Five State Elections 2026
-
టీవీకే విజయ్ ఉగ్రరూపం.. సినిమాలో కాదు..
పుదుచ్చేరి ఎన్నికల వేళ ఇవాళ (ఏప్రిల్ 4న) టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఓ వృద్ధుడిని భద్రతా సిబ్బంది వృద్ధుడిని తోసేశాడు. దీంతో భద్రతా సిబ్బందిపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఆ రోడ్ షోలో విజయ్ను చూడటానికి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వ్యానుపై ఉన్న విజయ్ను చూడడానికి ప్రజలు ఆయనకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అక్కడి జనసమూహాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక వృద్ధుడు.. విజయ్ వ్యానును దగ్గరగా వచ్చాడు.ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఆ వృద్ధుడిని తోసినట్టు ఈ వీడియోలో కనపడుతోంది. వెంటనే విజయ్ అది గమనించాడు. ఆ సిబ్బందిని చూసి అలా ప్రవర్తించవద్దని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుడితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల విజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ ఘటన కెమెరాలో రికార్డయింది. విజయ్ అభిమానులు, మద్దతుదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. విజయ్ వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని అంటున్నారు. ఆ పరిస్థితిలో వృద్ధుడి పక్షాన విజయ్ నిలబడ్డారని అంటున్నారు. విజయ్ రోడ్ షోలకు ప్రజలు భారీగా వస్తున్నారు. Thalapathy Vijay was angry with the security for pushing an elderly man 🥹🥹 pic.twitter.com/SkbSPXd08P— Vijay Fans Trends (@VijayFansTrends) April 4, 2026 -
టికెట్ నిరాకరణ.. మౌనం వీడిన అన్నామలై
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. అన్నామలై పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ఒత్తిడి మేరకే ఆయనను పోటీకి దూరంగా పెట్టారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ వదంతులను అన్నామలై కొట్టిపారేశారు. తానే పోటీ చేయనని అధిష్టానానికి చెప్పినట్టు వెల్లడించారు.తనకు టికెట్ నిరాకరించలేదని, తనకు తానుగా పోటీకి దూరంగా ఉన్నట్టు అన్నామలై చెప్పారు. కోయంబత్తూరు నుంచి చెన్నై వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తన నిర్ణయాన్ని పార్టీ నాయకత్వానికి చాలా ముందే అధికారికంగా లిఖితపూర్వకంగా తెలియజేశానని వెల్లడించారు. ''అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కోర్ కమిటీకి ఎప్పుడో చెప్పేశాను. కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. నాకు నేనుగా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే, అధిష్టానం టికెట్ ఎలా ఇస్తుంద''ని ప్రశ్నించారు.అధిష్టానం తనకు టికెట్ ఇవ్వలేదని మీడియాలో ప్రచారం జరుగుతుండడంతోనే తాను స్పష్టత ఇస్తున్నానని అన్నామలై తెలిపారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు, ఎన్డీఏ అభ్యర్థుల ప్రచారం చేసేలా అనుమతి ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, గెలిచే సత్తా నాయకులనే అభ్యర్థులుగా ఎంపిక చేసిందని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు డీఎంకే సంకీర్ణ ప్రభుత్వ మోసాలతో విసిగిపోయారని, ఈసారి ఎన్డీఏకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: తమిళనాడు ఎన్నికల బరిలో తెలంగాణ మాజీ గవర్నర్అన్నామలై అలిగారా?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై హాట్టాపిక్గా మారారు. అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు విషయంలో ఆయన గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కోయంబత్తూరులోని కీలక స్థానాలను అన్నాడీఎంకే పార్టికి కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని సమాచారం. ఇదే విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ కూడా రాసినట్టు వార్తలు వచ్చాయి. సీట్ల పంపిణీలో అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి పెత్తనం ఆయనను మరింత క్షోభకు గురిచేసిందని అన్నామలై సన్నిహితులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీకి ఆయనకు దూరంగా ఉన్నారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. లోపల ఎలా ఉన్నా, పైకి మాత్రం అలాంటిదేమి లేదని అన్నామలై చెబుతున్నారు. -
Assam: అభ్యర్థుల భవితవ్యం వాళ్ల చేతుల్లోనే!
అస్సాంలో ఏప్రిల్ 9న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న కారణంగా అస్సాంలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో 34 శాతం మంది ముస్లిం జనాభా ఉంది. ఇప్పుడు అది 40 శాతానికి చేరినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో అత్యధిక జనాభా ముస్లింలదే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో 126 స్థానాలకుగాను 23 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 188 మంది ముస్లిం అభ్యర్థులు (దాదాపు 26 శాతం) ఉన్నారు. అయితే జనాభాతో పోలిస్తే అస్సాంలో ముస్లిం ప్రాతినిధ్యం తక్కువే అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. బీజేపీ ప్రకటించిన 90 మంది అభ్యర్థుల్లో ఒక్క ముస్లిం కూడా లేరు.అత్యధికం ఆ పార్టీ నుంచే..పార్టీల వారీగా చూస్తే, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అత్యధికంగా 87 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపింది. ఏజీపీ 46 శాతం మందిని బరిలోకి దింపింది. తృణమూల్ కాంగ్రెస్ 32 శాతం, కాంగ్రెస్ 18 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపాయి. పొత్తుల విషయానికొస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని అస్సాం మహాజోత్ (ఏఎస్ఎం) 128 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా.. ఇందులో 22 మంది ముస్లింలు (17 శాతం) ఉన్నారు. మరోవైపు నార్త్ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి 127 మంది అభ్యర్థులను బరిలోకి దింపితే.. ఇందులో కేవలం 13 మంది మాత్రమే ముస్లింలు (10 శాతం) ఉండడం గమనార్హం.అయితే జనాభాపరంగా దిగువ అస్సాంతో పాటు బరాక్ వ్యాలీలోని కొన్ని నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థుల ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. గౌరీపూర్, జలేశ్వర్, చమారియా, చెంగా నియోజకవర్గాల్లో మాత్రమే ముస్లిం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు, రాష్ట్రంలోని 126 నియోజకవర్గాల్లో 83 నియోజకవర్గాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీలో లేరు. ఈ నియోజకవర్గాలు ప్రధానంగా ఉత్తర అస్సాం, బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్నాయి. దిబ్రూగఢ్లోని టిన్సుకియా నుంచి తముల్పూర్లోని కోక్రాఝర్ వరకు ముస్లిం అభ్యర్థులు లేకపోవడంతో ఇక్కడ అధికంగా ఉన్న ముస్లిం ఓట్లు ఎవరికి పడనున్నాయనేది ఆసక్తిగా మారింది.స్వతంత్రులతో తలనొప్పి!జనాభా పరంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ముస్లింలు తక్కువగా ఉండడం.. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న 257 మంది అభ్యర్థుల్లో 88 మంది (34 శాతం) ముస్లిం అభ్యర్థులు ఉండడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారనుంది. వీరివల్ల ఓట్ల విషయంలో చీలిక వచ్చే అవకాశముంది.అస్సాం జనాభాలో మూడింట ఒక వంతు ముస్లింలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ అభ్యర్థుల జాబితాలో వారి ప్రాతినిధ్యం మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. దీంతో ఏప్రిల్ 9న జరగనున్న ఓటింగ్లో ముస్లింలు ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా చూసుకుంటే అస్సాంలో అభ్యర్థుల భవితవ్యం ముస్లిం ఓటర్లపైనే ఆధారపడి ఉంది.చదవండి: ‘విజయ్’ దాడికి ‘రంగసామి’ కోట బద్దలు? -
దరఖాస్తు రుసుం వెనక్కి ఇవ్వరూ!
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న దృష్ట్యా, ఆశావహుల నుంచి దరఖాస్తుల సమయంలో స్వీకరించిన ఫీజును వెనక్కి ఇవ్వాలన్న నినాదం మక్కల్ నీది మయ్యంలో మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నటుడు, రాజకీయ నాయకుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇస్తున్నామని, అయితే, తమ పార్టీ తరఫున ఎవ్వరూ పోటీ చేయడం లేదని ప్రకటించారు. అదేసమయంలో డీఎంకే తన పార్టీ ఉదయసూర్యుడి చిహ్నంలో పోటీచేయాలని ఒత్తిడి తీసుకు రావడంతోనే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసే ఆశతో లక్ష మందికి పైగా మక్కల్ నీది మయ్యం నాయకులు దరఖాస్తు చేసుకున్నారు.వీరంతా రూ.30వేల నుంచి రూ.50వేల వరకు దరఖాస్తు రుసుము చెల్లించారు. అదేసమయంలో ఎన్నికలల్లో పోటీ చేయనప్పుడు పార్టీని నడపడంలో అర్థం ఏమిటి అన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆశావహుల నుంచి దరఖాస్తుల రూపంలో సేకరించిన రుసుంను వెనక్కి అందించేందుకు కమల్ నిర్ణయించినట్టు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని దరఖాస్తు చేసుకున్న వారికి అందించే విధంగా చర్యలపై మక్కల్ నీది మయ్యం కసరత్తులు చేపట్టిందని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. -
కేరళలో హైడ్రామా.. శశిథరూర్ కాన్వాయ్ అడ్డగింత, దాడి
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాన్వాయ్ను అడ్డుకున్న కొందరు దుండగులు ఆయన గన్మెన్పై దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.వివరాల మేరకు.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు కేరళలోని మలప్పురం జిల్లాలో పర్యటించారు. అక్కడ ప్రచారం ముగిసిన తర్వాత వాండూర్లో జరగనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్తుండగా, తిరువల్లి చెల్లితోడు వంతెన సమీపంలో ఎంపీ కాన్వాయ్ని కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదానికి దిగారు. ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.భద్రతా సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా వాండూర్ పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.కలికావుకు చెందిన ఉమ్మారా అనే నిందితుడిపై నాన్బెయిలాబుల్ కేసు నమోదైనట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా, కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.Malappuram, Keralam: A complaint has been filed alleging that the convoy of Congress MP Shashi Tharoor was blocked near Thiruvalli Chellithodu bridge while he was travelling to an election campaign event in Wandoor. The complaint claims that Tharoor’s gunman was assaulted… pic.twitter.com/CVqZ25TzbP— IANS (@ians_india) April 3, 2026 -
‘విజయ్’ దాడికి ‘రంగసామి’ కోట బద్దలు?
రెండు దశాబ్దాల రాజకీయ సంప్రదాయం ఒకవైపు.. మార్పు కోరుకునే కొత్త తరం మరోవైపు.. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు- 2026 వేళ ఈ కేంద్రపాలిత ప్రాంతం ఒక రసవత్తర పోరాటానికి వేదికైంది. గత 20 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకోని ‘రివాజు’ పుదుచ్చేరి సొంతం. ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేసి, చరిత్ర తిరగరాయాలని ముఖ్యమంత్రి ఎన్. రంగసామి భావిస్తుంటే, తన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో ఎంట్రీ ఇచ్చి, సమీకరణలను తలకిందులు చేసేందుకు ‘దళపతి’ విజయ్ సిద్ధమయ్యారు. దీంతో పుదుచ్చేరి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.వెంటాడుతున్న నకిలీ ఔషధాల కుంభకోణంప్రస్తుత ముఖ్యమంత్రి రంగసామికి తన వ్యక్తిగత ఇమేజ్, సంక్షేమ పథకాలు కొండంత అండగా నిలిచాయి. కేంద్రంలోని బీజేపీ దన్ను, నిధుల లభ్యత ఎన్డీఏ కూటమికి బలాన్నిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో బీజేపీకి బలమైన క్యాడర్ లేకపోవడం, నకిలీ ఔషధాల కుంభకోణం వంటి ఆరోపణలు ప్రభుత్వానికి మైనస్గా మారాయి. వీటన్నింటికీ మించి ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న అసంతృప్తిని తట్టుకుని రంగసామి గట్టెక్కుతారా అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆయనకు జీవన్మరణ సమస్యగా మారింది.సీనియర్ల అసంతృప్తితో..మరోవైపు కాంగ్రెస్-డీఎంకే కూటమి బలమైన పునాదులతో బరిలోకి దిగుతోంది. క్షేత్రస్థాయిలో నెట్వర్క్, ప్రత్యేక రాష్ట్ర హోదా సెంటిమెంట్ వీరికి కలిసొచ్చే అంశాలు. అయితే లోలోన రగులుతున్న విభేదాలు, సీట్ల పంపకంలో జాప్యం, సీనియర్ల అసంతృప్తి ఈ కూటమిని బలహీనపరుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ కూటమి తన ఖాతాలో వేసుకుంటుందా? లేక అంతర్గత కుమ్ములాటలతో ప్రత్యర్థులకు అవకాశం ఇస్తుందా? అనేది వేచి చూడాలి. నాయకత్వ సమస్యలను అధిగమిస్తేనే కాంగ్రెస్కు పుదుచ్చేరిలో మనుగడ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.జయాపజయాలను శాసించే ‘కింగ్ మేకర్’ఇక ఈ ఎన్నికల్లో అసలైన ‘ఎక్స్-ఫ్యాక్టర్’ సినీ నటుడు విజయ్. దళపతికి ఉన్న తిరుగులేని క్రేజ్, యువతలో ఉన్న ఫాలోయింగ్ టీవీకే పార్టీకి ప్రధాన బలం. ఇప్పటికే ఇతర పార్టీల కీలక నేతలను ఆకర్షిస్తూ విజయ్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అయితే బూత్ లెవల్ మేనేజ్మెంట్ లేకపోవడం, రెండో శ్రేణి నాయకత్వం లోపించడం వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. విజయ్ స్వయంగా గెలిచినా, గెలవకపోయినా.. ఆయన చీల్చే ఓట్లు ఇతర పార్టీల జయాపజయాలను శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి ఆయన్ని తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.అసలు యుద్ధమంతా ఇక్కడే..భౌగోళికంగా చూస్తే మొత్తం 30 స్థానాల్లో 23 స్థానాలు పుదుచ్చేరి జిల్లాలోనే ఉండటంతో అసలు యుద్ధమంతా నగరం చుట్టూనే కేంద్రీకృతమైంది. కారైకాల్, మాహే, యానాం ప్రాంతాల ఓటర్లు కూడా కీలకం కానున్నారు. 2021 ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ ఈసారి ఆ విజయపరంపరను కొనసాగిస్తుందా? లేక గత రెండు దశాబ్దాల చరిత్ర పునరావృతమై అధికారం మారుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రత్యేక రాష్ట్ర హోదా, నిరుద్యోగం వంటి అంశాలే ఇక్కడ ప్రధాన అజెండాగా మారాయి.అత్యంత ఆసక్తికర ఘట్టం2026 మే ఫలితాలు పుదుచ్చేరి రాజకీయాల్లో ఒక నవశకాన్ని ఆవిష్కరించబోతున్నాయి. రంగసామి తన అనుభవంతో ‘రివాజు’ మారుస్తారా? లేక విజయ్ తన ‘దళపతి’ మార్క్ చూపిస్తూ కొత్త రికార్డు సృష్టిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఓట్ల చీలిక ఎవరిని ముంచుతుందో, ఎవరిని తేలుస్తుందో కానీ పుదుచ్చేరి పీఠం కోసం జరుగుతున్న ఈ ‘ముక్కోణపు పోరు’ మాత్రం భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన ఘట్టంగా నిలవబోతోంది.ఇది కూడా చదవండి: ‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్! -
పార్టీలో చేరిన వారంలో సీటు
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. సుదీర్ఘ మంతనాలతో కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం విడుదలైంది. ఇందులో శ్రీపెరంబదూరు నుంచి టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై మళ్లీ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారిలో 11 మంది సిట్టింగ్లకు మళ్లీ అవకాశం కల్పిస్తూ ఏఐసీసీ చర్యలు తీసుకుంది. అలాగే, కొత్త వారికి అత్యధికంగా సీట్లు కేటాయంచారు.డీఎంకే కూటమిలో కాంగ్రెస్కు 28 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఆది నుంచి సీట్ల సర్దుబాటుతోపాటు నియోజకవర్గాల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్లో వివాదాల నడుమ సాగుతూ వచ్చింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై సిద్ధం చేసిన జాబితాపై విమర్శలు, ఆరోపణలు బయలుదేరాయి. చివరకు ఏఐసీసీ పెద్దలు జోక్యం చేసుకుని గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు సాయంత్రం 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మదురై మేలూరు నియోజకవర్గానికి గట్టి పోటీ ఉండడంతో అభ్యర్థి ఎవరు అన్నది పెండింగ్లో పెట్టారు. గత ఎ న్నికలలో 18 మంది గెలవగా ఒకరు బీజేపీలోకి వెళ్లారు. మరొకరు మరణించడంతో ఆ సీటు కాస్త ఉప ఎన్నికలలో డీఎంకే ఖాతాలో చేరింది. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలలో 11 మంది సిట్టింగ్లకు తాజాగా మళ్లీ అవకాశం కల్పించారు. వీరిలో సెల్వపెరుంతొగై, హసన్ మౌలానా, దురై చంద్రశేఖర్, గోపినాథ్, ఊర్వశి అమృతరాజ్, రూబీ మనోహరన్ ఉన్నారు. మిగిలిన స్థానాలలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు.కాంగ్రెస్ అభ్యర్థులుపొన్నేరి(రి)–దురైచంద్రశేఖర్, వేళచ్చేరి – హసన్ మౌలానా, శ్రీపెరంబదూరు– సెల్వపెరుంతొగై, షోళింగర్ –ఏఎం మునిరత్నం, ఊత్తంగరై(రి)– కుప్పుస్వామి,కృష్ణగిరి – చెల్లకుమార్, పెన్నగరం – జీకే ఎం తమిళ్కుమరన్, ఆత్తూరు (రి)–ఎస్కే అర్ధనారి, ఈరోడ్ ఈస్ట్– గోపినాథ్ పళణియప్పన్, ఊటి– పి.రామచంద్రన్, గౌండం పాళయం– సూర్యప్రకాష్, సింగానల్లూరు–శ్రీనిధినాయుడు, తురయూర్(రి)– విచ్చు లెనిన్ ప్రసాద్, కడలూరు– చంద్రశేఖరన్, మైలాడుతురై– జమాల్ యూనస్ మహ్మద్, అరంతాంగి–టి.రామచంద్రన్, కారైక్కుడి– ఎస్ మాంగుడి, ఉసిలంపట్టి– టి.శరవణకుమార్, శివకాశి–గణేశన్ అశోకన్, తిరువాడనై– రామకరుమాణిక్యం, శ్రీ వైంకుఠం–ఊర్వశి అమృతరాజ్, శంకరన్ కోవిల్(రి)–సెంగైగణేషన్, అంబాసముద్రం– వీపీ దురై, నాంగునేరి–రూబీమనోహరన్, కులచల్–తారగై, విలవన్ కోడ్ – టీటీ ప్రవీణ్, కిళ్లియూరు–రాజేష్కుమార్ పోటీచేస్తున్నారు.పార్టీలో చేరిన వారంలో సీటుపీఎంకేలో జీకే మణి కీలక నేత అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పీఎంకేలో వివాదాలు సాగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసుకు మద్దతుగా జీకే మణి వ్యవహరిస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న జీకే మణి కుమారుడు తమిళ్కుమారన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరి వారం రోజులైన కాక ముందే ఆయనకు పెన్నగరం సీటు కేటాయించడం కాంగ్రెస్లో చర్చకు దారి తీసింది. -
సువేందుకు అనుకూలం.. ఆయనను తొలగించండి: టీఎంసీ
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి(ఆర్వో)ను వెంటనే తొలగించాలని అధికార టీఎంసీ డిమాండ్ చేసింది. ఇదే నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండటం తెల్సిందే. ఇక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఆర్వో సురాజిత్ రాయ్ సన్నిహితుడంటూ ఆరోపించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్కు శుక్రవారం ఒక వినతిపత్రం సమర్పించింది.ప్రస్తుత ఆర్వో రాయ్ గతంలో నందిగ్రామ్ నియోజకవర్గంలో బ్లాక్ అభివృద్ధి అధికారిగా ఉన్నప్పుడే సువేందుకు అనుకూలంగా బహిరంగంగానే వ్యవహరించినట్లు పేర్కొంది. అలాంటి అధికారిని సరిగ్గా ఎన్నికల వేళ ఆర్వోగా నియమించడం అనుమానాలకు తావిస్తోందని టీఎంసీ పేర్కొంది. ఈ నియామకం తటస్థ వైఖరికి భంగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉందని తెలిపింది. -
ఎన్నికల బరిలో లాటరీ కింగ్ ఫ్యామిలీ.. వారి ఆస్తులు ఎంతంటే?
చెన్నై/పుదుచ్చేరి: లాటరీ కింగ్గా గుర్తింపు పొందిన శాంటియాగో మార్టిన్ కుటుంబంలోని ముగ్గురు తమిళనాడు, పుదుచ్చేరిల్లో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా...? వీరు వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగడమే అసలైన కిటుకు. మార్టిన్ భార్య లీమా రోజ్(59) ఇటీవలే అన్నాడీఎంకేలో చేరి లాల్గుడి నియోజకవర్గంలో పోటీకి దిగారు.మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్(38) సొంతంగా లక్ష్య జననాయక కట్చి(ఎల్జేకే)అనే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పుదుచ్చేరిలో బీజేపీ, ఏఐఎన్నార్సీల ఎన్డీయేలో ఈ పార్టీ కూడా ఉంది. చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ స్థానానికి పోటీ పడుతున్నారు.మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున(43), విజయ్ సారథ్యంలోని టీవీకే తరఫున చెన్నైలోని విల్లివాక్కమ్లో పోటీకి దిగారు. ఈ ముగ్గురూ ఏప్రిల్ 9, 13వ తేదీల్లో జరిగే పోలింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, మార్టిన్ గ్రూప్ కంపెనీ ఎండీగా ఉన్న జోస్ చార్లెస్ తనకు రూ.597 కోట్ల ఆస్తులు, అర్జున రూ.197 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించుకున్నారు. -
365 రోజులున్నా ఫలితం శూన్యం
గజోల్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో 15 రోజులుపాటు ఉంటానంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ‘అమిత్ షా అన్నా, బీజేపీ అన్నా బెంగాల్ ప్రజలకు గిట్టదు. అందుకే అమిత్ షా ఇక్కడ 15 రోజులు కాదు..ఏకంగా 365 రోజులపాటు మకాం వేసినా ఎలాంటి ఫలితమూ ఉండదు’అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం మాల్దా జిల్లా గజోల్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మాల్దాలో సర్ దరఖాస్తుల పరిశీలనకు వెళ్లిన న్యాయాధికారులను 8 గంటలపాటు నిర్బంధంలో ఉంచిన ఘటనపై మమత స్పందిస్తూ.. బీజేపీ హైదరాబాద్ కోకిల ఈ కుట్రకు పథకం వేసిందంటూ పరోక్షంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇటీవల టీఎంసీ నుంచి వేరుపడి ఆమ్ జనతా ఉన్నయన్ పేరుతో పార్టీ పెట్టిన హుమాయూన్ కబీర్కు మద్దతు ప్రకటించిన ఎంఐఎం చీఫ్ ముస్లింల ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎంఐఎం, ఐఎస్ఎఫ్ కార్యకర్తలకు మాల్దా ఘటనలో ప్రమేయం ఉందన్నారు. ఇందులో కాంగ్రెస్ హస్తం కూడా ఉందని చెప్పారు. ‘మాల్దా ఘటన బెంగాల్ పరువును మంటగలిపింది. ఈ ఘటనకు కారణం స్థానికులు కారు. వాళ్లకు ఇబ్బందులు ఉండే ఉండొచ్చు. బయటి వ్యక్తులే వారిని ఈ ఉచ్చులోకి లాగారు. హైదరాబాద్ నుంచి తమ మతానికి చెందిన కొందరిని వెంటేసుకు వచ్చిన ఒక బీజేపీ కోయిల దీని వెనుక ఉంది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎయిర్పోర్టులో మా సీఐడీ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది’అని మమత తెలిపారు. ‘బెంగాల్ అంటే ఢిల్లీ మాదిరిగా కాదు. వివిధ ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ, ఓటర్లకు డబ్బు ఎరవేసి ఏదైనా చేయొచ్చని అనుకుంటే కుదరదు’అని స్పష్టం చేశారు. బీజేపీ ఓటమి ఖాయమని తనకు తెలుసునన్నారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ తన నియంత్రణలోనే ఉందని, ఎన్నికల కమిషన్ అధీనంలోకి వెళ్లలేదని చెప్పారు. -
గిరిజనుల అభివృద్ధికి రోడ్ మ్యాప్
గువాహటి: అస్సాంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేసి ఉంచారని, ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలుపుతో అమలు చేయడం తథ్యమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గోల్పారా, కామ్రూప్ జిల్లాల్లో శుక్రవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి ప్రసంగించారు. ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతిగా అన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేకపోయిందని విమర్శించారు. ద్రౌపదీ ముర్మును దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. పలాశ్బరిలో ఐఐఎం ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.‘మీరు ఎంతగా అడ్డుకున్నా, ఐఐఎం ఏర్పాటును ఏమాత్రం ఆపలేరు’ అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మినీ అస్సాంగా పేరున్న గోల్పారా జిల్లాలోని పలు గిరిజన తెగల అభివృద్ధికి పాటుపడేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా నొక్కి చెప్పారు. అదే సమయంలో, గిరిజనులు మెజారిటీగా ఉన్న జిల్లాలు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు పరిధిలోకి రావని వివరించారు. ప్రతి గిరిజన కుటుంబానికీ ఒక ఆవు, ఒక గేదెను పంపిణీ చేస్తామని సహకార శాఖ మంత్రిగా ఇది తన హామీ అంటూ ఆయన ప్రకటించారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ధుబ్రి జిల్లా గోలక్గంజ్లో ఆయన పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీ రద్దయింది. -
అస్సాంలో మూడు ముక్కలాట!
