Faizan
-
స్పెల్లింగ్ బీ విజేత హైదరాబాదీ
ఓక్సన్ హిల్ (అమెరికా): హైదరాబాద్కు చెందిన ఫైజన్ జకీ అనే 13 ఏళ్ల బాలుడు అమెరికా జాతీయ స్పెల్లింగ్ బీ (Spelling Bee) చాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో జకీతో పోటీపడ్డ మరో ఇద్దరు చిన్నారులు సర్వజ్ఞ కదం, సర్వ్ ధరవనెవి కూడా భారత మూలాలే కావడం విశేషం. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో వారిద్దరినీ జకీ అలవోకగా ఓడించాడు. తద్వారా గతేడాది వెంట్రుకవాసిలో తప్పిపోయిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ చాంపియన్షిప్ను ఈసారి సగర్వంగా సాధించాడు. రెండో స్థానంలో నిలిచిన 14 ఏళ్ల కదం కాలిఫోర్నియావాసి. కాగా మూడో స్థానంలో నిలిచిన సర్వ్ వయసు కేవలం 11 ఏళ్లే.జార్జియాకు చెందిన అతనికి మరో మూడేళ్లు పోటీల్లో పాల్గొనే అవకాశముంది. అత్యంత కఠినమైన, ప్రతిష్టాత్మకమైన స్పెల్లింగ్ బీ పోటీలకు ఇది 100వ ఏడాది కావడం విశేషం. ఈసారి పోటీ 21 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగింది. 18వ రౌండ్లోనే జకీకి గెలిచేందుకు సువర్ణావకాశం వచ్చిది. కదం, సర్వ్ వరుసగా రెండు స్పెలింగులు తప్పు చెప్పారు. కానీ జకీ కూడా తనకిచ్చిన పదం తాలూకు వివరణ కూడా వినకుండానే బదులిచ్చేందుకు తొందరపడ్డాడు. కానీ తొలి అక్షరమే తప్పుగా చెప్పాడు. అయినా నిరాశ పడకుండా మరో మూడు రౌండ్ల తర్వాత ‘ఎక్లెయిర్సిస్మెంట్’ పదం స్పెలింగ్ సరిగా చెప్పడం ద్వారా విజయపతాక ఎగురవేశాడు. ఆ వెంటనే ఆనందం పట్టలేక వేదికపై కుప్పకూలిపోయాడు.‘‘గెలుస్తానని అనుకోలేదు. ఈ అనూభూతిని వర్ణించేందుకు మాటల్లేవు’’ అంటూ సంబరపడిపోయాడు. జకీ కొంతకాలంగా ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు. దాంతో ఫ్రెంచ్ మూలాలున్న ‘ఎక్లెయిర్సిస్మెంట్’ స్పెల్లింగ్ చెప్పడం సులువుగా మారింది. ప్రైజ్మనీ (Prize Money) కింద అతనికి 50 వేల డాలర్లు (దాదాపు రూ.42 లక్షలు) లభించాయి. అందులో అధిక మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని జకీ ప్రకటించాడు. ఈసారి తుది రౌండ్లకు అర్హత సాధించిన చిన్నారుల్లో మరో నలుగురు భారతీయులుండటం విశేషం. గతేడాది రన్నరప్ స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొనడం జకీకి ఇది నాలుగోసారి. ఇందుకోసం ఏడేళ్ల వయసు నుంచే కఠోరంగా సాధన చేస్తూ వచ్చాడు. 2019లో ఏడేళ్ల వయసులోనే తొలిసారి పోటీల్లో పాల్గొన్నా 370వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2023లో రెండోసారి సెమీస్ దాకా చేరి 21వ స్థానంలో నిలిచాడు. 2024లో మాత్రం ఒక్క స్పెల్లింగ్ కూడా తప్పు చెప్పకుండా ఫైనల్ రౌండ్ దాకా దూసుకెళ్లాడు. అక్కడ తాను సాధన చేయని లైటెనింగ్ రౌండ్ ఎదురైంది. అయినా హోరాహోరీ తలపడి టై బ్రేకర్ దాకా తీసుకెళ్లినా చివరికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.చదవండి: మిస్ యూఎస్ఏ తెలుగు టాలెంటెడ్గా పోలవరం యువతిఅతనిపై నెగ్గిన బృహత్ సోమవి కూడా భారత మూలాలే. ఈసారి టైటిల్ సాధనలో జకీకి అతను అండదండగా నిలిచాడు. జకీ కుటుంబం టెక్సాస్లో డాలస్లోని అలెన్లో నివసిస్తోంది. స్థానిక సీఎం రైస్ మిడిల్ స్కూల్లో అతను సెవెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు. ‘‘మావాడు రెండేళ్లకే చదవడం మొదలు పెట్టాడు. చూస్తుండగానే ఇంగ్లిష్ డిక్షనరీ మొత్తాన్నీ బట్టీ పట్టేశాడు’’ అని జకీ తల్లిదండ్రులు అర్షియా, అన్వర్ ఆనందంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడిక మ్యాథ్స్ ఒలింపియాడ్ (maths olympiad) తన తదుపరి లక్ష్యమని వివరించారు. జకీ తాత, నానమ్మ కూడా హైదరాబాద్ (Hyderabad) నుంచి ఫైనల్ను ఆసాంతం వీక్షించారు. మనోళ్లదే హవా అమెరికా జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో ఏళ్ల తరబడి భారత సంతతి బాలలే ఆధిపత్యం చలాయిస్తున్నారు. గత 36 పోటీల్లో ఏకంగా 30 సార్లు విజేతలుగా నిలిచి సత్తా చాటారు. -
