Fecelities
-
అవస్థల బడి
నాలుగు చినుకులు పడగానే కురిసే పై ఫొటోలోని ఈ పాఠశాల నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో ఉంది. ఈ ప్రాథమిక పాఠశాలలో 81 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు.. ఒక హెచ్ఎం ఉన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతం. కాళోజీసెంటర్: అందరికీ విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాని కి అవాంతరాలు తప్పడం లేదు. ఉపాధ్యాయులకు కొరతకు తోడు పలు చోట్ల మౌలిక వసతులు వేధిస్తుండడంతో సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండానే ఈ విద్యా సంవత్సరం సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 460 ఉండగా 15,972 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలు 83 లో 4,422 మంది విద్యార్థులు, హైస్కూల్ పాఠశాలలు 153లో 21,727 మంది, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు 12, మోడల్ స్కూల్స్6, ఇవ్వే కాకుండా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 8, ఎస్టీ గురుకులాలు 2, మొత్తం 724 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో45,275 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 2,988 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పినపటికీ క్షేత్రస్థాయిలో అమలు కాక ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, మరుగుదొడ్లు మద్యాహ్న భోజనం కోసం వంట గదులు లేని పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఏటా ఎమ్మార్సీ సమావేశంలో సమస్యలను గుర్తించి నివేదికలు అడుగుతున్నారే తప్ప సమస్యలను పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నా యి. అతేకాకుండా కొన్ని పాఠశాలల భవనాలు శిధిలావస్థల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం కోసం చర్యలు తీసుకోన్నప్పటికీ నత్తనడకన పనులు సాగుతున్నాయి. 36 పాఠశాలలు మూత రూరల్ జిల్లా పరిధిలో 460 ప్రాథమిక పాఠశాలలు ఉండగా విద్యార్థులు లేక గత ఏడాదే 36 పాఠశాలలు మూతపడ్డాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల తల్లీదండ్రుల ఆలోచన మారుతున్నది. తమబిడ్డల చదువులో ఉత్తమశ్రేణిలో మార్కులు సాధించాలని, ఇంగ్లిష్లో మాట్లాడాలని కళలు కంటున్నారు. అదే స్థాయిలో గ్రామీ ణ పాంతాల్లో కార్పొరేట్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడి యం లేక ఉత్తమ ఫలితాలు రాక ప్రైవేట్ బడుల వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయనే విమర్శలు వçస్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలు మరిచి.. ఉద్యోగం చేసే చోటనే ఉండాలనే నిబంధనలకు విరుద్ధంగా పట్టణాల నుంచి బస్సుల్లో ప్రయాణం చేయడం మూలంగా పాఠశాలకు సమయానికి హాజరు కావడం లేదని స్థానిక ప్రజల నుంచి విమర్శలు లేకపోలేదు. అంతే కాకుండా సాయంత్రం సమయం కంటే ముందే తిరుగు ప్రయాణం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంత మంది టీచర్లు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉద్యోగ బాధ్యతలను విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారై బడులు మూతపడుతున్నాయని పలు గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషిచేస్తున్నాం. 60 పాఠశాలలు టెన్త్ క్లాస్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. గత సంవత్సరం 88.75 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈ సంవత్సరం 95.87 శాతం సాధించాం. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం. – పెగడ రాజీవ్, ఇన్చార్జి డీఈఓ -
ఖైదీలకు రాచమర్యాదలు