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రాంతీయ’పోరుగా మారాయి! ఎగువ, మధ్య, దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ యుద్ధంగా రూపుదాల్చాయి. ప్రతి ప్రాంతానికీ భిన్నమైన సామాజిక నేపథ్యం, స్థానిక సమస్యలు, ఓటింగ్ సరళి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎగువ అస్సాంలో 35, బోడోలాండ్తో కలిపి మధ్య అస్సాంలో 41, దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగువ అస్సాం బీజేపీ వశం కాగా దిగువ అస్సాంలో ఆ పార్టీకి, కాంగ్రెస్కు హోరాహోరీ పోరు సాగింది. మధ్య అస్సాం రెండింటినీ ఆదరించింది. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ, సరిహద్దు జిల్లాల్లో ఊపందుకున్న అస్తిత్వ రాజకీయాలు, భారీగా కొత్త ఓటర్ల చేరికతో ఈసారి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దిగువ అస్సాం: సరిహద్దులో నువ్వా నేనా! బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే దిగువ అస్సాం ప్రాంతంలో గుర్తింపు, అస్తిత్వ రాజకీయాలదే ప్రధాన పాత్ర. 50 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో దుబ్రీ, బార్పేట, గోల్పారా వంటి ముస్లిం ప్రాబల్య జిల్లాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఇరు కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్డీఏకు 23 సీట్లు రాగా కాంగ్రెస్ కూటమి 27 స్థానాలతో పైచేయి సాధించింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, దాని భాగస్వామి ఏఐయూడీఎఫ్కు బలమైన పట్టుంది. అస్సాంలో ఏఐయూడీఎఫ్ గెలిచిన 16 సీట్లలో అత్యధికం ఇక్కడే కావడం విశేషం! ఈసారి మాత్రం దిగువ అస్సాంలో కాంగ్రెస్ కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎగువ అస్సాం: బీజేపీ కంచుకోట అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ ఆశలకు ఎగువ ప్రాంతమే అత్యంత కీలకం! తిన్సుకియా, శివసాగర్, డిబ్రూగఢ్, జోర్హాట్ వంటి కీలక జిల్లాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడి 35 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. కాంగ్రెస్ కూటమి 5 స్థానాలకు పరిమితమైంది. డీలిమిటేషన్ తర్వాత ఈ ప్రాంతంలో గిరిజన జనాభా శాతం పెరగడం బీజేపీకి మరింత కలిసొచ్చే అంశం. మధ్య అస్సాం: అధికారానికి వారధి! నగావ్, మోరిగావ్తో పాటు బోడోలాండ్ ప్రాంతంతో కూడిన మధ్య అస్సాం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ 41 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో కుల, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం మరీ ఎక్కువ. పలు స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కింగ్మేకర్లు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 22, కాంగ్రెస్ కూటమి 16, యూపీపీఎల్, బీపీఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు 3 స్థానాలు నెగ్గాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో ఈ ప్రాంతం రాజకీయంగా సరికొత్త రూపు సంతరించుకుంది. చాలా అసెంబ్లీ స్థానాల సరిహద్దులు మారిపోయాయి. ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య పెరిగింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ముక్కలయ్యాయి.ఈసారి కీలకాంశాలివే...→ అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. → కొత్త ఓటర్లతో పాటు భారీగా ఓట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. → బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. స్వల్ప ఓట్లతోనే భారీ తేడా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 75 స్థానాలు గెలిస్తే విపక్ష కాంగ్రెస్ కూటమి 50కి పరిమితమైంది. స్థానాలపరంగా ఇంత తేడా ఉన్నా ఓటుబ్యాంకు విషయంలో మాత్రం పెద్దగా అంతరం లేకపోవడం విశేషం! బీజేపీకి 33 శాతం, కాంగ్రెస్కు 30 శాతం ఓట్లు పడ్డాయి. ఇతరులు ఒక స్థానానికి (0.8 శాతం) పరిమితం కాగా, ఏఐయూడీఎఫ్ పార్టీ 9 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అంటే.. గెలిచిన సీట్లలో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీ చూపించినా, ఓట్ల శాతంలో మాత్రం కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనే ఇచ్చింది. -
తమిళనాడు ఎన్నికల బరిలో తెలంగాణ మాజీ గవర్నర్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం విడుదల చేసింది. అన్నాడీఎంకేతో జట్టు కట్టిన బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను తాజాగా ప్రకటించింది. ఈ 27 మందిలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఐదుగురు ఎస్సీలకు సీట్లు దక్కాయి. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళసై సౌందరాజన్.. మైలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం దక్కినందుకు తమిళసై సౌందరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. తాను విజయం సాధిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ''నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ అభ్యర్థుల మధ్య ఎలాంటి తేడా లేదు. చెన్నై నాకు కొత్త ప్రదేశం కాదు. మేము మైలాపూర్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. ప్రజల మధ్య ఉండాలనే ఉద్దేశంతోనే నేను గవర్నర్ పదవి నుంచి తిరిగి వచ్చాను. ప్రతి నాయకుడి కష్టానికి పార్టీ తగిన గౌరవం ఇస్తుంది. అన్నామలైకి తగిన బాధ్యతలు అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. డీఎంకే ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక పార్టీ. డీఎంకే కుటుంబ రాజకీయాలను ప్రజలు తిప్పికొడతార''ని ఏఎన్ఐతో తమిళసై సౌందరాజన్ చెప్పారు. భుజం భుజం కలిపి ప్రచారం చేస్తా: అన్నామలైఅభ్యర్థుల ప్రకటనపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. అన్నామలై 'ఎక్స్'లో స్పందించారు. గెలిచే వారినే అగ్రనాయకత్వం ఎంపిక చేసిందని పేర్కొంటూ, అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. డీఎంకే వంచనతో విసిగిపోయిన తమిళనాడు ప్రజల మద్దతు ఎన్డీఏ అభ్యర్థులకు ఉంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని, డీఎంకే ప్రభుత్వం కారణంగా అన్నిరంగాల్లో తమిళనాడు వెనుబడిపోయిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 210 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, దీనికి కార్యకర్తగా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థులందరితో భుజం భుజం కలిపి నిలబడి ప్రచారం చేస్తానని పేర్కొన్నారు.ఆ బాధ్యతను నెరవేరుస్తాఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అగ్రనాయకత్వం తనకు ప్రచార బాధ్యతలు అప్పగించిందని అన్నామలై తెలిపారు. కేరళలోని కన్నూర్ శుక్రవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశానుసారం బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం సాగిస్తున్నట్టు చెప్పారు. "ఈ ఎన్నికలలో తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే నా పాత్ర. ఈనెల 7వ తేదీ వరకు పుదుచ్చేరి, కేరళలో ప్రచారం చేసే బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ప్రస్తుతం అదే పనిమీద ఉన్నాను. 7వ తేదీ నుండి 23వ తేదీ వరకు తమిళనాడులో ప్రచారానికి వెళతాను. ఇది పార్టీ నాకు అప్పగించిన బాధ్యత. నేను ఆ బాధ్యతను నిర్విస్తానని చెప్పారు. Press ReleaseThe Central Election Committee of the @BJP4India has decided the following names for the ensuing General Elections to the Legislative Assembly of TAMIL NADU:TAMIL NADU Legislative Assembly Election 2026..!#TNElection2026#TNElection2026 pic.twitter.com/nSe4tgaupm— BJP Tamilnadu (@BJP4TamilNadu) April 3, 2026చదవండి: 21 స్థానాల్లో కానరాని డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులు -
’జననాయకన్’పై ఉమ్మడి కుట్ర: విజయ్
సాక్షి, చైన్నె: టీవీకే అధినేత విజయ్ చైన్నె పెరంబూరులో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఆయన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైతం పోటీకి నిర్ణయించారు. దీంతో ఇక్కడ నామినేషన్ దాఖలు నిమిత్తం తిరుచ్చికి చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆయనకు టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆధవ్ అర్జున, నిర్మల్కుమార్ తదితరులు ఆహ్వానం పలికారు. విమానాశ్రయంలో అర్ధగంట పాటుగా విజయ్ తన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇక్కడి నుంచి తన ప్రచార వాహనంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి విజయ్ వెళ్లారు. మార్గం మధ్యలో విజయ్ను చూసేందుకు అభిమానులు, జనం ఎగబడ్డారు. తన వాహనం నుంచి వారికి అభివాదం తెలుపుతూ ముందుకు వెళ్లారు. అదే సమయంలో ఆయన వాహనాన్ని వెంబడిస్తూ యువకులు దూసుకొచ్చారు. కాన్వాయ్లోని ఓవాహనం ఢీ కొనడటంతో పోలీసు ఒకరు గాయపడ్డారు. అలాగే మేల పుదూర్ వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకోవడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ఓ చోట గాయపడి రోడ్డున పడ్డ మహిళా అభిమానితో పాటూ మరొకరి వద్దకు వెళ్లి విజయ్ పరామర్శించారు. కాగా, విజయ్ కాన్వాయ్లో ఓ యువతి మోటారు సైకిళ్పై దూసుకెళ్తుండటాన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై ఆమె చిందులు తొక్కడం గమనార్హం. నామినేషన్ దాఖలు అనంతరం మరక్కడై వద్ద జరిగిన ప్రచార సభలో విజయ్ ప్రసంగించారు. ముందుగా ఆయన దివంగత ఎంజీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఉమ్మడి కుట్ర..కరూర్ సంఘటన ఎలాగైతే ఒక కుట్రలో భాగమో, తన ’జననాయకన్’ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించడం వెనుక కూడా ఉమ్మడి కుట్ర ఉందని తన ప్రసంగంలో విజయ్ ఆరోపించారు. డీఎంకే వేరు, బీజేపీ వేరు కాదని, రాజకీయాల్లో ఈ రెండూ ఒక్కటే అని విజయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న ఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు, చిన్న హోటల్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్తున్నారని, గ్యాస్ కొరతను తీర్చడానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. దుష్ట శక్తి డీఎంకేను తరిమి కొడుదామన్నారు.వారివి బూటకపు హామీలు2021 ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన నీట్ పరీక్ష రద్దు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. తిరుచ్చికి చెందిన ఓ మంత్రి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ. 12 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి తాను వచ్చానని పేర్కొన్నారు. తనను ఎదుర్కొనేందుకు పలు కూటములు రహస్య బంధంతో దూసుకొస్తున్నాయని, తనను ఎలా అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలుసునని వివరించారు. ప్రజలు అందరి కోసం వచ్చిన తనకు న్యాయం చేకూరే విధంగా అండగా నిలబడాలని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన వాగ్దానాలను విస్మరించనని, ఇప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినానంతరం మరో మాట మాట్లాడనని, నమ్మిన వారిని మోసం చేయడం తెలియదని, అబద్ధాలు వళ్లించడం అస్సలు తెలియదని, అందరికీ నిజాయితీ ఉంటానని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులకు విజిల్ చిహ్నంలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయా నియోజకవర్గాలలోని అభ్యర్థులు, విజయ్ వేర్వేరు కాదని, అన్ని చోట్ల ఈ విజయ్ పోటీలో ఉన్నట్టుగా భావించి ఆదరించాలని విన్నవించారు. వంద శాతం ఈ విజయ్ను నమ్మండి, తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడిగే అవకాశం తనకు ఉందని, తనకు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విన్నవించారు. కాగా విజయ్ తిరుచ్చిలో ఇక బస చేసేందుకు వీలుగా అరియామంగళం గ్రామంలో ప్రత్యేక బంగళా సిద్ధం చేశారు. -
మూలవాసులకు ఎస్టీ కేటగిరీ
గువాహటి: మూలవాసులుగా గుర్తించిన ఆరు తెగలకు ఎస్టీ హోదా, పాలన, ఆరోగ్యం, పారిశ్రామికీకరణ తదితర 11 రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత..కీలకాంశాలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా బోకాజాన్లో ‘రైజోర్ ఇష్టాహార్’పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో యాంటీ కరప్షన్ కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్ సంస్థలకు భారీ భూకేటాయింపులపై సిట్తో దర్యాప్తు, పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు తప్పనిసరి చేయడం వంటి హామీలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన ఐదు గ్యారంటీలకు ఇవి అదనం. → అస్సాంలోని మొరాన్, మొటోక్, చుటియా, టై–అహోం, కొచ్–రాజ్»ొంగ్షిలతోపాటు తేయాకు తోటల్లో పనిచేసే గిరిజనులకు ఎస్టీ హోదా కల్పించడం. → టీ పరిశ్రమను ప్రధాన పరిశ్రమగా గుర్తించడం. టీ వర్కర్లకు పరిశ్రమల్లో మాదిరిగా కనీసం వేతనాలు, ఇతర ప్రయోజనాలను కల్పించడం. → బీటీసీ, కేఏఏసీ, దిమా హసావో కౌన్సిళ్లను ఆర్థికంగా మరింత చేయూతనివ్వడం, మరిన్ని అధికారాలను కల్పించడం, గిరిజన తెగలకు తిరిగి పునరావాసం కల్పించడం. → ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిపే శ్వేతపత్రం విడుదల, ఆస్పత్రులు, స్కూళ్లలో ఖాళీల భర్తీ వంటి ఐదు కార్యక్రమాల అమలు. → పూర్తి అధికారాలతో స్వతంత్ర అవినీతి వ్యతిరేక కమిషన్ ఏర్పాటు. పంచాయతీ రాజ్ సంస్థలకు వార్షిక గ్రాంట్ల విడుదల, జవాబుదారీతనం పెంపు. పోలీసు యంత్రాంగంలో సంస్కరణలు. జిల్లా ఆస్పత్రుల హోదా పెంపు, డిజిటల్ క్లాస్రూంల ఏర్పాటు. → ఐదేళ్లలో మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయడం. అన్ని రకాల ప్రభుత్వ సేవలను డిజిటైజ్ చేయడం. అందరికీ ఆరోగ్యం, స్కూళ్లలో వంద శాతం హాజరీ, ఉద్యోగిత పెంపు, ఆదాయం రెట్టింపు వంటివి అమలు. -
మార్పునకు దగ్గరి దారి భవానీపూర్
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మార్పునకు సొంత నియోజకవర్గం భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీని ఓడించడమే దగ్గరిదారి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మమతకు పోటీగా బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్లో గురువారం నామినేషన్ వేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలంటే 170 సీట్లను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, భవానీపూర్లో సువేందు గెలవడం మరో ఎత్తుగా పేర్కొన్నారు. ఇక్కడ సువేందు విజయంతో రాష్ట్రంలో మార్పు దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. కోల్కతాలోని హజ్రా నుంచి గురువారం మొదలైన సువేందు నామినేషన్ ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. ‘బెంగాల్లో మార్పు సంభవిస్తుంది. అయితే, ముందుగా భవానీపూర్లో మార్పు రావాలా? వద్దా? అంటూ ప్రజలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు మన అభ్యర్థిని సువేందు అధికారిని భారీ మెజారిటీతో గెలిపించాలని భవానీపూర్ ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు. నందిగ్రామ్ నుంచే కాదు భవానీపూర్లో కూడా పోటీ చేసి మమతను ఓడించాలని సువేందును ఒప్పించానన్నారు. 2021లో మరోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సువేందు చేతిలో మమత ఓడారన్నారు. ఈసారి మాత్రం, రాష్ట్రంలో అధికారంతోపాటు భవానీపూర్లోనూ మమతా బెనర్జీ ఓటమి ఖాయమని అమిత్ షా ప్రకటించారు. ‘మోదీ జీ నాయకత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. చొరబాటుదార్లను రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి వెళ్లగొట్టాలి’అని మంత్రి పేర్కొన్నారు. బెంగాల్ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందన్నారు. కాళీఘాట్ వద్ద హైటెన్షన్. బీజేపీ ర్యాలీలో జై శ్రీరాం, బీజేపీ జిందాబాద్, మమతా హటావో, బంగ్లా బచావో నినాదాలు భవానీపూర్లో మారుమోగుతున్న వేళ ర్యాలీ సీఎం మమతా బెనర్జీ నివాసమున్న కాళీఘాట్ సమీపానికి చేరుకుంది. అక్కడ టీఎంసీ మద్దతుదారులు పార్టీ జెండాలు చేబూని జోయ్ బంగ్లా, మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రెండు పార్టీల మద్దతుదారుల నడుమ కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
రూ. 3 వేలకు పింఛను పెంపు
కోజికోడ్: కేరళ అసెంబ్లీ ఎన్నికలకుగాను అధికార ఎల్డీఎఫ్ మేనిఫెస్టోను సీఎం పినరయి విజయన్ గురువారం విడుదల చేశారు. సంపూర్ణ పేదరిక నిర్మూలన, పింఛను రూ.3 వేలకు పెంపు, ఉద్యోగావకాశాల పెంపు, పెట్టుబడులను ఆకర్షించడం..తదితర కీలక హామీలు ఇందులో ఉన్నాయి. సామాజిక న్యాయంతోకూడిన ఆర్థికాభివృద్ధి, రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం విజయన్ చెప్పారు. మేనిఫెస్టోలోని మొత్తం 950 ప్రతిపాదనలను ప్రజలందరికీ సులువుగా అర్థమయ్యేలా 60–సూత్రాల కార్యక్రమంగా సంక్షిప్తం చేశామన్నారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి, పారిశ్రామిక విధానాలను రూపొందిస్తామ న్నారు. నెలవారీ సంక్షేమ పింఛను మొత్తాన్ని ప్రస్తుతమిస్తున్న రూ.1,600 నుంచి రూ.2 వేలకు పెంచనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాల కుట్రలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాలు మత ఛాందసవాద శక్తులతో చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం కేరళలో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ వర్చువల్గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతాన్ని వదిలేసిందని, మావోయిస్టు ముస్లిం లీగ్ కాంగ్రెస్గా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు సొంత ఎజెండా కోసం సమాజంలో మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో మన విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపర్చాయని విమర్శించారు. అయ్యప్ప ఆలయ బంగారం విషయంలో ఆ రెండు కూటములు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని దురి్వనియోగం చేస్తున్నాయని ఆక్షేపించారు. దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకుందన్నారు. విదేశాల్లోని పరిస్థితుల గురించి కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, దానివల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇబ్బంది పడాల్సి వస్తోందని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కేరళలో ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువత బతుకులు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చిచెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని, బీజేపీకి ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. -
తండ్రి బాటలో తనదైన ముద్రతో..
గౌరవ్ గొగోయ్.. దేశంలో గుర్తింపు పొందిన యువ నాయకుల్లో ఒకరు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా సమస్యలపై గొంతెత్తడంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. పార్లమెంటు ప్రసంగాల్లో తన వాగ్ధాటితో ఆకట్టుకున్న నేత. ఇప్పుడు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గౌరవ్, తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకుడు హితేంద్రనాథ్ గోస్వామితో తలపడుతున్నారు. అస్సాం గణ పరిషత్ను ఓడించి అధికారాన్ని కాంగ్రెస్ చేతికిచ్చిన తన తండ్రి తరుణ్ గొగోయ్ తరహాలోనే.. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. మోదీ ప్రభంజనాన్ని పక్కకు నెట్టి.. గౌరవ్ గొగోయ్ తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. దీంతో డైనింగ్ టేబుల్ ముచ్చట్లలోనే కాదు.. ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం ఉండేది. ఆ రాజకీయాల మధ్యే గౌరవ్ పెరిగారు. బాల్యం నుంచే ప్రభావం ఉన్నా.. ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం 2014లో. కలియాబోర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగినా.. కలియాబోర్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మృణాల్ కుమార్ సైకియాపై గెలిచి గౌరవ్ పార్లమెంటులో అడుగుపెట్టారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంటులోని అత్యంత యువ గొంతుకల్లో ఒకరిగా నిలిచారు. స్థానిక సమస్యలపై గళమెత్తారు. ఆర్థిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ భద్రత, సమాఖ్య సంబంధాల వంటి అంశాలపై సూటి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 2020లో కాంగ్రెస్ ఆయనను లోక్సభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా నియమించడంతో ప్రభుత్వంపై దాడిలో దూకుడు పెంచారు. 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నియోజకవర్గ మార్పులతో 2024 ఎన్నికల్లో జోర్హాట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ‘చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడిలాంటివాడిని, కానీ నేనే చక్రవ్యూహాన్ని ఛేదించి బయటకు వస్తాను’అని చెప్పిన ఆయన.. చెప్పినట్లుగానే ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2025 మేలో అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కీలక ముఖంగా మారారు. కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్... 2024లో జోర్హాట్లో గౌరవ్ గొగోయ్ గెలుపు ఆయన విశ్వసనీయతను మరింత పెంచింది. అయితే బలమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిపత్యం, కాంగ్రెస్లోని అంతర్గత వర్గపోరాటాలు, విచ్చిన్నమైన ప్రతిపక్షం ఇప్పుడు గౌరవ్ ముందున్న సవాళ్లు. కాంగ్రెస్లోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే, ఇటీవలి ఓటములతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలిగితే కొంతమేరకు విజయం సాధిస్తారు. అయితే, యువ ఓటర్లను ఇట్టే ఆకట్టుకునే శక్తి, ఎలాంటి అవినీతి కళంకం లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతిని అరికట్టడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యాలుగా ఆయన ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు... కొత్త కాంగ్రెస్కు, పార్టీ మారి బీజేపీలో చేరిన పాత కాంగ్రెస్కు మధ్యే అంటున్నారు. కళలంటే ఆసక్తి.. గౌరవ్ గొగోయ్ 1982 సెపె్టంబర్ 4న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ పాఠశాలలో అభ్యసించారు. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత కొంతకాలంపాటు ఎయిర్టెల్ మార్కెటింగ్లో పనిచేసిన ఆయన.. ఉద్యోగాన్ని వదిలి.. ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లారు. లండన్లోని న్యూయార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. గౌరవ్కు డ్యాన్స్, కొరియోగ్రఫీ, సంగీతం అంటే చాలా ఇష్టం. గౌరవ్ తల్లి.. డాలీ గొగోయ్. యూకేకు చెందిన ఎలిజబెత్ క్లేర్ను వివాహం చేసుకున్నారు. బ్రిటిష్ పౌరురాలైన ఎలిజబెత్ ప్రస్తుతం వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విజయ్ ఇంపాక్ట్.. డీఎంకే, అన్నాడీఎంకే లేకుండానే పోటీ
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఆయ పార్టీల అగ్రనేతలు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. డీఎంకే-కాంగ్రెస్, అన్నాడీఎంకే-బీజేపీ కూటముల మధ్య హోరాహోరీ తప్పదని ప్రిపోల్ సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచింది. సీమాన్ పార్టీ నామ్ తమిళర్ కచ్చి (ఎన్టీకే) కూడా ఒంటరిగా పోటీ చేస్తోంది. దీంతో ఈసారి గెలిచే అభ్యర్థులకు భారీగా ఆధిక్యాలు రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.పోటీ ఎక్కువ ఉండడంతో ప్రధాన పార్టీలు చిన్న పార్టీలను కూడా తమ కూటమిల్లో చేర్చుకున్నారు. దీంతో భాగస్వామ్య పార్టీలకు అధికంగా సీట్లు కేటాయించాల్సి వచ్చింది. ఫలితంగా 21 స్థానాల్లో డీఎంకే గానీ, అన్నాడీఎంకే గానీ పోటీలో లేవు. ఈ స్థానాల్లో రెండు కూటముల మిత్రపక్షాల అభ్యర్థులు పోటీలో ఉండడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి మరో పది స్థానాలు జతయ్యాయి. చిన్న పార్టీల ప్రాతినిథ్యం పెరగడంతో వాటికి సీట్ల కేటాయింపులు కూడా పెంచాల్సి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. డీఏంకే కూటమిలో 20పైగా చిన్న పార్టీలు ఉండడం గమనార్హం.మిత్రపక్షాలు బలంగా ఉన్నందువల్లే ఈ 21 స్థానాలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వదులుకోవాల్సి వచ్చిందని జాతీయ పార్టీలకు ఎనలిస్టుగా వ్యవహరిస్తున్న వి. భారతి అభిప్రాయపడ్డారు. కొత్తగా బరిలోకి దిగిన టీవీకే, ఎన్టీకే పార్టీలు కూడా స్థానికంగా బలమున్న నేతలకే టిక్కెట్లు ఇవాల్సి ఉంటుందన్నారు. విజయ్ ఎన్నికల బరిలోకి దిగడంతో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల లెక్కలు మారిపోయాయని సెపాలజిస్ట్ ఆర్. చంద్రశేఖరన్ అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గెలిచే అభ్యర్థులకు పెద్దగా మెజార్టీలు రాకపోవచ్చని తెలిపారు. చదవండి: హీరో విజయ్ విద్యార్హతలు ఇవే -
2014 నుంచి వాళ్లంతా మార్పును చూశారు: అమిత్ షా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. “టీఎంసీని బంగాళాఖాతంలోకి విసిరేయండి. పశ్చిమ బెంగాల్ ప్రజలు భయపడకుండా ఓటు వేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను గద్దె దించండి. ఈసారి ఎవరూ భయపడకూడదు. బెంగాల్ ఓటర్లను ఎవరూ అడ్డుకోలేరు. భవానీపురంలో సువేందు అధికారికి మద్దతు ఇవ్వండి. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి. అధికార టీఎంసీ పార్టీపై అవినీతి ఆరోపణల మచ్చ ఉంది. పశ్చిమ బెంగాల్లో మార్పు వస్తుంది. కానీ భవానీపూర్లో మార్పు కావాలా.. లేదా? మా అభ్యర్థి సువేందు అధికారికి మీ ఓట్లు వేయాలని కోరడానికి ఇక్కడికి వచ్చాను. 2014 నుంచి మోదీ జీపై నమ్మకం ఉంచిన వారు మార్పు చూశారు. గతంలో మమత ఒక ఎన్నికలో ఓడిపోయారు, ఈ సారి బెంగాల్ అంతటా ఓడిపోతారు. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం మారాలనే స్వరం వినిపిస్తోంది. మమతకు బైబై చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి 15 రోజులు రాష్ట్రంలో ఉంటాను’’ అని చెప్పారు.భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ (ఏప్రిల్ 2న) నామినేషన్ దాఖలు చేశారు. 294 సభ్యులు ఉండే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఓటింగ్ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో (రెండు దశల్లో) జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. 2021లో ఎనిమిది దశల్లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించింది. బీజేపీ 77 స్థానాలు దక్కించుకుంది. -
బీజేపీ గేమ్ ప్లాన్లో భాగమే: మమత ఫైర్
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎస్ఐఆర్ విధుల్లో భాగంగా బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఈ అంశం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ప్లాన్ అంటూ విమర్శలు చేశారు.తాజాగా మమత మాట్లాడుతూ..‘ఈ ఘటనతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ప్రజాగ్రహమే దీనికి కారణం. న్యాయాధికారులను ముట్టడించిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. కానీ SIRపై ప్రజలు కోపంగా ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. దీనిపై నాకు ఎలాంటి అధికారం లేదు. శాంతిభద్రతలు వంటి అన్ని అధికారాలను వారే నా నుండి లాగేసుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.అలాగే, మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగమే. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాషాయ పార్టీ, ఈ నెల చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. వారు శాంతిభద్రతలను నియంత్రించాలని కోరుకుంటున్నారు కానీ విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో పేర్ల తొలగింపుపై విస్తృతమైన అశాంతి నెలకొన్న నేపథ్యంలో శాంతిని కాపాడుకోవాలని ప్రలోభాలకు లొంగవద్దని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అంటూ కామెంట్స్ చేశారు.Sagardighi, West Bengal: On Malda issue, Chief Minister Mamata Banerjee says, "The BJP is playing a game...They have removed 1 crore 20 lakhs voter names, which is why we approached the Supreme Court. The Supreme Court ruled that this cannot happen..." pic.twitter.com/HVyEGIdzjs— IANS (@ians_india) April 2, 2026 ఏం జరిగింది?బెంగాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ మాల్డా జిల్లాలో ఆందోళనకారులు బుధవారం ఆందోళనకు దిగారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరారు. అందుకు అనుమతి నిరాకరించడంతో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కార్యాలయం చుట్టూ చేరి అధికారులను నిర్బంధించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ వీధుల్లో భాగంగా బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ధర్మాసనం అభివర్ణించింది. బెంగాల్లో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఈ ఘటనపై తగిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేశారు.Seven judicial officers including THREE female officials were kept at siege for over 17 hours by Trinamool goons inside Kaliachak BDO office in Malda ! These judges have been appointed by the Hon'ble Court for completing the SIR process. But Mamata Banerjee and Trinamool does not… pic.twitter.com/a38LCVcPev— Keya Ghosh (@keyakahe) April 2, 2026ముగ్గురు మహిళలు సహా ఏడుగురు న్యాయాధికారులను కొన్ని అసాంఘిక శక్తులు నిర్బందించాయని, ఈ అర్థరాత్రి వరకు తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చిందని సీజేఐ తెలిపారు. ఇది న్యాయాధికారులను భయపెట్టడమే కాకుండా కోర్టు అధికారాన్ని నేరుగా సవాలు చేయడమేనని ధర్మాసనం పేర్కొంది. న్యాయాధికారులపై మానసిక దాడులకు పాల్పడేందుకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ కోరేందుకు ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. -
డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ!
ఒకప్పుడు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికే సంకోచించిన మహిళలు, ఇప్పుడు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమైన ‘నిర్ణయాత్మక శక్తి’గా అవతరించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్నా మహిళల మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది.సైలెంట్ ఓటర్లు కాదు.. డిసైడింగ్ ఫ్యాక్టర్గత మూడు దశాబ్దాలుగా మహిళల రాజకీయ చైతన్యం ఊహించని రీతిలో పెరిగింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేవలం ఓటు వేయడమే కాదు, తమ ఓటుతో గెలుపోటములను తలకిందులు చేస్తున్నారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ వంటి పథకాలన్నీ ఈ ‘మహిళా ఓటు బ్యాంకు’ను ఆకట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.రాష్ట్రాల వారీగా మహిళల సత్తా ఇదే..అస్సాం: ఇక్కడ పెను మార్పు కనిపిస్తోంది. 2011లో కాంగ్రెస్ వైపు ఉన్న మహిళలు, 2021 నాటికి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలు మహిళల ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేశాయి.పశ్చిమ బెంగాల్: ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టు బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న అనుబంధం, మహిళా కేంద్రీకృత పథకాల వల్ల మహిళా ఓటర్లలో దాదాపు సగం మంది ఇప్పటికీ ‘దీదీ’ వెంటే నడుస్తున్నారు.కేరళ: మలయాళ గడ్డపై రాజకీయ విధేయతలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓట్లు ప్రధాన కూటముల మధ్య దాదాపు సమానంగా చీలిపోయినా, ఓటర్లు తమ అభిప్రాయాలను అంత సులభంగా మార్చుకోవడం లేదు.తమిళనాడు: ఇక్కడ మహిళల తీరు విభిన్నం. వీరు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరును బట్టి తమ మద్దతును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అధికార మార్పిడికి కారకులవుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఓట్లతో గెలుపు మార్జిన్ను నిర్ణయించేది కూడా వారే కావడం విశేషం. -
ఉదయనిధి స్టాలిన్, టీవీకే విజయ్ నామినేషన్ దాఖలు
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ (ఏప్రిల్ 2న) నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉధయనిధి స్టాలిన్ ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడే ఉదయనిధి స్టాలిన్ అన్న విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ 2024 సెప్టెంబరు 28న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2022 డిసెంబరు 14 నుంచి క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు.మళ్లీ ర్యాలీ నిర్వహించిన టీవీకే విజయ్టీవీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ తిరుచిరాపల్లిలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ రోడ్ షో నిర్వహించారు. త్రిచీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 30న పెరంబూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో విజయ్పై కేసు నమోదైంది.మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయ్ 30 లౌడ్స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. ఇవాళ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ మళ్లీ విజయ్ రోడ్ షో నిర్వహించడం గమనార్హం. విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కాగా, విజయ్ తనకు రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్లో ప్రకటించారు. -
కేరళలో ఎన్నికల సర్వే.. దిమ్మతిరిగే ఫలితాలు?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా ఎన్డీయే, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. మేనిఫెస్టోలు విడుదల చేసి ఓటర్లను తమవైపునకు తిప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కేరళలో నిర్వహించిన ఒక సర్వే ఆసక్తికర వివరాలను వెల్లడించింది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనే విషయంలో భారీ ట్విస్ట్ ఇచ్చింది.కేరళలో Citizens Opinion Research and Evaluation (CORE) సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే మార్చి 23 నుండి 30 మధ్య రాష్ట్రంలోని మొత్తం 140 నియోజకవర్గాల నుండి 31,706 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. తద్వారా వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను తీసుకుంది. ఈ సర్వేలో అధికార కూటమి అయిన LDFకు మిశ్రమ స్పందన లభించగా, UDF పనితీరుపై ప్రజలు కొంత మేరకు సానుకూలంగా స్పందించారు. ఇక NDA విషయానికి వస్తే తీవ్రమైన ప్రతికూల భావనను ఎదుర్కొంటోంది.👉ప్రస్తుత ప్రభుత్వం ఎల్డీఎఫ్ విషయానికి వస్తే.. సుమారు 43.1% మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ పనితీరుకు సానుకూల రేటింగ్ ఇచ్చారు. అందులో 17.16% మంది 'చాలా బాగుంది' అని, 25.94% మంది 'బాగుంది' అని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రభుత్వం గణనీయమైన సంఖ్యలో విమర్శకులను కూడా ఎదుర్కొంటోంది. సుమారు 25.74% మంది ప్రభుత్వ పనితీరును 'బాగోలేదు' లేదా 'అస్సలు బాగోలేదు' అని అభివర్ణించారు. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో విమర్శలు ఎదుర్కొంటోంది. సగటున 31% పాజిటివ్గా స్పందించారు.👉ఇక, యూడీఎఫ్ విషయానికి వస్తే.. 42.07% మంది ఓటర్లలో 28.72% మంది మాత్రమే దాని పనితీరును 'బాగుంది' లేదా 'చాలా బాగుంది' అని రేట్ చేశారు. 29.22% మంది బాగాలేదు లేదా అసలు బాగాలేదు అని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో లాభం ఉన్నప్పటికీ, పెద్ద ఎత్తున ఊపు లేదు.👉మరోవైపు.. ఎన్డీయే కూటమి విషయానికి వస్తే.. కూటమి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ప్రతిస్పందించిన వారిలో 60% కంటే ఎక్కువ మంది కూటమి పనితీరును బాగాలేదు లేదా అస్సలు బాగాలేదు అని రేటింగ్ ఇచ్చారు. కేవలం 11.66% మంది ఓటర్లు మాత్రమే దానికి సానుకూల రేటింగ్ ఇచ్చారు. ఎన్డీయే సానుకూల రేటింగ్ దక్షిణ కేరళలో కొంత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సర్వేను విశ్లేషిస్తే యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య పోటాపోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా..ఉత్తర కేరళ: LDF బలంగా ఉంది.మధ్య కేరళ: UDF పోటీలో ఉంది.దక్షిణ కేరళ: విభిన్న అభిప్రాయాలు, స్పష్టమైన ఆధిక్యం లేదు.నియోజకవర్గాల వారీగా అంచనాలు (35 కీలక సీట్లు)ఉత్తర కేరళ (కాసరగోడ్, కన్నూర్, వయనాడ): LDF బలంగా ఉండగా, UDF కొంత పోటీ, NDA బలహీనంగామధ్య కేరళ (ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్): LDF/UDF సమాన పోటీ, UDF కొంత ఆధిక్యం, NDA ప్రభావం తక్కువదక్షిణ కేరళ (తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట): LDF/UDF విభిన్న ఆధిక్యం, UDF కొన్ని సీట్లలో బలంగా, NDA ప్రతికూల అభిప్రాయం -
కేరళ ఎన్నికలు.. UDF మేనిఫెస్టో విడుదల చేసిన రేవంత్
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్కు అందజేశారు. రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు, అనేక ఇతర వాగ్దానాలతో కూడిన ఈ మేనిఫెస్టోను యూడీఎఫ్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ అందిస్తున్న పథకాలు, నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందజేత. అలాగే, యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. రూ. 3,000 సంక్షేమ పింఛను, ఊమెన్ చాందీ పేరుతో అన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత బీమా పథకం. వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి ఆరు 'ఇందిరా హామీలు' మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు, 'జాబ్ వాచ్ టవర్ల' ఏర్పాటు, వయనాడ్లో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, అలాగే కోజికోడ్ మరియు తిరువనంతపురం నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేస్తామని కూడా యూడీఎఫ్ హామీ ఇచ్చింది.మేనిఫెస్టోలోని వాగ్దానాలు-ఇందిరా హామీలు:మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణంకళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంసంక్షేమ పింఛన్లు రూ. 3,000కు పెంచబడతాయిఅన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత 'ఊమెన్ చాందీ ఆరోగ్య బీమా'యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణంవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు ఆరోగ్య రంగం:'కారుణ్య బెనివలెంట్ ఫండ్' మరియు 'శృతి రంగం' వంటి పథకాలు తిరిగి ప్రారంభించబడతాయిBPL కుటుంబాలకు చెందిన రోగులకు డయాలసిస్ ఉచితం చేయబడుతుందిమహిళలు మరియు పిల్లల కోసం 'She Hospitals' (షీ హాస్పిటల్స్) ప్రారంభించబడతాయిJIPMER నమూనాలో 'బిల్లు లేని ఆసుపత్రులు' (No-bill hospitals) స్థాపించబడతాయిఆసుపత్రులకు వచ్చే రోగులకు పడక (బెడ్) పొందడం వారి హక్కుగా పరిగణించబడుతుందివ్యవసాయం మరియు మత్స్య రంగం:వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుందిరబ్బరుకు రూ. 300 కనీస మద్దతు ధర (Floor Price) కల్పించబడుతుంది.అలాగే CIAL నమూనాలో ఒక రబ్బరు కంపెనీ ప్రారంభించబడుతుందివరి ధాన్యానికి రూ. 35, కొబ్బరికి అధిక కనీస ధర ఇవ్వబడుతుందిమత్స్యకారులకు మరియు కేఎస్ఆర్టీసీ, ఆటో, టాక్సీ యజమానులకు ఇంధన రాయితీ ఇవ్వబడుతుంది విద్య మరియు ఉపాధి:వయనాడ్లో ఆధునిక సౌకర్యాలతో 'గిరిజన విశ్వవిద్యాలయం' స్థాపించబడుతుందిక్యాంపస్లలో ర్యాగింగ్ను నివారించడానికి 'సిద్ధార్థన్ స్టూడెంట్ డిస్ట్రెస్ యాప్' ప్రవేశపెట్టబడుతుంది'సిద్ధార్థన్ యాంటీ-ర్యాగింగ్ చట్టం' అమలు చేయబడుతుందివిద్యా సంస్థలలో వివక్షను అంతం చేయడానికి 'రోహిత్ వేముల చట్టం' అమలు చేయబడుతుందిఅంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లోని మార్పులను అధ్యయనం చేయడానికి 'జాబ్ వాచ్ టవర్' ఏర్పాటు చేయబడుతుంది10,000 కొత్త ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రారంభించడానికి సహాయం అందించబడుతుంది సంక్షేమ ప్రాజెక్టులు:ఆకలి రహిత కేరళ కోసం ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించబడతాయిఐదేళ్లలో 5 లక్షల మందికి ఇళ్లు అందించబడతాయిసామాజిక భద్రతా పింఛనులో దివ్యాంగులకు 25% అదనంగా ఇవ్వబడుతుందిఆశా కార్యకర్తల కనీస వేతనాన్ని రూ.700కి పెంచనున్నారుపేదల వివాహాలను తక్కువ ఖర్చుతో జరిపించడానికి 'స్నేహ సుమంగళి' వివాహ మందిరాలను నిర్మించనున్నారుపరిపాలన మరియు అభివృద్ధి:అవినీతిని అరికట్టడానికి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారుమత సామరస్యాన్ని నిర్ధారించడానికి 'సహన మంత్రిత్వ శాఖ'శాంతి కోసం 'శాంతి మరియు సామరస్య' శాఖను ఏర్పాటు చేయనున్నారునదులను అనుసంధానించడం ద్వారా కేరళ తీరప్రాంతంలో 'మిషన్ సముద్ర' ప్రాజెక్టును అమలు చేయనున్నారుతిరువనంతపురం మరియు కోజికోడ్ నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేయనున్నారుమాదకద్రవ్య రహిత కేరళ కోసం 'బ్రేక్ ది డ్రగ్ చైన్' ప్రాజెక్టును ప్రారంభించనున్నారు -
సురేష్ గోపి నిజంగా గెలవలేదా?
