the financial year
-
ప్రథమార్ధంలోనే రూ. 3.6 లక్షల కోటు
బాండ్లతో ప్రభుత్వం రుణ సమీకరణ న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బాండ్ల ద్వారా దాదాపు రూ. 3.6 లక్షల కోట్ల రుణం సమీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 6 లక్షల కోట్లు సమీకరించాలంటూ ప్రభుత్వం నిర్దేశించుకున్న దాంట్లో ఇది దాదాపు 60 శాతం మొత్తం. వ్యయాల నిర్వహణ, గతంలో తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపునకు ఈ మొత్తం ఉపయోగపడగలదని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి చెప్పారు. ఏప్రిల్లోనే రూ. 64,000 కోట్లు సమీకరించనున్నట్లు ఆయన వివరించారు. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రతి వారం రూ. 14,000-16,000 కోట్లు బాండ్ల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకుంటుందని మహర్షి తెలిపారు. ఒకవైపు ప్రభుత్వమే భారీగా రుణాలు సమీకరిస్తుండటం.. కార్పొరేట్ డెట్ మార్కెట్ వృద్ధికి విఘాతం కలిగిస్తోందంటూ ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిన రోజే కేంద్రం నిధుల సమీకరణ ప్రకటన వెలువడటం గమనార్హం. -
ఆశలు సజీవం...!
నల్లగొండ : వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులపై (బీఆర్జీఎఫ్)ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నా యి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రావాల్సిన రూ.33.80 కోట్లు విడుదల చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో జిల్లాలో చేపట్టాల్సిన వివిధ రకాల అభివృద్ధి పనులు మరుగునపడ్డాయి. నిధుల ఎప్పుడు వస్తాయన్న ఆశతో జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎదరుచూస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంలో కూడా ఈ నిధుల మంజూరు గురించి కేం ద్రంతో చర్చించడం జరిగింది. మరికొంత ఆలస్యమైనప్పటికీ జిల్లాకు రావాల్సిన నిధులు తప్పక వస్తాయని అధికారులు చెబున్నారు. అయితే గతేడాది నిధులతో ప్రమేయం లేకుండానే 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు రూ. 33.50 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులకు సంబంధించి కొత్త వా ర్షిక ప్రణాళిక రూపొందించేందుకు 70 రోజుల గడువు విధించింది. అప్పటిలోగా గ్రామసభలు, మున్సిపాల్టీల్లో వార్డుసభలు నిర్వహించి పనులు గుర్తించాలని పేర్కొంది. ఎప్పటి మాదిరే ఈ నిధుల్లో గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్లకు 30 శాతం, జిల్లా పరిషత్, అర్బన్ ప్రాంతాలకు 20 శాతం నిధులు కేటాయించనున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉన్నందున సభలు నిర్వహించేందుకు వీల్లేదు. వచ్చే నెలాఖరు వరకు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి కేంద్రం విధించిన 70 రోజుల్లో 40 రోజుల సమయం వృథా అయినట్లే. గతేడాది కూ డా వరుస ఎన్నికల కోడ్ కారణంగానే ప్ర తిపాదనలు రూపొందించడం ఆలస్యమైంది. పర్యవసానంగా ఇప్పటివరకు ని ధులు విడుదల కానీ పరిస్థితి ఏర్పడింది. అన్నీ అవరోధాలే... ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం..మరోవైపు వరుస ఎన్నికల కారణంగా గతేడాది రావాల్సిన బీఆర్జీఎఫ్ నిధులు రాకుండా పోయాయి. వాస్తవానికి ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో ప్రతిపాధనలు పం పితే జూన్లో ఈ నిధులు వస్తాయి. ప్రతి పాదనలకు ముందు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, త ర్వాత జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. 2014-15 బీఆర్జీఎఫ్ ప్రతిపాదలనకు స్థానిక, సార్వత్రిక ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్, ప్రక్రియ తదితర కారణాలతో ఈ వ్యవహారం డోలాయమానంలో పడింది. కొన్ని జిల్లాలో అప్పుడున్న శాసనసభ్యులు, మంత్రులు అధికారులతో మాట్లాడి హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపగా..జిల్లాలో మాత్రం బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలకు నోచుకోలేదు. జెడ్పీకి కొత్త పాలకవర్గం వచ్చాక సెప్టెంబర్లో డీపీసీ ఆమోదంతో రూ.33.80 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. ప్రతిపాదనలు పంపి ఆరు మాసాలు కావస్తున్నా నిధుల ఊసు లేదు. జూన్లో హైపవర్ కమిటీకి చేరి ఉంటే... వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద చేపట్టే పనులకు ఉన్నతాధికారులు మే నెలలోనే ప్రత్యేక అధికారులనుంచి ప్రతిపాదనలు కోరారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీంతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపకుండా ఆపేశారు. ఎన్నికల అనంతరం జెడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారంలోకి రావడంతో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు మళ్లీ మార్చాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధుల సూచనల మేరకు కొత్త ప్రతిపాదనలు రూపొందించి డీపీసీ ఆమోదం పొందే నాటికి పరిస్థితి చేయి దాటిపోయింది. ప్రతిపాదనలు హైపవర్ కమిటీ చేరడం ఆలస్యం కావడంతో ఇప్పటివరకు నిధులు రాకుండా ఆగిపోయాయి. పంపకాలు సవ్యంగా జరిగేనా...? గతేడాది ప్రతిపాదనలకు వరుస ఎన్నికలు అడ్డంకిగా నిలిస్తే..