– చేయితడిపితే మందు, మాంసం,సెల్ఫోన్ – ముడుపులివ్వందే ములాఖాత్బి నై.. – భువనగిరి సబ్జైలులో నిబంధనలకు తూట్లు – ఆగస్టు 14 వివాదమే కొంపముంచిందా ఆ జైలులో అధికారుల చేయి తడిపితే చాలు.. రిమాండ్ ఖైదీలకు మద్యం, మాంసం, బిర్యాని,సెల్ఫోన్తో పాటు రాచమర్యాదలు లభిస్తాయి.. పలుకుబడి కలిగిన రిమాండ్ ఖైదీలు జైలుకు వచ్చారంటే చాలు అధికారి నుంచి సిబ్బంది వరకు పండగే..నిబంధనలకు తూట్లు పొడిచి సదరు అధికారులు వారికి సేవలందిస్తూ తరించిపోతున్నారు.. భువనగిరి సబ్ జైలులో కొంతకాలంగా సాగుతున్న ఈ తతంగం ఉన్నతాధికారులకు పొక్కడంతో బట్టబయలైంది. – భువనగిరి అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్నట్టు తయారైంది.. భువనగిరి సబ్జైలులో పరిస్థితి. నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగించేందుకు పాటు పడాల్సిన అధికారులే ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి కాసులకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు బహిరంగగానే వినిపిస్తున్నాయి. సిబ్బంది అవినీతి అక్రమాలతో కొందరు ఖైదీలకు రాచమర్యాదలు లభిస్తున్నాయని తెలుస్తోంది. వారిచ్చే డబ్బులకోసం నిబంధనలను తుంగలో తొక్కి చికెన్, మటన్ బిర్యానీలు,మద్యం సరఫరా చేయడంతో పాటు వారు కోరినంత సేపు సెల్ఫోన్ మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నారని సమాచారం. దీంతోపాటు ఖైదీలు వచ్చినా పోయినా సిబ్బంది చేతులు తడపాల్సిందే. అధికారుల విచారణతో.. ఇటీవల ఆలేరు ప్రాంతానికి చెందిన కిషోర్ ఓ కేసులో భువనగిరి సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కిషోర్ విడుదలయ్యేటప్పుడు ఇద్దరు జైలు వార్డర్లు అతడి వద్ద రూ. వెయ్యి వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించగా ఆరోపణలు నిజమని తేలాయి. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో పాటు ఇద్దరు వార్డర్లు నవీన్, కిరణ్కుమార్పై బదిలీ వేటు వేశారు. అయితే ఈ విషయంలో తనకేమీ సంబంధం లేదని, అకారణంగా తనను బదిలీ చేశారని, జైళ్ల శాఖలో బాసిజం,ృవేధింపులు పెరిగాయని లేఖ రాసి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. అయితే ఆయన ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షం కావడంతో అధిృ>రులు ఊపిరిపీల్చుకున్నారు. వివాదం బయటపడడంతో.. భువనగిరి సబ్ జైలులో పలుకుబడి కలిగిన వ్యక్తులను మహారాజుల్లా చూసుకుంటారని తెలుస్తోంది. అందుకు ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలే నిదర్శనం. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతని అనుచరులు కొందరిని భువనగిరి సబ్ జైలుకు తరలించారు. జైలులో ఉన్న నిందితులకు సకల సౌకర్యాలతో రాచమర్యాదలను జైలు సిబ్బంది సమకూర్చారని సమాచారం. వారికి హోటళ్ల నుంచి భోజనం అనుమతించారు. దీంతో పాటు సెల్ఫోన్ మాట్లాడుకోవడానికి అనుమతి ఇవ్వడంతో వివాదం అయ్యింది. అగస్టు 14 వ తేదీన సెల్ఫోన్ వివాదం ఉన్నతాధికారులకు చేరింది. దీంతో ఖైదీలను వెంటనే నల్లగొండ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా కొంత కాలంగా జరుగుతున్న వ్యవహారం బహిరంగ రహస్యమే అయినప్పటికీ తాజావివాదాలతో బయటపడింది. సీసీ కెమెరాలున్నా.. జైలులో సీసీ కెమెరాలు ఉన్నా అవి జైలు అవరణలో మొత్తంగా లేవు. దీంతో సిబ్బంది సహకారంతో పలుకుబడి కలిగిన ఖైదీలకు అన్ని వసతులను సమకూరుస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంటారని సమాచారం. ఖైదీలను పరామర్శించడానికి వచ్చేవారి నుంచి ముడుపులు లేనిదే ములాఖాత్కు కూడా అనుమతి లభించదని విమర్శలు లేకపోలేదు. విచారణలో బయటపడినందునే.. – ఆకుల నర్సింహ, జైళ్లశాఖ ఇన్చార్జ్ ఐజీ భువనగిరి సబ్ జైలులో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదు అందాయి. ప్రాథమిక విచారణలో ఆరోపణలు రుజువుకావడంతోనే జైలు సూపరింటెండెంట్, ఇద్దరు వార్డర్లపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బదిలీ వేటు వేశాం. సబ్ జైలులో ఖైదీలకు సెల్ఫోన్ను అనుమతించ వద్దు. కొందరు సెల్ఫోన్ వాడినట్లు మా దృష్టికి వచ్చింది. వారందరినీ వెంటనే ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించాం.అవినీతిలేని జైళ్ల కోసం చర్యలు తీసుకుంటున్నాం.