషర్లు శ్రీవారి ఆలయ ఆస్తులు, ఆభరణాలు, ఉత్సవ మూర్తులు, ఉత్సవర్లకు ఊరేగింపులో వాడే వాహనాలు, నిత్య కైంకర్యాలకు వాడే పురాతన వస్తువులు, రికార్డులు, లెక్కల అప్పగింత జరిగింది.ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తరహా సమీక్ష జరిగేది. టీటీడీ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇది వార్షిక బడ్జెట్గా మారింది. వందల ఏళ్ల నాటి సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూనే, ఆనాటి చరిత్ర మరుగున పడకుండా, మహంతుల పరిపాలనా కాలం నాటి పద్ధతుల్లోనే శ్రీవారికి ఆణివార ఆస్థానం ద్వారా లెక్కలు నివేదించే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. -
దసరా మామూళ్లు ఇవ్వలేం.. గేటుకు బోర్డు
చౌటుప్పల్ రూరల్: దసరా మామూళ్లు ఇవ్వలేం.. అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ పరిధిలోని ఓ పరిశ్రమ యాజమాన్యం బోర్డు పెట్టింది. దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల కోసం గ్రామాల్లోని యువత చందాలు వసూలు చేస్తుంటారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన కిందిస్థాయి సిబ్బంది కూడా పరిశ్రమ వద్దకు వెళ్లి దసరా (dussehra) మామూళ్లు అడుగుతారు. అయితే, ఈ ఏడాది పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని, తాము ఎవరికీ దసరా చందాలు ఇవ్వలేమని పరిశ్రమ గేటుకు బోర్డు తగిలించారు. వైద్యానికి పడవ ప్రయాణమే..ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మల్యాల సమీపంలోని గొత్తికోయగూడెంలో (gutti koya gudem) శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. కొండాయి– దొడ్ల మధ్యలో వంతెన లేకపోవడం.. జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పడవలో ప్రయాణించాల్సి వచ్చింది. దొడ్లనుంచి నుంచి గొత్తి కోయగూడానికి రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లారు. గొత్తికోయగూడెంలో వైద్య శిబిరం నిర్వహించి, ఇంటింటికి తిరిగి జ్వరాల సర్వే (Fever Survey) చేశారు. మొత్తం 35 మందికి మందికి మందులు అందజేసి.. ఐదుగురికి రక్తపూతల పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కొండాయి వైద్యాధికారి డాక్టర్ ప్రణీత్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ భాస్కర్రావు, ఆశ వర్కర్లు జ్యోతి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థులతో బెంచీల తరలింపుట్రాక్టర్లో ప్రమాదకర ప్రయాణంజగిత్యాల రూరల్: విద్యార్థులతో ట్రాక్టర్లో ప్రమాదకర రీతిలో బెంచీలు తరలించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట పాఠశాలలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. పురాణిపేట పాఠశాల విద్యార్థులకు బెంచీలు అవసరం కాగా.. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది శుక్రవారం ట్రాక్టర్లో జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి బెంచీలు తీసుకొచ్చేందుకు వెళ్లారు. బెంచీలను విద్యార్థులతో ట్రాక్టర్లోకి మోయించారు. కాగా, విద్యార్థులు అదే ట్రాక్టర్లో ప్రమాదకర రీతిలో.. పొరండ్ల నుంచి పురాణిపేటకు ప్రయాణించడం చూసి పట్టణ ప్రజలు విద్యాశాఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చెరువులో దిగి.. విద్యుత్ సమస్య పరిష్కరించిఆలేరు రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక నుంచి పటేల్గూడెం వెళ్లే మార్గంలో మల్లన్న కుంట చెరువు వద్ద వ్యవసాయ బావులకు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్లో సాంకేతిక సమస్య వల్ల గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్.. ప్రాణాలకు తెగించి కుంటలోకి దిగి ఈదుకుంటూ వెళ్లి స్తంభం ఎక్కి విద్యుత్ లైన్ను సవరించాడు. శ్రీకాంత్ సాహసాన్ని గుర్తించిన భువనగిరి డివిజినల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు అతనికి ప్రశంసా పత్రం అందజేశారు.