కేరళ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసి, చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్, కేంద్ర మంత్రి సురేష్ గోపీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన ఎన్నికల విజయంపై విచారణ జరిపి తీరాల్సిందేనని కేరళ హైకోర్టు తేల్చిచెప్పింది. తనపై దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలంటూ సురేష్ గోపి పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది దీంతో సురేష్ గోపికి కేంద్ర మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ పరిణామం కేరళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.ఏమిటా ఆరోపణలు? ఎందుకీ వివాదం?2024 లోక్సభ ఎన్నికల్లో త్రిసూర్ నియోజకవర్గం నుంచి సురేష్ గోపీ గెలుపొందారు. అయితే ఆయన తన ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు మతపరమైన చిహ్నాలను, దైవచింతనను అడ్డం పెట్టుకున్నారని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) నేత బినోయ్ ఏఎస్ కోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో మతాన్ని ఉపయోగించడం తీవ్రమైన నేరం. ఈ ఆరోపణలే ఇప్పుడు సురేష్ గోపీ మెడకు చుట్టుకున్నాయి.హైకోర్టు ఏమంది? మంత్రికి చుక్కెదురు!బినోయ్ దాఖలు చేసిన పిటిషన్లో పస లేదని, దానిని విచారించకుండానే కొట్టివేయాలని సురేష్ గోపీ హైకోర్టులో వాదించారు. కానీ జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ ధర్మాసనం ఈ వాదనను అంగీకరించలేదు. పిటిషనర్ లేవనెత్తిన అంశాల్లో వాస్తవాలు ఉన్నాయని, పూర్తిస్థాయి విచారణ ద్వారానే దీనికి ముగింపు పలకాలని స్పష్టం చేస్తూ, కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సురేష్ గోపీ ఇప్పుడు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.బీజేపీకి గుండెల్లో రైళ్లుకేరళలో గత 70 ఏళ్లుగా ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీకి.. సురేష్ గోపీ 74,686 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయాన్ని అందించారు. ఆ విజయంతోనే ఆయన మోదీ క్యాబినెట్లో పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ కోర్టు విచారణలో ఆయన దోషిగా తేలితే, ఆ విజయం రద్దు కావడమే కాకుండా, రాబోయే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే ప్రమాదం కూడా ఉంది.రాజకీయంగా ఇబ్బందికర పరిణామంకేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి విచారణ జరగడం రాజకీయంగా బీజేపీకి, సురేష్ గోపీకి పెద్ద తలనెప్పిగా మారింది. కోర్టు తదుపరి విచారణలో ఎలాంటి సాక్ష్యాధారాలు బయటకు వస్తాయోనని కేరళలోని వామపక్ష, కాంగ్రెస్ కూటములు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కేరళలో బీజేపీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్న ప్రత్యర్థులకు ఈ తీర్పు ఒక ఆయుధంగా మారింది.సురేష్ గోపీ తదుపరి అడుగు ఎటు?హైకోర్టు నిర్ణయంతో సురేష్ గోపీ ముందు ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హైకోర్టులో విచారణను ఎదుర్కోవడం, రెండు ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం. అయితే హైకోర్టు ఘాటుగా స్పందించిన తీరు చూస్తుంటే ఆయనకు ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. సినీ గ్లామర్తో రాజకీయాలను శాసించిన ఈ ‘మాస్ హీరో’కి, ఈ లీగల్ బ్యాటిల్ ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.ఇది కూడా చదవండి: ఇండోనేషియా: 7.4 తీవ్రతతో భారీ భూకంపం -
పేరులో నేముంది?
కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరుకుంటోంది. అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీ ఎఫ్ హోరాహోరీ తలపడుతుండగా బీజేపీ సార థ్యంలోని ఎన్డీఏ కూడా ఉనికి చాటుకునే ప్రయ త్నాల్లో ఉంది. అయితే ప్రధాన పార్టీలకు ‘పేర్ల గొడవ’ పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. తమ అభ్యర్థుల పేరుతోనే ఉన్న పలువురు వ్యక్తులు పోటీలో ఉండటంతో అవి తల పట్టుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా వారిని నయానో భయానో బరి నుంచి తప్పించే పనిలో పడ్డాయి. లేదంటే వాటి ఓట్లకు ఎంతో కొంత గండి పడే పరిస్థితి నెలకొంది. అన్ని స్థానాల్లోనూ అధికార, విపక్ష కూటముల నడుమ హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో కొన్ని ఓట్లు తగ్గినా తమ గెలుపోటములే ప్రభావితం అవుతాయంటూ పార్టీలన్నీ ఆందోళన చెందుతున్నాయి.విజయన్పై విజయన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గంలో కన్నూరుకు చెందిన ఎ.ఎం.విజయన్ అనే మరో వ్యక్తి కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశాడు! తిరువంబాడిలో ముస్లిం లీగ్ నేత ఖాసింపై అదే పేరుతో ఉన్న మరో ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎర్నాకులం జిల్లా కాలంసెరి స్థానంలో మంత్రి పి.రాజీవ్ కూడా ఇలాంటి పరీక్షే ఎదుర్కొంటున్నారు. రాజీవ్ పేరుతో అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు. అంబలపుజ స్థానంలో సీపీఎం సీనియర్ నేత జి.సుధాకరన్కు టికెట్ దక్కకపోవడంతో ఆయన రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సుధాకరన్ అనే పేరున్న మరో అభ్యర్థి కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. కోయిలాండిలో కాంగ్రెస్ నేత కె.ప్రవీణ్కుమార్పై అదే పేరుతో ఉన్న మరో అభ్యర్థి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల పోటీ చేస్తున్న హరిపాద్ స్థానంలో రమేశ్ అనే మరో వ్యక్తీ బరిలో ఉన్నారు. ఇరింజలకుండ స్థానంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి థామస్ ఉన్నితాన్కు థామస్ అనే స్వతంత్రుని నుంచి సవాలు ఎదురవుతోంది.బైపోర్లో గమ్మత్తుకోజికోడ్ జిల్లాలోని బైపోర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత పి.వి.అన్వర్ బరిలో ఉండగా అదే పేరుతో ఏకంగా మరో నలుగురు పోటీ చేస్తున్నారు! ఎల్డీఎఫ్ తరఫున పర్యాటక మంత్రి పి.ఎ.మహ్మద్ రియాజ్ పోటీ చేస్తున్నారు. అదే పేరుతో మరో ఇద్దరు కూడా బరిలో ఉన్నారు! వట్టియూర్కవు అసెంబ్లీ స్థానంలోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే వి.కె.ప్రశాంత్పై కె.ప్రశాంత్ అనే స్వతంత్రుడు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కె.మురళీధరన్ పోటీ చేస్తుండగా అదే పేరుతో మరో అభ్యర్థి కూడా బరిలో నిలిచారు.ప్రధాన పార్టీలకు ‘ప్రసాద్’చెర్తాల స్థానంలో ప్రధాన కూటముల అభ్యర్థులిద్దరిదీ ఒకే పేరు కావడం విశేషం. ఎల్డీఎఫ్ నుంచి మంత్రి పి.ప్రసాద్, కాంగ్రెస్ నుంచి కె.ఆర్.రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నారు! ఇది చాలదన్నట్టు ప్రసాద్ అనే మరో వ్యక్తి కూడా స్వతంత్రునిగా ఇక్కడ బరిలో నిలిచారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హిమంత.. అస్సాం మామ
డాక్టర్ హిమంత బిశ్వ శర్మ. అస్సాం రాజకీయ సంక్లిష్టతలను అర్థం చేసుకుని, తదనుగుణంగా తనను తాను మలచుకున్న నేత. పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో దిట్ట. స్వయం కృషితో ఈశాన్య భారత రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు హిమంత. అస్సామీలు ఆప్యాయంగా ‘మామ’ అని పిలుచుకునేంతటి ప్రజాదరణ ఆయన సొంతం...!ఎన్ఈడీఏ రూపశిల్పి1991 నాటి సంగతి. యువతను తిరిగి కాంగ్రెస్కేసి ఆకర్షించగల యువ నాయకుని కోసం నాటి ముఖ్య మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు హితేశ్వర్ సైకియా ప్రయత్నిస్తున్న రోజులు. హిమంత బిశ్వ శర్మ ఆయన కంట పడ్డారు. అలా కాంగ్రెస్లో చేరారు. ఐదేళ్లపాటు నిర్విరామంగా కృషి చేసి రాష్ట్రవ్యాప్తంగా తిరుగులేని నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. జాలుక్బారి అసెంబ్లీ స్థానాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. 1996లో తొలిసారి అక్కడ ఓడినా కుంగిపోలేదు. 2001లో అస్సాం గణ పరిషత్ సీనియర్ నాయకుడు భృగుకుమార్ ఫుకాన్ను ఓడించి సత్తా చాటారు. ఏడాదికే మంత్రి పదవి సాధించారు. జాలుక్బారి నుంచి వరుసగా ఐదు పర్యాయాలుగా అత్యధిక మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. దశాబ్దాల పాటు అస్సాం కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా, సీఎం తరుణ్ గొగొయ్ కుడిచేయిగా కొనసాగారు. అలా 24 ఏళ్లు కాంగ్రెస్కు సేవలందించిన హిమంత, అధిష్టానంతో విభేదాల కారణంగా 2014లో పార్టీకి రాజీనామా చేశారు. 2015లో బీజేపీలో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దగా ఉనికి లేని ఆ పార్టీకి అక్కడ పెద్ద దిక్కుగా మారారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్ఈడీఏ)కి రూపకల్పన చేసి ఆ ప్రాంతంలో బీజేపీ తలరాతను మార్చేశారు. అస్సాంలో పార్టీ అధికారాన్ని నిలబెట్టారు.కేబినెట్ ఆన్ వీల్స్గువాహటిలోని కాటన్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చి రాష్ట్రాన్ని ఏలిన ఏడో నేతగా హిమంత నిలిచారు. ఆయన నాయకత్వంలో అస్సాం అశాంతి నుంచి బయటపడింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తొలి అస్సాం సీఎంగా హిమంత నిలిచారు. తెల్లవారుజాము వేళ కూడా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయడం ఆయన స్టైల్. సీఈఓ తరహా పనితీరుతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా గ్రామీణ జిల్లాల్లో అధికారిక సమావేశాలు నిర్వహిస్తూ ‘కేబినెట్ ఆన్ వీల్స్’తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.వివాదాలు, మరకలు→ మియా (బెంగాలీ మాట్లాడే ముస్లిం)లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని హిమంత ప్రకటించడం వివాదాస్పదమైంది→ వలసదారులపై హిమంత రైఫిల్ ఎక్కుపె ట్టినట్టుగా చిత్రించిన ‘పాయింట్ బ్లాంక్’ వీడియో అత్యంత వివాదాస్పదంగా మారింది. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఫిర్యాదులు చేశారు. వామపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. హిమంత మాత్రం అది ఫేక్ అని కొట్టిపారేశారు.→ ప్రభుత్వ నిధులతో నడిచే అన్ని మదర్సాలనూ సాధారణ పాఠశాలలుగా మార్చాలన్న హిమంత నిర్ణయంపై భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి.→ ‘జీరో టాలరెన్స్’ విధానంలో భాగంగా ప్రభుత్వ, అటవీ భూముల నుంచి వేలాది మందిని వెళ్లగొట్టారు. వారిలో బెంగాలీ మా ట్లాడే ముస్లింలే అధికంగా ఉండటంతో, వారిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేసుకున్నా రని ఆరోపణలొచ్చాయి.వ్యక్తిగత జీవితంహిమంత 1969 ఫిబ్రవరి 1న జోర్హాట్లో జన్మించారు. తండ్రి కైలాశ్నాథ్ శర్మ సాహితీవేత్త. అలా హిమంత పుస్తకాలు, మేధో చర్చల నడుమ పెరిగారు. పాఠశాల విద్యార్థిగానే ఆదివాసీల హక్కుల ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. గువాహటి కాటన్ వర్సిటీ విద్యార్థి సంఘానికి మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే చదువులోనూ రాణించారు. పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ చేశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కావడం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు గువాహటి హైకోర్టులో ఐదేళ్లు సొలిసిటర్గా కూడా పనిచేశారు. హిమంత భార్య రినికి భుయాన్ శర్మ రాష్ట్రంలో మీడియా టైకూన్గా పేరొందారు. వారికి కొడుకు, కూతురున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అస్సాంలో మూడోసారి.. మేమే!
గువాహటి: అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొరబాటుదార్ల రక్షణ కోసం చట్టం తీసుకొస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ కుట్రలను సాగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆయన బుధవారం అస్సాంలో పర్యటించారు. ధెమా జీ జిల్లాలోని గోగాముఖ్, బిశ్వనాథ్ జిల్లాలోని బెహాలీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. మెజార్టీ ప్రజల ను మైనార్టిలుగా మార్చేసి, చొరబాటుదార్లను శాశ్వతంగా ఓటుబ్యాంకుగా మార్చుకోవడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు చొరబాటుదార్ల కోసం కేంద్రంలో చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయతి్నంచిందని గుర్తుచేశారు. ఆ పార్టీ కుతంత్రాలను ఎన్డీయే అడ్డుకుందని వెల్లడించారు. ఇప్పుడు కూడా చొరబాటుదార్లను కాపాడుతామంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారని విమర్శించారు. దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ చేసినట్టుగానే నేడు కాంగ్రెస్ సైతం సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.భ్రష్టాచార్ కీ జనని కాంగ్రెస్ ‘‘ఓట్ల ఏకీకరణపై బీజేపీకి విశ్వాసం లేదు. మేము నమ్మే సూత్రం సబ్కా సాత్, సబ్కా వికాస్ మాత్రమే. అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వానికి ఓటు వేయాలి. అస్సాంను మరింత అభివృద్ధి చేసే బాధ్యత మాదే. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించబోతున్నాం. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ)కి వందోసారి కూడా ఓటమి తప్పదు. యువతకు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా బీజేపీ మేనిఫెస్టో రూపొందించాం. అస్సాంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని ఉపయోగించుకోలేదు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. బీజేపీ అధికారంలోకి వచి్చన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇక్కడి వనరుతోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం. అది అవినీతికి తల్లిలాంటిది(భ్రష్టాచార్ కీ జనని). అస్సాం ఆత్మగౌరవాన్ని, భద్రతను కాపాడే విషయంలో రాజీపడింది’’ అని మోదీ ధ్వజమెత్తారు.ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం ‘‘మేము మళ్లీ అధికారంలోకి వస్తే అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తాం. ఆరో షెడ్యూల్ కింద గిరిజనులకు రక్షణలు కల్పిస్తాం. అస్సాం గుర్తింపు, గౌరవాన్ని కాపాడుతాం. రాష్ట్రంలో పదేళ్ల బీజేపీ పాలన సేవ, సుశాసన్కు బాటలు వేసింది. తేయాకు సాగుకు ప్రసిద్ధి పొందిన అస్సాం నేడు సెమీకండక్టర్ల తయారీ హబ్గా మారడం సంతోషంగా ఉంది’’అని మోదీ ఉద్ఘాటించారు. తేయాకు తోటలో కార్మికుడిగా మోదీ అస్సాం రాష్ట్రం దిబ్రూగఢ్ జిల్లాలో మనోహరి టీ ఎస్టేట్ను ప్రధాని మోదీ సందర్శించారు. 19 మంది మహిళా కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేశారు. స్వయంగా తోటలోకి దిగి తేయాకు తెంపి, సంప్రదాయ బుట్టలోకి సేకరించారు. తేయాకు తోటలో పనిచేయడం మర్చిపోలేని అనుభవమని మోదీ పేర్కొన్నారు. తన జీవితం ఛాయ్తో ముడిపడి ఉందన్నారు. టీ చెట్ల నుంచి తేయాకు ఎలా తెంచాలన్నది మహిళలను చూసి నేర్చుకున్నానని తెలిపారు. మహిళలతో మాట్లాడారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. అలాగే వంటల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళను తన గురువుగా మోదీ అభివరి్ణంచారు. మరో మహిళ పాట పాడి వినిపించారు. తేయాకు అస్సాం అత్మ అంటూ మోదీ ఎక్స్లో పోస్టుచేశారు. ఇక్కడ సాగవుతున్న టీ ప్రపంచమంతటా సరఫరా అవుతోందని వివరించారు. టీ కార్మికుల శ్రమ, పట్టుదల అస్సాంకు గర్వకారణమని స్పష్టంచేశారు. -
ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు: స్టాలిన్
తిరుచ్చి: ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారంటూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ప్రదేశ్గా పేరు మారుస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏపై స్టాలిన్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ డబ్బా ఇంజిన్ ముందు ద్రవిడ మోడల్ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ తల వంచదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్టాలిన్ విరుచుకుపడ్డారు.బీజేపీ ప్రభుత్వాన్ని ఒక పనికిరాని డబ్బా ఇంజిన్గా అభివర్ణించిన స్టాలిన్.. తమ ద్రవిడ మోడల్ పాలనను 'సూపర్ ఫాస్ట్ ఇంజిన్తో పోల్చారు. తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడటంలో, అభివృద్ధి పథంలో దూసుకుపోవడంలో తమ ప్రభుత్వం ఎవరికీ లొంగదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించి, ద్రవిడ సిద్ధాంతాన్ని మరోసారి గెలిపించాలంటూ ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు.బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే, వారి వల్ల కలిగే నష్టాలు మన ఊహకు అందవు. తమిళనాడు పేరును కూడా మార్చేస్తారు. తమిళనాడు ఎప్పటికీ తమిళనాడుగానే ఉండాలి. ఉత్తరప్రదేశ్, మణిపూర్లాగా హింసాత్మక ప్రాంతంగా మారకూడదు. హోసూర్ విమానాశ్రయం, విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల కోసం తరచుగా పర్యటనలు చేస్తారు’’ అంటూ స్టాలిన్ విమర్శలు గుప్పించారు. -
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్?
ముంబై: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగక ముందే తమిళనాడు ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు–ఓటములపై,పొత్తులపై అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయా? ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోకపోతే హీరో,తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ను ఆహ్వానించే అవకాశముందా? ఒప్పందం ప్రకారం విజయ్ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారా? త్రిముఖ పోరులో విజయ్ ‘కింగ్ మేకర్’అవుతాడా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్డీయే మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే.కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిలో విజయ్ చేరుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత మద్దతు కోరుతాం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే గట్టిపోటీ ఇస్తుంది. హంగ్ ఏర్పడితే టీవీకే ఎన్డీఏలో చేరుతుంది. విజయ్ మద్దతుతో ఎన్డీఏ సర్కార్ వచ్చే ఛాన్స్’ఉందని అని వ్యాఖ్యానించారు.మంగళవారం పుదుచ్చేరిలో ఇండియా రిపబ్లికన్ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం.. అథవాలే మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాదు. తమిళనాడులో మెజారిటీ సాధించకపోతే ఎన్డీఏ కూటమి విజయ్తో మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ప్రస్తుతం కేరళంను అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.అక్కడ కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ఎన్నికల తర్వాత, ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలో ఉన్నారు. దేశాభివృద్ధియే ఆయన లక్ష్యం’అని ఆయన అన్నారు.ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. పొత్తును ఖరారు చేసేలా చర్చలు ఎన్డీఏ పెద్దలు ఓ దూతను విజయ్ వద్దకు పంపించారు. ఎన్డీఏ కూటమి తరుఫున సదరు నేత విజయ్తో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో విజయ్ రెండున్నర సంవత్సరాలు, అన్నాడీఎంకే ఎడప్పాడి పళనిస్వామి మరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేలా మంతనాలు జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇదే అంశాన్ని టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున ధృవీకరించారు.అయితే, పళనిస్వామి రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఒప్పందాన్ని అంగీకరించలేదు.దీంతో, విజయ్తో పొత్తు కోసం బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. విజయ్ ఒంటరిగా ఎన్నికల పోటీ చేస్తున్నారు. తాజా,పరిణామల నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీఏ కూటమికి మెజారిటీ రాకపోతే విజయ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రామ్దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయా పార్టీల పొత్తులు, గెలుపు–ఓటములు ఊహాగానాలు మాత్రమే. ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచారు? కింగ్ మేకర్ ఎవరు అవుతారు? ఏ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి? అన్నది ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత మాత్రమే స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘యువరాజు’ సెంచరీ: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
గోగాముఖ్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ‘ఈ ఎన్నికలు కేవలం విజయం కోసం కాదు వికసిత భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రజా తీర్పు’ అంటూ గోగాముఖ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పేర్కొన్నారు. అస్సాంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేసి, ఘనమైన ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలుప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని ఘాటు విమర్శలు చేశారు. అస్సాం ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో ఎన్డీఏ హ్యాట్రిక్ విజయం సాధిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటములలో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా, వారి ‘యువరాజు’ ఓటముల్లో సెంచరీని పూర్తి చేసుకోబోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత జరిగిన తన మొదటి సభకు భారీగా తరలివచ్చిన జనసందోహమే ఎన్డీఏ విజయానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. Assam has seen rapid development over the past decade. The people are ready to reaffirm their faith in the BJP-NDA. Watch from Gogamukh.https://t.co/UN20VAYJoS— Narendra Modi (@narendramodi) April 1, 2026మేనిఫెస్టోలో వరాల జల్లుఅస్సాం అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన కీలక హామీలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. 15 లక్షల కుటుంబాలకు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. లఖ్పతి దీదీ పథకం ద్వారా ఇప్పటికే మూడు లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారని, రానున్న కాలంలో ఈ సంఖ్యను 40 లక్షలకు విస్తరిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘అరుణోదయ’ పథకాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.ఏప్రిల్ 9న పోలింగ్అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)లతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. గత పదేళ్ల అభివృద్ధి మళ్లీ తమను అధికారంలోకి కూర్చోబెడుతుందని బీజేపీ భావిస్తుండగా, అధికారపక్షాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మోదీ పర్యటనతో అస్సాం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇది కూడా చదవండి: Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు -
అస్సాంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల
అస్సాంలో తమను గెలిపిస్తే యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ పేర్కొంది. ‘బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆక్ర మించిన భూములను విడిపించి స్థానికులకు అందజేస్తాం. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తాం’’అని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు 31 హామీలతో కూడిన బీజేపీ ‘సంకల్పపత్ర’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం గువాహటిలో విడుదల చేశారు. ఇక అస్సాంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..అరుణోదయ్ పథకం లబ్ధిదారులైన మహిళలకు ఆర్థిక సాయం ప్రస్తుత రూ.1,250 నుంచి క్రమంగా రూ.3,000కు పెంపుగిరిజనులతో సహా అర్హులైన తేయాకు కార్మికులందరికీ భూ పట్టాలు. రూ.500 చొప్పున వేతన పెంపు. అక్రమ చొరబాటుదారులకు దేశ బహిష్కరణ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుతో అస్సామీల నాగరికత, వారసత్వం, హక్కుల పరిరక్షణ మిషన్ వసుంధర’లో భాగంగా చొరబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రతి అంగుళం భూమికీ విముక్తి. వాటిపై అసలైన అస్సామీ పౌరులకు భూ హక్కులు.చదవండి: బీజేపీ మేనిఫెస్టో.. 3,000 పెన్షన్, ఉచిత సిలిండర్! -
మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. తన వాగ్ధాటితో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీని ఇరకాటంలో పడేశాయి. గుజరాతీ సమాజంపై ఆమె చేసిన విమర్శలు వివాదాస్పదం కావడంతో, స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి క్షమాపణలు కోరాల్సి వచ్చింది.అసలేం జరిగింది?మూడు రోజుల క్రితం తృణమూల్ భవన్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మహువా మోయిత్రా స్వాతంత్ర్య పోరాటంలో బెంగాలీల పాత్రను ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘మీరు కాలాపానీ (అండమాన్ సెల్యులార్ జైలు)కి వెళ్లి చూస్తే అక్కడ ఎవరి పేర్లు కనిపిస్తాయి? అక్కడ ఎంతమంది గుజరాతీలు ఉన్నారు? జైలు శిక్ష అనుభవించిన వారిలో 68 శాతం మంది బెంగాలీలే.. ఆ తర్వాత పంజాబీలు ఉంటారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.భవానీపూర్లో సెగ.. దీదీ క్షమాపణలుమహువా చేసిన ఈ వ్యాఖ్యలపై భవానీపూర్లోని గుజరాతీ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో గుజరాతీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. దీంతో అప్రమత్తమైన టీఎంసీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వార్డు నంబర్ 70 కౌన్సిలర్ అసిమ్ బసు ద్వారా మమతా బెనర్జీ ఒక బహిరంగ క్షమాపణ లేఖను విడుదల చేశారు. ‘నా గుజరాతీ సోదర సోదరీమణులకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. మీ పట్ల నాకు ఎంతో గర్వం ఉంది. సంబంధిత ఎంపీ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అవి అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు. మేము వాటిని సమర్థించం’ అని మమత తన సందేశంలో పేర్కొన్నారు.పార్టీ అనుమతి లేని వ్యాఖ్యలుఎంపీ మహువా మోయిత్రా పార్టీ అనుమతి లేకుండానే ఈ వ్యాఖ్యలు చేశారని కౌన్సిలర్ అసిమ్ బసు తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా పోస్ట్ను హిందీ, ఇంగ్లీష్తో పాటు ప్రత్యేకంగా గుజరాతీ భాషలోనూ విడుదల చేయడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈ వార్డులో టీఎంసీ వెనుకబడి ఉండటంతో, ప్రస్తుతం ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్డీఏ అంజలి’ -
బీజేపీ మేనిఫెస్టో.. 3,000 పెన్షన్, ఉచిత సిలిండర్!
