-
స్వదేశానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.! పాకిస్థాన్ కొత్త చట్టం..
పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మళ్లీ తన సొంత దేశానికి రావడానికి మార్గం సుగమం అయింది! చట్టసభ్యుల అనర్హతపై కాలపరిమితిని నిర్ణయిస్తూ పాక్ కేంద్ర అసెంబ్లీ చట్టం తీసుకువచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ మేరకు చట్టం తీసుకురావడం గమనార్హం. చట్ట సభ్యులపై ఐదేళ్లకు మించి అనర్హత వేటు వేయడానికి అవకాశం లేనివిధంగా చట్టాన్ని సవరించినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ సవరణపై తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధికీ సంజ్రాణి సంతకం కూడా చేసి ఆమోదించినట్లు స్పష్టం చేశారు. అయితే.. హజ్ యాత్రలో ఉన్న అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ లేని సమయంలో ఈ చట్టం తీసుకురావడం గమనార్హం. ఇదీ చదవండి: హజ్యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే.. బ్రిటన్లో నవాజ్ షరీఫ్.. అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే.. 2019లో ఆరోగ్య రీత్యా బెయిల్పై విడుదలయిన నవాజ్ షరీఫ్.. బ్రిటన్కు పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. పాక్ రాజకీయాలను బ్రిటన్ నుంచే తెరవెనక ఉండి శాసిస్తున్నాడని కొందరు విశ్వసిస్తారు. మళ్లీ రాజకీయాల్లోకి.. గతేడాది విశ్వాస పరీక్షలో ఓడి ఇమ్రాన్ ఖాన్ పదవీత్యుడయ్యాక.. నవాజ్ షరీఫ్ సోదరుడు సెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్లో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని, తన సోదరున్ని స్వదేశానికి తీసుకురావాలని సెహబాజ్ ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించాడు. నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలని అధికార PML-N పార్టీ కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్ రాజకీయంలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నవాజ్ పాక్ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్ షరీఫ్ -
బుష్ Vs ట్రంప్: ప్రవాసం నుంచి పోరాటంలోకి
వాషింగ్టన్: సొంత శిబిరరమే శత్రువుగా భావిస్తోన్న డోనాల్డ్ ట్రంప్ నానాటికీ బలం పుంజుకుంటున్నాడు. అతని ప్రచండ వేగానికి తాళలేక రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసు నుంచి ఒక్కొక్కరు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటితే ట్రంప్ నే తమ అభ్యర్థిగా ప్రకటించాల్సిన పరిస్థితి. అలా జరగకూడదంటే ట్రంప్ పై బ్రహ్మాస్త్రాన్ని సంధించాలి. తద్వారా అస్మదీయులను ఆదుకోవాలి. ఆ తరుపుముక్క మరెవరోకాదు యూఎస్ మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్. ఏడేళ్లుగా తనకుతాను విధించుకున్న ప్రవాసం నుంచి నిన్ననే బయటికి వచ్చిన జార్జ్ బుష్.. ట్రంప్ పై పోరాటానికి సిద్ధమయ్యారు. రిపబ్లికన్ సెనెటర్ల కోసం నిధుల సేకరణకు నడుం కట్టారు. రిపబ్లికన్ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. పలు అంశాల్లో విద్వేషపూరితంగా వ్యవహరించే ట్రంప్ ను తన అభ్యర్థిగా అంగీకరించేదిలేదని తేల్చిచెప్పిన పార్టీ.. అసలు ఎన్నికల్లో ట్రంప్ కు అడ్డుకట్టవేసేలా ప్రణాలికలు రచిస్తోంది. దశాబ్ధాలుగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బుష్ కుటుంబాన్ని, వారి పలుకుబడిని ఉపయోగించుకోవడం ద్వారా సెనెటర్లకు నిధులు సమకూర్చుకోవాలనుకుంటోంది. ఆ క్రమంలోనే తిరిగి పార్టీకోసం పనిచేయాలంటూ జార్జ్ బుష్ ను కొందరు సీనియర్ నేతలు సంప్రదించారు. రెండు దఫాలు అధ్యక్షుడిగా పనిచేసి, గడిచిన ఏడు సంవత్సరాలుగా ప్రవాసంలో గడుపుతున్న బుష్.. ఎట్టకేలకు పార్టీ అభ్యర్థనను మన్నిచారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సరేనన్నారు. 