Financial Expert
-
బంగారం పెరిగినా డాలరుకు ప్రాధాన్యం తగ్గదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగితే డాలరు ప్రాధాన్యం కోల్పోతుందనుకోవడం సరైన అంచనా కాకపోవచ్చని ఆర్థిక నిపుణుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తెలిపారు. డాలరు మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం ధర పెరుగుతుందని, ఈ కారణంతో డాలరు పని ఇక అయిపోయిందనే పుకార్లు వినిపిస్తుంటాయని పేర్కొన్నారు. కానీ బలహీనపడిన ప్రతీసారీ అది పుంజుకుంటూనే ఉందని తెలిపారు. అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఆ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, డాలరుకు ఉన్న ప్రాధాన్యతకు సవాళ్లు ఎదురైనా తాత్కాలికమేనని 75 ఏళ్ల చరిత్ర చెబుతోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరిగేందుకు, ధర ఎగబాకేందుకు అవకాశాలున్నాయి గానీ డాలరు పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థికవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
అయితే జనవరి.. లేదంటే ఏప్రిల్
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే జనవరికల్లా దేశంలో కరోనా ప్రభావం పూర్తిస్థాయిలో తగ్గిన పక్షంలో ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. అ ప్పటికీ తగ్గకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆ ర్థికరంగం క్రమంగా కోలుకునే అవకాశాలున్నా’ యని ఆర్థిక నిపుణుడు తిరుపతిరెడ్డి భీముని చె ప్పారు. కీలక రంగాలపై మరో ఆరేడు నెలల దాకా కరోనా ప్రభావం ఉంటుందని విశ్లేషించా రు. దీని నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఇప్పటి వరకు ఉన్న ‘సేవింగ్స్’ను వివిధ వర్గాల ప్రజలు జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించా రు. డిసెంబర్ చివరిదాకా వేచిచూసి, జనవరి నుంచి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నెమ్మదిగా మొదలుపెట్టొచ్చని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ చూపిన చొరవ, స్ఫూర్తి, ఆత్మస్థైర్యం, దేశంలో ఉన్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టేం దుకు విదేశాలు ఆసక్తి చూపొచ్చన్నారు. కరోనా ప్రభావం ఏయే రంగాలపై, ఏ మేరకు పడుతుందనే దానిపై వివరాలు ఆయన మాటల్లోనే.. 18 నుంచి 22% ఉద్యోగాల్లో కోత ► దేశంలోని జాబ్ మార్కెట్లో 18 నుంచి 22 శాతం ఉద్యోగాల్లో కోత పడవచ్చు. ► చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కొన్ని మూతపడే అవకాశ ముంది. ఈ రంగాల్లో 28 –33% వరకు నిరుద్యోగం పెరగవచ్చు. ► రిటైల్ ఇండస్ట్రీలో నిత్యావసర వస్తువులు మి నహా రిటైల్ రంగాలు కోలుకునేందుకు కొం త సమయం పట్టొచ్చు. కరోనా, లాక్డౌన్ ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడింది. ఈ రంగాలపై ప్రభావం అధికం.. ఆతిథ్య రంగం: పర్యాటకం, హోటళ్లు, అనుబం ధ రంగాలతో ముడిపడిన ఆతిథ్యరంగం 40 – 50 శాతం దాకా నష్టపోవచ్చు. దేశంలో జనవరి –జూన్ మధ్య అధికశాతం ప్రజలు ప్లెజర్ట్రిæప్లు, విదేశీయానాలు, టూర్లకు వెళుతుంటారు. పెళ్లి ళ్లు, ఇతర సోషల్ గ్యాథరింగ్స్ నిలిచిపోవడంతో ఈ రంగం తీవ్రంగా నష్టపోనుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాలు: ప్ర స్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు కొనే వారుండ రు. నగర శివారు ప్రాంతాల్లో ఓ పెన్ ప్లాట్లకి డిమాండ్ 20–30% తగ్గొచ్చు. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశా లు తక్కువే. ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఆటోమొబైల్ రంగం: కరోనాకు ముందే ఈ రం గం కొంత ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుత పరిణా మాలతో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో ముడిసరుకులు చైనా నుంచి 35 శాతం దిగుమతి అవుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయి. సినిమా, టీవీ రంగాలు: సినిమాలు విడుదల కా క, టీవీ సీరియళ్ల షూటింగ్స్ జరగక కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు ఈ రంగం నష్టాలు చ విచూసే అవకాశాలున్నాయి. వీటిపై ప్రత్యక్షం గా, పరోక్షంగా ఆధారపడిన కొన్ని లక్షల కుటుం బాలు ఆర్థికంగా ఇబ్బంది పడనున్నాయి. ‘ప్యాకేజీ’ ఫలాలు ఇప్పుడే తెలియవు.. ► కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా అది నేరుగా చిన్నతరహా పరిశ్రమలకు చేరకపోవడం వల్ల ప్యాకేజీతో వాటికి అంతగా వెసులుబాటు లభించలేదు. ఈ పరిశ్రమలు