తిరువనంతపురం: కేరళలో అధికారమే లక్ష్యంగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్లతో పాటు బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది.కేరళలో అధికారంలోకి వస్తే నిరుపేద మహిళలు, వితంతువులు, 70 ఏళ్ల పైబడ్డ వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని బీజేపీ ప్రకటించింది. పేద కుటుంబాలకు ఏటా రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు పలు వరాలు గుప్పించింది. రాష్ట్రానికి ఎయిమ్స్, ప్రార్థనా స్థలాల పరిరక్షణకు చట్టం తదితర హామీలు ఇచ్చింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఎన్డీఏ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. హామీలు ఇవే..నిరుపేద కుటుంబాల్లో ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.3,000 పెన్షన్వితంతువులకు, 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు కూడా నెలకు రూ.3,000 పెన్షన్ఓనం, క్రిస్మస్ పండుగలకు ఒక్కోటి చొప్పున నిరుపేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్మెడికల్, కిరాణా దుకాణాల్లో నెలకు రూ.2,500 మేరకు కొనుగోళ్లకు వీలుగా ప్రతి పేద మహిళకూ భక్ష్య, ఆరోగ్య సురక్ష కార్డు. -
‘జుబీన్’ చుట్టూ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి ప్రధానాంశంగా మారుతోంది. దీనిపై పారీ్టల పరస్పర ఆరోపణలు, దూషణలతో వాతావరణం వేడెక్కింది. ఈ అంశానికి కాంగ్రెస్ ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోనే చోటిచి్చంది! తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా గార్గ్ మృతిపై నిజాలు వెలికితీసి న్యాయం చేస్తామని హామీ ఇచి్చంది. అస్సాంలో గార్గ్కు లక్షల్లో అభిమానులున్నారు. దాంతో వారి ఓట్ల కోసం పార్టీలన్నీ యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. రాజకీయ దుమారం 52 ఏళ్ల జుబీన్ గార్గ్ 2025 సెపె్టంబర్ 19న సింగపూర్లో ఒక ద్వీపం వద్ద ఈత కొడుతూ మరణించారు. అది కాస్తా రాజకీయంగా వివాదాంశంగా మారింది. గార్గ్ను కుట్రలో భాగంగా హత్య చేశారని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అది ప్రమాద మరణమేనని సింగపూర్ కోర్టు నిర్ధారించినా, ఆయనకు బలవంతంగా మద్యం తాగించారని హిమంత వాదించారు. దీనిపై విచారణకు సిట్ కూడా ఏర్పాటు చేశారు. గార్గ్ మేనేజర్, ఈవెంట్ నిర్వాహకుడు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు సహా ఏడుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ ఉదంతాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకునేందుకు పారీ్టలన్నీ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు ప్రధాన హామీలలో గార్గ్ కేసుకూ స్థానం కలి్పంచింది! గార్గ్ హత్య ఎలా జరిగింది, బాధ్యులెవరన్నది తాము అధికారంలోకి వచి్చన 100 రోజుల్లో వెలికి తీసి నిజానిజాలను ప్రజల ముందుంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గార్గ్ కుటుంబానికి న్యాయం చేయలేకపోతే బీజేపీకి ఓటేయొద్దని హిమంత పలుమార్లు ప్రకటించడాన్ని పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఎన్నికల ర్యాలీల్లో పదేపదే గుర్తు చేస్తున్నారు. విచారణలో విపరీత జాప్యం జరుగుతోందంటూ గార్గ్ భార్య గరిమ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గార్గ్ మృతిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ మొదలవనుంది. స్మారకం చుట్టూ నేతల చక్కర్లు గువాహటి సమీపంలో నిర్మిస్తున్న గార్గ్ స్మారక కేంద్రం వద్ద నేతలు బారులు తీరుతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాష్ట్ర, జాతీయ నాయకులు నిత్యం పోటెత్తుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ వాద్రా మొదలుకుని ఆ పారీ్టకి చెందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దాకా ఈ జాబితాలో ఉండటం విశేషం! ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల రాక మరింత పెరిగింది. రాజకీయాలను ఆజన్మాంతం ద్వేషించిన జుబీన్ పేరు ఇప్పుడు రాజకీయంగా మారుమోగుతుండటం విచిత్రంగా ఉందంటూ ప్రజలు విస్తుపోతున్నారు! -
జైలు నుంచే అసెంబ్లీకి
ప్రొఫైల్ అఖిల్ గొగోయ్. రైజోర్ దళ్ అధ్యక్షుడు. శివసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. మార్క్సిస్ట్ విశ్వాసాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అస్సాం రైతులకు ఆశాకిరణంగా మారారు. భూ హక్కులు, పర్యావరణ పరిరక్షణ పోరాటాలతో వెలుగులోకి వచ్చి అవినీతి వ్యతిరేకోద్యమ నేతగా ఎదిగారు. అరెస్టులు, జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. జైలు నుంచే అసెంబ్లీకి ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రచారమే చేయకుండా ఎన్నికల్లో గెలిచిన తొలి అస్సామీ నేతగా నిలిచారు. వందకు పైగా కేసులు! అఖిల్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశలోనే మొదలైంది. గువాహతిలోని కాటన్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత సీపీఐ (ఎంఎల్) అనుబంధ సంస్థలో చేరినా కొంతకాలానికే బయటికొచ్చారు. ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టడానికి సమాచార హక్కు చట్టాన్నే ఆయుధంగా చేసుకున్నారు. అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ సమస్యలపై పోరాటానికి ‘కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి’(కేఎంఎస్ఎస్)ని ఏర్పాటు అఖిల్ ఉద్యమ ప్రయాణంలో కీలక మలుపు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, భూ హక్కుల కోసం, రైతులు, దినసరి కూలీల సమస్యలపై ఆందోళనలు చేపట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో అఖిల్ను అరెస్టు చేసినా కొంతకాలానికే నిర్దోషిగా విడుదలయ్యారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమంలోనూ పని చేశారు. 2012లో కొండ ప్రాంతాలవారిని బలవంతంగా ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ, కజిరంగా నేషనల్ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఉద్యమించి పలుమార్లు అరెస్టయ్యారు. ఆయనపై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కదాంట్లోనూ ఆయన దోషిగా నిర్ధారణ కాలేదు. వ్యక్తిగత జీవితం అఖిల్ 1976 మార్చి 1న జోర్హాట్లోని సెలెన్ఘాట్ గ్రామంలో జని్మంచారు. గువాహటిలోని కాటన్ కాలేజీలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. ఆయన తండ్రి, బోలురామ్ తల్లి ప్రియదా గొగోయ్, భార్య గీతాశ్రీ తమూలీ, కుమారుడు నచికేత ఉన్నారు. ఈసారి కాంగ్రెస్తో జట్టు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2019 డిసెంబర్లో ఉద్యమించడంతో హిమంత సర్కారు అఖిల్పై దేశద్రోహ ఆరోపణలు మోపి జైలుకు పంపింది. దానిపై ప్రజాగ్రహం పెల్లుబికింది. కేఎంఎస్ఎస్ సహా సుమారు 70 అనుబంధ సంస్థలు కలిసి అఖిల్ సారథ్యంలో ‘రైజోర్ దళ్’గా మారాయి. జైల్లో ఉంటూనే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో శివసాగర్ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యరి్థపైనే దాదాపు 12 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు! తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. అసెంబ్లీలో ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రైజోర్ దళ్ కాంగ్రెస్తో జట్టుకట్టింది. అఖిల్ పారీ్టకి కాంగ్రెస్ ఏకంగా 13 స్థానాలు కేటాయించింది! అఖిల్ మళ్లీ శివసాగర్ నుంచే బరిలో దిగారు. అక్కడ బీజేపీ భాగస్వామి అస్సాం గణ పరిషద్ కూడా స్నేహపూర్వక పోటీ చేస్తుండటం విశేషం. -
విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్డీఏ అంజలి’
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంటున్న వేళ ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. త్రిపుణితుర నియోజకవర్గం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రముఖ నటి అంజలి నాయర్ తన పేరు విషయంలో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాలెట్ పేపర్, ఈవీఎంలలో తన పేరును మార్చాలని ఆమె కోరుతున్నారు.అసలు సమస్య ఏమిటి?ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం.. అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ప్రస్తుతం ‘అంజలి పీవీ’వి. అని ఉంది. అయితే ఓటర్లకు ఆమె ‘అంజలి నాయర్’ గానే సుపరిచితురాలు. ఒకవేళ ఈవీఎంపై అంజలి పీవీ అని ఉంటే, సామాన్య ఓటర్లు గుర్తుపట్టలేరని, ఇది తన గెలుపు అవకాశాలపై, ఓట్ల శాతంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కోర్టులో వాదనలుతన ప్రచార సామాగ్రి, పోస్టర్లు, సోషల్ మీడియా పబ్లిసిటీ అంతా ‘అంజలి నాయర్’ అనే పేరుతోనే జరిగిందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల్లో ఉన్న పేరుకు, ప్రచారంలో ఉన్న పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని అంజలి నాయర్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కేరళ హైకోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.సాంకేతిక ఇబ్బందులుఅయితే ఈ దశలో పేరు మార్పు చేయడం ఎన్నికల సంఘానికి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళలో ఇప్పటికే కొన్ని విభాగాల్లో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. వృద్ధులు, వికలాంగుల కోసం ఇంటి వద్ద నుంచే ఓటు వేసే విధానం ఇప్పటికే ప్రారంభం కాగా, సర్వీస్ ఓటింగ్ కూడా త్వరలో మొదలుకానుంది. నామినేషన్ పత్రాల్లో ఉన్న పేరునే సాధారణంగా బ్యాలెట్ పేపర్పై ముద్రిస్తారు కాబట్టి, ఇప్పుడు మార్పులు చేయడం ఎంతవరకు సాధ్యమనేది ఉత్కంఠగా మారింది.ఇది కూడా చదవండి: కెనడా గ్యాంగ్వార్లో పంజాబ్ యువకుడి హత్య -
‘దీదీ’ ఇలాకాలో సినీ తారల ధమాకా!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలంటేనే ఒక హై వోల్టేజ్ డ్రామా. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలన్నా, ప్రతిపక్షంలో నిలబడాలన్నా కేవలం సిద్ధాంతాలు ఉంటే సరిపోదు.. ప్రజల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన ‘గ్లామర్’ కూడా తోడవ్వాలి. దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయాలను శాసిస్తున్న మమతా బెనర్జీ (టీఎంసీ) నుంచి, సవాల్ విసురుతున్న బీజేపీ (బీజేపీ) వరకు అందరికీ సినీ తారలే బ్రహ్మాస్త్రాలుగా మారారు. ఒకప్పుడు కేవలం ప్రచారానికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు, నేడు నేరుగా ఎన్నికల బరిలో నిలిచి, పార్లమెంటు మెట్లు ఎక్కుతున్నారు. అటు గ్లామర్ అటు పవర్.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్న ఆ బెంగాలీ అగ్ర తారల ప్రస్థానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.మిథున్ చక్రవర్తి: ‘డిస్కో డాన్సర్’ నుంచి బీజేపీ స్టార్ వరకు..బెంగాలీ సినిమాతో పాటు బాలీవుడ్ లోనూ ‘గ్రాండ్ మాస్టర్'గా పేరు తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి రాజకీయ ప్రస్థానం ఆసక్తికరం. గతంలో తృణమూల్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక నేతగా ఉన్నారు. తన డైలాగులతో ప్రచార సభల్లో ఉత్సాహం నింపడం ఆయన ప్రత్యేకత.నుస్రత్ జహాన్: వివాదాలు.. విజయాలుబెంగాలీ సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరైన నుస్రత్ జహాన్, 2019లో తృణమూల్ కాంగ్రెస్ తరపున బసిర్హాట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తన పెళ్లి, పార్లమెంటులో తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచే నుస్రత్, 2024 వరకు ఎంపీగా సేవలు అందించారు.మిమీ చక్రవర్తి: యువత ఆరాధ్య దైవంనుస్రత్ జహాన్ ఆప్తమిత్రురాలు మిమీ చక్రవర్తి కూడా 2019లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. జాదవ్పూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఇటీవల తన పదవికి రాజీనామా చేసి తిరిగి సినిమాలపై దృష్టి సారించినప్పటికీ, రాజకీయాల్లో ఆమె ప్రభావం మాత్రం తగ్గలేదు.చిరంజిత్ చక్రవర్తి: నిలకడైన రాజకీయ నాయకుడువెండితెరపై హీరోగా మెప్పించిన చిరంజిత్, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. బారాసత్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అతికొద్ది మందిలో ఈయన ఒకరు.సాయోనీ ఘోష్: కొత్త తరం గళంనటి, గాయని అయిన సాయోనీ ఘోష్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. గతంలో టీఎంసీ యువజన విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె 2024 ఎన్నికల్లో జాదవ్పూర్ నుంచి ఎంపీగా గెలిచి, పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆమె ప్రసంగాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి.హిరన్ ఛటర్జీ: బీజేపీ పోరాట యోధుడుఖరగ్పూర్ సదర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న హిరన్ ఛటర్జీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నారు. సినిమాల్లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్నప్పటికీ, రాజకీయాల్లో మాత్రం మాస్ లీడర్గా ఎదిగారు.సోహమ్ చక్రవర్తి - రాజ్ చక్రవర్తిసోహమ్ చక్రవర్తి: చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా ఎదిగిన సోహమ్, ప్రస్తుతం టీఎంసీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ సినీ విభాగంలో చురుగ్గా ఉంటూ చండిపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.రాజ్ చక్రవర్తి: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ చక్రవర్తి, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులు. బరాక్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అటు సినిమాలు ఇటు రాజకీయాలను సమన్వయం చేసుకుంటున్నారు.పర్ణో మిత్ర - సయంతిక బెనర్జీనటి పర్ణో మిత్ర గతంలో బీజేపీలో చేరి వార్తల్లో నిలిచారు. మరోవైపు సయంతిక బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్లో చేరి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.శ్రావంతి ఛటర్జీ: గ్లామర్ పాలిటిక్స్ప్రముఖ నటి శ్రావంతి ఛటర్జీ 2021 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే, ఆ ఎన్నికల తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వార్తల్లో నిలిచారు.పశ్చిమ బెంగాల్లో కేవలం గ్లామర్ ఉంటేనే రాజకీయాల్లో గెలవడం సాధ్యం కాదు. ప్రజల సమస్యల మీద పోరాడాలి. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పైన పేర్కొన్న నటీనటులు ఈ రెండు రంగాల్లోనూ సమతూకం పాటిస్తూ, బెంగాల్ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. సినిమాల్లో వారి పాత్రలు ఎలా ఉన్నా, రాజకీయ తెరపై వారు పవర్ ఫుల్ లీడర్లుగానే కనిపిస్తున్నారు.ఇది కూడా చదవండి: అస్సాం ‘వార్’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ! -
కాంగ్రెస్.. రాజకీయ రాబందు
థరాడ్/గాందీనగర్: కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాబందులా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి పశ్చిమాసియా పరిణామాలను వాడుకుంటోందని మండిపడ్డారు. ఆ ఉద్రిక్తతలు మనపై ప్రభావం చూపకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. మంగళవారం గుజరాత్లోని వావ్ థరాడ్ జిల్లా నానీ గ్రామంలో మోదీ పర్యటించారు.రూ.19,806 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఖేడ్బ్రహ్మ–హిమ్మత్నగర్–అసర్వా రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్ పుకార్లు వ్యాప్తి చేస్తోంది. ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్ ఏజెన్సీ ముందు క్యూ కట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ నేతలు విచ్చింన్న రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. పరిస్థితులు అదుపు తప్పితే దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి కాంగ్రెస్ కాచుకొని ఉంది’’ అని దుయ్యబట్టారు. ఇంధన భారం పడకుండా చర్యలుపలు దేశాలు యుద్ధం, అశాంతి, అస్థిరతలో కూరుకుని ఉంటే భారత్ మాత్రం సుస్థిరత, ఐక్యతను ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పశి్చమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం కొరత పెరిగిందని గుర్తుచేశారు. ఇంతటి సంక్షోభంలోనూ మన బలమైన విదేశాంగ విధానం, పౌరుల సమష్టి కృషితో ప్రతికూల పరిస్థితిని విజయవంతంగా నియంత్రిస్తున్నామని తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచమంతటా ఇంధనం ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయన్నారు. ఈ భారం మన ప్రజలపై పడకుండా చర్యల చేపటినట్లు వెల్లడించారు. శాంతి, అహింస సందేశం ప్రపంచ అస్థిరత, అశాంతి మంటల్లో చిక్కుకున్న నేటి తరుణంలో సామ్రాట్ సంప్రాతి మ్యూజియం శాంతి, అహింస సందేశాన్ని ఇస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ సమీపంలో శ్రీమహావీర్ జైన్ ఆరాధన కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన ఈ మ్యూజియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మ్యూజియం వారసత్వం, సందేశం మన దేశానికే కాకుండా మొత్తం మానవాళికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. విశ్వసనీయ సరఫరాదారు భారత్ గుజరాత్లోని సనంద్లో కేనెస్ సెమీకాన్ కంపెనీ ఆధ్వర్యంలోని సెమీకండక్టర్ ప్లాంట్ను మోదీ ప్రారంభించారు. సెమీకండక్టర్లలో మనదేశం విశ్వసనీయ సరఫరాదారుగా మారిందని చెప్పారు. ‘‘21వ శతాబ్దం పలు సవాళ్లు తెచి్చంది. సంఘర్షణల వల్ల ప్రపంచ సప్లై చైన్లు ప్రభావితమయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో సాంకేతికత, ఇంధన భద్రతకు మా ప్రభుత్వం బలమైన పునాది వేస్తోంది’’ అని వివరించారు. -
హీరో విజయ్ ఏం చదివారో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి–ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తనకు సంబంధించిన ఆస్తులు, వాహనాలు, విద్యా వివరాలను పొందుపరిచారు. తనకు రూ.603.20 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.విలాసవంతమైన కార్లు, బైకులుఅఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం విజయ్కు అత్యంత ఖరీదైన, విలాసవంత బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టొయోటా లెక్సస్ 350, టొయోటా వెల్ఫైర్ కార్లతోపాటు మరికొన్ని బైకులు ఉన్నాయి. మొత్తంలో ఆస్తుల్లో రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నారు. కొడైకెనాల్లో వ్యవసాయ భూమి, చెన్నై పరిసరాల్లో రూ.198.62 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నాయి. 2015–16 ఏడాదికి సంబంధించి రూ.1.5 కోట్ల విలువైన ఆస్తి వివాదాల్లో ఉంది. ఇప్పుడది కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ట్యాక్స్(అప్పీల్స్), హైకోర్టులో పెండింగ్లో ఉంది. 2022–23 ఏడాదికి సంబంధించి రూ.14.13 లక్షల విలువైన మరో ఆస్తి సైతం వివాదాల్లో ఉంది.భార్య పేరిట విడిగా ఆస్తులువిజయ్ భార్య సంగీత పేరిట విడిగా రూ.15.76 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు, రూ.25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. విజయ్ వద్ద రూ.2 లక్షల నగదు, వేర్వేరు బ్యాంకుల్లో రూ.213 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. విజయ్ వద్ద 883 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి.అప్పులు లేవుతనకు ఎలాంటి అప్పులు లేవని విజయ్ అఫిడవిట్లో వెల్లడించారు. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్కు రూ.3 కోట్లు, తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్కు రూ.3.02 కోట్లు, తల్లి శోభాశేఖర్కు విజయ్ రూ.8.71 లక్షలు ఇచ్చారు. ఏఎల్పీ ఆంటోనియస్ బ్రిటో, కోకిలాంబల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు చెరో రూ.20 కోట్లు, విద్యా చారిటబుల్ ట్రస్ట్కు రూ.5.84 కోట్లు ఇచ్చారు. భార్య సంగీతకు రూ.12.60 కోట్లు, కుమారుడు జేసన్ సంజయ్కు రూ.8.78 లక్షలు, కుమార్తె విద్యా సాశకు రూ.4.60 లక్షలు ఇచ్చారు. ఏటా స్వయంఉపాధి(నటన), వడ్డీలు, స్థిరాస్తుల నుంచి అద్దెల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోందని విజయ్ అఫిడవిట్లో పేర్కొన్నారు.చదవండి: ఎన్నికల వేళ.. విజయ్కు మరో షాక్డిగ్రీ డిస్కంటిన్యూవిజయ్ విద్యార్హతలను గమనిస్తే.. 1989లో పదోతరగతి పాసయ్యారు. ఆ తర్వాత ప్రైవేట్గా ఇంటర్మీడియట్ చదివారు. 1992లో చెన్నై లయోలా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ మధ్యలోనే ఆపేశారు. -
బెంగాల్లో అనూహ్య పరిణామం.. బీజేపీలోకి టెన్నిస్ దిగ్గజం
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పేస్ పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్కతాలో లియాండర్ పేస్ జన్మించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో బ్రెజిల్కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా పేస్ నిలిచారు.ప్రొఫెషనల్ టెన్నిస్లో సింగిల్స్ కంటే డబుల్స్పై దృష్టి సారించిన పేస్ పురుషుల గ్రాండ్స్లామ్ టోర్నీల్లో డబుల్స్లో ఎనిమిది సార్లు, పది సార్లు మిక్స్డ్ డబుల్స్ లో టైటిల్స్ సాధించాడు. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో కీలకమైన యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పేస్ను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్ని బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామం. #WATCH | Delhi: Former ace Tennis star Leander Paes joins the BJP, in the presence of Union Ministers Kiren Rijiju and Sukanta Majumdar. pic.twitter.com/qIDW1OovWz— ANI (@ANI) March 31, 2026 -
మరోసారి బరిలో ఎలక్షన్ కింగ్
సాక్షి, చెన్నై : ఎలక్షన్ కింగ్గా సుపరిచితులైన కె. పద్మరాజన్ (65) తన రికార్డును మరింత సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆయన సోమవారం మెట్టూరు నియోజకవర్గంలో తన 253వ నామినేషన్ దాఖలు చేశారు. రికార్డుల రారాజు: సేలం జిల్లా మెట్టూరు సమీపంలోని కుంజండియూర్కు చెందిన పద్మరాజన్, గత 38 ఏళ్లుగా (1988 నుండి) దేశంలోని అన్ని ప్రధాన ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. అత్యధిక సార్లు ఓడిపోయిన అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. దిగ్గజాలతో పోటీ: గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ వంటి ప్రధానులతో పాటు కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఎడప్పాడి పళనిసామి వంటి హేమాహేమీలపై ఈయన పోటీ చేశారు. మెట్టూరులో నామినేషన్ వేసిన అనంతరం పద్మరాజన్ మాట్లాడుతూ.. తన 254వ నామినేషన్ను చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గంలో దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ను ఢీకొననున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకు ఎన్నికల డిపాజిట్ల కోసం దాదాపు రూ. కోటికి పైగా ఖర్చు చేసినట్లు పద్మరాజన్ వెల్లడించారు. 2011 జరిగిన మెట్టూరు అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన 6,700 ఓట్లే ఇప్పటి వరకు ఆయన సాధించిన అత్యధిక ఓట్ల రికార్డు కావడం గమనార్హం. గెలవడం తన ఉద్దేశం కాదని, ఒక సామాన్యుడు కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో పోటీ పడవచ్చని నిరూపించడమే తన లక్ష్యమని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడమే తన అంతిమ ధ్యేయమని పద్మరాజన్ పేర్కొన్నారు. -
ఒకే కుటుంబం.. మూడు పార్టీలు!
సాక్షి, చెన్నై : ఎన్నికలలో ఆసక్తికరంగా ఒకే కుటుంబానికి చెంది బిగ్ షాట్లు ముగ్గురు పోటీలో ఉన్నారు. అయితే, వీరంతా వేర్వేరు పార్టీల తరపున పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. వీరు తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే రక్తసంబంధం ఉన్నప్పటికీ, సిద్ధాంతపరంగా భిన్నమైన బాటలు ఎంచుకుని తల్లి, కుమారుడు , అల్లుడు ఎన్నికల క్షేత్రంలో తలపడుతున్నారు. వీరంతా లాటరీ కింగ్ మార్టిన్ ఫ్యామిలీకి చెందిన వారు కావడం గమనార్హం. లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ పోటీలో ఉ న్నారు. ఆమె కుమారుడు జోష్ చార్లెస్ మార్టిన్ ఎన్డీఏ కూటమిలో లక్ష్య జననాయగ కట్చి తరపున పుదుచ్చేరిలోని కామరాజర్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక, లీమా రోజ్ మేనల్లుడు ఆధవ్ అర్జున టీవీకే తరపున విల్లివాక్కంలో పోటీ చేస్తుండటం గమనార్హం. లాటరీ మార్టిన్గా పేరుగడించిన వ్యాపార వేత్త కుటుంబానికి చెందిన వారు ఇలా తలా ఓ పార్టీ తరపున పోటీలో ఉండడం రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. వీరి నామినేషన్లలో ఆస్తులు కోట్లు కోట్లుగా ఉండడం గమనార్హం. -
ఎన్నికల వేళ.. టీవీకే విజయ్కు మరో షాక్!
చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు.ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. విజయ్ 30 లౌడ్స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల నియమాలను ఆయన ఉల్లంఘించినట్లు కుమార్ చెప్పారు.కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరవల్లూర్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయ్తో పాటు సుమారు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు.పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విజయ్ సోమవారం (మార్చి 30న) నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ రోడ్షో నిర్వహించారు. రోడ్షోకు భారీగా జనాలు వచ్చారు. అయితే, చెన్నై పోలీసులపై టీవీకే నేతలు పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం సజావుగా సాగేందుకు పోలీసులు భద్రత కల్పించలేదని, ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేదని అన్నారు.చెన్నై పోలీసులు తమకు భద్రత కల్పిస్తూ, తమ ప్రచారాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని టీవీకే విజ్ఞప్తి చేసింది. ప్రచారం చేసుకోవడానికి అనుమతి పొందిన తర్వాత కూడా విజయ్కు భద్రత కల్పించలేదని చెప్పింది.కాగా, విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, త్రిచీ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. ఆయా స్థానాల్లో డీఎంకే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆర్డీ శేఖర్, ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ విజయ్కు ప్రత్యర్థులుగా ఉన్నారు. పెరంబూర్ నియోజకవర్గంలో 2016 వరకు సీపీఎం ఆధిపత్యం ఉండేది. ఆర్డీ శేఖర్ 2019 ఉపఎన్నికలో గెలిచి ఈ స్థానం దక్కించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. -
ఎన్నికల రేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్టు
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళ నేతృత్వంలోని అఖిల భారత పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్రకళగం అభ్యర్థిగా ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరుగడించిన మాజీ పోలీసు అధికారి ఎస్. వెల్లదురై రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలలో శశికళ పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుతో కలిసి కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో సోమవారం శశికళ జాబితాను ప్రకటించారు. 21 మందితో తొలి జాబితాను ఆమె ప్రకటించారు. ఇందులో శంకరన్ కోయిల్ నుంచి అన్నాడీఎంకే మాజీ ఎంపీ వసంతి మురుగేషన్ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మదురైలో చక్రవర్తి, తిరుచ్చి తూర్పులో నందకుమార్, రాజ పాళయంలో డాక్టర్ హరీష్ ముదుకులత్తూరులో రిటైర్డ్ అదనపు ఎస్పీ డాక్టర్ రాంకుమార్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే,పొత్తుల మేకు సాత్తూరు, ఆలంకులం నియోజకవర్గాలను పసుంపొన్ మక్కల్ దేశం కట్చి, నన్నిలం నియోజకవర్గాన్ని వెల్లలార్ మున్నేట్ర కళగంకుకు కేటాయించినట్టు వివరించారు. అదే సమయంలో శశికళ పార్టీ తరపున నాంగునేరిలో పోటీ చేస్తున్న అభ్యర్థిపై అందరి దృష్టి పడింది. పోలీసు శాఖలో రిటైఱ్డ్ ఎస్పీగా ఉన్న వెల్ల దురై ఇక్కడ అభ్యర్థి కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. స్మగ్లర్ వీరప్పన్ వేటలో కీలక పాత్ర పోషించిన వెల్లదురై, తన సర్వీసులో ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొని ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్నో సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఎన్నికల రేసులో ఆయన దిగడంతో నాంగునేరి నియోజకవర్గంలో చర్చ మొదలైంది. -
అస్సాం ‘వార్’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ!
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఏప్రిల్ 9న జరగనున్న 126 అసెంబ్లీ స్థానాల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2.49 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించబోతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హేమాహేమీలు తలపడుతున్న ఈ స్థానాలే అస్సాంలో తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఆ కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక విశ్లేషణ..జోర్హాట్: దిగ్గజాల మధ్య హోరాహోరీఎగువ అస్సాంలోని జోర్హాట్ ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక స్థానంగా నిలిచింది. ఇక్కడ బీజేపీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హితంద్ర నాథ్ గోస్వామి.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ గౌరవ్ గొగోయ్తో తలపడుతున్నారు. 2016 నుంచి ఇక్కడ బీజేపీదే హవా.. కానీ, 2024 లోక్సభ ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్లో గౌరవ్ గొగోయ్కు 12,130 ఓట్ల ఆధిక్యం లభించింది. నియోజకవర్గ పునర్విభజన తర్వాత మహిళా ఓటర్ల ప్రాబల్యం ఈ పోరును ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా మార్చేసింది.శివసాగర్: ప్రాంతీయత వర్సెస్ జాతీయ శక్తిచారిత్రక శివసాగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. రైజోర్ దళ్ అధినేత అఖిల్ గొగోయ్ 2021లో జైలు నుంచే పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఈసారి ఆయనను ఢీకొట్టేందుకు బీజేపీ నుంచి కుశాల్ దోవారీ, మిత్రపక్షం అసోం గణ పరిషత్ (ఏజీపీ) నుంచి ప్రదీప్ హజారికా బరిలో ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల మధ్యే ఇక్కడ ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్’ జరగడం అఖిల్ గొగోయ్కు కలిసి వస్తుందా లేక ఓట్లు చీలుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.బిహ్పురియా: ఫిరాయింపుల సెగబిహ్పురియాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కాషాయ కండువా కప్పుకుని బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ నుంచి నారాయణ్ (రామ్) భుయాన్ రంగంలో ఉన్నారు. ఆయన స్థానిక నిరుద్యోగం, గ్రామీణ ఆర్థిక సమస్యలను అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. బీజేపీలో అంతర్గత అసమ్మతి భూపేన్ బోరాకు సవాల్గా మారింది.జలుక్బారీ: ముఖ్యమంత్రి కోటముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన శక్తిని మరోసారి నిరూపించుకోవడానికి జలుక్బారీ నుంచి ఆరోసారి బరిలోకి దిగుతున్నారు. 2021లో లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన హిమంతకు ఇక్కడ ఎదురులేదనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్ ఆయనను ఢీకొంటున్నారు. నియోజకవర్గ పునర్విభజన జరిగినప్పటికీ, పట్టణ ఓటర్లు హిమంత వైపే మొగ్గు చూపుతారనే అంచనాలు ఉన్నాయి.దిస్పూర్: రాజధాని పోరులో ‘రెబల్’ సెగరాష్ట్ర రాజధాని దిస్పూర్ నియోజకవర్గంలో రాజకీయం మెగా డ్రామాను తలపిస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ప్రద్యుత్ బోర్డోలోయ్ ఇక్కడి అభ్యర్థి. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్తకూర్ గోస్వామి పోటీ చేస్తున్నారు. అయితే, టికెట్ దక్కని బీజేపీ సీనియర్ నేత జయంత కుమార్ దాస్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం బీజేపీకి తలనొప్పిగా మారింది. 2.43 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గం అస్సాం పట్టణ ఓటర్ల నాడిని ప్రతిబింబిస్తుంది.గౌహతి సెంట్రల్: అనుభవం వర్సెస్ యువతకొత్తగా ఏర్పడిన గౌహతి సెంట్రల్లో తరం మారుతున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ గుప్తాతో 27 ఏళ్ల యువ నాయకురాలు, అస్సాం జాతీయ పరిషత్ (AJP) అభ్యర్థి కుంకీ చౌదరి తలపడుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి వర్సెస్ యువత ఉపాధి అనే నినాదాల మధ్య ఇక్కడ పోరు సాగుతోంది. ఆప్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఉండటంతో ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది.తముల్పూర్: మిత్రుల మధ్య యుద్ధంబోడోలాండ్ రీజియన్లోని తముల్పూర్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎన్డీఏ మిత్రపక్షాలైన బీజేపీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) ఇక్కడ నేరుగా తలపడుతున్నాయి. బీజేపీ నుంచి బిస్వజిత్ దైమరీ, యూపీపీఎల్ అధినేత ప్రమోద్ బోరో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో రఫీ దైమరీ బరిలో ఉండటంతో, బోడో ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: Assam: క్షుద్ర విద్యల రాజధానికి నేతల క్యూ -
కేరళ ఎన్నికలు.. ఈసీ సరికొత్త ప్రయోగం
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ సరికొత్త ప్రయోగం చేపట్టింది. పేరు ఓట్ స్వీటెన్డ్ కేరళ క్యాంపెన్. ఇందులో భాగంగా మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి హల్వా ప్యాకెట్లు అందజేశారు. ఇందుకుగాను, ప్రతి జిల్లాకు 200 చొప్పున హల్వా ప్యాకెట్లను అందజేస్తారు.ఏఏ బూత్లలో వీటిని ఫస్ట్ టైం ఓటర్లకు అందజేయాల్సిందీ జిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయించి, ఆ మేరకు ఆయా బూత్లకు పంపిణీ చేయనున్నారు. కొత్త ఓటర్లకు ఉత్సాహం కలిగించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశమని ఈసీ తెలిపింది. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. -
బెంగాల్ దీదీకి ‘సరిహద్దు’ సెగ
దేశ రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తి రేపే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని ఈసారి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరిహద్దు అంశాలు తలపోటుగా మారాయి. చొరబాటు అ్రస్తాన్ని సంధించి ఎలాగైనా దీదీ కోటలో పాగా వేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. బెంగాల్కు బంగ్లాదేశ్తో 2,216 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలకు ఇదే కేంద్ర బిందువుగా మారింది. చొరబాట్లు కేంద్రం వైఫల్యమే.. సరిహద్దు గుండా శరణార్థులు, చొరబాటుదారుల రాక భారీగా పెరిగిందని, ఇది రాష్ట్ర జనాభా ముఖచిత్రాన్ని మార్చేస్తోందంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని చెబుతూ హిందువుల ఓట్ల ఏకీకరణకు ప్రయతి్నస్తోంది. మరోవైపు, అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. సరిహద్దుల భద్రత చూసుకునే బీఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, చొరబాట్లు జరిగితే అది కేంద్రం వైఫల్యమేనని సీఎం మమతా బెనర్జీ వాదిస్తున్నారు. బంగ్లాదేశ్తో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేస్తూ, చొరబాట్ల పేరుతో బెంగాలీలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో రైతులను ప్రభావితం చేసే ‘తీస్తా నదీ జలాల పంపిణీ’వివాదం కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ‘మతువా’ల చుట్టూ రాజకీయ చదరంగం బెంగాల్లో దాదాపు 17 శాతం ఉన్న దళిత (నామశూద్ర) ‘మతువా’సామాజిక వర్గం ఉత్తర 24 పరగణాలు, నదియా లాంటి సరిహద్దు జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించగలదు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వీరు భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద అధికారికంగా పౌరసత్వం కల్పిస్తామంటూ బీజేపీ ఇచి్చన హామీ వారిని ఆకర్షిస్తోంది. అయితే, సీఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని టీఎంసీ చెబుతోంది. మతువాలు ఇప్పటికే భారత పౌరులని దీదీ వాదిస్తున్నారు. సీఏఏ బీజేపీకి అస్త్రంగా మారింది. దీదీ మాత్రం సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓట్ల ఏకీకరణపై ఆశలు పెట్టుకున్నారు. సరిహద్దు జిల్లాల్లో పెరిగిన ముస్లిం జనాభా బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న 7 జిల్లాల్లో ప్రతి ఏటా దాదాపు 5 వేల చొరబాటు కేసులు నమోదవుతున్నాయి. గుర్తించని చొరబాట్లు ఇంకా ఎన్నోరెట్లు ఉంటాయి. సరిహద్దు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగింది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ముస్లిం జనాభా 50 శాతానికిపైగా ఉండగా, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో 40 శాతం వరకు ఉంది. అక్రమ చొరబాట్ల వల్లే ముస్లింల జనాభా పెరిగినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ముస్లింలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని, బెంగాల్ సంస్కృతి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆక్షేపిస్తోంది. పెండింగ్లో 40 లక్షల ఎస్ఐఆర్ కేసులు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా సుమారు 25 లక్షల ఓటర్ల కేసులు పరిష్కారం కాగా, ఇంకా 40 లక్షల కేసులు పరిశీలనలోనే ఉండటం రాజకీయ చర్చకు దారితీసింది. సరిహద్దు జిల్లాలైన ముర్షిదాబాద్లో 12 లక్షల కేసులు, మాల్డాలో 8 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన వివాదాస్పద ఓటర్లలో 20 లక్షల మంది ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఉన్నారు.సరిహద్దు జిల్లాల్లో పరిస్థితి ఇలా.. → జనాభాలో సగానికి పైగా ముస్లింలు ఉండే ముర్షీదాబాద్, మాల్డా జిల్లాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటలు. కానీ, ఇప్పుడు టీఎంసీ పాగా వేసింది. ఇక్కడ హిందువుల ఓట్లను సంఘటితం చేయాలని బీజేపీ, పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని వామపక్ష కూటమి యతి్నస్తున్నాయి. → రాజ్బన్షీలు, గూర్ఖాలు, తేయాకు తోటల కారి్మకులు ఉన్న ఉత్తర బెంగాల్ (కూచ్ బెహార్, జల్పాయ్గురి, డార్జిలింగ్) భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నమైనది. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు సజీవంగా ఉన్నాయి. ఈ ప్రాంతం కొన్నేళ్లుగా బీజేపీకి ఆయువుపట్టుగా మారింది. → సుందర్బన్స్ అటవీ ప్రాంతంతో కూడిన దక్షిణ 24 పరగణాల జిల్లా టీఎంసీకి అభేద్యమైన కోట అనడం సబబు. మైనారీ్టలు, గ్రామీణ పేదలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో ఇక్కడ ఏ ఎన్నికలైనా సరే టీఎంసీ విజయం సాధిస్తోంది. స్థానికంగా బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది. -సోమన్నగారి రాజశేఖర్రెడ్డి -
బీజేపీ ఎల్డీఎఫ్ రహస్య దోస్తీ
పథనంతిట్ట/కొట్టాయం: కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమితో బీజేపీ రహస్య దోస్తీ కొనసాగిస్తోందని, రెండూ కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్ ఆదూర్ పట్టణంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ‘‘మనం ఎన్నికల్లో ఒక్క కూటమిని మాత్రమే ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎల్డీఎఫ్ కూటమితో బీజేపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. అందుకే శబరిమల అంశంపై మోదీ ఏమీ మాట్లాడటం లేదు. దేశంలో ఎక్కడికెళ్లినా మతం, ఆలయాల ప్రస్తావన తెచ్చే మోదీ.. కేరళలో మాత్రం ఎందుకు శబరిమల అంశంపై మౌనం దాల్చారు?. ఎన్నికల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటేనే మోదీ మతపరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. లేదంటే వాటి ఊసెత్తరు’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘దేశవ్యాప్తంగా తమకు గిట్టని పారీ్టలు, నేతలపై ఈడీని ఉసిగొల్పే మోదీ సర్కార్ కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ కూటమి పారీ్టలు, నేతలను ఎందుకు వదిలేసింది? అదే నాపై అయితే డజన్లకొద్దీ కేసులు మోపి విచారణ పేరిట దర్యాప్తు సంస్థల కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. నాపై 36 కేసులు పెట్టారు. ఏకధాటిగా 55 గంటలపాటు విచారించారు. ఇలాంటి కఠిన చర్యలు కేరళ ముఖ్యమంత్రి లేదా ఎల్డీఎఫ్ నేతలపై ఎందుకు తీసుకోవట్లేదు?’’అని మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ నిలదీశారు. ‘‘ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త చెప్పినట్లు మార్కెట్లో ఒక అదృశ్యశక్తి ఉందంటే అది మాత్రమే ఆర్థికవ్యవస్థను నడిపిస్తుందని అర్థం. అలాగే కేరళ ఎన్నికల్లో అదృశ్యశక్తి దాగి ఉంది. అదే బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. అందుకే కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ కుటిలయత్నాలు చేస్తోంది. పాలక్కడ్లో మోదీ ఆదివారం మాట్లాడారుగానీ కీలక అంశాలను వదిలేశారు. అయ్యప్ప ఆలయంలో వామపక్ష నేతల చోరీని మోదీ మాటవరసకైనా ప్రస్తావించలేదు’’అని రాహుల్ అన్నారు. ఆర్ఎస్ఎస్కు మాత్రమే నిధులు అందాలేమో.. యూడీఎఫ్ కూటమి అభ్యర్థి చాందీ ఊమెన్కు మద్దతుగా రాహుల్ సోమవారం పథుప్పల్లి నియోజకవర్గంలో ప్రచారంచేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు సైకిల్ తొక్కి అక్కడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన విదేశీ విరాళాల(నియంత్రణ)చట్టం సవరణ బిల్లుపై రాహుల్ అభ్యంతరం వ్యక్తంచేశారు.‘‘హఠాత్తుగా ఎఫ్సీఆర్ఏ చట్టం తెచ్చారు. ఇందులో గమ్మత్తైన విషయమేంటంటే విదేశాల నుంచి ఇకపై కేవలం ఒక సంస్థ మాత్రమే విరాళాలు పొందే ఆస్కారముంది. అదే ఆర్ఎస్ఎస్. గౌతమ్ అదానీ ద్వారా విదేశీపెట్టుబడిదారులను మోదీ శాసిస్తున్నారు. మరోవైపు ప్రతిపాదిత ఎఫ్సీఆర్ఏ నిబంధనలతో ఆర్ఎస్ఎస్ మాత్రమే లబ్ధిపొందనుంది’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. -
చొరబాటు.. ఎన్నికల అంశం కాదు
న్యూఢిల్లీ: అస్సాంను సమస్యగా పరిణమించిన చొరబాటు అంశాన్ని కేవలం ఎన్నికల్లో ప్రచారాంశంగా చూడొద్దని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాట్లు అనేవి దేశ పౌరుల గుర్తింపునకు, జాతీయ భద్రతకు గొడ్డలిపెట్టుగా తయారవుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. మరో పది రోజుల్లో అస్సాంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోని బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో ‘మేరా బూత్, సబ్సే మజ్బూత్ సంవాద్’కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్గా భేటీ అయ్యారు. ‘‘అస్సాంలో తొలిసారిగా ఓటేసే యువ ఓటర్లు రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థ పాలనలను ఒకసారి గుర్తుచేసుకోండి. పొరపాటున కాంగ్రెస్కు ఓటేసినా మీరు చేసే ఈ తప్పు రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిపథం నుంచి పక్కకు తప్పిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టేలా బీజేపీ కార్యకర్తలు బాగా శ్రమించాలి. చొరబాట్లు అనేవి కేవలం ఎన్నికల అంశం కానేకాదు. అస్సాం రాష్ట్ర గుర్తింపు పరిరక్షణకు సంబంధించిన అంశమిది. చొరబాటుదారులు అక్రమంగా భూములను లాక్కునేలా కాంగ్రెస్ ప్రోత్సహించింది. చొరబాటుదారులు ఒక్కసారి రాష్ట్రంలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారంటే అక్కడి చిరువ్యాపారాలను తమపరంచేసుకుంటారు. దాంతో స్థానికుల జీవనోపాధి కష్టమవుతోంది. ఆక్రమణను కాంగ్రెస్ ప్రోత్సహిస్తే బీజేపీ వాటిని అడ్డుకుంది. ఈశాన్య భారతంలో కేంద్రప్రభుత్వం శాంతిస్థాపన కోసం వేర్వేరు సంస్థలతో 12 శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది. అదే కాంగ్రెస్ ఒప్పందాలను కాగితాలకే పరిమితంచేసింది. కేవలం ఆర్భాటం చేస్తూ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కి ప్రజలను తప్పుదోవపట్టించింది. కాంగ్రెస్పాలనలో అస్సాం హింసతో రగిలిపోయింది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు శాంతిస్థాపనకు శతథా కృషిచేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్క శాంతి ఒప్పందం అమలుకునోచుకోలేదు. దీంతో యువత అశాంతితో రగిలిపోయారు. నాడు బోడోల్యాండ్లో కర్ఫ్యూలు కన్పించేవి. బాంబుమోతలు విన్పించేవి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు శాంతి, సుస్థిరత సాధించాయి. ఒకప్పుడు హింసను చవిచూసి నేడు శాంతిపథంలో దూసుకెళ్తున్న అస్సాం దేశానికే ఒక ఆదర్శదాయకం’’అని అన్నారు. ‘‘అస్సాం బీజేపీ కార్యకర్తలందరికీ ఇదే నా ఆహా్వనం. నేను కూడా మీలాగా కార్యకర్తనే. నాపై మోపిన బాధ్యతను నెరవేర్చా. నేడు ఏఐతో వచ్చే ఆడియో, వీడియో సందేశాలపై అప్రమత్తంగా ఉండండి. మీ అందరి వద్దా నమో యాప్ ఉండాలి. నారీశక్తి కోసం పార్టీ చేపట్టే చర్యల సమగ్ర వివరాలు యాప్ ద్వారా తెల్సుకుని ఓటర్లకు అవగాహన పెంచండి’’అని మోదీ సూచించారు. -
జ్యోతిష్యంతో క్యాన్సర్ నయమవుతుందట..
కోయంబత్తూరు: తమిళనాడు ఎన్నికల వేళ కోయంబత్తూరు-గౌండంపాళయం నియోజకవర్గ అభ్యర్థిగా టీవీకే తరఫున కనిమొళి సంతోష్ పేరును ప్రకటించడంతో వివాదం రాజుకుంది. గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక పోస్టులో ఆమె.. “మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్ను 100 శాతం నయం చేయవచ్చు” అని చెప్పినట్లు ఉంది.సెలబ్రిటీ జ్యోతిష్కురాలు కమిమొళి నరసింహనాయకన్పాళయం ప్రాంతానికి చెందిన కనిమొళి న్యాయవాది, వ్యాపారవేత్త. అంతేకాదు, తనను తాను సెలబ్రిటీ జ్యోతిష్కురాలినని, వాస్తు నిపుణురాలినని చెప్పుకుంటారు. మెడికల్ ఆస్ట్రాలజీపై ఆమె చేసిన పాత సోషల్ మీడియా పోస్టులను ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. ఒక వీడియోలో కనిమొళి మాట్లాడుతూ.. “మెడికల్ ఆస్ట్రాలజీ జ్యోతిష్యంలో ప్రత్యేక శాఖ. క్యాన్సర్ ప్రాణాపాయం కలిగించే వ్యాధి. మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్ను కూడా పూర్తిగా నయం చేయవచ్చు” అని చెప్పారు. అలాగే వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి వచ్చే వ్యాధులను గుర్తించవచ్చని, సరైన పరిష్కారాలు తెలుసుకోవచ్చని కూడా తెలిపారు.కనిమొళికి ప్రస్తుతం సోషల్ మీడియాలో 1,00,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రచారం చేసిన మెడికల్ ఆస్ట్రాలజీ వీడియోలను డీఎంకే, అన్నాడీఎంకే, నామ్ తమిళర్ కచ్చి సభ్యులు బాగా షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కనిమొళి మూఢనమ్మకాలను వ్యాప్తి చేశారని అంటున్నారు.ఎలాంటి వారికి టికెట్లిచ్చారు? టీవీకే అధినేత విజయ్ 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత 234 మంది అభ్యర్థులతో విజయ్ వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. అవి వైరల్ అయ్యాయి.అయితే కనిమొళిని అభ్యర్థిగా ప్రకటించడంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులను నిశితంగా పరిశీలించి ఎంపిక చేశామని విజయ్ ముందుగా చెప్పారు. అయితే, సిన్సియర్ నేతలకు సీట్లు రాలేదని కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సూత్రాలకు విరుద్ధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారికి సీట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు. -
నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్.. టీవీకే అధినేత ఆస్తులెంత?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ఇవాళ (మార్చి 30) కోలతూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచే ఆయన 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కోలతూర్ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న అభవృద్ధి పనులపై స్టాలిన్ ఓ పుస్తకం విడుదల చేశారు."మేము భారీ విజయం సాధించనున్నాం. గత మూడు ఎన్నికలతో పోల్చితే ఈ సారి మరింత భారీగా మద్దతు కనపడుతోంది. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తమిళనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సారి భారీ విజయం సొంతమవుతుంది" అని స్టాలిన్ చెప్పారు.డీఎంకే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 164 స్థానాల్లో పోటీ చేస్తుంది, 70 స్థానాలు మిత్ర పార్టీలకు సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 28, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి 5, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐఎం)కి 5, వీసీకేకు 8, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది. ఇతర చిన్న పార్టీలలో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే)కి 10, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కి 2 స్థానాలు, ఇంకా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చిన విజయ్ నామినేషన్ సమర్పించారు. విజయ్తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. విజయ్ తన అఫిడవిట్లో రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. TVK Chief Vijay declares ₹405 crore of movable assets and ₹115 crore of immovable assets in his affidavit while filing nomination for Perambur assembly constituency pic.twitter.com/03U4JC28GC— Arvind Gunasekar (@arvindgunasekar) March 30, 2026 -
అస్సాం ఎన్నికల బరిలో ‘జెన్ జీ’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలంటే వారసత్వ ఆస్తి అనే పాత పద్ధతులకు అస్సాం ఎన్నికల్లో ‘ఎండ్ కార్డ్’ పడుతోంది. ప్రజలతో అనుబంధం, విద్య, పోరాట పటిమే పెట్టుబడిగా కుర్రకారు రాజకీయ రణరంగంలోకి దూసుకొస్తోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు లక్షల మంది యువత తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాంతో పార్టీలు యువతకు గాలం వేస్తున్నాయి.34 ఏళ్ల లోపు నవతరానికి, విద్యావంతులకు మునుపెన్నడూ లేని విధంగా టికెట్లు కేటాయించాయి. వాళ్లు పక్కా గ్రౌండ్ వర్క్, సమస్యలపై అవగాహనతో రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ అడుగుపెట్టి ప్రజా గళం వినిపించాలని ఈ యువ అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. వీరంతా విద్యార్థి ఉద్యమాలు, సామాజిక సేవ నుంచి వచ్చిన, క్షేత్రస్థాయి అనుభవమున్న వారే...!తేయాకు తోటల నుంచిరాజోర్ దళ్ పార్టీ తరఫున మార్గెరీటా నియోజ కవర్గం నుంచి బరిలో ఉన్న రాహుల్ ఛెత్రీ తేయాకు తోటల్లో పనిచేసిన కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా నాయకుడిగా ఎదిగారు. దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న రాహుల్ నిరుద్యోగం, విద్య, మౌలిక సదుపాయాల కల్పనను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.విద్యార్థి రాజకీయాలతోఅల్గాపూర్–కట్లిచెర్రా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జుబేర్ అనామ్ మజుందార్ పోటీ చేస్తున్నారు. ఆయన తొలుత విద్యార్థి సంఘాల్లో పనిచేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. చురుకైన, దూకుడైన నాయకుడిగా పేరుగాంచారు. ప్రజలకు చేరువ కావడానికి డిజిటల్ మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారు.మధ్యతరగతి ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ తిన్సుకియా అభ్యర్థిగా డేవిడ్ టి.ఫుకాన్ను నిలబెట్టింది. మేనేజ్మెంట్ విద్యను అభ్యసించిన ఫుకాన్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. మధ్యతరగతి ప్రజల ప్రతినిధిగా గుర్తింపు పొందారు. పరిశ్రమలు, తేయాకు తోటల కార్మికుల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.గిరిజన గొంతుకగా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి, జిల్లా అటానమస్ కౌన్సిల్లో చురుగ్గా పనిచేసిన 36 ఏళ్ల రూపాలీ లాంగ్థాసా గిరిజన సమాజంలో కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపునకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. హాఫ్లాంగ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి ఉన్నారు.గ్లోబల్ అనుభవంతో సెంట్రల్ గౌహతి నుంచి అస్సాం జాతీయ పరిషత్ అభ్యర్థిగా కుంకీ చౌదరి బరిలో ఉన్నారు. ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులందరిలోనూ అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. లండన్లో మాస్టర్స్ చేసిన ఆమె కార్పొరేట్ కెరీర్ను వదిలి స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కుంకీ చౌదరి విస్తృతంగా పనిచేశారు.కార్యకర్త నుంచిగోల్పారా వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పవిత్ర రాభా పోటీ చేస్తున్నారు. విద్యార్థి రాజకీయాలతో ప్రస్థానం ప్రారంభించి, యువమోర్చాలో కీలక పాత్ర పోషించి సంస్థాగతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్థానిక అభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఆయన ముందుకెళ్తున్నారు.మంచి కెరీర్ వదిలేసిమరియానీ నియోజకవర్గం నుంచి రైజోర్ దళ్ అభ్యర్థిగా డాక్టర్ జ్ఞానశ్రీ బోరా పోటీ చేస్తున్నారు. కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన ఆమె సురక్షితమైన కెరీర్ను వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. నిరుద్యోగం, మెరుగైన ఆరోగ్య సేవలు, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్నారు.చదవండి: మాయోంగ్ గ్రామానికి నేతల క్యూ.. ఎందుకో తెలుసా? -
బెంగాల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు.. తొలి జాబితా ఇదే
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగుతున్న కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఏకంగా 284 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకు ఏప్రిల్ 23, 29వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనుండటం తెల్సిందే.ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ ఆధిర్ రంజన్ చౌదరి, బహరంపూర్ నుంచి టీఎంసీ మాజీ ఎంపీ మౌసమ్ నూర్ మాలతిపూర్ నుంచి పోటీకి దిగనున్నారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు బెంగాల్ సీనియర్ నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ జాబితాను ఖరారు చేశారు. The AICC leadership has approved the following candidates for the West Bengal Assembly elections. My best wishes to them all. More than Congress candidates, they are people’s candidates representing diverse religious, cultural, geographical, and professional identities. We will… pic.twitter.com/3R2BjFhWdv— Subhankar Sarkar শুভঙ্কর সরকার (@subhankar_cong) March 29, 2026మూడో ఓటరు లిస్ట్ బెంగాల్లో ప్రచురించిన ఈసీకోల్కతా: పశ్చిమబెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అనంతరం మూడో అదనపు ఓటరు జాబితాను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. శనివారం రాత్రి 11.30 గంటలకు ప్రచురించిన ఈ జాబితాలో బూత్లవారీ వివరాలున్నాయి.అయితే ఇందులో కూడా తొలగించిన, కొత్తగా చేర్చిన పేర్ల సంఖ్యను వెల్లడించలేదు! సోమవారం తొలి అదనపు జాబితాను, శుక్రవారం రాత్రి రెండో జాబితాను ఈసీ విడుదల చేయడం తెలిసిందే. చదవండి: దీదీ 'చేప'లకు మోదీ గాలం? -
‘పన్ను చెల్లిస్తేనే..’.. వందేళ్ల ఓటరు అనుభవాలు
పతనంతిట్ట: వయసు సెంచరీ దాటినా, ఓటు వేయాలనే ఉత్సాహం ఆ తాతలో ఏ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కేరళకు చెందిన 101 ఏళ్ల గంగాధరన్ ఆచారి ఓటర్లకు అసలైన బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తున్నారు. ఎవరి సాయం లేకుండా, స్వయంగా పోలింగ్ బూత్కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుంటూ, ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటిచెబుతున్నారు. ఏప్రిల్ 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు గంగాధరన్ ఆచారి ఎదురు చూస్తున్నారు.నాడు ఇంటి పన్ను చెల్లిస్తేనే ఓటు..పతనంతిట్ట జిల్లా అడూర్ సమీపంలోని చెరుకోడ్ నివాసి అయిన గంగాధరన్ ఆచారి 1925లో జన్మించారు. ఆయన తన మొదటి ఓటును ఓమల్లూర్లో వేశారు. ఆ రోజుల్లో ఓటు హక్కు అందరికీ ఉండేది కాదు; కేవలం ఇంటి పన్ను చెల్లించే వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉండేది. రేడియో ద్వారా ఎన్నికల అవగాహన కార్యక్రమాలను విని, ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన పెంచుకున్నానని ఆయన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి నేటి మూడంచెల పంచాయతీ ఎన్నికల వరకు ఆయన నిరంతరాయంగా ఓటు వేస్తూనే ఉన్నారు.ఒక చరిత్ర పుటగంగాధరన్ ఆచారి జీవితం ఒక చరిత్ర పుటలాంటిది. తన యవ్వనంలో ఇలంతూర్ పర్యటనకు వచ్చిన మహాత్మా గాంధీని ఆయన స్వయంగా చూశారు. అంతేకాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్, చిత్ర తిరునాల్, సర్ సి.పి. వంటి మహోన్నత వ్యక్తులను వివిధ సందర్భాల్లో కలిశారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, అప్పటి పరిస్థితులు, అభ్యర్థుల గుణగణాలను బట్టే తాను ఓటు వేస్తానని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్య రహస్యం ఇదే101 ఏళ్ల వయసులోనూ గంగాధరన్ ఎంతో దృఢంగా ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, అర కిలోమీటరు దూరం నడవడం ఆయన దినచర్యలో భాగం. పరోటా, ఎగ్ కర్రీ, పాలు వంటి ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటారు. వయసు రీత్యా పళ్లు ఊడిపోయినా, మనసు మాత్రం ఇంకా పడుచుగానే ఉందని ఆయన నవ్వుతూ చెబుతారు.కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, ఎన్నికల రోజున ఎవరిపై ఆధారపడకుండా ఒంటరిగానే పోలింగ్ బూత్కు వెళ్లడం ఆయన ప్రత్యేకత. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు ఆయన ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఓటు వేయడం అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు, అదొక థ్రిల్లింగ్ అనుభూతి అని గంగాధరన్ ఆచారి అంటున్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఇక ప్రోగ్రామర్లకు గుడ్బై: గూగుల్ మాజీ సీఈఓ -
Assam: క్షుద్ర విద్యల రాజధానికి నేతల క్యూ
గౌహతి: అక్కడ మండుటెండలో ఒక మహిళ స్పృహలేకుండా నేలపై పడి ఉంది. ఆమె తలపై ఒక చేటను ఉంచి, మంత్రాలు పఠిస్తూ నీళ్లు పోస్తున్నాడు ఒక వ్యక్తి. తరువాత అదే నీటిని ఒక మట్టి పాత్రలో పోసి ఆమె చేత తాగించాడు. ఇదేదో మారుమూల అడవిలో జరుగుతున్న తంతు కాదు.. అస్సాంలోని క్షుద్ర విద్యల రాజధానిగా పేరొందిన ‘మాయోంగ్’ గ్రామంలోని దృశ్యం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడ మంత్రతంత్రాల హోరు మరింతగా మారుమోగిపోతోందిక్షుద్ర పూజల హడావుడిఅస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనితో పాటు, మంత్రతంత్రాలతో గెలుపును దక్కించుకోవాలని మాయోంగ్ బాట పడుతున్నారు. గౌహతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం మంత్రతంత్రాలకు పెట్టింది పేరు. ఇక్కడికి వచ్చే నేతలు ఓట్లు అడగడానికి రారని, ‘విజయ ప్రాప్తి’ కోసం క్షుద్ర పూజలు చేయించుకునేందుకు వస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామం జాగీరోడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుండి బీజేపీ తరపున మంత్రి పిజూష్ హజారికా, కాంగ్రెస్ నుండి బబుల్ దాస్ పోటీ పడుతున్నారు. పిజూష్ హజారికా పది రోజుల క్రితమే తన కుటుంబంతో కలిసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.ప్రతి ఇంట్లో ఒక మంత్రగాడుమాయోంగ్లో సుమారు మూడు వేల జనాభా ఉంటే, దాదాపు ప్రతి ఇంట్లో ఒక మంత్రగాడు ఉంటాడని చెబుతుంటారు. ఇక్కడి వారసత్వంగా వస్తున్న తంత్ర విద్యను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ‘మా వద్దకు జబ్బులు తగ్గించుకోవడానికి, మానసిక సమస్యల నివారణకు చాలామంది వస్తుంటారు. రాజకీయ నేతలు కూడా వస్తుంటారు. అయితే ఎవరినైనా ఓడించడానికైనా పూజలు చేయమంటే మేము ఒప్పుకోం. వచ్చే ప్రతి వ్యక్తి వివరాలను ఒక డైరీలో నమోదు చేస్తాం’ అని స్థానిక తంత్రవేత్త విపుల్ మేధి తెలిపారు. 100 ఏళ్ల వయసున్న జంతు మండల్ అనే వృద్ధ మంత్రగాడు మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి కూడా నేతలు వచ్చి మంత్రి పదవుల కోసం పూజలు చేయమని తమను అడుగుతారని, కానీ తాము కేవలం స్వస్థత చేకూర్చే పనులు మాత్రమే చేస్తామని పేర్కొన్నారు.చరిత్రలో ‘మాయోంగ్’ మాయాజాలంఈ గ్రామానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. శత్రువులను గాలిలో మాయం చేయడం, మనుషులను జంతువులుగా మార్చడం వంటి శక్తులు ఇక్కడి వారికి ఉన్నాయని స్థానికుల నమ్మకం.తుగ్లక్ సైన్యం మిస్టరీ: 1337లో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ తుగ్లక్ పంపిన ఒక లక్ష మంది సైన్యం ఈ మాయోంగ్ అడవుల్లోనే అదృశ్యమయ్యారనే కథలు ప్రచారంలో ఉన్నాయి.మొఘలుల వెనకడుగు: ఔరంగజేబు పంపిన రాజా రామ్ సింగ్ కూడా మాయోంగ్ మంత్రగాళ్ల భయంతో వెనక్కి తగ్గినట్లు చరిత్ర చెబుతోంది.మహాభారతంతో లింక్: భీముడు-హిడింబల కుమారుడైన ఘటోత్కచుడు ఇక్కడే నివసించాడని, అతని వారసులే ఈ విద్యల్లో ఆరితేరారని స్థానికులు నమ్మకం. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన పురాతన కత్తులు, మంత్రాలు రాసిన రాగి పలకలను స్థానిక మ్యూజియంలో భద్రపరిచారు.మారుతున్న కాలంఇక్కడ 18వ శతాబ్దం వరకు నరబలి కూడా జరిగేదని, బ్రిటిష్ వారు దానిని నిషేధించారని తెలుస్తోంది. అయితే, ప్రస్తుత తరం ఈ విద్యలకు దూరంగా ఉంటోంది. గ్రామంలోని యువత ఇప్పుడు కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపుతోంది.‘మా పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాం. రాజకీయ నేతలు కూడా గెలిచాక మా పిల్లలకు ఉపాధి కల్పించాలి’ అని స్థానిక మహిళలు నిరుపమ దేవి, నీలం ముని దేవి మీడియా ముందు కోరారు.ఇది కూడా చదవండి: షాకింగ్: ఇండియా పోస్ట్ పేరుతో కొత్త దందా -
స్టాలిన్ ప్రత్యర్థిగా సంతాన కృష్ణన్
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అన్నాడీఎంకే అభ్యర్థుల 3వ జాబితా ఆదివారం విడుదలైంది. ఇందులో చైన్నెలో 12 చోట్ల అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై అభ్యర్థులు పోటీ చేయనున్నారు. సీఎం స్టాలిన్కు కొళత్తూరులో ప్రత్యర్థిగా జయ పైరవై సంయుక్త కార్యదర్శి సంతాన కృష్ణన్ను రంగంలోకి దించారు. వివరాలు.. అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వ్యూహాలకు పదును పెట్టి, ప్రజల్లోకి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కూటమి పార్టీలకు సీట్ల సర్దుబాటు ముగించారు. తమ అభ్యర్థులు తొలి జాబితాను 23 మందితో విడుదల చేశారు. అనంతరం 127 మందితో రెండో జాబితా ప్రకటించారు. తాజాగా 17 మందితో మూడో, తుది జాబితాను విడుదల చేశారు. ఇందులో చైన్నెలోనే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులు కీలకంగా మారారు. వీరిలో ఒకరు బి సంతనా కృష్ణన్. ఈయన కొళత్తూరులో సీఎం స్టాలిన్ను అన్నాడీఎంకే అభ్యర్థిగా ఢీ కొడుతున్నారు. మరొకరు చేపాక్కం– ట్రిప్లికేన్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను ఢీ కొట్టేందుకు ఆది రాజా రాం సిద్ధమయ్యారు.మూడవ జాబితాలోని కీలక అభ్యర్థులుకొళత్తూర్: బి. సంతాన కృష్ణన్, థౌజండ్ లైట్స్ – మాజీ మంత్రి బి వలర్మతి, అన్నానగర్ – మాజీ మంత్రి గోకుల ఇందిర, చేపాక్కం, ట్రిప్లికేన్ – ఆది రాజా రాం, ఆర్.కె. నగర్ – ఆర్.ఎస్. రాజేష్, విల్లివాక్కం– ఎస్.ఆర్. విజయకుమార్, వేళచ్చేరి– అశోక్, షోళింగనల్లూరు – కందన్, విరుగంబాక్కం– విరుగై వి.ఎన్. రవి, టి. నగర్ – మాజీ ఎ మ్మెల్యే సత్యనారాయణన్ అలియాస్ సత్య, హార్బర్ – రాయపురం మనో, ఎగ్మూర్ (రి)– అభిషేక్ రంగసామి పోటీ చేస్తున్నారు.ఆర్మ్ స్ట్రాంగ్ సతీమణికి సీటుబీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ చైన్నెలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన మరణం తదుపరి పరిణామాలతో సతీమని పొర్కొడి ఆర్మ్స్ట్రాంగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తమిళనాడు బీఎస్పీ పేరిట పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్యకు న్యాయం కోసం పోరాడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు బీఎస్పీకి అన్నాడీఎంకే తరపున ఓ సీటును కేటాయించారు. అన్నాడీఎంకే రెండాకు చిహ్నంలో తిరువీకా నగర్ నియోజకవర్గం నుంచి ఆర్మ్ స్ట్రాంగ్ సతీమణి పొర్కుడిని అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు.కృష్ణస్వామికి సీటు ఇచ్చే ప్రసక్తే లేదు: పళణిఅభ్యర్థులను ప్రకటించినానంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూత్తుకుడిలో పళని స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పుదియ తమిళగం అధ్యక్షుడు కృష్ణ స్వామి తనను సంప్రదించ లేదని స్పష్టం చేశారు. ఆయన మరొకరి ద్వారా తొలుత పది , ఆ తర్వాత 5 సీట్లకు పట్టుబట్టారని వివరించారు. గత ఎన్నికల్లో 31 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 33 వేల ఓట్లు మాత్రమే సాధించిన పార్టీకి అన్ని సీట్లు ఇవ్వడం అసాధ్యమని తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు. ఆయనకు గానీ, ఆ పార్టీకి గానీ సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో తూత్తుకుడి, నైల్లె జిల్లాల్లో వచ్చిన భారీ వరదల సమయంలో డీఎంకే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. నటుడు విజయ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఈ ఎన్నికలలో ద్విముఖ పోటీ మాత్రమే అని చెప్పడంపై స్పందిస్తూ.. ఆయన ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాతే ఆయనకు వాస్తవాలు అర్థమవుతాయి అని ఎద్దేవా చేశారు. -
కేరళ వార్: సిల్వర్ స్క్రీన్ టు అసెంబ్లీ
దేశంలో అటు సినిమా, ఇటు రాజకీయం.. ఈ రెండూ నాణేనికి రెండు పార్శ్వాల వంటివని అంటుంటారు. వెండితెరపై వెలిగిన తారలు ప్రజాక్షేత్రంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. మాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, తమదైన ముద్ర వేసిన ఐదుగురు ప్రముఖ దర్శకులు, నటుల ప్రస్థానం ఇలా..రాము కారియాట్: ట్రెండ్ సెట్టర్మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన వారిలో దిగ్గజ దర్శకులు రాము కారియాట్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘నీలకుయిల్’ (1954) తదితర గొప్ప చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, జాతీయ అవార్డు గెలుచుకున్న 'చెమ్మీన్' (1967) సినిమాతో మరో చరిత్ర సృష్టించారు. కేరళలో సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఎన్నికల బరిలోకి దిగే సంప్రదాయాన్ని ఆయనే మొదలుపెట్టారు. 1965లో త్రిసూర్ జిల్లాలోని నాటిక నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఘనవిజయం సాధించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.ఇన్నోసెంట్: హాస్య చక్రవర్తి నుంచి పార్లమెంటు వరకు..ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించిన ఇన్నోసెంట్ వరీద్ తెక్కెతల.. తన కామెడీ టైమింగ్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు ఉన్న దశలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో చలకుడి నియోజకవర్గం నుంచి ఎల్డిఎఫ్ (ఎల్డీఎఫ్)మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఒక హాస్య నటుడిగా కేరళ ప్రజల హృదయాల్లో నిలిచిన ఆయన, పార్లమెంటు సభ్యుడిగానూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.సురేష్ గోపి: కేరళలో బీజేపీ సత్తామలయాళ స్టార్ హీరో సురేష్ గోపి ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘మణిచిత్రతాజు’ (1993) వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన ఆయన, 2016లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు. చివరకు 2024 లోక్సభ ఎన్నికల్లో అదే త్రిసూర్ నుంచి ఘనవిజయం సాధించి, కేరళ నుంచి బీజేపీ తరపున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు.గణేష్ కుమార్: రాజకీయ వారసుడునటుడు కేబీ గణేష్ కుమార్ అటు సినిమా, ఇటు రాజకీయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. సీనియర్ నాయకుడు ఆర్. బాలకృష్ణ పిళ్ళై కుమారుడైన గణేష్ కుమార్.. 2023 నుంచి కేరళ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ‘మణిచిత్రతాజు’, ‘కమిషనర్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన, రాజకీయాల్లోనూ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని కీలక నేతగా ఎదిగారు.రమేష్ పిషారోడి: 2026 బరిలో కొత్త ఆశప్రముఖ నటుడు, కమెడియన్ రమేష్ పిషారోడి ఇప్పుడు 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్టానం పిషారోడిని బరిలోకి దించింది. రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోవాలని ఆయన సిద్ధమవుతున్నారు.కేరళ రాజకీయ ముఖచిత్రంలో సినీ సెలబ్రిటీల పాత్ర ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 1965లో రాము కారియాట్ వేసిన పునాది నుంచి నేడు రమేష్ పిషారోడి వరకు ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికల్లో మలయాళీ ఓటర్లు మరోసారి వెండితెర తారలకు పట్టం కడతారో లేదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: Bengal Politics: ‘కురుక్షేత్రం’లో ‘ద్రౌపది’ గర్జన.. -
డీఎంకే మేనిఫెస్టో.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్
చెన్నై: తమిళనాడులో గెలిస్తే 35 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని అధికార డీఎంకే ప్రకటించింది. ‘మహిళలకు రూ.8,000 విలువైన కూపన్లు ఇస్తాం. కూపన్లతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే పాతవాటితో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు’’ అని పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం ఆయన విడుదల చేశారు. ‘‘వ్యవసాయం, విద్య, పరిశ్రమల రంగాల్లో పలు రకాల సంక్షేమ పథకాలను అమలుచేస్తాం. రైతులు, గృహిణులు, విద్యార్థులు మొదలు అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోరుతూ పలు సంక్షేమ చర్యలను అమలుచేయబోతున్నాం. మామూలుగా డీఎంకే మేనిఫెస్టో హీరోలా ఉంటుంది. ఈసారి సూపర్స్టార్లా ఉండనుంది’’ అంటూ హామీల చిట్టాను ఓటర్ల ముందు ఆవిష్కరించారు.డీఎంకే మేనిఫెస్టో ముఖ్యాంశాలు...20 లక్షల మందికిపైగా రైతులకు ఉచితంగా మీటర్లేని పంపుసెట్లువార్షిక ఆదాయ పరిమితి పెంపుముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం రూ.10లక్షలకు పెంపువృద్ధులు, వితంతువులు, 50 ఏళ్లు దాటిన అవివాహితులకు నెలకు రూ.2,000 పెన్షన్కలైంగర్ మగలిర్ ఉరుమై థొగై పథకం కింద కుటుంబపెద్దగా ఉన్న మహిళలకు నెలవారీ ఆర్థికసాయం రూ.2వేలకు పెంపుపాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం ఎనిమిదవ తరగతి విద్యార్థుల దాకా వర్తింపుక్వింటాల్ వరి ధాన్యానికి రూ.3,500 మద్దతు ధరటన్ను చెరకుకు రూ.4,500 మద్దతు ధరవచ్చే నాలుగేళ్లలోపు పూరిగుడిసెల అవసరం లేకుండా గృహపథకంలో భాగంగా కొత్తగా 10 లక్షల గృహాల నిర్మాణంఉన్నత విద్య పూర్తిచేసిన వాళ్లకు నాన్ ముధల్వాన్ పథకం కింద ఆరు నెలలపాటు వృత్తి నైపుణ్య శిక్షణతోపాటు నెలకు రూ.1,500 అందజేతరాష్ట్రానికి రూ.18 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించడంవచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడంపుధుమై పెన్, తమిళ్ పుధల్వాన్ పథకాల కింద నెలకు రూ.1,500 ఉన్నత విద్యా గ్రాంట్ అందజేతకోయంబత్తూర్, సేలం, మదురై, తిరుచిరాపల్లి సమీపంలో ఫ్యూచర్–రెడీ గ్లోబల్ సిటీల నిర్మాణం. -
లూటీదార్లు!