చదవండి: శ్రీపురం శ్రీమంతులు.. రూ. కోటితో ఆలయం పునరుద్ధరణముమ్మరంగా తిరుమాడ వీధుల పనులువరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించేందుకు చుట్టూ వెడల్పాటి మాడవీధులు, తొమ్మిది అంతస్తుల్లో నాలుగు రాజగోపురాలు నిర్మించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేయించారు. ఆలయం చుట్టూ ఉన్న స్థలం చదును పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండ -
Dussehra 2025 అమ్మవారి ప్రసాదాలు, రెసిపీలు
దుర్గామాత పూజలకు అన్నీ సిద్ధం అనుకునేలోపు నైవేద్యాల తయారీ ఎలా– అనే ఆందోళన తలెత్తడమూ సహజం... ఏమేం కావాలి, ఎలా రెడీ చేసుకోవాలో ముందే తెలుసుకుని, ఆచరణలో పెడితే అమ్మవారికి రుచిగా... శుచిగా నైవేద్యాలను సులువుగా సిద్ధం చేసుకోవచ్చు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఆ వివరాలు ఈ వారం వంటిల్లులో..పరమాన్నం కావలసినవి: పెసరపప్పు - 1/2 కప్పు; బియ్యం -3/4 కప్పు; పాలు -కప్పు; నీళ్లు - 4 కప్పులు; బెల్లం తరుగు- కప్పు; యాలకుల పొడి-అర టీ స్పూన్; నెయ్యి - 3 టేబుల్స్పూన్లు; జీడిపప్పు-పది పలుకులు; కిస్మిస్ – గుప్పెడు.తయారీ: ∙పప్పును దోరగా వేయించుకోవాలి ∙బియ్యం, పప్పు కలిసి కడగాలి. కుకర్లో కడిగిన బియ్యం, పప్పు, నీళ్లు కలిపి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దించాలి. మందపాటి గిన్నెలో బెల్లం తరుగు వేసి వేడిచేయాలి. దీంతో 3–4 నిమిషాల్లో బెల్లం పాకం సిద్ధం అవుతుంది.కుకర్ విజిల్ వచ్చాక మూత తీసి, అన్నం మెత్తగా స్పూన్తో మెదుపుకోవాలి. పాలు పోసి కలపాలి ∙ఫిల్టర్ పెట్టి, బెల్లం సిరప్ వడకట్టి, మెత్తగా అయిన అన్నంలో కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టౌపై పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. దీంట్లో యాలకుల పొడివేసి కలపాలి.విడిగా మరొక మూకుడులో నెయ్యి వేడి చేసి, దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు మిశ్రమంలో కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి.చదవండి: మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్అల్లం గారెలుకావలసినవి: మినప్పప్పు- కప్పు; ఉప్పు - 1/3 టీ స్పూన్ (తగినంత); వంట సోడా- చిటికెడు; పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూన్; అల్లం తరుగు – టేబుల్ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; మిరియాల పొడి - పావు టీ స్పూన్; నూనె-వేయించడానికి తగినంత.తయారీ: ∙మినప్పప్పు కడిగి, 3–4 గంటలసేపు నానబెట్టాలి. నీళ్లు వడకట్టి, ఉప్పు వేసి, మెత్తగా రుబ్బుకోవాలి ∙రుబ్బిన పిండిలో పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, మిరియాల పొడి, కరివేపాకు తరుగు వేసి కలపాలి. స్టౌ పై కడాయి పెట్టి, గారెలు వేయించడానికి తగినంత నూనె పోసి, వేడి చేయాలి ∙వేళ్లకు నీళ్లు తగిలేలా తడి చేసుకొని, పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, వేళ్లతోనే బాల్స్లా చేసుకోవాలి ∙నూనె రాసిన ΄్లాస్టిక్ షీట్పైన పిండి బాల్ను కొద్దిగా వేళ్లతో అదిమి, మధ్యలో హోల్ పెట్టాలి ∙తయారు చేసుకున్న దానిని కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు ఉంచి, బయటకు తీసి, ప్లేటులో పెట్టాలి. కదంబంకావలసినవి: బియ్యం-కప్పు; కందిపప్పు-అరకప్పు, చింతపండు నిమ్మ కాయంత; కూరగాయలు - బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, బెండకాయ, దొండకాయ, గాజర్, బఠానీ.. మొదలైనవి – 150 గ్రాములు (చిన్న ముక్కలు); పసుపు- పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; సాంబార్ పొడి – 2 టీ స్పూన్లు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీ స్పూన్; ఎండుమిర్చి – 2; ఇంగువ – చిటికెడు; నెయ్యి – బేటుల్ స్పూన్.