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్స్టేషన్కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్లోని మిస్రోడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్లోని మిస్రోడ్ పోలీస్స్టేషన్కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
కారులో కణతపై కాల్చుకొన్న ఫైజన్ మృతి
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై నిన్న ఆత్మహత్యకు యత్నించిన యువ వ్యాపారి ఫైజన్ అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కణతపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించిన అతడిని పోలీసులు గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పాయింట్ బ్లాక్లో గన్ ఫైర్ కావడంతో బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయింది. కోమాలోకి వెళ్లిపోయన ఫైజన్ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చదవండి: కారులో కణతపై కాల్చుకొని... ఉస్మానియా మార్చరీకి మృతదేహం మరోవైపు ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఆత్మహత్యకు ఫైజన్ వినియోగించిన నాటు తుపాకీని పోలీసులు అక్రమ ఆయుధంగా నిర్ధారించారు. దీంతో ఆయుధచట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా నార్సింగ్ ఇన్స్పెక్టర్ రమణ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతోనే ఫైజల్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. మృతుడు రూ.2కోట్ల 50 లక్షల బాకీ ఉన్నట్లు నిన్న నలుగురు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
ఫోన్లో తలాక్ చెప్పి.. భార్య మేనకోడలితో పరార్
భోపాల్: మెసేజ్లు, వాట్సప్ ద్వారా భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పేసి విడాకులు ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ఓ యువకుడు ఫోన్ ద్వారా భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పి.. మైనర్ అయిన భార్య మేనకోడలితో లేచిపోయాడు. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. భోపాల్కు చెందిన ఫైజాన్ అనే యువకుడు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మేనకోడలి (14)తో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ భోపాల్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫైజాన్ తన భార్య మేనకోడలితో కలసి కాన్పూర్ వెళ్లాడు. ఫైజాన్ భార్య కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాన్పూర్ వెళ్లేముందు ఫైజాన్ అక్కడ ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరాడు. కాగా కాన్పూర్ వెళ్లాక స్నేహితుడి ఫోన్ స్విచాఫ్ రావడంతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. పెట్రోలింగ్ చేస్తున్న రైల్వే పోలీసులు.. అనుమానాస్పదంగా కనిపించిన పైజాన్, మైనర్ బాలికను కస్టడీలోకి తీసుకుని విచారించారు. భోపాల్ పోలీసులకు సమాచారం అందించి, వారిద్దరినీ భోపాల్ పంపించారు. ఫైజాన్ భార్యను ఒప్పించి, తనను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని, కాన్పూర్ వెళ్లాక ఫోన్లో విడాకులు ఇస్తున్నట్టు భార్యకు చెప్పాడని మైనర్ బాలిక పోలీసుల విచారణలో చెప్పింది. ఫైజాన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో అతని భార్యను కూడా విచారిస్తామని చెప్పారు.