పాలక్కాడ్/త్రిసూర్: సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళను విచ్చలవిడిగా లూటీ చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అసలైన ఎ–టీమ్. అంతే తప్ప ఎవరికీ బి–టీమ్ కాదు’’ అని తేల్చిచెప్పారు. ఆదివారం కేరళలోని పాలక్కాడ్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని తేల్చిచెప్పారు. కేరళ ప్రజల మద్దతు, ఆశీస్సులతో ఎన్డీయే ప్రభుత్వం రాబోతోందని అన్నారు.కేరళకు సేవ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే ‘మోదీ గ్యారంటీ’ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈసారి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. సమాజంలో వేర్వేరు వర్గాల నుంచి ఎన్డీయేకు ఆదరణ పెరుగుతోందన్నారు. కేరళ యువత, మహిళలు, రైతన్నలు బీజేపీ కూటమిని ఎంతగానో అభిమానిస్తున్నారని వెల్లడించారు.అన్ని కుంభకోణాలపై దర్యాప్తుకేరళను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ విపరీతంగా లూటీ చేశాయని మోదీ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఆ రెండు కూటముల మధ్య అవగాహన ఉంది. ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చి, జేబులు నింపుకొనేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల కేరళ ఆర్థికంగా నష్టపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ అక్రమాలు బయటకు వస్తాయని బెదిరిపోతున్నాయి. మేం గెలిచాక ఆ కుంభకోణాలపై దర్యాప్తు జరిపిస్తాం’’ అని ప్రకటించారు.ఆ సొమ్మంతా కక్కిస్తాం పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనలో కేరళ రుణ భారం మూడు రెట్లు పెరిగి రూ.5 లక్షల కోట్లు దాటేసిందరి మోదీ చెప్పారు. ‘‘ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందో చెప్పాలంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అది ఎల్డీఎఫ్ నేతల జేబుల్లోకే వెళ్లింది. మేం రాగానే ఆ సొమ్మంతా కక్కించి రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తాం. కేరళ ప్రగతి కోసం కేంద్రం భారీగా నిధులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే రాష్ట్రానికి మేమే ఎక్కు నిధులు విడుదల చేశాం’’ అని చెప్పారు. ‘‘మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఆర్థిక సమగ్రత, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణంపై దృష్టి పెట్టాం.చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి పార్లమెంట్లో ‘నారీశక్తి వందన్ అధినియమ్ చట్టం’ తెచ్చాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలేమో అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలుతున్నారు’’ అని మండిపడ్డారు. పశ్చిమాసియా పరిణామాలపై కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. దానివల్ల గల్ఫ్ దేశాల్లోని భారతీయుల ప్రాణాలకు ముప్పుందన్నారు. త్రిసూర్లో భారీ రోడ్ షో కేరళలోని త్రిసూర్లో మోదీ ఆదివారం భారీ రోడ్ షో నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు, కాషాయం రంగు తలపాగా ధరించి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. డోలు వాయించిన మోదీపాలక్కాడ్ సభలో మోదీ కేరళ సంప్రదాయ డోలు వాద్యం ‘చెండా’పై దరువేశారు. దాంతో సభికులు హర్షధ్వానాలు వెలిబుచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక దాకా జనం రోడ్డుకు ఇరువైపులా నిల్చొని మోదీకి స్వాగతం పలికారు. వేదికపై చెండాను వాయించడానికి ఆయన కర్రలు చేతుల్లోకి తీసుకోగానే ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆయన అర నిమిషం పాటు కొన్ని బీట్లు వాయించి అలరించారు. సభలో ఇద్దరు చిన్నారులు పెయింటింగ్లను పట్టు కొని ఉండటం గమనించిన మోదీ, వా టిపై వాళ్లు పేర్లు, చిరునామా రాయాలని వారికి సూచించారు. వారికి తాను ప్రత్యు త్తరం పంపుతానన్నారు. ఆ పెయింటింగులను తీసుకో వాలని తన భద్రతా సిబ్బందికి సూచించారు. సభలో మైక్కు సంబంధించిన పరికరం నుంచి పొగలు రావడం కాసేపు కలకలం సృష్టించింది.కష్టకాలంలోనూ సత్తా చాటుతున్నాం: మన్ కీ బాత్లో మోదీసాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ఇంధన సంక్షోభాల వంటి క్లిష్ట పరిస్థితులను 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సహకారంతో దేశం దీటుగా ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యుద్ధాల వేళ స్వార్థ రాజకీయాలకు తావులేదని, పుకార్లను నమ్మవద్దని ఆదివారం మన్ కీ బాత్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పీఎం సూర్య ఘర్ పథకాన్ని దేశ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్న తీరు తనకెంతో ఉత్సాహాన్నిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడం పట్ల ప్రశంసల జల్లు కురిపించారు. 100 రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతోందని, ఫిట్నెస్పై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. జల సంరక్షణకు ప్రజలు ప్రాధాన్యమివ్వాలన్నారు. పురాతన రాతప్రతులను సంరక్షించేందుకు ఉద్దేశించిన ’జ్ఞాన్ భారతం సర్వే’లో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
డీఎంకే మేనిఫెస్టో విడుదల.. ఇవన్నీ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే మేనిఫెస్టో ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పథకాలను ఇందులో పొందుపర్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన స్టాలిన్.. డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసిందని, మళ్లీ గెలిస్తే ప్రస్తుత పథకాలను మరింత పెంచుతామని తెలిపారు.మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలుఉన్నత విద్య చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు మహిళలకు ప్రతి నెల ఇచ్చే సాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,000కు పెంపు (రూ.1.37 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు ప్రయోజనం)వృద్ధాప్య పెన్షన్ కూడా రూ. 2,000కు పెంపుబ్రేక్ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి వరకు పెంపు (ప్రస్తుతం 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు అమలులో ఉంది)మహిళల స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలుముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద ఇచ్చే ప్రయోజనం రూ.లక్షకు పెంపు20 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ కొనసాగింపుమీటర్లు లేకుండా పంప్ సెట్లు కూడా పంపిణీప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ యూనిట్ల సంఖ్య రెండింతలు పెంపురాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ.18 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యం టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి నియో టైడల్ పార్కుల ఏర్పాటు -
TVK : విజయ్ అరుదైన నిర్ణయం.. తన డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్
సాక్షి,చెన్నై: సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా పార్టీ అధినేతలు సామాన్యులకు కీలక పదవులు ఇచ్చి, తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. అందరి మన్ననలు పొందుతుంటారు. తాజాగా, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ను విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ప్రకటించారు.ఆదివారం తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనున్న 234 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. అయితే, వేదికగా విజయ్ తనని ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరును ప్రకటించడంతో శబరినాథన్, ఆయన తండ్రి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. శబరీనాథన్ విజయ్ పాదాలను తాకి, ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో విజయ్ స్వయంగా అతని కన్నీళ్లను తుడిచారు. ఈ దృశ్యం అభిమానులను కదిలించింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు ‘విజయ్ తన డ్రైవర్ కుమారుడిని రాజకీయ నాయకుడిగా నిలబెట్టడం విశ్వాసానికి నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.మరికొందరు ‘రాజేంద్రన్ 30 ఏళ్లుగా విజయ్తో ఉన్నాడు. అతని కుమారుడు శబరీనాథన్ అభిమాన సంఘం కార్యకలాపాల్లోనూ, సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నాడు’ అని వివరించారు. గత ఏడాది శబరీనాథన్ను విరుగంబాక్కం జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం ద్వారా విజయ్ తన విశ్వాసపాత్రులపై నమ్మకం ఉంచినట్లు స్పష్టమైంది.2024లో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తన పార్టీని ప్రకటించారు. ఆయన చివరి సినిమా ‘జన నాయకన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపై ఆయన పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి స్వయంగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ‘ప్రజలతో నిలబడే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశాను’అని విజయ్ స్పష్టం చేశారు. Namma Kuda Irkavangala Namma Pathukitta , Namaku Mela Irkavan Nammala Paarthupaan 🫶Thalapathy Vijay Personal Driver Rajendran & his Son Got Emotional ♥️😭#TVKPeopleCandidates pic.twitter.com/dIe7bqZpo0— Arun Vijay (@AVinthehousee) March 29, 2026 -
పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఎన్డీయే 14-17, ఎస్పీయే 9-11, సినీ నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2-4, ఇతరులు 1-2 సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. 9-11స్థానాలు కైవసం చేసుకుని ఎన్.ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5-7, ఎస్పీఏలో భాగస్వాములైన కాంగ్రెస్ 3-5, డీఎంకే 6-8 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీయే 34-36 శాతం, ఎస్పీఏ 30-32 శాతం, టీవీకే 16-18 శాతం, ఎన్టీకే 4-6 శాతం, వీసీకే 1-3 శాతం, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు 2-5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది.పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఈ సర్వేను 16-23 మార్చి, 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకుని, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. ఈ సర్వేలో కులం, మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే నివేదికను నిఖిల్ కుమార్ రూపొందించారు. డేటా ఎనాలిసిస్ ను, ఇతర సాంకేతిక సహకారాన్ని అవెల్జెన్స్ సంస్థ అందించింది.ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీయే కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా... ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోకపోవడంతో ఎస్పీఏకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్... డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీయేకు సానుకూలంగా మారాయి.ఎన్డీయే కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తుల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ... దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండటం సానుకూలంగా మారింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీయేకూ సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎస్పీయేలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలిస్తే అవి ఎన్డీయేకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఎన్డీయే ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా? అని అడిగినప్పుడు, 55 శాతం మంది ఇస్తామని, 41 శాతం మంది ఇవ్వమని, 4 శాతం మంది చెప్పలేం అని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అభివృద్ధి చెందడం సాధ్యం కాదని నమ్ముతున్నట్లు దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పరిశీలిస్తే కేంద్రంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే కూటమిని గెలిపించుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.ఎన్నికల్లో మీరు ఓటే వేసే ముందు ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తారు? అని ప్రశ్నించినప్పుడు 40 శాతం మంది అభ్యర్థి, 30 శాతం మంది పార్టీ, కులం, మతానికి 10 శాతం, డబ్బు 10 శాతం, మిగిలినవారు ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.ఈ ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు 62 శాతం మంది ఎన్. రంగస్వామికి మద్దతిచ్చారు. దీంతో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రధాన అంశం... ఏమిటని ప్రశ్నించినప్పుడు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేకపోవడం, అధికార యంత్రాంగంలో అవినీతి, విచ్చలవిడి మద్యం అమ్మకాలు ప్రధాన సమస్యలు అని ఈ సర్వేలో ప్రజలు వెల్లడించారు.రాష్ట్ర హోదా డిమాండ్, లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, యువతలో నిరుద్యోగం, వరదలు, రోడ్ల దుస్థితి, నీటి కొరత, స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. కానీ, వీటికి కౌంటర్ గా ప్రచార వ్యూహాల్లో ఎన్డీయే సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉచిత బియ్యం, పాలు, విద్యుత్ సబ్సిడీలు, మహిళలకు నెలకు రూ. 2000 ఆర్థిక సహాయం వంటి పథకాలతో ప్రచారం చేస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా తీసుకుని ఎస్పీయే కూటమి రాష్ట్ర హోదా, పాలనా లోపాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ప్రచారం చేస్తోంది.మరోవైపు టీవీకే యువతను ఆకర్షించే ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తోంది. అభ్యర్థుల ఎంపికలో మత, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎన్డీయే ప్రధానంగా హిందూ ఓటర్లపై ఆధారపడి, వ్యూహాత్మకంగా మైనారిటీ అభ్యర్థులను కూడా నిలబెట్టింది. ఎస్పీయేకి క్రైస్తవులు, ముస్లింలలో బలమైన మద్దతు ఉంది. ఎన్టీకే 50 శాతం మహిళలకు టికెట్లు కేటాయించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో స్థానిక అంశాలు, అభ్యర్థుల బలం, ఓట్ల విభజన వంటి అంశాలే ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. అయినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయేకి స్వల్ప ఆధిక్యం తెచ్చిపెట్టే అవకాశం ఉంది.పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అభ్యర్థులు ఉపసంహరణ చివరి తేది అయిన మార్చి 16 నుంచి 23వ తేది వరకు ఈ సర్వే నిర్వహించడం జరిగింది. రానున్న 10 రోజుల్లో సంభవించే రాజకీయ పరిణామాలు తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏప్రిల్ 9వ తేదిన పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలకు ముగిసిన తర్వాత పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ పోస్ట్ పోల్ సర్వే నిర్వహించి ఏప్రిల్ 29 నాడు తుది సర్వే ఫలితాలను వెల్లడిస్తుంది. -
‘కేరళంను లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ దోచుకున్నాయి’
పాలక్కాడ్: కేరళం ఎన్నికల వేళ ఎల్డీఎఫ్, యూడీఎఫ్పై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ కేరళంలోని పాలక్కాడ్లో మోదీ పర్యటించి బహరంగ సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కేరళం ప్రభుత్వం దోచుకుంటోందని అన్నారు. కేరళంను లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ దోచుకున్నాయని చెప్పారు. ఓటు బ్యాంక్పైనే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు దృష్టి పెట్టాయని తెలిపారు.“బీజేపీకి వారు భయపడుతున్నారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలు చేసిన అవినీతి బయటపడుతుందని వారు నమ్ముతున్నారు. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్-యూడీఎఫ్ ఇక్కడ భారీగా అవినీతికి పాల్పడ్డాయి. కానీ, ఈ పార్టీల ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అవినీతి కేసులను దర్యాప్తు చేసి కేరళం ప్రజలకు న్యాయం చేస్తుంది. అందుకే ఎల్డీఎఫ్-యూడీఎఫ్కు నిద్ర పట్టడం లేదు. కేరళంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్డీఏ లక్ష్యం కేరళం ప్రజల కలలను నెరవేర్చడం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే ఐదు రెట్ల ఎక్కువ బడ్జెట్ను కేరళానికి మేము ఇచ్చాం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎవరి బీ-టీమ్ అనే నిజం కేరళం ప్రజలకు తెలియాలి‘’ అని అన్నారు. -
తమిళనాడు: టీవీకే అభ్యరుల జాబితా విడుదల
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నిలక పోరు తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేయనున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగనున్నారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు.డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామన్న విజయ్.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని విజయ్ నిర్ణయించడంతో ఆ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమిళగ వెట్రి కళగంతో తొలి సారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు విజయ్ ఉరకలు తీస్తున్నారు. కేడర్ను బలోపేతం చేస్తూ, ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించడమే కాకుండా, వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు.అయితే, పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకోగా.. అనుమతి లభించలేదు. పెరంబూరులో తన ఎన్నికల ప్రచారానికి అధికారులు అనుమతి నిరాకరించడంపై విజయ్ అందులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. తన ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బ్యూరోక్రట్లు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాడమే కాకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. తమ ఉద్యోగు బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. -
Bengal Politics: ‘కురుక్షేత్రం’లో ‘ద్రౌపది’ గర్జన..
భారతీయ టెలివిజన్ చరిత్రలో ‘మహాభారతం’ సీరియల్లో ద్రౌపదిగా నటించి, యావత్ దేశాన్ని అలరించిన నటి రూపా గంగూలీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ పౌరాణిక గాథలో అన్యాయాన్ని ఎదిరించినట్లే, ఇప్పుడు సోనార్పూర్ సౌత్ నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికలను ‘చెడుపై మంచి సాగిస్తున్న ధర్మయుద్ధం’గా ఆమె అభివర్ణించడం అందరి దృష్టిని ఆకర్షించింది.కురుక్షేత్రం తరహాలో బెంగాల్ రాజకీయాలుప్రస్తుత రాజకీయ పరిస్థితులను రూపా గంగూలీ కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. ‘ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం. అంతిమంగా సత్యమే గెలుస్తుంది (సత్యమేవ జయతే)’ అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా బెంగాల్ ప్రజలు పాలనాపరమైన వైఫల్యాలతో సతమతమవుతున్నారని, సామాన్యులకు కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తాను ఈ పోరులో నిలబడినట్లు ఆమె స్పష్టం చేశారు.ఓటర్ల జాబితాలో ఇన్ని లోపాలా?ఎన్నికల వ్యవస్థలోని లోపాలపై రూపా గంగూలీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా 2002 నుంచి ఇప్పటివరకు మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఇంకా కొనసాగడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రతిపక్షాల వాదనకు చోటు కల్పించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సొంత గడ్డ.. తండ్రి కలసోనార్పూర్ సౌత్ నియోజకవర్గంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని రూపా గంగూలీ గుర్తు చేసుకున్నారు. ‘మహాభారతం సీరియల్ ద్వారా వచ్చిన సంపాదనతో నా తల్లిదండ్రుల కోసం ఇక్కడే ఇల్లు కొన్నాను. దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నా తండ్రి పడ్డ కష్టాలు, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి లేమి నాకు బాగా తెలుసు’ అంటూ ఆమె భావోద్వేగంగా స్పందించారు. ఈ వ్యక్తిగత అనుబంధమే తనను ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ప్రేరేపించిందని రూపా గంగూలీ అన్నారు.సంక్షేమ పథకాలే లక్ష్యంఎన్నికల హింసను అరికట్టి శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగాలని రూపా గంగూలీ కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ)వంటివి అర్హులైన బెంగాల్ ప్రజలందరికీ చేరాలని ఆమె ఆకాంక్షించారు. ‘ద్రౌపది’గా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు సోనార్పూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం? -
Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం?
పశ్చిమ బెంగాల్ అనగానే అందరికీ అక్కడి కళలు, సాహిత్యం.. అంతకు మించి ఘుమఘుమలాడే చేపల పులుసు గుర్తుకువస్తాయి. అయితే ఇప్పుడు అదే చేప రాజకీయాల్లో రచ్చ లేపుతోంది. అభివృద్ధి, నిరుద్యోగం వంటి అంశాలను పక్కనబెట్టి, ఓటర్ల కంచంలో ఉండే ‘చేప ముక్క’ చుట్టూ ఇప్పుడు తృణమూల్, బీజేపీ మధ్య యుద్ధం నడుస్తోంది. బెంగాలీయుల ప్రాణప్రదమైన ఆహారపు అలవాట్లను అస్త్రంగా చేసుకుని సాగుతున్న ఈ ‘ఫిష్ పాలిటిక్స్’ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.చేపతో బీజేపీ ప్రచారం.. షాకైన ఓటర్లుబీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం తిననివ్వరంటూ మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమలం పార్టీ నేతలు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ ఏకంగా 5 కిలోల బరువున్న 'కట్ల' చేపను చేత్తో పట్టుకుని వీధుల్లో ప్రచారం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘మేము చేపలకు వ్యతిరేకం కాదు.. మా సంస్కృతిలో భాగం’ అంటూ ఓటర్లకు భరోసా ఇచ్చేందుకే ఈ ఫీట్ చేశానని ఆయన చెబుతున్నారు.దీదీ ఘాటు విమర్శలు: ‘మీ కంచంపై కన్నేస్తారు’ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రసంగాల్లో బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ‘వారు మీ పళ్లెంలో చేపను ఉండనివ్వరు, గుడ్లను తాకనివ్వరు. చివరికి మీరు బెంగాలీ మాట్లాడితే బంగ్లాదేశీయులని ముద్ర వేస్తారు’ అంటూ భావోద్వేగపూరిత విమర్శలు చేస్తున్నారు. బెంగాలీ అస్తిత్వాన్ని, ఆహారపు అలవాట్లను కాపాడుకోవాలంటే తృణమూల్కే ఓటు వేయాలని ఆమె గట్టిగా పిలుపునిస్తున్నారు.బీజేపీ కౌంటర్: ‘స్వామి వివేకానందుడే చెప్పారు’మమత ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తీవ్రంగా స్పందించారు. స్వామి వివేకానందుడి బోధనలను గుర్తు చేస్తూ.. ఆహారపు అలవాట్లపై తాము ఎప్పుడూ ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశారు. కేవలం ఓట్ల కోసమే దీదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బెంగాల్ సంస్కృతిని తమ కంటే బాగా ఎవరూ గౌరవించలేరని ఆయన కౌంటర్ ఇచ్చారు.ఓటర్ల మనోగతం: ‘ఆహారాన్ని రాజకీయం చేయకండి’రాజకీయ నాయకుల వాదోపవాదాలు ఎలా ఉన్నా, సామాన్య ఓటర్లు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. ‘మా పళ్లెంలో చేపను దూరం చేసే ఎవరికైనా ఓటు వేయబోము’ అని కొందరు స్పష్టం చేస్తుండగా, మరికొందరు మహిళా ఓటర్లు అసలు సమస్యను తెరపైకి తెస్తున్నారు. చేపల ధరల కంటే, ఆ చేపను వండే గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వాటి గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.గణాంకాలు చెబుతున్న 'చేప' పవర్!బెంగాల్లో చేపల వినియోగం కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక ఆర్థిక వ్యవస్థ. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం బెంగాలీయులు ఏడాదికి 8.36 లక్షల టన్నుల చేపలను ఆరగిస్తున్నారు. తమ మొత్తం ఆహార ఖర్చులో 18.9 శాతం కేవలం చేపలు, మాంసం కోసమే ఖర్చు చేస్తారు. పెళ్లిళ్లలో కూడా చేపను కానుకగా ఇచ్చే ఈ రాష్ట్రంలో, చేప చుట్టూ తిరిగే రాజకీయం ఎన్నికల ఫలితాలను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి!ఇది కూడా చదవండి: కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ? -
సర్వం ‘సర్’మయం!
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రధానాంశంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ప్రచారమంతా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ చుట్టే తిరుగుతోంది! దాంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ వంటివి పూర్తిగా పక్కకు పోయాయి. సర్, చొరబాట్లు, మైనారిటీల సంతుష్టీకరణే ప్రచారాంశాలుగా మారాయి.సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 64 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇంకా లక్షలాది ఓటర్ల తనిఖీ కొనసాగుతోంది. దాంతో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలే పూర్తిగా మారిపోతున్నాయి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 90 స్థానాల్లో మెజారిటీ 10 వేల లోపే నమోదైంది. భారీ ఓట్ల తొలగింపు కారణంగా ఆ స్థానాల్లో ఈసారి పార్టీల బలాబలాలే తారుమారయ్యే పరిస్థితి నెలకొంది! ఒక్క ముర్షీదాబాద్ జిల్లాలోనే ఏకంగా 11 లక్షల ఓట్లు తొలగింపునకు గురవడం విశేషం. 8.3 లక్షలతో మాల్డా రెండో స్థానంలో నిలిచింది. నార్త్, సౌత్ 24 పరగణా జిల్లాల్లో కలిపి 12 లక్షల పైచిలుకు ఓట్లు గల్లంతయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో మరో 11 లక్షల ఓట్ల తనిఖీ కొనసాగుతోంది! ఇదంతా తమ ఓటుబ్యాంకుకు గండి కొట్టే కుట్రేనని టీఎంసీ ఆరోపిస్తుండగా, కేవలం చొరబాటుదారులను, దొంగ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యమని బీజేపీ చెబుతోంది.అస్తిత్వవాదం దిశగా... బెంగాల్లో గతంలో ప్రధానంగా ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు, మతపరమైన విభజన వంటివి తెరపైకి వచ్చేవి. ‘‘సర్ ప్రక్రియతో పరిస్థితే మారిపోయింది. కొంతకాలంగా ఏ జిల్లాను తీసుకున్నా మతపరమైన విభజన కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. అంతేగాక అది క్రమంగా శాశ్వత రూపు సంతరించుకుంటూ ఉండటం ఆందోళనకరం. స్థానికంగా చిన్న స్థాయిలో జరిగే శ్రీ రామనవమి ఉత్సవాలు ఈసారి భారీ జన సమీకరణ వేదికలుగా మారడం ఇందుకు నిదర్శనం’’ అని రాజకీయ విశ్లేషకులు సుమన్ భట్టాచార్య, మొయిదుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు. బెంగాల్ రాజకీయాలు వర్గ సమీకరణల నుంచి పూర్తిగా మతం, సంస్కృతి, పౌరసత్వం పేరిట క్రమంగా అస్తిత్వవాదం వైపు మళ్లుతున్నాయని వారన్నారు. -
164 స్థానాల్లో డీఎంకే పోటీ
చెన్నై: తమిళనాట అధికార డీఎంకే పార్టీ వచ్చే నెలలో జరగబోయే శాసనసభ ఎన్ని కల్లో 164 స్థానాల నుంచి బరిలో దిగనుంది. తన సారథ్యంలోని లౌకిక ప్రగతిశీల కూటమి(ఎస్పీఏ)లో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, డీఎండీకే తది తర 11 పార్టీలకు డీఎంకే మొత్తంగా 70 సీట్లను కేటాయించింది. కూటమి పార్టీల్లో కాంగ్రెస్కు అత్యధికంగా 28 సీట్లు కేటాయించింది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలోని పార్టీ కార్యాల యంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ‘‘సీట్ల సర్దుబాటులో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. నిదానంగా చర్చలు జరపడంతో నష్టంకంటే లాభమే ఒనగూరింది. మిత్ర పక్షాలన్నింటినీ సంతృప్తిపరుస్తూ సీట్లు కేటాయించాం.ఎస్పీఏ కూటమిలో ఐక్యతకు ఇది నిదర్శనం. ఎన్నికల తర్వాత డీఎంకే 2.0 ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అభ్యర్థులంతా గెలుపు గుర్రాలే’’ అని అన్నారు. పార్టీ మేనిఫెస్టోను ఆదివారం విడుదలచేస్తానని ఆయన వెల్లడించారు. వైకో సారథ్యంలోని ఎండీఎంకేలోని కొందరు అభ్యర్థులు సహా 11 మంది కూటమి పార్టీల అభ్యర్థులు ఈసారి డీఎంకే ‘ఉదయించే సూర్యుడు’ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతుండటం విశేషం. దీంతో డీఎంకే పరోక్షంగా 175 స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నట్లయింది. సీట్ల సర్దుబాటు తర్వాత పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్కోడె, శివకాశి, కరైకుడి సహా 28 స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీకి నిలబడుతున్నారు. కూటమి న్యాయం పాటిస్తూ... దివంగత తమిళనటుడు కెప్టెన్ విజయ్కాంత్ స్థాపించిన డీఎండీకే పార్టీకి 10 సీట్లు కేటాయించారు.దాదాపు మంత్రులందరికీ మళ్లీ చాన్స్33 మంది కేబినెట్ మంత్రుల్లో ము గ్గురు మినహా మిగతా వారందరికీ సీఎం స్టాలిన్ మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించారు. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకూ మరోసారి పోటీచేసే అవకాశం దక్కింది. ఈసారి వైద్యులు, ఇంజనీర్లు, పీహెచ్డీ పట్టాదారులు సహా 60 మందికిపైగా కొత్తవాళ్లను డీఎంకే రంగంలోకి దింపుతోంది. డీఎంకే పార్టీ తరఫున ఈసారి 18 మంది మహిళా నేతలూ ఎన్నికల రణక్షేత్రంలోకి దూసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగోసారి కొలథూర్ స్థానం నుంచి పోటీచేయనున్నారు. ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి మరోసారి చెపాక్–త్రిప్లికేన్ నుంచి పోటీచేస్తున్నారు. -
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఇలా..
చెన్నై: వచ్చే నెలలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే పార్టీ- కాంగ్రెస్ల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ మేరకు డీఎంకేతో జట్టు కట్టిన కాంగ్రెస్తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సీట్ల సర్దుబాటును ఈరోజు(శనివారం, మార్చి 28వ తేదీ) ప్రకటించారు. తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను డీఎంకే 164, కాంగ్రెస్ 28, డీఎండీకే 10 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక వీసీకే 8 స్థానాల్లో, సీపీఐ 5, సీపీఎం 5, ఎండీఎంకే 4 స్థానాలను కేటాయించారు. ఇక డీఎంకే పోటీ చేసే పలు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ బరిలోకి దిగుతుండగా, చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ చేయనున్నారు. బోడినాయక్కనూర్ నుంచి పన్నీరు సెల్వం పోటీ దిగుతుండగా, కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలోకి సెంథిల్ బాలాజీ బరిలో ఉండనున్నట్లు డీఎంకే వెల్లడించింది. -
బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్పై బీజేపీ ఛార్జ్షీట్
కోల్కతా: బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్పై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. శనివారం రాష్ట్రంలో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా.. టీఎంసీ ప్రభుత్వ పదిహేనేళ్ల పరిపాలనా వైఫల్యాలను ఎండగట్టారు. బెంగాల్ అవినీతి ప్రయోగశాలగా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. చొరబాటు దారులకు బెంగాల్ అడ్డాగా ఉందని.. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయన్న అమిత్ షా.. మమత పాలనలో అరాచకం రాజ్యమేలుతోందంటూ దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే(బెంగాల్) పరిమితం కాదని.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయని.. అందుకే అత్యంత కీలకమంటూ వ్యాఖ్యానించారు.గత 15 ఏళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్ చొరబాట్లకు, బుజ్జగింపు రాజకీయాలకు, సరిహద్దు అభద్రతకు ప్రధాన కారిడార్గా మారిందని షా ఆరోపించారు. కేంద్రం పదేపదే కోరినప్పటికీ, సరిహద్దు కంచె ఏర్పాటుకు మమతా బెనర్జీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదని అంటూ ఆయన విమర్శించారు. చొరబాటుదారులతో ఓటు బ్యాంకును సృష్టించుకోవడమే వారి లక్ష్యమంటూ ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలను భయం- విశ్వాసం మధ్య జరుగుతున్న పోరాటంగా అమిత్ షా అభివర్ణించారు. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ అబద్ధాలు, హింస, అవినీతి రాజకీయాలను పెంచి పోషించారు. ఈసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా, ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే పరివర్తన్ ర్యాలీల పేరిట ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ.. మమత సర్కారు వైఫల్యాలపై బహిరంగ సభలు, చిన్న స్థాయి భేటీల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఛార్జ్షీట్ పేరుతో ప్రజలను మరింతగా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అవినీతి–కుంభకోణాలు, పరిపాలనా వైఫల్యాలు, శాంతిభద్రతల పతనం, మహిళలపై నేరాలు– భద్రతా లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులు, పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగాల క్షీణత, రైతు సమస్యలు, తేయాకు తోట కార్మికుల దుస్థితి, కోల్కతా నగర పరిస్థితి, ‘సిండికేట్ రాజ్’వంటివి ఇందులో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
తమిళనాడు ఎన్నికల బరిలో సినీ దర్శకుడు
చెన్నై: తమిళ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ప్రముఖ దర్శకుడు, నటుడు, సుందర్ సి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈయననే డీఎంకే (DMK) మళ్ళీ బరిలోకి దించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ నెలకొననుంది. సుందర్ సి భార్య, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.దర్శకుడి భార్య ఖుష్బూ స్పందిస్తూ.. ‘సినీ కెరీర్లో మూడు దశాబ్దాల పాటు నా భర్తకు ఈ రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని.. అందుకే ఇప్పుడు వారికి సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్యగా నేను గర్వపడుతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.సుందర్ సి (సుందర్వేల్ చిదంబరం) జనవరి 21, 1968న జన్మించారు. ఆయన 1990లో ‘వాళ్కై చక్కరం’తో నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. 1995లో ‘మురై మానమ్’తో దర్శకుడిగా మారారు. దాదాపు 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 10కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కళైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. తన భార్యతో కలిసి పలు టెలివిజన్ సిరీస్లను నిర్మించారు. -
పుదుచ్చేరి రాజకీయాల్లో ‘లాటరీ కింగ్’ వారసుడు
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా తెర వెనుక ఉండి ఎన్నికల వ్యూహాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన ‘లాటరీ కింగ్’ శాంటియాగో మార్టిన్ కుటుంబం ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగింది. మార్టిన్ కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త జోస్ చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన మార్టిన్ స్థానిక నాయకత్వంతో విభేదాల కారణంగా ఆ పార్టీకి స్వస్తి పలికారు. అనంతరం తన సేవా సంస్థ ‘జేసీఎం మక్కల్ మండ్రం’ను రాజకీయ పార్టీగా మార్చి 2025లో ‘లక్ష్య జననాయక కచ్చి’ (ఎల్జేకే)ని స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగానే ఉంది. కూటమి ఒప్పందంలో భాగంగా ఎల్జేకేకు కేటాయించిన రెండు స్థానాల్లో మార్టిన్ కామరాజ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లింతోపు నియోజకవర్గంలో కూడా ఆయన నామినేషన్ వేసినప్పటికీ ఎన్నికల సంఘం కామరాజ్ నగర్ నామినేషన్ను ఆమోదించింది.భారీ ఆస్తుల ప్రకటనఎన్నికల అఫిడవిట్లో మార్టిన్ సమర్పించిన వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రూ.597 కోట్ల విలువైన చరాస్తి, స్థిరాస్తులతో ఆయన ఈ ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు.మొత్తం ఆస్తులు: రూ.597 కోట్లుస్థిరాస్తులు (భూమి, భవనాలు): రూ.450 కోట్లునగలు: రూ.72 కోట్లువాచీలు: రూ.32 కోట్లువాహనాలు: రూ.2 కోట్లుఅప్పులు: రూ.210 కోట్లుచార్లెస్ మార్టిన్కు తన తండ్రి స్థాపించిన ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్’ సంస్థలో 4.5 శాతం వాటా ఉంది. గతంలో ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా విరాళాలు ఇచ్చిన సంస్థగా ఇది వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.కుటుంబ రాజకీయాలుమార్టిన్ కుటుంబం కేవలం పుదుచ్చేరికే పరిమితం కాలేదు. ఆయన తల్లి లీమా రోజ్ మార్టిన్ తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే టికెట్పై పోటీ చేస్తుండగా ఆయన బావ ఆధవ్ అర్జున ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే కుటుంబం వేర్వేరు రాష్ట్రాల్లో, వేర్వేరు పార్టీల తరఫున బరిలో ఉండటం విశేషం. -
కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ?
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి.బీజేపీ వ్యూహం: మోదీ సుడిగాలి పర్యటనలుకేరళపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ప్రచారకర్తగా రంగంలోకి దించుతోంది. ప్రధాని ఇప్పటికే రెండుసార్లు కేరళలో పర్యటించగా, ఈ ఆదివారం మరోసారి ప్రచారానికి రానున్నారు. బీజేపీ విడుదల చేసిన 40 మంది సభ్యుల జాబితాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ తదితర హేమాహేమీలు ఉన్నారు. అయితే, అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ఈ జాబితాలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్ ఆశలన్నీ గాంధీ కుటుంబంపైనే..కాంగ్రెస్ పార్టీ కూడా భారీ తారాగణంతో ప్రచార బరిలోకి దిగుతోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కేరళలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే రాహుల్, ప్రియాంకలు ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, సచిన్ పైలట్ తదితర కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్లను స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ ఎంపిక చేయడం విశేషం.రేసులో ఇతర పార్టీలుఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించనున్నారు. అలాగే లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ , బహుజన్ సమాజ్ పార్టీలు కూడా తమ అగ్రనేతల పేర్లను ఎన్నికల సంఘానికి అందజేశాయి. మొత్తానికి జాతీయ స్థాయి నేతల రాకతో కేరళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఈ స్టార్ క్యాంపెయినర్ల హవా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ! -
అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు ‘దళపతి’ పూర్తి స్థాయిలో విజయ్ సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన అడుగు వేస్తూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 29వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థులను విజయ్ స్వయంగా పరిచయం చేయనున్నారు.తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ లోతుగా కసరత్తు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆదివారం (మార్చి 29) చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్లో రాష్ట్ర స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ వేదిక నుంచే విజయ్ అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు.ఎన్నికల బరిలో 264 స్థానాలుతమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పుదుచ్చేరికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా, తమిళనాడు అభ్యర్థుల తుది జాబితాను ఆదివారం నాటి సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు.ఏప్రిల్లో పోలింగ్ సందడిఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్వల్ప సమయంలోనే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఆదివారం జరిగే ఈ సమావేశం టీవీకే ఎన్నికల వ్యూహాన్ని, ప్రచార పంథాను స్పష్టం చేయనుంది.నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ నేతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా, విజయ్ తన అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ సమీకరణలను ఎలా మారుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళపతి అభిమానులు ఈ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 29.. తమిళ రాజకీయాల్లో కొత్త మలుపునకు నాంది కాబోతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: West Bengal: 57 సీట్లు.. నరాలు తెగే ఉత్కంఠ! -
West Bengal: 57 సీట్లు.. నరాలు తెగే ఉత్కంఠ!
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఎప్పుడూ సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఇప్పుడు నేతలందరి దృష్టి ఆ 57 నియోజకవర్గాలపైనే నిలిచింది. 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘనవిజయం సాధించినప్పటికీ, ఈ సీట్ల ఫలితాలను పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ, నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా..రాష్ట్ర అధికార పీఠాన్ని నిర్ణయించడంలో కేవలం 8,000 లోపు ఓట్ల తేడాతో గెలిచిన ఈ 57 సీట్లు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఈ స్వల్ప ఓట్ల తేడా అటు ఇటు అయితే బెంగాల్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. గత 2021 ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, ఈ 57 స్థానాల్లో గెలుపోటములు వెంట్రుక వాసిలో జరిగాయి. వీటిలో సగటున 8,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతోనే అభ్యర్థులు గట్టెక్కారు. మరీ ముఖ్యంగా, 19 నియోజకవర్గాల్లో అయితే మెజారిటీ 3,000 ఓట్ల లోపే ఉండటం గమనార్హం. ఈ 57 కీలక స్థానాల్లో గతంలో టీఎంసీ 29 సీట్లు గెలవగా, బీజేపీ 28 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే రెండు పార్టీల మధ్య పోరు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీ ఉన్న 19 సీట్లలో బీజేపీ 12 చోట్ల విజయం సాధించగా, టీఎంసీ 7 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, 2026లో ఈ 57 స్థానాల్లో చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా అది ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే అసలైన కురుక్షేత్రంఈ ఉత్కంఠభరిత నియోజకవర్గాల్లో అత్యధికంగా 47 సీట్లు దక్షిణ బెంగాల్లోనే ఉన్నాయి. ఉత్తర బెంగాల్లో కేవలం 10 స్థానాలు మాత్రమే ఇటువంటి స్వల్ప మెజారిటీ పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైన పుర్బా మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, బంకురా, పురూలియా, పశ్చిమ బర్థమాన్ జిల్లాలు ఈసారి ప్రధాన యుద్ధభూమిగా మారనున్నాయి. బంకురా, పశ్చిమ బర్థమాన్ జిల్లాల్లో ఇటువంటి సీట్లు ఆరేసి చొప్పున ఉండగా.. మిగిలిన మూడు జిల్లాల్లో ఐదు చొప్పున ఉన్నాయి.గత ఎన్నికల్లో షాకింగ్ మెజారిటీలునందిగ్రామ్: ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి కేవలం 1,956 ఓట్ల తేడాతో విజయం సాధించారు.కుల్తీ: ఇక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 679 ఓట్లతో గట్టెక్కారు.దంతాన్: టీఎంసీ కేవలం 623 ఓట్లతో ఇక్కడ విజయాన్ని అందుకుంది.ఘటల్: బీజేపీ కేవలం 966 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచింది.దిన్హాటా: కూచ్ బెహార్ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నిశిత్ ప్రామాణిక్ కేవలం 57 ఓట్ల తేడాతో గెలవడం ఒక సంచలనం. అయితే ఆయన రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 1.64 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఇక్కడ గెలవడం గమనార్హం.మారిన రాజకీయ సమీకరణలు2026 సమరంలో పాత లెక్కలు చెల్లుతాయని చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈసారి పోటీ మరింత క్లిష్టంగా మారనుంది. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉండగా, సీపీఐ(ఎం) - ఐఎస్ఎఫ్ కలిసి పోటీ చేస్తున్నాయి. వీరికి తోడుగా అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్కు చెందిన ఏజేయూపీ కూటమి ముస్లిం ఓట్ల సమీకరణలను మార్చే అవకాశం ఉంది. ఓట్లు ఇలా చీలిపోవడం వల్ల స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాల్లో ఫలితాలు ఎటువైపు తిరుగుతాయోనన్న టెన్షన్ పార్టీల్లో నెలకొంది.పార్టీల ధీమా.. పరస్పర విమర్శలుబీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథ్ ఛటోపాధ్యాయ మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేకత, ఓటర్ల జాబితా సవరణ తమకు కలిసి వస్తుందని, తాము 80 శాతానికి పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు టీఎంసీ ప్రతినిధి అరూర్ చక్రవర్తి ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి అనుకూలంగా కొన్ని వర్గాల ఓటర్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు తమవైపే ఉన్నారని, స్వల్ప మెజారిటీ సీట్లలో కూడా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2021లో 213 సీట్లతో భారీ విజయం సాధించిన టీఎంసీకి, 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీకి మధ్య 2026 ఎన్నికలు చావో రేవో అన్నట్లు ఉండబోతున్నాయనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి -
తొమ్మిది స్థానాలే కీలకం.. ఎన్డీయే హోరాహోరీ
కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో 9 అసెంబ్లీ స్థానాల్లో మూడు కూటముల నడుమ నెలకొన్న ముక్కోణపు పోరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ స్థానాల్లో గెలుపోటములు మొత్తంగా ఎన్నికల ఫలితాలనే నిర్దేశించవచ్చని పరిశీలకులు భావిస్తుండటం విశేషం.నీమమ్తిరువనంతపురం జిల్లాలో ఉంది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా బీజేపీ నెగ్గిన ఏకైక అసెంబ్లీ స్థానం కావడం విశేషం. 2016లో ఎల్డీఎఫ్కు చెందిన కె.శివన్కుట్టిపై బీజేపీ సీనియర్ నేత ఒ.రాజగోపాల్ విజయం సాధించారు. అనంతరం 2021 ఎన్నికల్లో శివన్కుట్టి కేవలం 3,949 ఓట్ల మెజారిటీతో బీజేపీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖరన్ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శివన్కుట్టి, యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.శబరీనందన్ పోటీలో ఉన్నారు.కళక్కొట్టం బీజేపీ బలంగా కనిపిస్తున్న మరో అసెంబ్లీ స్థానమిది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్ మరోసారి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యరి్థగా బీజేపీ సీనియర్ నేత వి.మురళీధరన్ నిలిచారు. 2016లో సురేంద్రన్ చేతిలో ఆయన కేవలం 7,347 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇటీవలి తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి దూకుడు మీదున్న బీజేపీ ఈసారి కళక్కొట్టం తమ ఖాతాలో చేరడం ఖాయమని ధీమాగా ఉంది. యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే టి.శరచ్ఛంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు.వట్టియుర్కవుఇది కూడా బీజేపీకి మంచి పట్టున్న స్థానమే. 2016, 2012 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. కానీ 2019 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి ప్రశాంత్ హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా నెగ్గాలని భావిస్తున్న బీజేపీ మాజీ డీజీపీ ఆర్.శ్రీలేఖను బరిలో దించింది. 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించిన కె.మురళీధరన్నే యూడీఎఫ్ ఈసారీ పోటీకి పెట్టింది.మంజేశ్వరంబీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.పాల చారిత్రకంగా ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. ఈసారి మాత్రం కథ మారింది. ఎల్డీఎఫ్ నుంచి కేరళ కాంగ్రెస్ (మణి) చైర్మన్జోస్ కె.మణి బరిలో ఉన్నారు. యూడీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మణి సి.కప్పన్తో తలపడుతున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా బాగా ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే పి.సి.జార్జి కుమారుడు షోన్ జార్జిని బరిలో దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.నట్టికగత ఎన్నికల్లో సీపీఐ తరఫున నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే సి.సి.ముకుందన్ ఈసారి బీజేపీ టికెట్పై బరిలో దిగుతుండటం ఆసక్తికరం. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత ఆదరణ బాగా కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎల్డీఎఫ్ ఈసారి మాజీ ఎమ్మెల్యే గీతా గోపీకి టికెటిచ్చింది. యూడీఎఫ్ నుంచి కూడా సునీల్ లాలూర్ రూపంలో గట్టి అభ్యర్థి బరిలో ఉండటంతో పోరు హోరాహోరీగా మారింది. మంజేశ్వరం బీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.అరన్ములపత్థనంతిట్ట జిల్లాలోని ఆలయ నగరమైన ఈ స్థానంపై కూడా బీజేపీ గట్టి ఆశలే పెట్టుకుంది. అరన్ముల విమానాశ్రయ ఆందోళనలతో మంచి జనాదరణ పొందిన రాజశేఖరన్ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ఆరోగ్య మంత్రి వీణా జార్జిని ఆయన ఢీకొడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ఈసారి వ్యూహాత్మకంగా అబిన్ వర్కుకి టికెట్ ఇచ్చింది. గత రెండు ఎన్నికల్లో వీణా జార్జికి దన్నుగా నిలిచిన పలు సామాజికవర్గాలకు చెందిన ఓటర్లను ఆయన కాంగ్రెస్వైపు తిప్పగలరని పార్టీ ఆశపడుతోంది.త్రిసూర్గత ఎన్నికల్లో ఇక్కడ అధికార, విపక్ష కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎల్డీఎఫ్ నుంచి సీపీఎం అభ్యర్థి పి.బాలచంద్రన్ కేవలం 946 ఓట్లతో గట్టెక్కారు. ఎన్డీఏ తరఫున సినీ నటుడు సురేశ్గోపి గట్టి పోటీ ఇచ్చినా మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం ఆయన 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిసూర్ స్థానం నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో బీజేపీకి దక్కిన తొలి లోక్సభ స్థానం అదే కావడం విశేషం. బీజేపీ ఈసారి సీనియర్ నాయ కుడు వేణుగోపాల్కు టికెట్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ నుంచి అలంకొడె లీలాకృష్ణన్, యూడీఎఫ్ నుంచి మాజీ మేయర్ రాజన్ పల్లన్ పోటీలో ఉన్నారు.పాలక్కాడ్ఇక్కడ ఎల్డీఎఫ్, బీజేపీ తెర వెనక కుమ్మక్కయ్యాయని విపక్ష నేత వి.డి.సతీశన్ విమర్శలతో వాతావరణం బాగా వేడెక్కింది. యూడీఎఫ్కు పడే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఎల్డీఎఫ్ కావాలనే హోటల్ వ్యాపారి ఎన్ఎంఆర్ రజాక్కు టికెటిచి్చందని సతీశన్ ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ‘మెట్రో మ్యాన్’ఇ.శ్రీధరన్కు టికెటిచి్చంది. ఆయన కేవలం 3,859 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఓటమి చవిచూశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచిన శోభా సురేంద్రన్కు బీజేపీ ఈసారి టికెటిచి్చంది. షఫీ లోక్సభకు వెళ్లడంతో 2021లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతటిల్ నెగ్గారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ ఈసారి ఆయన్ను పక్కన పెట్టి రమేశ్ పిశరోడికి టికెట్ ఇచ్చింది. -
బీజేపీకి ఝలక్.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అన్నామలై!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నాడీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇప్పటికే లేఖ కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే కినతుకడవు వంటి స్థానాలను అన్నాడీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతుకడవు నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు రెండు రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయేలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి. బీఎల్ సంతోష్కు ఝలక్..ఇదిలా ఉండగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. గురువారం బీఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం.ఢిల్లీకి అభ్యర్థుల జాబితా27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారం. ఇందులో అవినాశి–కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మైలాపూర్– మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నార్త్– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, నాగర్కోయిల్– మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తళి – అమరప్రసాద్ రెడ్డి, తిరుప్పూర్ సౌత్ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్ – విజయధరణి, మదురై సౌత్–రామ శ్రీనివాసన్, తిరువణ్ణామలై– అశ్వత్థామన్, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్, పుదుక్కోట్టై– రామచంద్రన్..రామనాథపురం– జి.పి.ఎస్. నాగేంద్రన్,రాశిపురం– డాక్టర్ ప్రేమ్ కుమార్,వాసుదేవనల్లూర్ – ఆనందన్ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్, ఊటి– భోజ రాజన్ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్, రాధాపురం– బాలకృష్ణన్, తిరువారూర్ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్– ఆర్.ఎం. రాధాకృష్ణన్, పద్మనాభపురం– ఎడ్విన్ జోస్,కులచల్– శివకుమార్ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. -
పొసగని పొత్తులతోనే పోరాటం
తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని దశాబ్దా లుగా రాష్ట్రం ద్విముఖ పోటీలనే చవి చూస్తూ వచ్చింది. ఇపుడు మూడవ గణనీయమైన పార్టీ ప్రవేశంతో ఎన్నికలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. సినీ నటుడు విజయ్ రాజకీయ బరిలోకి దిగడంతో ఆయనకు విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై ఎక్కువగా చర్చలు సాగుతున్నాయి. రాజకీయ అనుభవం సంపాదించడానికి కాక, ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకే బరిలోకి దిగుతున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం (టీవీకే)ను జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అన్నా డీఎంకే ఆయన డిమాండ్లు చూసి ఖంగుతింది. జన నాయకుడు కాగలడా?బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలలో కన్నా మెరుగైన ఫలితాలను కోరుకుంటోంది. అన్నా డీఎంకేతో పొత్తు ఏదో ఒరగబెట్టగలదనే ఆశ బీజేపీకే లేదు. కానీ టీవీకే ఆగమనం ఈ కూటమికి ఇపుడు లేని ఆధి క్యాన్ని తెచ్చిపెట్టగలదు. ఎన్నికల ప్రచార ఖర్చులు రూ. 40 లక్షలు మించకూడదని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తోంది. వాస్తవంలో, రూ. 5 కోట్లు అవసరమవుతాయని అంచనా. టీవీకే అభ్యర్థులలో కొందరికి అంత స్తోమత లేదని ఇటీవల జరిగిన ఆ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఫలితంగా, ఏదైనా పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, దాని పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు. విజయ్ గతంలో బీజేపీని తన ‘సైద్ధాంతిక శత్రువు’గా అభివర్ణించారు. హిందుత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, క్రైస్తవ, ముస్లిం మైనా రిటీల ఓట్లకు గండిపడవచ్చని ఆయన సందేహిస్తున్నారు. ఆయన అనుయాయుల్లో ఆ రెండు వర్గాలవారే ఎక్కువగా ఉన్నట్లు చెబు తున్నారు. టీవీకే వచ్చి చేరడం పట్ల అన్నా డీఎంకేకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అది చీలుస్తుందని దానికి తెలుసు. అయినా టీవీకే తనకు కూడా గ్రహణం పట్టిస్తుందే మోనని అన్నా డీఎంకే లోలోపల ఆందోళన చెందుతోంది. సినిమాలలో మాదిరిగానే ప్రత్యర్థుల దుమ్ము దులిపి ‘జన నాయగన్’ అనిపించుకోవాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్ని కల బరిలో నిలిచిన అభ్యర్థి హీరోగా నటించిన సినిమా విడుదల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం అవుతుందా? ఇది ఎన్నికల కమిషన్కు ఎదురవుతున్న ప్రశ్న. రెండు ద్రవిడ కూట ములలో విజయ్ దేనిని దెబ్బతీస్తారనే దానిపైనే దాని జవాబు ఆధారపడి ఉంటుందని గత కొద్ది ఏళ్ళ చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. చిత్ర దర్శకుడు సీమాన్ కూడా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పేరుతో ఒక చిన్న తమిళ జాతీయవాద పార్టీని ఇదివరకే ప్రారంభించారు. దాని ఓట్ల శాతం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తోంది. విజయ్ రాకతో ఎక్కువ దెబ్బతినేది ఆ పార్టీయేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యుద్ధం స్టాలిన్తోనే!అభిమానులు దళపతిగా పిలుచుకునే విజయ్ తన విమర్శ నాస్త్రాలన్నింటినీ పాలక డీఎంకే పైన, దాని నాయకుడు, ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ పైన మాత్రమే ఎక్కుపెడుతున్నారు. విజయ్ 2025 సెప్టెంబర్లో కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన కొద్ది బహిరంగ సభలలోనే పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత, ఏ బహిరంగ సభలో మాట్లాడినా ఆయన ఎన్నికల ‘యుద్ధం’ తనకూ, స్టాలిన్కూ మధ్యనేనని చెబుతూ వస్తున్నారు. పాలకడీఎంకే పాల్పడినట్లు చెబుతున్న అవినీతి, దుష్పరిపాలనను తొల గించగల వ్యక్తిగా విజయ్ తనను తాను చాటుకుంటున్నారు. పెరి యార్, కె. కామరాజ్, సి.ఎన్. అన్నాదురై, ఎమ్జీఆర్ల సిసలైన వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. ఆయన అన్నా డీఎంకే ప్రస్తావనే తీసుకురావటం లేదు. తన ‘సైద్దాంతిక శత్రువు’ను కూడా విమర్శించడం లేదు. తమిళ నాడు నాయకత్వాన్ని కోరుకుంటున్నా, ఇంతకూ రాష్ట్రానికి సంబంధించి విజయ్ ప్రణాళికలేమిటో స్పష్టం కాలేదు. మీడియా ఇంటర్వ్యూలకు కూడా ఆయన దూరంగాఉంటున్నారు. స్టాలిన్ మాత్రం తన వంతుగా, అభివృద్ధికి సంబంధించి ‘ద్రావిడ నమూనా’ను పరిరక్షించుకునేందుకు సాగుతున్న నిర్ణయా త్మక పోరాటంగా ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. కేంద్రం నుంచి ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా, ‘డబుల్ ఇంజిన్’ సర్కారు ఉన్న రాష్ట్రాలకన్నా తమిళనాడు మెరుగైన పనితీరును కనబరచిందని ఆయన చెబుతున్నారు. అయినా ఆయన దేనినీ తేలికగా తీసు కోవడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి కాకుండా, తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి ఐదేళ్ళ కొకసారి పొడసూపుతూఉంటుంది. జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే మాత్రమే గత దశాబ్దంలో ఒకేసారి 2016లో వరుసగా రెండవ విడత విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. అన్నా డీఎంకే గురించి విజయ్ ఎలా ప్రస్తావించడం లేదో, అలాగే స్టాలిన్ కూడా విజయ్ పేరును ఎత్తడం లేదు. విజయ్పై ధ్వజమెత్తే పనిని ఆయన పార్టీలోని ఇతరులకు వదిలేశారు. కానీ, కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత కూడా, ఆయన జన సమ్మోహక శక్తి తరగక పోవడంతో డీఎంకే ఆందోళనకు లోనవుతోంది. పైగా, ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్తో డీఎంకే సంబంధాలు గత ఎన్నిక లప్పుడున్నంత బలంగా లేవు. సీట్ల పంపంకంపై అవి బాహాటంగానే కీచులాడుకున్నాయి.అన్నా డీఎంకే అంతంతే!ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే పాత్ర కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తోంది. దాని కూటమిలో బీజేపీతో పాటు టి.టి.వి. దినకరన్ కూడా ఉన్నారు. జయలలితకు సన్నిహితురాలైన శశికళకు ఆయన మేనల్లుడు. కాగా, శశికళ సొంత కుంపటి ఉండనే ఉంది. ఆమె పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అన్నా డీఎంకేను చికాకు పరచగలదని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, అంతో ఇంతో పలుకుబడి కలిగిన ఒ.పన్నీర్ సెల్వం కూడా అన్నా డీఎంకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర, బిహార్ వంటి రాష్ట్రాల్లో కాషాయ పార్టీతో జత కట్టిన ప్రాంతీయ పార్టీలు ఎటువంటి ఫలితాలు సాధించిందీ పార్టీ నాయకుడు ఎళప్పాడి పళనిస్వామి గమనించకపోలేదు. అన్నా డీఎంకే కూటమిలో కెమిస్ట్రీ లోపించిందని తెలుస్తూనే ఉంది. మొత్తం 234 మంది సభ్యులు గల అసెంబ్లీలో 2021 ఎన్నికల్లోడీఎంకే 133 సీట్లు సాధించింది. డీఎంకేను ఎన్డీయే ఓడించలేక పోయినా, మహా అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడే విధంగా, డీఎంకే కూటమికి చిల్లు పెట్టవచ్చు. ఎన్డీయేతో కలిసో లేదా కలవకుండానో విజయ్ తన వంతు పాత్ర తాను పోషిస్తారు. విజయ్ ‘రాజు కాలేరు. రాజుగా ఎవరినో కూర్చోపెట్టనూ లేరు. ఓట్లను చీలుస్తారంతే’ అని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్ అందుకే వ్యాఖ్యానించినట్లుంది!-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-నిరుపమా సుబ్రమణియన్ -
రూ.400 కోట్లకు పైగా నగదు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం వేళ అక్రమ నగదు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతోంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు తావులేకుండా ఈసీ కఠిన చర్యలు చేపట్టింది.ఫిబ్రవరి 26న ఎల్రక్టానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఎస్ఎంఎస్) పేరిట ఎన్నికల నిఘా వ్యవస్థను క్రియాశీలకం చేసింది. నాటి నుంచి మార్చి 25 వరకు కొద్దిరోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.408.82 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మొత్తంలో మాదకద్రవ్యాల విలువ రూ.167 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న అక్రమ సొత్తును ఈసీ గణాంకాలతో సహా వెల్లడించింది. 100 నిమిషాల్లోనే పరిష్కారం... ఎన్నికల అక్రమాలపై సామాన్య పౌరులు ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ‘సి–విజిల్’ (cVIGIL) యాప్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని ఈసీ తెలిపింది. మార్చి 15 నుంచి 25 మధ్య కేవలం పది రోజుల్లోనే 70,944 ఫిర్యాదులు అందాయి. ఇందులో 95.8 శాతం (67,899) ఫిర్యాదులను కేవలం 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించారు. 1950 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ పేర్కొంది. చదవండి: ఎన్నికర ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు నిర్మించిన కేరళ నేత -
ఓట్లలో ముందంజ సీట్లలో వెనకంజ
తిరువనంతపురం: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళాభ్యున్నతి కోసం ఊదరగొట్టే రాజకీయ పార్టీలు తీరా సీట్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నాయి. ఇందుకు కేరళ రాజకీయాలూ మినహాయింపు కాదని తేటతెల్లమైంది. గత నెల 21వ తేదీన కేరళ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. దీని ప్రకారం కేరళ ఓటర్లలో 1,32,20,811 మంది పురుషులు ఉంటే వాళ్లకంటే ఎక్కువగా 1,39,21,868 మంది మహిళలు ఉన్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టం ద్వారా శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఓపక్క ప్రకటించినా క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఆ మాటలన్నీ నీటిలో ఉప్పు మూటలేనని రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడిగా తేల్చిచెప్పాయి. త్వరలో జరగబోయే కేరళ శాసనసభ ఎన్నికల్లో 140 స్థానాలకుగాను అన్ని ప్రధానపార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ అత్యధికంగా 14 చోట్ల మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపింది. సీపీఐ(ఎం) 12 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల, సీపీఐ ఐదు చోట్ల మహిళలకు సీట్లు ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తేగానీ మహిళలకు కోటాపై ఆలోచించేదిలేదని రాజకీయపార్టీల ఆలోచనగా ఉందని తాజా కేటాయింపులతో తేలిపోయింది. అయితే విపక్ష యూడీఎఫ్ కూటమిలో భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలకు సీట్లు ఇవ్వడం విశేషం. 1957లో కేరళ శాసనసభ ఆవిర్భవించింది. అప్పట్నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఏ ఒక్క శాసనసభలోనూ మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కనీసం 10శాతానికి చేరుకోలేదు. పార్టీలు మహిళలకు సీట్లు ఇవ్వడానికి మొదట్నుంచీ విముఖత చూపుతున్నాయని ఏప్రిల్9న బరిలో దిగనున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పీసీ విష్ణునాథ్ అన్నారు. ‘‘శక్తిసామర్థ్యాలున్న మహిళా నేతలు ఎలాంటి చట్టం, కోటా లేకుండానే సీటు సాధించి విజయతీరాలకు చేరగలరు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ప్రతి పార్టీ.. గెలుపు గుర్రాలనే నమ్ముకుంటోంది. మహిళా అభ్యర్థి అని కాకుండా ఇతరత్రా అంశాలకు ప్రాధాన్యతనిచ్చి సీటు కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటున్నాయి’’అని అన్నారు.ప్రాధాన్యత పెరగాలి: ఐద్వా నాయకురాలు‘‘ఎల్డీఎఫ్ కూటమి మొత్తంగా 18 మంది మహిళలకు సీట్లు ఇచ్చింది. ఇది ఏమాత్రం సరిపోదు. మాకు సీట్లు పెరగాలని ప్రతిసారీ గట్టిగా చెబుతున్నాం. పార్టీలు హామీలు ఇస్తున్నాయి. తీరా అభ్యర్తుల తుది జాబితా బయటికొచ్చేసరికి పరిస్థితి తారుమారవుతోంది’’అని సీనియర్ సీపీఐ(ఎం) నాయకురాలు, ఆలిండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) జాతీయ కార్యదర్శి పీకే శ్రీమతి అసహనం వ్యక్తంచేశారు. ‘‘కేరళలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే మోదీ సర్కార్ హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ చట్టంపై మాట్లాడుతోంది. దమ్ముంటే తక్షణం ఆ చట్టం అమల్లోకి తేవాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు. కేరళలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
ముస్లింల ఓట్లే ‘కీ’లకం
(సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి) పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయ వాగ్భాణాలు, ప్రత్యేక వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు సహజం. కానీ వాటిని మించి కులాలు, మతాలు, ప్రాంతీయ సమీకరణాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. బెంగాల్ ఓటర్లలో దాదాపు 30 శాతం మంది ముస్లింలే. దాంతో అక్కడి పార్టీల తలరాతను మార్చగలిగే శక్తిగా ముస్లింలు ఎదిగారు. దీంతో ఈసారి వాళ్లు ఎవరికి పట్టంకడతారనే చర్చ మొదలైంది. ముఖ్యంగా తృణమూల్కు మొదటి నుంచీ ముస్లింలు అండగా ఉంటూ వస్తున్నారు. వీరి దన్నుతోనే మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి ముస్లిం ఓట్లలో చీలిక తెస్తూనే హిందూ ఓట్లను ఐక్యం చేసే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముస్లిం ఓటర్లు రాష్ట్రంలోని కనీసం 110 స్థానాల్లో జయాపజయాలను ప్రభావితం చేయగలరు. దీంతో మరోసారి ముస్లింల ఐక్యత మరోసారి తృణమూల్ను విజయతీరాలకు చేరుస్తుందా? లేదంటే వీరిలో ఐక్యత దీపం కొండెక్కి తృణమూల్ పడవను ఓటమి సముద్రంలో ముంచేస్తుందా? లేదంటే చీలిక తెచ్చి బీజేపీ ఘన విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. పథకాలతో లబ్ధిపొందిన ముస్లింలు ముస్లింల మద్దతు వెనుక కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేకాకుండా పక్కాగా అమలు చేసిన వ్యూహాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సమీకరణాలున్నాయి. ముఖ్యంగా...టీఎంసీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లిం వర్గాల్లో గట్టి మద్దతును ఏర్పరచాయి. మహిళల కోసం ‘లక్ష్మీ భండార్’, విద్యార్థుల కోసం ‘సబుజ్ సాథి’, బాలికల విద్యను ప్రోత్సహించే ‘కన్యాశ్రీ’వంటి పథకాలు సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రత్యక్ష లాభం చేకూర్చాయి. ఈ పథకాలు మతాలకు అతీతంగా అమలయ్యాయి. దీంతో ముస్లిం వర్గాలు ఈ పథకాల నుంచి ఎక్కువ మంది లబ్దిపొందాయి. మైనారిటీ వర్గాలపై టీఎంసీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మదర్సాల అభివృద్ధి, ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు, మతపరమైన నాయకులకు గౌరవ వేతనాలు వంటి చర్యలు ‘ప్రభుత్వం మన కోసం పని చేస్తుంది’అనే భావనను ముస్లింలలో బలంగా నాటాయి. ఈ భావన రాజకీయంగా టీఎంసీకి కీలక మద్దతుగా మారింది. గడిచిన పదేళ్లుగా ప్రధాన పోరు బీజేపీ, టీఎంసీల మధ్యే నెలకొంది. బీజేపీ హిందూ రాజకీయాలతో పోలిస్తే టీఎంసీ సర్వమత సహకార భావనే ముస్లింలను ఆ పార్టీకి దగ్గర చేసిందని తెలుస్తోంది. ముస్లింల ఈ రక్షణాత్మక భావనే తమ గెలుపునకు భరోసా అని టీఎంసీ నేతలు ఆశిస్తున్నారు. టీఎంసీ అయితేనే తమ ప్రయోజనాలకు పరిరక్షణగా నిలబడుతుందనే యోచన ముస్లింలలో బలంగా నాటుకుపోయింది. ఈ ఐక్యతే టీఎంసీకి గతంలో గంపగుత్తగా ఓట్లు పడేలా చేసింది. స్థానికంగా ముస్లిం నాయకత్వానికి టీఎంసీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, ప్రాంతీయ నాయకులను ప్రోత్సహించడంతో ప్రజల్లో ప్రాతినిధ్యం ఉన్న భావన పెరిగింది. ఇది ఓటర్లతో నేరుగా అనుబంధాన్ని ఏర్పరచింది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్పూర్, దక్షిణ 24 పరగణాలు వంటి ముస్లిం ప్రభావిత జిల్లాల్లో టీఎంసీకి బలమైన కేడర్ ఉంది. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఓటును సమీకరించడంలో ఇవన్నీ కీలకంగా మారాయి. ప్రతిపక్ష పార్టీల బలహీనత టీఎంసీకి అనుకూలంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఒకింత ముస్లిం ఓటు బ్యాంక్ ఉండేది. అయితే క్రమంగా ఈ రెండు పార్టీలు ప్రభావం కోల్పోవడంతో ప్రత్యామ్నాయం లేక ముస్లింలు టీఎంసీని ఆశ్రయించారు. హిందువులను ఐక్యం చేసే పనిలో కమలదళం బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదల వెనుక ఉన్న ప్రధాన వ్యూహాల్లో ఒకటి ముస్లిం ఓటును విభజించడం. రెండోది హిందూ ఓటును ఐక్యంగా మార్చడం. ఈ ద్వంద్వ వ్యూహమే 2019 నుంచి పార్టీని బెంగాల్లో ముందుకు నడిపిస్తోంది. ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేయకుండా వాళ్లను రెండు, మూడు పార్టీల వైపు చూసేలా చేయడమే బీజేపీ లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రత్యక్షంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కన్నా కాంగ్రెస్, లెఫ్ట్, చిన్న ప్రాంతీయ పార్టీల వైపు ముస్లిం ఓటర్లు చూసేలా బీజేపీ పరోక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని వార్తలొచ్చాయి. హిందువులను ఏకం చేసి ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం బీజేపీ మతపరమైన గుర్తింపును బలంగా ప్రస్తావిస్తోంది. సమూహ భావనను బీజేపీ ముందుకు తెస్తోంది. ముఖ్యంగా ‘సాంస్కృతిక పరిరక్షణ’, దేవాలయాలపై దాడులు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ హిందువుల్లో ఐక్యత పెంపొందేలా శతథా కృషిచేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నమశూద్రులు, రాజ్బంశీలు వంటి వర్గాల్లో బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ఈ వర్గాల మధ్య ప్రస్తావించడం ద్వారా తమ మద్దతును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జంగిల్మహల్ వంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రభావం పెంచుకుంది. బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో హిందువుల జనాభా ఎక్కువ. ఇక్కడ బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కబీర్ మరో ఒవైసీ అవుతారా..? తృణమూల్కు చెందిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ‘బాబ్రీ మసీదు నమూనాలో మసీదు కడతా’ అంటూ ఆయన మొదటుపెట్టిన రాజకీయాలు తీవ్ర అలజడిని రేపుతున్నాయి. కబీర్తో ముస్లిం ఓటు విభజనకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కబీర్తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసిపోవడంతో సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఓటు చీలిపోయే ఆస్కారముంది. ఈ చీలిక నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్కు గండికొడుతుంది. వీరిద్దరూ కలిసి 140 స్థానాల్లో పోటీలో ఉంటారన్న అంచనాలు తృణమూల్ను కంగారు పెడుతున్నాయి. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో హుమయున్ కబీర్ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామాలను బిహార్ రాజకీయాలతో పోల్చుతున్నారు. అక్కడ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటును విభజించి, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసింది. ఆర్జేడీ ఓటమికి పరోక్షంగా కారణమైంది. ఇప్పుడు అచ్చం అలాగే హుమాయున్ కబీర్ కారణంగా ముస్లిం ఓటు చీలితే టీఎంసీ విజయావకాశాలు తగ్గి బీజేపీ అధికారపీఠానికి చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
గెలిచే తంబీ ఎవరో..?