తయారీ: కందిపప్పు బాగా ఉడికించి, మెత్తగా మెదిపి పక్కనుంచాలి. మరొక గిన్నెలో బియ్యం మెత్తగా ఉడికించి, వేరుగా ఉంచాలి ∙ఒక గిన్నెలో కూరగాయల ముక్కలు, చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.ఉడికిన కూరగాయ ముక్కల్లో సాంబార్ పొడి వేసి బాగా కలపాలి ∙మెత్తగా చేసిన పప్పు, అన్నం ఉడుకుతున్న కూరగాయల మిశ్రమంలో వేసి కలపాలి ∙ఒక చిన్నపాన్లో నూనె వేసి వేడి చేసి, ఆవాలు, జిలకర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసిన తాలింపును వేసి కలపాలి. గిన్నెలోకి తీసిన తర్వాత చివరగా నెయ్యి వేయాలి. – నారాయణమ్మ, మీ థాట్ హోమ్ డిలైట్ -
విజయవాడ : ముగిసిన దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)
-
అదిరే ఫ్యాషన్ లుక్ : దాండియా ధడక్
నవరాత్రులలో దాండియా ఆటలు గర్భా నృత్యాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేలా ఉంటాయి. ఈ ఆటపాటలలో పాల్గొనే వారు మరింత సౌకర్యంగా ఉండేలా చూపరులకు కనువిందు చేసేలా... ప్రత్యేక డ్రెస్సులూ ఉంటాయి. ముదురు రంగులు, అద్దాల మెరుపులు, ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు, ధోతీ ప్యాంట్స్కి ఆధునికపు హంగుల అమరిక ఈ రోజుల్లో ముచ్చట గొలుపుతుంటాయి. నవరాత్రి గర్భా, దాండియా రాత్రుల కోసం ట్రెండీ దుస్తుల ఆలోచనలు నవతరాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వైపుగా నడిపిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్తో అలంకరించిన రంగురంగుల చనియా చోళి దుస్తులను స్టైల్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.ధోతీ ప్యాంటుతో క్రాప్ టాప్ మిర్రర్,ఎంబ్రాయిడరీ చేసిన క్రాప్ టాప్, ధోతీ ప్యాంటు కలయిక కంఫర్ట్ స్టైల్తో ఆకట్టుకుంటుంది. దాండియా ఆడటానికి అనుకూలంగా ఉండే ఈ డ్రెస్ కాన్ఫిడెన్స్నూ ఇస్తుంది. ఫ్యాషన్ లుక్ కోసం ధోతీ ప్యాంటును కొత్త క్రాప్ టాప్తో తిరిగి వాడచ్చు.లెహెంగా అసెమెట్రికల్ కుర్తీఅసెమెట్రికల్ కుర్తీలు వేడుకలకు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఫ్లేర్డ్ లెహెంగాతో జత చేస్తే చూపుతిప్పుకోలేరు. ఒక డైనమిక్ ఎలిమెంట్ను జోడిస్తుంది. పండుగ సీజన్లో స్పెషల్ లుక్ కోరుకునేవారికిది బెస్ట్ ఆప్షన్. ప్యాంటుతో సైడ్ స్లిట్ కుర్తీసంప్రదాయ దుస్తులకు ఆధునిక టచ్ను ఇష్టపడే వారికి సైడ్ స్లిట్ కుర్తీ సరైన ఎంపిక. ఇది ప్లెయిన్, ఎంబ్రాయిడరీ లేదా బ్రోకేడ్ బోర్డర్లతో డిజైన్ చేసిన ప్యాంటుతో, లెహెంగా కాంబినేషన్గా ధరించవచ్చు.లెహెంగాతో మిర్రర్ డెనిమ్ షర్ట్ఇండో–వెస్ట్రన్ లుక్ కోసం లెహెంగాతో డెనిమ్ షర్ట్ను జత చేయచ్చు. ఈ ఇండో–వెస్ట్రన్ లుక్ వివిధ రకాల ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే వారికి సరైనది. క్లాసిక్ లెహెంగా, క్యాజువల్ డెనిమ్ షర్ట్ మరింత కంఫర్ట్గా ఉంటుంది, ఇది నవరాత్రుల్లో ప్రత్యేకంగా చూపుతుంది. సొంతంగా క్రియేషన్ పెద్ద పెద్ద జూకాలు, గాజులు, లేయర్డ్ నెక్లెస్లు.. జర్మన్ సిల్వర్ జ్యువెలరీని ఎంచుకోవచ్చు నృత్యం చేసే సమయం కాబట్టి వాటర్ ప్రూఫ్ మేకప్ను ఎంచుకుంటే లుక్ ఫ్రెష్గా ఉంటుంది. పెద్ద పెద్ద బిందీలు నవరాత్రి రోజులలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. పొడవాటి జడలు, వివిధ మోడల్స్లో ఉన్న ముడులు, వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ బాగుంటాయి. బోహో– ఫ్యూజన్ కాంబినేషన్లో