100మంది సభ్యుల అమెరికా సెనేట్ లో ప్రస్తుతం రిపబ్లికన్ల సంఖ్య 54. వీరిలో అత్యధికులు బలపరిచే వ్యక్తే రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అవుతాడు. అలా జరగొద్దంటే పార్టీ పెద్దలు సెనెటర్లను ట్రంప్ బారి నుంచి కాపాడుకోవాలి. వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించడం ద్వారా సెనెటర్లు ట్రంప్ వైపునకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. మాజీ అధ్యక్షుడిగా బుష్ తనకున్న పరిచయాల ద్వారా సెనెటర్ల కోసం నిధులు సేకరిస్తారు. ఆరిజోనా సెనెటర్ జాన్ మెక్ కెయిన్, న్యూ హాంప్ షైర్, ఒహియో, విస్కాన్సిస్, మిస్సౌరీల సెనెటర్లు కెల్లీ అయోట్, రాబ్ పోర్ట్ మెన్, ర్యాన్ జాన్సన్, రాయ్ బ్లంట్ ల తరఫున బుష్ ఫండ్ రైజింగ్ కార్యక్రమ షెడ్యూల్ కూడా ఖరారయినట్లు సమాచారం. కాగా, ట్రంప్.. తనకు వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్రలను ఖండించారు. అభ్యర్థి ఎవరైనాసరే, ఎన్నికల్లో సహకరిస్తానని బుష్ గతంలో మాటిచ్చారని, ఇప్పుడా వాగ్ధానాన్ని భంగం చేస్తున్నారని విమర్శించారు. కండోలిజా రైస్ కు కీలక పదవి? జార్జి బుష్ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన కండోలిజా రైస్ ను ఉపాధ్యక్షురాలిగా ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్ అయితే రైస్ వైస్ ప్రెసిడెంట్ కావడం ఖాయమని వైట్ హౌస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తోన్న రైస్ మాత్రం.. తనకు ఉపాధ్యక్ష పదవి చేపట్టే ఆసక్తి లేదని, పాఠాలు చెప్పడంలోనే ఆనందం ఉందని పేర్కొన్నారు. -
సిరియా సమస్యలు, పౌరజీవనం పైనే దృష్టి..
అంతర్యుద్ధంతో రగిలిపోయిన సిరియాలోని విశేషాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి అందించిన ప్రవాస మీడియా సంస్థలు ఇప్పుడు మెల్లగా టర్కీ చేరుకుంటున్నాయి. యుద్ధ వాతావరణం, స్థానిక ప్రజల జీవన స్థితిగతులపై ప్రత్యక్ష ప్రసారాలు చూపించిన పాత్రికేయులు ఇకపై స్థానిక సమస్యలపైనే దృష్టి సారించేందుకు సిద్ధమౌతున్నారు. దీంతో ఇప్పటిదాకా సిరియా నుంచి పుష్కలంగా బయటకు వచ్చే అన్నిరకాల వార్తలు ఇక తగ్గే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తలపై ఇకమీద తాము ఆసక్తి చూపేది లేదని, సగటు పౌరజీవనం, ఆహార లోపం, స్థానిక సమస్యల వంటివాటిపైనే దృష్టి సారిస్తామని ఆయా వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లావంత్' (ISIL) కవరేజ్ లో ఎక్కువశాతం వలసలు, అంతర్జాతీయ, ప్రాంతీయ విశేషాలతోపాటు, సిరియా యుద్ధం, ఇతర దేశాలపై దాని ప్రభావం వంటి అనేక విషయాలను మీడియా సంస్థలు ప్రధానంగా వెలువరించేవి. అయితే ఇకపై సిరియన్ అంతర్యుద్ధం సృష్టించిన ఘోర సంక్షోభంపై దృష్టి సారించనున్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న దేశ పరిస్థితిని, స్థానిక సమస్యలను ప్రతిబింబించేందుకు పాత్రికేయులు సన్నద్ధమౌతున్నారు. సిరియా ప్రజల తిరుగుబాటుతో ఏం జరిగిందో... కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలనుకుంటున్నారు. సిరియాలో ఉదయం ప్రసారాల్లో ప్రజలకు పనికొచ్చే తాజా సమాచారాన్ని అందించనున్నారు. అందులో భాగంగా యుద్ధ వాతావరణం నుంచి బయటపడుతూ ఇక్కట్లు పడుతున్న జనానికి ధరలు, అందుబాటులో దొరికే పదార్థాలు, వస్తువుల గుచించి ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రాత్రిళ్లు.. సాధారణ విషయాలతో పాటు దాడుల్లో మరణించిన పిల్లలు, ప్రజల వివరాలను కూడా చెబుతున్నారు. కొన్నాళ్లుగా సిరియా అంతర్యుద్ధాన్ని ప్రత్యక్షంగా చిత్రిస్తూ... ఐఎస్ఐఎల్లో కఠిన జీవితాన్ని ఎదుర్కొన్న కొన్ని సిరియన్ మీడియా సంస్థలు ఇప్పుడు దక్షిణ టర్కీలోని గేసియెంట్స్, సాన్ లోర్ఫా పట్టణాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటుచేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటిదాకా సిరియా నుంచి ప్రపంచానికి వార్తలను తెలియజేసిన పాత్రికేయులు... ఇకపై ప్రపంచంలోని విషయాలను సిరియన్లుకు అందించేందుకు కృషి చేస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
ప్రజలకు తాటిపర్తి కృతజ్ఞతలు
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement