emergency slide
-
జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం !
-
మా విమానాలు ఎప్పటికీ కూలిపోవు!
న్యూఢిల్లీ: మార్చి 8, 2014..239 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేషియన్ ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యమైంది. ఆ విమానం అదృశ్యం అయిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకూ తెలియకపోయినా.. ఆ మరుసటి నెల ఏప్రిల్ లో ఏయిర్ ఏషియా చేసిన ప్రకటన ఇప్పడు సర్వత్వా చర్చనీయాంశమైంది. తమ విమానాలు ఎప్పుడూ తప్పిపోవని ఏయిర్ ఏషియా గర్వంగా చెప్పుకుంది. తమ పైలెట్ ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకువస్తాడని.. తమ విమానాల్లో ప్రయాణించే వారు ఎటువంటి భయం లేదనేది ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన చేసి ఈ డిసెంబర్ కు సరిగ్గా ఎనిమిది నెలలు. అయితే ఇప్పుడు అదే సంస్థకు చెందిన విమానం అదృశ్యం అయిన ఘటన విషాదం నింపింది. ఆదివారం మలేసియా విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి నిన్న ఉదయం సింగపూర్కు బయల్దేరిన మలేసియాకు చెందిన ఎయిర్ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్బస్(ఏ320-200) విమానానికి అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు వరకూ ఇండోనేషియా దేశస్థులు ఉన్నారు. ఇప్పటికే మలేసియాకు చెందిన మూడు విమానాలు, మూడు నౌకలు సోమవారం ఉదయం నుంచి గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొని ఆ విమానం ఆచూకీ కోసం ముమ్మరం గాలింపు చేపట్టారు. -
జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం !
రెండు రోజుల క్రితం తప్పిపోయిన ఎయిర్ ఏషియా విమానం శకలాలు జావా సముద్రంలో కనిపించాయి. బోర్నియో ద్వీపం వద్ద విమనం తలుపులు, స్లైడ్, ఇతర పరికరాలు కనిపించినట్లు ఇండోనేసియా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 162 మందితో వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం తలుపు ఒకటి కనిపించినట్లు ఇండోనేషియా టీవీ చానళ్లు తొలుత చెప్పాయి. మెట్రో టీవీ, కొంపాస్ టీవీలు తాము చూసినట్లు చెబుతున్న ఎమర్జెన్సీ స్లైడ్ ఫొటోలను ప్రసారం చేశాయి. ఈ తలుపు, స్లైడ్ సముద్రపు నీటిలో తేలియాడుతున్నాయి. అచ్చం ఎమర్జెన్సీ స్లైడ్, విమానం తలుపులాగే కనపడుతున్న వస్తువులు గాలింపు సందర్భంగా కనిపించినట్లు ఇండోనేషియా వైమానిక దళాధికారి ఆగస్ డ్వి పుట్రాంటో తెలిపారు. తర్వాత ఈ విషయాన్ని ఇండోనేసియా సర్కారు కూడా నిర్ధారించింది. మొత్తం పది పెద్ద వస్తువులు తమకు కనిపించాయని, వాటితో పాటే చాలా చిన్న వస్తువులు కూడా ఉన్నాయని, కొన్ని తెల్లటి వస్తువులున్నా, వాటిని ఫొటోలు తీయలేకపోయామని పుట్రాంటో అన్నారు. విమానం రాడార్ పరిధి నుంచి తప్పిపోయిన ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఈ వస్తువులు కనిపించడం గమనార్హం.