encounter in Odisha
-
బెజ్జింగివాడ అడవుల్లో ఎన్కౌంటర్
-
బెజ్జింగివాడ అడవుల్లో ఎదురు కాల్పులు
-
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
మల్కాన్గిరి: ఒడిశాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మల్కాన్గిరి జిల్లా బెజ్జింగివాడ అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పులతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అళ్లూరుకోట, సన్యాసిగూడ గ్రామాల మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులు కలిమెల ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు. కీలక నేత రణ్ దేవ్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను గుర్తించినట్టు సమాచారం. గాయపడిన మావోయిస్టులు ఎవరైనా ఉన్నారేమోనన్న ఉద్దేశంతో చుట్టపక్కల ప్రాంతాల్లో రక్షణ బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. -
ఒడిశాలో ఎన్కౌంటర్, 14మంది నక్సల్స్ మృతి
-
ఒడిశాలో ఎన్కౌంటర్, 14మంది నక్సల్స్ మృతి
మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మల్కన్గిరి జిల్లా కొడియా, కోరాపూట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 14మంది మృతి చెందారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మల్కన్ గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఏవోబీ ప్రాంతంలో బాగా బలంగా ఉన్న మావోయిస్టులకు ఇదే అతి పెద్ద ఎదురుదెబ్బ. మావోయిస్టులు సమావేశం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఘటనా ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. గత నెలలో కూడా ఒడిశాలో తొమ్మిదిమంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు నారాయణపూర్ లో ఓ మహిళా మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.