డెనిమ్ డ్రెస్లు పగటి పూట కూడా ఈ రోజుల్లో క్యాజువల్గా ధరించవచ్చు. సంవత్సరాలుగా లెహంగాలు, ఘాగ్రాలు నవరాత్రి దుస్తులుగా ఉన్నాయి కాబట్టి స్కర్టులు, కుర్తీల నుండి లేయర్డ్ ఇండో–వెస్ట్రన్ గౌన్ల వరకు ఈ రోజుల్లో ప్రయత్నించవచ్చు. ∙రంగురంగుల టాసెల్స్, రాజస్థానీ ఎంబ్రాయిడరీ ప్యాచ్లు, మిర్రర్ వర్క్ ఉపయోగించి పండగ థీమ్ను క్రియేట్ చేయవచ్చు. నవరాత్రి స్పెషల్ డ్రెస్సులు దాదాపు రూ.1500/– నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. లేదంటే ఇంట్లోనే డిజైనరీ క్రాప్ టాప్, బ్లౌజ్ లేదా చిన్న కుర్తీతో జత చేయబడిన డెనిమ్ బాటమ్స్ ధరిస్తే డ్యాన్స్ చేసేవారికి తాజా, ఉల్లాసభరితమైన వైబ్ను జోడిస్తాయి. పండుగ అలంకరణ కోసం దుప్పట్టా లేదా బాందిని స్టోల్ లేదా టై–డై ప్రింట్లతో స్టైల్ చేయచ్చు. నవరాత్రి ఫ్యాషన్ అనేది వ్యక్తిగత వ్యక్తీకరణతో సంప్రదాయాన్ని కళ్లకు కట్టవచ్చు. వాటిని మార్కెట్లో కొనుగోలు చేసినా, సొంతంగా తమదైన స్టైల్ను క్రియేట్ చేసినా, బోహో–ఫ్యూజన్ డ్రెస్సులు డ్యాన్స్ ఫ్లోర్పై హంగామా చేస్తాయి. ఈ పండుగ సీజన్లో సాధారణంగా కాకుండా తమదైన సొంత సృజనాత్మకతను సరికొత్తగా పరిచయం చేయచ్చు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)
-
బతుకమ్మ, దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడువేల పైచీలుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను నడిపేందుకు సిద్ధం కాగా.. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది.ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ .. బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉంది. గత దసరా కంటే ఈ సారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. పోలీస్, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోంది.” అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. -
ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..!
గణపతి నవరాత్రలు ముగిసిన వెంటనే దేవి నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు, వాడ, గ్రామంలోని ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరంణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కాగా, ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం. చివరి రోజు విజయ దశమితో కలిపి పదకొండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే..ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి. ఇక చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం 11 రోజులు 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకొండు అలంకారాలు ఇవే..!.సెప్టెంబర్ 22 - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారంసెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రి దేవి అలకారంసెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంసెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారంసెప్టెంబర్ 26 - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారంసెప్టెంబర్ 27 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంసెప్టెంబర్ 28 - శ్రీ మహా చండీదేవి అలంకారంసెప్టెంబర్ 29 - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారంసెప్టెంబర్ 30 - శ్రీ దుర్గా దేవి అలంకారంఅక్టోబర్ 1 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంఅక్టోబర్ 2 - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంగమనిక: ఈ కథనంలో తెలియజేసిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)
-
అడవులన్నీ పైలంగా.. ఆపదలన్నీ దూరంగా..