మళ్లీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలి. అందుకు బ్యాంకులు సిద్ధమేనా? అనేది తేలాలి. ► ప్రాధాన్యతారంగాలను ఎంచుకుని ఆయా రంగాల వారీగా నిర్దేశిత ప్యాకేజీలు ప్రకటించి ఉంటే బావుండేది. ► ప్రస్తుతం ఎక్కువగా నష్టపోతున్న పర్యాటక, రవాణా, ఆతిథ్య, లాజిస్టిక్స్, ఎంటర్టైన్మెంట్, వాటి అనుబంధ సహాయకరంగాలను ఆదుకోవాలి. వీటిలో పనిచేసే వారు ఉద్యోగాలు, ఉపాధి కొంతమేర కోల్పోయే అవకాశముంది. ► కేంద్ర ప్యాకేజీ వల్ల వెంటనే ఫలితాలు వచ్చే అవకాశం లేదు. పరిశ్రమలతో పాటు ఇతర ఏయే రంగాలకు ఎలాంటి సహాయం అందింది, ఏ మేరకు కోలుకున్నాయి?, ఏ మేరకు సత్ఫలితాలొచ్చాయనేది తెలుసుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. కరోనాతో అనుకూలంగా మారేవి.. ► డిజిటలైజేషన్కు ప్రాధాన్యం పెరుగుతుంది ► ఆన్లైన్ కోచింగ్లు, ఆన్లైన్ బోధన పెరుగుతాయి ► ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి బీమా రంగం అభివృద్ధి చెందుతుంది ► విదేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా మేకిన్ ఇండియా స్ఫూర్తితో ముందుకెళ్లొచ్చు. -
మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా..
-
బాబు , వెంకయ్య లిద్దరూ మాట తప్పుతున్నారు
-
వడ్డీరేట్లు తగ్గింపు శుభపరిణామం
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత్ ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గురువారం న్యూఢిల్లీలో తెలిపారు. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం శుభ పరిణామని ఆయన తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుతం తీసుకున్న వడ్డీ రేట్ల తగ్గింపు మూడు నెలల క్రితమే తీసుకుంటే బాగుండేదని నరసింహమూర్తి అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల భారత్ అర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఈసారీ రేట్ల కోత లేనట్టే!
రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలో ఉండటమే కారణం - బ్యాంకర్లు, ఆర్థిక నిపుణుల అంచనా - రేపే ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఈసారి కూడా వడీ రేట్లను తగ్గించే అవకాశాల్లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం(30న) ఆర్బీఐ పరపతి విధాన సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వస్తుందోనని మార్కెట్లు, కార్పొరేట్లతోపాటు రుణ గ్రహీతల్లోనూ ఆసక్తి నెలకొంది. పాలసీ సమీక్ష విషయంలో ఆర్బీఐ ఇప్పుడు రిటైల్ ధరలపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టులో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.8 శాతానికి(జూలైలో 7.96) స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్లో 8.5 శాతంగా ఉంది. ఇక టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం కూడా జూలైలో 5.19 శాతం నుంచి ఆగస్టులో అనూహ్యంగా 3.74 శాతానికి దిగొచ్చింది. వచ్చే ఏడాది జనవరికల్లా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 8 శాతానికి, 2016 జనవరినాటికి 6శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. గత సమీక్షలో ఆర్బీఐ కేవలం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ప్రభుత్వ బాండ్లలో బ్యాంకులు తప్పనిసరిగా ఇన్వెస్ట్చేయాల్సిన నిధులు)ని అరశాతం తగ్గించి 22 శాతానికి చేర్చింది. తద్వారా వ్యవస్థలోకి రూ.40 వేల కోట్లు విడుదలయ్యేలా చేసింది. ఇక రెపో రేటు 8%, రివర్స్ రెపో 7%, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4% చొప్పున యథాతథంగా కొనసాగించింది. బ్యాంకర్లు ఇలా... ఆర్బీఐ రేట్ల కోతకు ఇది సమయం కాదని.. రానున్న పాలసీ సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. వరుసగా కొన్ని నెలలపాటు ద్రవ్యోల్బణం తగ్గుదల నమోదైతేనే రేట్ల కోతను ఆర్బీఐ పరిశీలించవచ్చని కెనరా బ్యాంక్ సీఎండీ ఆర్కే దూబే పేర్కొన్నారు. వడ్డీరేట్ల తగ్గింపునకు జనవరిలోనే అవకాశం ఉండొచ్చని ఆయన అంచనావేశారు. కాగా, తక్షణం వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) పెంచాల్సిన అవసరం లేదని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎంవీ టంకశాల చెప్పారు. రుణ వృద్ధి ఇంకా మందకొడిగానే ఉన్న నేపథ్యంలో ఎస్ఎల్ఆర్ను తగ్గించక్కర్లేదన్నారు. కాగా, రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం ఎగబాకొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈసారి సమీక్షలో రేట్ల కోతకు అవకాశాలు అంతగా లేవని కేర్ రేటింగ్ పేర్కొంది.