ఈ ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రతిబంధకంగా మారింది. 70 రోజుల గడువులోగా ప్రతిపాదనలు పంపడం ఆలస్యమైతే మొదటి విడత జూన్, జులైలో విడుదల కావాల్సిన నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే గతేడాది జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వచ్చిన నిధుల్లో పంపకాలు సవ్యంగా సాగాయి. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైర్మన్ టీఆర్ఎస్లోకి చేరడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీల వాటాల పంపకంలో వివాదాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నిధుల పంపకంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జెడ్పీటీసీలు గుర్రుగా ఉన్నారు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కొత్త పనుల ప్రతి పాధనులు సకాలంలో చేరుతాయా..?లేదా..? అన్నది వేచిచూడాల్సిందే. -
12.97శాతం రుణాలే మంజూరు
ఎస్ఎల్బీసీ నివేదన లక్ష్యం రూ.56,019 కోట్లు.. ఇచ్చింది రూ.7,263 కోట్లు 1,514 మంది కౌలు రైతులకు రూ.3.81 కోట్ల రుణాలు హైదరాబాద్:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలన్నీ కలుపుకుని రూ.56,019 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ.7,263 కోట్లు (12.97 శాతం) మాత్రమే రైతులకు రుణ రూపేణా అందించామని మంగళవారం నాటి ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంక ర్లు నివేదించారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 13 జిల్లాల్లో పునరుద్ధరించినవి, కొత్తవి కలిపి 1,86,885 మందికి రుణ అర్హత కార్డులు (ఎల్ఈసీ కార్డులు) జారీ చేయ గా, రుణాలిచ్చింది మాత్రం 1,514 మందికి రూ.3.81 కోట్లు మాత్ర మే. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులో ఒక్క కౌలు రైతుకు రుణ అర్హతకార్డు రెన్యువల్ కాకపోగా, కొత్త కార్డు ఒక్కటీ మంజూరు చేయలేదు. ఇక్కడ పైసా రుణం కూడా కౌలు రైతులకు ఇవ్వలేదని ఎస్ఎల్బీసీ గ ణాంకాలు తెలియజేస్తున్నాయి. గుంటూరు, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూ రు, కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లా ల్లో కౌలు రైతులకు రుణాలు అసలు మంజూరు చేయకుండా మొండిచెయ్యి చూపారు. తూర్పుగోదావరిలో 1,369 మంది కౌలు రైతులకు, ప్రకాశంలో 109, శ్రీకాకుళంలో 25, విజయనగరంలో 11 మంది కౌలు రైతులకు రుణాలిచ్చారు. బీమా గడువు 31వరకు పెంచాలి.. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ 31 వరకు పంటల బీమా గడువు పొడిగించాలని సమావేశంలో తీర్మానిం చారు. ఈ తీర్మానాన్ని కేంద్రం పరిధిలోని అగ్రికల్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పంపించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి హాజరైన వ్యవసాయ బీమా కార్పొరేషన్ ప్రతి నిధి గడువు పెంపు కుదరదని తేల్చి చెప్పారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ దొరస్వామి సానుభూతితో అంశాన్ని పరిశీలించాలని కోరారు. నిరర్ధక రుణాలుగా రూ. 32,516 కోట్లు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.32,516 కోట్ల వ్యవసాయ రుణాలు నిరర్ధక రుణాలుగా మారిపోయినట్లు ఎస్ఎల్బీసీ నివేదిక వెల్లడించింది. రూ. 94,937 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది. చెల్లించాల్సిన తేదీ దాటిన 90 రోజుల తర్వాత కూడా కనీస మొత్తం జమ చేయని ఖాతాలను తాత్కాలిక నిరర్ధక రుణ (ఓవర్ డ్యూస్) ఖాతాలుగా బ్యాంకులు గుర్తిస్తాయి. రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించినా తీసుకోవడానికి బ్యాంకులు సిద్ధం గా ఉన్నాయని ఎస్ఎల్బీసీ కన్వీనర్ సి.దొరస్వామి చెప్పారు. మంగళవారం ఎస్ఎల్బీసీ సమావేశానంతరం ఆయన విలేకరులతో ము చ్చటించారు. ‘కిసాన్ వికాస పత్రాలను బ్యాం కులు అంగీకరిస్తాయి. రుణమాఫీ పథకం కింద ప్రభుత్వం జారీ చేసే బాండ్లు ఎలా ఉంటాయి? దానికి ఉన్న సాధికారత ఏమిటి? ఆర్బీఐ వాటిని అంగీకరిస్తే.. బ్యాంకులూ అం గీకరిస్తాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎవరు చెల్లించినా, ఏ రూపంలో చెల్లించినా బ్యాంకులు తీసుకుంటాయి’ అని చెప్పారు. తొలుత 20 శాతం చెల్లిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన గురించి ప్రస్తావించగా.. ‘మీకు ఎవరైనా రూ.100 బాకీ ఉంటే.. రూ. 20 ఇస్తానంటే వద్దంటారా? ఇచ్చినంత తీసుకొని మిగతా మొత్తం ఇవ్వమని అడుగుతారు. బ్యాంకులు కూడా అంతే’ అని స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం ఇచ్చినా, 30 శాతం ఇచ్చినా తీసుకుంటామని, మిగతా సొమ్మునూ ఇవ్వమని అడుగతామని అన్నారు. 20 శాతం నిధులు చెల్లించిన తర్వాత రైతులకు రుణాలు ఇచ్చే విషయమై ఆర్బీఐ నిబంధనల మేరకే బ్యాంకులు వ్యవహరిస్తాయని చెప్పారు.