‘అడవి పూల సింగారం.. చేను చెల్కల బంగారం పైలమే తల్లీ.. పైలమే బతుకమ్మా.. గునుగు పూలెయ్యాలో.. తంగెడు పూలెయ్యాలో.. ఊరూ.. అడవి.. ఆడీపాడంగా.. అడవులన్నీ పైలంగా.. ఆపదలన్నీ దూరంగా.. చప్పట్లే మిరిమిట్లవ్వంగా.. రావే చెల్లి.. రావే అక్క.. బతుకమ్మ ఆడగరావే.. ఉయ్యాలో.. ఉయ్యాలో.. బతుకు సుడిగుండం దాటి బరిగీసి నిలువగ రావే.. ఉయ్యాలో.. ఉయ్యాలా..’ఇలా సాగే బతుకమ్మ పాటతో బహుజన బతుకమ్మ సింగారించుకుంది. ఈ పాటను వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ అలియాస్ మిత్ర రాయగా.. ఆయన సతీమణి విమలక్క గానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిసరాల్లోనే చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్లో ఆదివారం బహుజన బతుకమ్మ పాటను ఆవిష్కరించారు. పన్నెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మ (Bahujana Bathukamma) ఆటాపాటలతో అలరించనుంది.ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని చాటుదాం ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం అంటూ..’ ప్రారంభమైన ఈ కార్యక్రమానికి 15 ఏళ్లు నిండుతున్నాయి. తెలంగాణ ప్రాంత మెట్టపంటలు అందివచ్చే కాలానికి పంటల పండుగలా (హార్వెస్ట్ ఫెస్టివల్) వస్తున్న బతుకమ్మను తెలంగాణ ప్రజలు వందల ఏళ్లుగా జరుపుకుంటున్నారు. ఈ సాంస్కృతిక ఉత్సవం మహత్తర తెలంగాణ (Telangana) సాయుధ పోరాటకాలంలోనూ, రైతాంగ పోరాటాలలోనూ, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో సాధనంగా మారిన అనుభవం ఉంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్తో మొదలైన బహుజన బతుకమ్మ, కులం, మతం అని తేడాలు లేకుండా, వనరుల విధ్వంసం జరగకుండా, ప్రత్యేకించి స్త్రీల సమానహక్కుల ప్రస్తావనతో సెక్యులర్ పండుగగా జరగాలని బహుజన బతుకమ్మ కృషి చేస్తుంది. ‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ’అనే నినాదంతో ఈ ఏడాది బహుజన బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలో చిత్రీకరణ బహుజన బతుకమ్మ పాటను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, గోపాల్రావుపల్లి, తాడూరు శివారుల్లో చిత్రీకరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క బృందం, జానపద కళాకారుడు వంతడ్పుల నాగరాజు పర్యవేక్షణలో ఈ పాట షూటింగ్ జరిగింది. ‘ప్రకృతి విధ్వంసమంటే.. ప్రజలపై యుద్ధమే.. శాంతి స్వావలంబన చాటుదామని ఈ ఏడాది ప్రజాబాహుళ్యంలోకి వెళ్లారు. గత 15 ఏళ్లుగా బహుజన బతుకమ్మను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వహిస్తోంది. కళాకారుల నృత్యాలు, ఆటపాటలతో గోపాల్రావుపల్లి, తాడూరు, తంగళ్లపల్లి పరిసరాల్లో సందడి చేశారు.పన్నెండు రోజులు పాటల పండుగే బహుజన బతుకమ్మ పాటల పండుగను రాష్ట్రమంతంటా నిర్వహించనున్నారు. తొలిరోజు సెప్టెంబర్ 20న గన్పార్క్లో 11 గంటలకు నివాళితో మొదలై.. 3 గంటలకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఆటపాటలతో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 21న సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, 22న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు, 23న వనపర్తి జిల్లా కొత్తకోట, 24న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రం, 25న ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు, 26న ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం పెద్దాపురంలో, 27న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేడుకలు నిర్వహించనున్నారు. చదవండి: గత చరిత్రకు సజీవ సాక్ష్యం.. అమ్మాపురం సంస్థానంసెప్టెంబర్ 28న ఉమ్మడి మెదక్ జిల్లా పెద్ద నిజాంపేట మండలం కల్వకుంట, 29న హైదరాబాద్లోని మల్లాపురం గోకుల్నగర్లో, 30న మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచెడ్, అక్టోబర్ 3న నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో బహుజన బతుకమ్మ వేడుకలు ముగియనున్నాయి.- సిరిసిల్ల