కన్యాకుమారి.. భారతీయులకు సుపరిచిత ప్రాంతం..! తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా దక్షిణ భాగంలో ఉన్న విలవన్కోడ్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారుతోంది. ఇందుక్కారణం.. ఆ ప్రాంతం రబ్బరు పరిశ్రమలకు నెలవు. యాలకులు, లవంగాలు సుగంధ ద్రవ్యాల పంటలకు కేరాఫ్ అడ్రస్..! అంతేకాదు.. చారిత్రక చిత్తరల్ కొండ ఆలయం, తిక్కురిచి మహాదేవ ఆలయం, నట్టాలం శంకరనారాయణ దేవస్థానం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు టఫ్గా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నా.. గెలుపోటములను ఏమాత్రం అంచనా వేయని పరిస్థితులున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?కన్యాకుమారి జిల్లాలో ప్రధాన వాణిజ్య పట్టణమైన మార్తాండంతోపాటు.. కుళితురై, కలియక్కవిలై, అరుమనై వంటి ప్రముఖ ప్రదేశాలు విలవన్కోడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కొండప్రాంతమైన కొడియార్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతాల్లో రబ్బరు తోటలు సమృద్ధిగా ఉన్నాయి. రబ్బరు ప్రాసెసింగ్ పరిశ్రమలకు విలవన్కోడ్ అడ్డా అని చెప్పవచ్చు. జీడిమామిడి తోటలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. కేరళ, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో పండే జీడిమామిడి ప్రాసెసింగ్ మిల్లులు కూడా విలవన్కోడ్లో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నాడర్ సామాజికవర్గం మెజారిటీగా ఉంది. వీరి తర్వాత నాయర్లు, ఈలవలు, వెల్లలార్లు, ఎస్సీలు, ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్తోపాటు.. సీపీఎం, బీజేపీలకు మంచి క్యాడర్ ఉందని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 11 సార్లు, సీపీఎం ఐదు సార్లు విజయం సాధించగా.. బీజేపీ క్రమంగా తన ఓటుబ్యాంకును పెంచుకుంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ. పురుష ఓటర్ల సంఖ్య ఒక లక్షా 11 వేల 990 కాగా.. మహిళా ఓటర్లు ఒక లక్షా 13 వేల 226 మంది ఉన్నారు. ముగ్గురు థర్డ్ జెండర్లు కూడా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.ఈ నియోజకవర్గ ప్రజల చిరకాల డిమాండ్ అయిన.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు హామీపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో ఈ హామీ పేరుతో ప్రధాన పార్టీలు తమను మోసగిస్తున్నాయనే భావన ఇక్కడి ఓటర్లలో ఉంది. దీంతోపాటు.. జీడిమామిడి మిల్లుల అప్గ్రేడేషన్, జీడిమామిడి కార్మికుల రోజుకూలీ పెంపు వంటి డిమాండ్లు పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడ అటవీ చట్టానికి సంబంధించిన సమస్యలతోపాటు.. నెయ్యర్ ఎడమగట్టు కాల్వలో నీటి విడుదల లేకపోవడం వంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు అంటేనే.. అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లు రాజకీయాలు కొనసాగుతాయి. ఈ నియోజకవర్గంలో మాత్రం.. ఆ రెండు పార్టీల ప్రాబల్యం కనిపించదు. అయితే.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ హామీని నెరవేరుస్తామంటూ బీజేపీ.. కాంగ్రెస్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. -
Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు!
పుదుపల్లి: కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఆ అభ్యర్థి ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్భాటాలు లేవు, భారీ కటౌట్లు అసలే లేవు. కేవలం ఒక సైకిల్, ఒంటిపై తండ్రి బొమ్మ ఉన్న టీషర్ట్.. ప్రజల ఆశీస్సులు కోరుతూ పుదుపల్లి నియోజకవర్గంలో చాందీ ఊమెన్ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తనయుడు, ప్రస్తుత యూడీఎఫ్ అభ్యర్థి చాందీ ఊమెన్ తనదైన శైలిలో ‘గ్రీన్ క్యాంపెయిన్’కు శ్రీకారం చుట్టారు.హోరెత్తే ప్రచారానికి స్వస్తిసాధారణంగా ఎన్నికలంటే వీధివీధినా వెలిసే భారీ ఫ్లెక్సీలు, మైకులతో హోరెత్తే ప్రచార రథాలు గుర్తొస్తాయి. కానీ, పుదుపల్లిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల పోస్టర్లు గోడల నిండా కనిపిస్తున్నా, చాందీ ఊమెన్ మాత్రం ఎక్కడా ఒక్క బ్యానర్ కూడా కట్టకుండా ప్రచారం సాగిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమాసియాలో యుద్ధం, మానవీయ సంక్షోభం నెలకొన్న వేళ.. ప్రచారం కోసం అనవసరంగా లక్షల రూపాయలు ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. అది సరైన సమయం కాదు’ అని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రచారం కోసం ఖర్చు చేసే నిధులను నియోజకవర్గంలోని పేదల కోసం 100 ఇళ్లు నిర్మించడానికి ఉపయోగిస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే 50 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ప్రచార ఆర్భాటాల కంటే పేదలకు గూడు కల్పించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.రోజూ సైకిల్పై..ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకే తన హైబ్రిడ్ సైకిల్పై చాందీ ఊమెన్ ప్రయాణం మొదలవుతుంది. తన తండ్రి ఫోటో ఉన్న వైట్ టీషర్ట్ ధరించి, గ్రామీణ ప్రాంతాల్లోని ఇరుకు దారుల్లో సైకిల్ తొక్కుతూ ప్రతి ఇంటిలోని వారినీ ఆయన పలకరిస్తున్నారు. ‘గతంలో పాదయాత్ర చేశాను, కానీ సైకిల్ అయితే గంటకు 31 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలుసుకునే అవకాశం నాకు దక్కుతోంది’ అని ఆయన వివరించారు. దారి పొడవునా స్కూలు పిల్లలతో ముచ్చటిస్తూ, వృద్ధుల యోగక్షేమాలు అడుగుతూ, సెల్ఫీలు ఇస్తూ సాగుతున్న ఆయన యాత్రకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు.తండ్రి వారసత్వంపుదుపల్లి అంటే ఊమెన్ చాందీకి పెట్టని కోట. 2023 ఉప ఎన్నికల్లో తన తండ్రి సాధించిన మెజారిటీ (9,000) కంటే ఎక్కువగా, దాదాపు 37,000 ఓట్ల మెజారిటీతో చాందీ ఊమెన్ విజయం సాధించారు. తన తండ్రి తనకు ఇచ్చిన అతిపెద్ద సలహా ‘ఎప్పుడూ ప్రజలతోనే ఉండు, ఎవరినీ నొప్పించకు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. కేరళ ప్రభుత్వం తన నియోజకవర్గంపై వివక్ష చూపుతోందని, తన తండ్రిపై ఉన్న రాజకీయ కక్షతోనే నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు.తండ్రి అడుగుజాడల్లోనే..చాందీ ఊమెన్ ప్రచార శైలిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన ఏమాత్రం అలసట లేకుండా గంటల తరబడి సైకిల్ తొక్కుతూ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆయన తండ్రి లాగే నిరాడంబరంగా ఉండటం మాకు సంతోషంగా ఉంది’ అని ఓటర్లు అంటున్నారు. ఆయన వెనుక అనుచరులు, భద్రతా సిబ్బంది వాహనాలు ఉన్నప్పటికీ, చాందీ ఊమెన్ మాత్రం సామాన్యునిలా సైకిల్పైనే ప్రజల్లో మమేకమవుతున్నారు. ఎండ తీవ్రత పెరగకముందే ఉదయం 8:30 గంటల వరకు ప్రచారం ముగించి, కొద్దిసేపు టిఫిన్ విరామం తీసుకుని తిరిగి తన తదుపరి షెడ్యూల్లో బిజీ అయిపోతున్నారీ యువ నేత.ఇది కూడా చదవండి: West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్ -
ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మెట్టూరు కూడా ఒకటి. ఇక్కడి నుండి నామ్ తమిళర్ కట్చి తరపున అడవి బిడ్డ, స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యా రాణి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ, ఆమె తన ఎన్నికల ఖర్చుల కోసం ప్రజల సహాయాన్ని అర్థించారు. వీడియో ద్వారా విజ్ఞప్తి విద్యారాణి సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేస్తూ, అందులో తన భావాలను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన వాహన డీజిల్, ఆహారం, ఇతర రోజువారీ ఖర్చుల కోసం తనకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సోదర సోదరీమణులు, పెద్దలు, తమిళ బంధువులందరూ ఏకమై తోచిన సహాయం చేస్తే, అది తన విజయాన్ని సులభతరం చేస్తుందని ఆమె ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. విద్యా రాణి కేవలం విజ్ఞప్తి చేయడమే కాకుండా, తన వీడియోలో ఆర్థిక సహాయం పంపడానికి వీలుగా జీ పే, పోన్ పే నెంబర్లతో పాటుగా బ్యాంక్ ఖాతా వివరాలను జత చేశారు. సామాన్యుల పక్షాన నిలబడి పోరాడటానికి తనకు ఈ సహాయం ఎంతో అవసరమని ఆమె విజ్ఞప్తి చేశారు.విద్యారాణి రాజకీయ నేపథ్యం గతంలో బీజేపీ , పీఎంకే పారీ్టల్లో పనిచేసిన విద్యా రాణి, ఇటీవల సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చిలో చేరారు. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది , సామాజిక కార్యకర్త. తన తండ్రి వీరప్పన్పై ఇప్పటికీ సానుభూతి ఉన్న ప్రాంతాల్లో ఆమెకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఓ వైపు ప్రధాన పారీ్టలు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంటే, విద్యా రాణి వీడియో సందేశంలో ఉద్వేగ పూరిత వ్యాఖ్యలతో ప్రజల నుండి చందాలు సేకరించే పనిలో పడ్డారు. చందనపు దుంగల, ఎనుగుల దంతాల స్మగ్లర్గా పశి్చమ పర్వత శ్రేణుల్లోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం కేంద్రంగా ఒకప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ముచ్చెమటలు పట్టించిన వీరప్పన్ తనయ తాజాగా నిధుల కోసం ఎదురు చూడటం గమనార్హం. -
ఇండియా కూటమిలో రాజకీయ వార్
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఇండియా కూటమిలో రాజకీయ వార్ తారా స్థాయికి చేరింది. ఆరు స్థానాలలో ఇరు పార్టీలు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందు ఇరు పార్టీల తరపున అభ్యర్థులు ముందుకు రాక పోవడంతో కూటమి చిన్నా భిన్నమయ్యే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇండియా కూటమిలో వివాదం కొనసాగుతూనే ఉంది. సీట్ల సర్దుబాటుకు ముందుగా ఇక్కడి 30 స్థానాలలో డీఎంకే, కాంగ్రెస్ కూటమి తరపున నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసినానంతరం సీట్ల సర్దుబాటు జరిగింది. ఇందులో 16 చోట్ల కాంగ్రెస్, 14 చోట్ల డీఎంకే పోటీ చేస్తున్నది. ఇందులో ఓ స్థానం వీసీకేకు డీఎంకే అప్పగించింది. సీట్ల పంపకాలు ముగిసినప్పటికీ, ఆరు స్థానాలు కూటమి చిన్నాభిన్నంకు పరిస్థితులను కల్పిస్తున్నాయి. ఈ ఆరు స్థానాలలో కాంగ్రెస్, డీఎంకే నామినేషను బుధవారం జరిగిన పరిశీలనలో ఆమోదించారు. గురువారం ఉపసంహరణ ప్రక్రియ జరగనున్నది.కుదరని ఏకాభిప్రాయంకూటమిలో ఏకాభిప్రయం కుదరక పోవడంతో సీపీఐ ఒంటరిగా పోటీ అని ప్రకటించి, తట్టాం చావడి, ఉలవర్కరై స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టేసింది. ఇక వీసీకే తరపున ఉలవర్కరై, ఉసుడు, తిరుభువనం నియోజకవర్గాలలో నామినేషన్లు దాఖలు చేసిన వాళ్లు ఉపసంహరణకు ముందుకు రాక పోవడం చర్చకు దారి తీసింది. ఇదే తరహా పోరు అన్నడి డీఎంకే, కాంగ్రెస్లోనూ నెలకొంది. డీఎంకేకు కేటాయించిన కాలపట్టు, రాజ్భవన్, నెల్లి తోపు, మంగళం, తిరుభువనం తో పాటుగా మరో నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కూడా నామినేషన్లు వేశారు. తాజాగా వీరు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో డీఎంకే ఇరకాటంలో పడ్డట్లయ్యింది. గురువారం నామినేషన్లు ఉపసంహరించుకోని పక్షంలో రెండు పార్టీలు తలబడేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రెండ్లీ సమరంగా ఈ ఆరు స్థానాలలో పోటీ ఉంటుందని కాంగ్రెస్ ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం. అయితే దీనిని డీఎంకే అంగీకరించే పరిస్థితులలో లేదు. అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పోటీలో ఉన్న స్థానాలలో తమ తరపున నామినేషన్లు వేసిన వారి చేత ఉపసంహరింప చేయకుండా డీఎంకే ఎత్తుకు పై ఎత్తు వేస్తుండటంతో పుదుచ్చేరి ఇండియా కూటమిలో రాజకీయ సంక్షోభం అన్నది బయలు దేరి నట్టైంది. కూటమి చీలకుండా కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జ్ గిరీశ్ చోదన్కర్ తదితరులు కాంగ్రెస్ నేతలతో సమాలోచనలో ఉన్నారు.నాకు వ్యతిరేకంగా కుట్రమాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామికి సీటు నిరాకరించడం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. తనకు నెల్లి తోపు నియోజకవర్గం దక్కకుండా రాష్ట్ర అధ్యక్షుడు వైద్యలింగం కుట్ర పన్నారని నారాయణ స్వామి బహిరంగంగా విమర్శించారు. నారాయణస్వామి మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో నారాయణస్వామి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పార్టీని కాపాడటమే తన లక్ష్యం. ఒక నాయకుడు తనపై కుట్ర పన్నారని, కూటమి బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యానించారు. -
Bengal: బీజేపీ సంచలనం.. ‘ఆర్జీ కర్’ బాధితురాలి తల్లికి న్యాయం?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యావత్ దేశాన్ని కుదిపేసిన కోల్కతా ఆర్జీ కర్ (RG Kar) ఆస్పత్రి హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ట్రైనీ డాక్టర్ తల్లి రత్న దేబ్నాథ్ను ఎన్నికల బరిలోకి దింపింది. బుధవారం విడుదల చేసిన 19 మంది అభ్యర్థుల మూడో జాబితాలో ఆమె పేరును ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పాణిహతి నియోజకవర్గం నుండి ఖరారు చేసింది.న్యాయం కోసమే ఈ పోరాటం: రత్న దేబ్నాథ్తన అభ్యర్థిత్వంపై రత్న దేబ్నాథ్ ఉద్వేగంతో వ్యాఖ్యానిస్తూ.. ‘నా కూతురి విషయంలో న్యాయం కోసం ఎన్నో చోట్ల తిరిగాను. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, నా బిడ్డకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాను. నేను గెలిస్తే అది నా ఒక్కదాని విజయం కాదు, పాణిహతి ప్రజల విజయం’ అని ఆమె పేర్కొన్నారు. 2024 ఆగస్టులో జరిగిన ఈ దారుణ ఘటనపై సీబీఐ విచారణ జరగగా, ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.మూడవ జాబితాలోని ఇతర విశేషాలుబీజేపీ విడుదల చేసిన ఈ మూడో జాబితాలో పలువురు ప్రముఖులకు చోటు దక్కింది.దీపాంజన్ చక్రవర్తి: నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ)మాజీ కమాండో అయిన ఈయనను హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారా స్థానం నుండి బరిలోకి దింపారు.మొత్తం అభ్యర్థులు: బెంగాల్లోని మొత్తం 294 స్థానాలకు గాను, తాజా జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 274 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.రాజకీయ విమర్శలు - ఎన్నికల షెడ్యూల్రత్న దేబ్నాథ్ బీజేపీ తరపున పోటీ చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తప్పుబట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావిస్తూ టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. తుది ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.ఇది కూడా చదవండి: Bengal Election: ‘సునామీ’కి సెంటర్ పాయింట్! -
Bengal Election: ‘సునామీ’కి సెంటర్ పాయింట్!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ‘దక్షిణ బెంగాల్’ ప్రాంతం ఎప్పుడూ ఒక పవర్ హౌస్ లాంటిది. హుగ్లీ నదీ తీరం మొదలుకొని నబన్న (రాష్ట్ర సచివాలయం) వరకు సాగే ఈ రాజకీయ చదరంగం ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, ఆపై లెఫ్ట్ ఆధిపత్యం చూసిన ఈ ప్రాంతం, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి తిరుగులేని కంచుకోటగా ఉంది. అయితే ఈ కోటకు బీటలు వారేలా చేసి అక్కడ పాగా వేయాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అసలు దక్షిణ బెంగాల్ రాజకీయ సమీకరణలు ఏమిటి? ఏయే అంశాలు స్థానిక ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి? ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇదే చర్చనీయాంశంగా మారింది.తామ్రలిప్త సామ్రాజ్యం నుంచి..దక్షిణ బెంగాల్ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఇది కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, బెంగాలీ పునరుజ్జీవనోద్యమానికి కేంద్రం. ప్రాచీన తామ్రలిప్త సామ్రాజ్యం నుంచి బ్రిటీష్ పాలన వరకు ఈ ప్రాంతానిది ప్రత్యేక చరిత్ర. కోల్కతా, హౌరా లాంటి నగరాలు రాజకీయ చైతన్యానికి నిలయాలు. ఉత్తర బెంగాల్తో పోలిస్తే ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. 2011 గణాంకాల ప్రకారం దక్షిణ బెంగాల్ జనాభా 7.4 కోట్లకు పైమాటే. ఈ అధిక జనాభా, పట్టణీకరణ ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి.మౌలిక సదుపాయాల లేమికోల్కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణ మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే గత దశాబ్దాలుగా సాగుతున్న పట్టణీకరణకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, శాటిలైట్ నగరాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.దక్షిణ బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటర్ల శాతం అత్యంత కీలకమైన అంశం. ముర్షిదాబాద్లో అత్యధికంగా 66.27 శాతం ముస్లిం జనాభా ఉండగా, బీర్భూమ్, దక్షిణ 24 పరగణాలు, నాడియా, హౌరా జిల్లాల్లో కూడా వీరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంక్ మమతా బెనర్జీ వెంటే నిలిచింది. ముర్షిదాబాద్లోని 22 సీట్లకు గానూ గతంలో టీఎంసీ 20 గెలుచుకోవడం ముస్లింల మద్దతుకు నిదర్శనం.బీజేపీ ప్రచారాస్త్రాలుఈసారి ఐఎస్ఎఫ్ (ఐఎస్ఎఫ్), లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి వల్ల ఓట్లు చీలితే తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ముర్షిదాబాద్ లాంటి సరిహద్దు జిల్లాల్లో పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్ వంటి అంశాలను బీజేపీ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. దీని వల్ల తమకు సీట్లు పెరుగుతాయని కమలనాథులు ఆశిస్తున్నారు. మరోవైపు, పశ్చిమ 'రార్' ప్రాంతంలోని పురూలియా, బాంకురా, ఝార్గ్రామ్ వంటి జిల్లాల్లో గిరిజన జనాభా అధికం. ఇక్కడ బీజేపీ తన పట్టును పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అర్జున్ ముండా వంటి జాతీయ స్థాయి గిరిజన నేతలను ఇక్కడ రంగంలోకి దించింది.మారుతున్న సమీకరణలుసంతాల్లు, ముండాలు సంప్రదాయబద్ధంగా టీఎంసీకి మద్దతు ఇస్తుండగా, మహతో సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. దీనికి తోడు రాజేష్ మహతో వంటి నేతలు పార్టీ మారడం స్థానిక సమీకరణలను మారుస్తోంది. అలాగే, వేసవిలో తలెత్తుతున్న తీవ్రమైన నీటి ఎద్దడి ఈసారి ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. కేంద్ర నిధుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య జరుగుతున్న పోరులో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండటం ఓటర్ల తీర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.బీజేపీ- టీఎంసీ ఎత్తుకు పైఎత్తు!2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, దక్షిణ బెంగాల్పై తృణమూల్ పట్టు ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఆనాడు దక్షిణ బెంగాల్లోని జిల్లాల్లో టీఎంసీ ఏకంగా 153 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. కోల్కతా, హౌరా తదితర జిల్లాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని మమత ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని, మారుతున్న సామాజిక సమీకరణలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. మొత్తం మీద బెంగాల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఈ దక్షిణ బెంగాల్ ఓటర్ల తీర్పుపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: West Bengal: కబీర్కి ఒవైసీ ‘పెద్దన్న’.. పొత్తు ఖరారు! -
బీజేపీ గుండెల్లో రెబెల్స్!
అస్సాంలో హ్యాట్రిక్పై కన్నేసిన అధికార బీజేపీకి రెబెల్స్ బెడద పెద్ద తలనొప్పిగా తయారైంది. పలు స్థానాల్లో ఎంత బుజ్జగించినా బరినుంచి తప్పుకోవడానికి తిరుగుబాటు అభ్యర్థులు ససేమిరా అంటుండటం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి చెందిన ఇతర పార్టీలకు కూడా రెబెల్స్ పోటు తప్పడం లేదు. ఇవి చాలవన్నట్టు పలుచోట్ల కూటమి పక్షాల నడుమ కూడా స్నేహపూర్వక పోటీలకు కూడా రంగం సిద్ధమైంది! రెబెల్స్, అసమ్మతులు, స్నేహపూర్వక పోటీల వంటి సమస్యలు కనీసం 20 పై చిలుకు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. ఇవన్నీ చివరికి అధికార కూటమి విజయావకాశాలనే దెబ్బ తీస్తాయేమోనన్న అభిప్రాయాలు బీజేపీ నేతల నుంచే వ్యక్తమవుతుండటం విశేషం! ఈశాన్యాన బీజేపీకి అత్యంత కీలకమైన అస్సాంలో పోలింగ్ గడువు శరవేగంగా సమీపిస్తోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ భవితవ్యం ఏప్రిల్ 9న జరిగే పోలింగ్లో తేలిపోనుంది. ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి సమరశంఖం పూరించిన బీజేపీ సరికొత్త తలనొప్పులతో సతమతమవుతోంది. ఈసారి ఏకంగా 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ నిరాకరించింది. దాంతో వారిలో పలువురు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. సీనియర్ నాయకులు పలుమార్లు పిలిపించుకుని బుజ్జగించినా తప్పుకునేందుకు ససేమిరా అంటూ పల్స్ రేటు పెంచేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోని అస్సాం గణ పరిషద్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. టికెట్లు దక్కని వారిలో పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బీజేపీ కూటమికి ప్రత్యర్థులుగా బరిలో దిగుతుండటం మరో విశేషం! మంత్రి నందితా గార్లోసా విషయంలో అదే జరిగింది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో మర్నాడే కాంగ్రెస్లో చేరారామె. ఆ పార్టీ తరఫున తన సిట్టింగ్ స్థానం హాఫ్లాంగ్ నుంచి పోటీ చేస్తున్నారు. అస్సాం బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు జయంతకుమార్ దాస్దీ ఇదే కథ. దిస్పూర్ టికెట్ను ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రద్యోత్ బోర్డోలోయ్కి బీజేపీ కేటాయించింది. ఆ స్థానాన్ని ఆశించిన దాస్ వెంటనే బీజేపీకి రాజీనామా చేసి స్వతంత్రునిగా బరిలో దిగారు! కటీగోరా బీజేపీ మాజీ ఎమ్మెల్యే అమర్చంద్ జైన్ కూడా టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మారారు. సీనియర్ల అసంతృప్తి ఈసారి పలువురు సీనియర్ బీజేపీ నేతలు కూడా తమకు టికెట్లు దక్కకపోవడంతో నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ జాబితాలో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ భట్టాచార్య, ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన అతుల్ బోరా వంటి హేమాహమీలున్నారు. వారంతా పార్టీపై కినుక వహించడమే గాక ప్రచారానికి దూరంగా ఉండాల్సిందిగా తమ అనుయాయులకు, స్థానిక శ్రేణులకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. దాంతో పలు అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ ప్రచారం బోసిపోయి కన్పిస్తోంది. టికెట్లు దక్కని ఇతర సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులను కూడా ఈ సీనియర్లు పార్టీకి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారన్న వార్తలు బీజేపీ నాయకత్వానికి మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఏజీపీతోనూ తలనొప్పులు ఎన్డీఏ భాగస్వామి అస్సాం గణ పరిషద్తోనూ బీజేపీకి తలనొప్పులు తప్పడం లేదు. పలు స్థానాల్లో వాటి మధ్య స్నేహపూర్వక పోటీ తప్పని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇది అంతిమంగా కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చే పరిణామమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే దీన్ని బీజేపీ స్వయంకృతాపరాధంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఏజీపీకి కేటాయించిన పలు స్థానాల్లో ఆ పార్టీ కూడా బరిలో దిగుతుండటమే ఇందుకు కారణం. శివసాగర్లో ఏజీపీ ప్రదీప్ హజారికాకు టికెటివ్వగా చివరి క్షణాల్లో బీజేపీ కుషాద్ దొవారీని బరిలో దింపింది. ఏజీపీ బరిలో ఉన్న చామరియాలో కూడా బీజేపీ నామినేషన్ల చివరి రోజున తన అభ్యర్థిని బరిలో దించింది. తిరుగుబాట్లు, రెబెల్స్, అసమ్మతులు, అసంతృప్తులు చాలా స్థానాల్లో సమస్యగానే పరిణమించినట్టు రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒకరు అంగీకరించారు. ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తామో అర్థం కావడం లేదంటూ ఆయన వాపోయారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి దాస్రూపం గోస్వామి మాత్రం ఈ ఆందోళనలను కొట్టిపారేశారు. ‘‘బీజేపీ వంటి పెద్ద పార్టీలో ఆశావహులు చాలామంది ఉంటారు గనుక ఎంతో కొంత అసంతృప్తి సహజమే. వారంతా త్వరలోనే దారికొస్తారు’’ అని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్కడ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో, కేరళ రాజకీయ నాయకులు కూడా తమదైన యుద్ధం చేస్తున్నారు. అదే ఓట్ల కోసం చేసే యుద్ధం. క్షిపణులు, డ్రోన్లు వంటివి తమ వద్ద లేకపోయినా అభ్యర్థులు, కార్యకర్తలు తాము యుద్ధంలో ఉన్నట్లే భావిస్తున్నారు. కజక్కూట్టం నియోజకవర్గంలో ఈ యుద్ధం మరింత క్లిష్టంగా ఉంటుంది.రాజకీయ నేతలకు అక్కడి ఎత్తైన అపార్ట్మెంట్లు పెద్ద ఓటింగ్ యంత్రాల్లా కనిపిస్తాయి. కిటికీలు అభ్యర్థుల పార్టీ గుర్తుల్లా కనిపిస్తాయి. కానీ సమస్య ఏమిటంటే అభ్యర్థులు వస్తే కిటికీలు, తలుపులు రెండూ తెరుచుకోవు. ఆ ఫ్లాట్లలోని వారు తెరవరు. ఇళ్లలో ఇంటింటి ప్రచారం చేసే అలవాటు ఉన్న పార్టీలకు ఐటీ ఉద్యోగులు ఉండే ఫ్లాట్లలో ప్రచారం చేయడానికి మాత్రం ప్రత్యేక వ్యూహాలు అవసరం.ఎన్నికల్లో ఒక్కోసారి గెలుపు చాలా చిన్న మెజారిటీపై ఆధారపడుతుంది. సరిగ్గా ప్రచారం చేయకపోయినా, అభ్యర్థులు, కార్యకర్తలను ప్రచారంలో ప్రజలు ఆదరించకపోయినా తీవ్ర నిరాశకు గురవుతారు. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న ఎన్నికల్లో కజక్కూట్టం నియోజకవర్గంలో పార్టీలకు ఇటువంటి సమస్యే ఎదురవుతుంది. అక్కడ అన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి. అభ్యర్థులు వెళ్లినా ఆ ఫ్లాట్ల యజమానులు తలుపులు తెరవడం లేదు. రాజకీయ పార్టీల ప్రచారానికి వారు సహకారించడం లేదు. ఐటీ ఉద్యోగులు ఉండే ఈ ఫ్లాట్ల వద్దకు వెళ్లి ప్రచారాలు చేసుకోవాలంటే పార్టీల అభ్యర్థులకు ప్రత్యేక వ్యూహాలు అవసరం. అంతేగాక, ఈ ఫ్లాట్లలో బయటి వాళ్లు ఎక్కువగా ఉంటారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్న ఉద్యోగులు అధికం. ప్రతి ఓటు అభ్యర్థికి చాలా ముఖ్యం ఇక్కడ ఓటరు కార్డు ఉన్నవారిలో ఓటింగ్ ఆసక్తి తక్కువ. యువ ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రానికి రారు. ఆ ఫ్లాట్లలో అసోసియేషన్ పాత్ర కీలకంగా ఉంటుంది. వారి అనుమతి లేకపోతే రాజకీయ నాయకులు అక్కడ ప్రచారం చేసుకోవడం అసాధ్యం. ఇక్కడ ఇంటింటి ప్రచారం చాలా తక్కువ. అయితే, ఇక్కడి ప్రతి ఓటు అభ్యర్థికి చాలా ముఖ్యం. తక్కువ మెజార్టీతో ఇక్కడ అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. కజక్కూట్టం నియోజకవర్గంలో ఎత్తైన అపార్ట్మెంట్లు రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగా మారాయి. అతి తక్కువ మెజార్టీతో ఇక్కడి అభ్యర్థులు గెలుస్తుండడంతో ఆయా ఫ్లాట్ల ఓటర్లను వదులుకునే ప్రసక్తే లేదు. కజక్కూట్టం స్థానిక ఎన్నికల్లో గతంలో ఎల్డీఎఫ్ 1,909 ఓట్ల తేడాతో గెలిచింది. దీంతో ఈ ఎన్నికల్లోనూ ప్రతి ఓటు కీలకంగా మారింది.పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు వస్తే ఆయా ఫ్లాట్లలో నివసించే వారు తలుపులు తెరవకపోవడం, ప్రచారానికి సహకరించకపోవడం పార్టీలను ఇబ్బందికి గురి చేస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తే ఈ ఫ్లాట్లలోని చాలా మంది తమకు సహకరించరని పార్టీల కార్యకర్తలు చెబుతున్నారు.తక్కువ మెజార్టీతో గెలుపుకజక్కూట్టం టెక్నోపార్క్ కు నిలయం. ఇక్కడ 1990 దశకంలో వ్యవసాయ భూమిని ఐటీ కేంద్రంగా మార్చారు. ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు కనపడుతున్నాయి. మూసివేసిన గేట్లు, తలుపులు తీయాలని కోరుతూ వాటిల్లోకి వెళ్లడం రాజకీయ పార్టీల నేతలకు పెద్ద సవాలు.కజక్కూట్టంలో గతంలో పలు పార్టీల నేతలు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఎంఏ వాహిద్ 2001లో రెండు ప్రధాన కూటములను ఓడించి గెలిచారు. 2016 వరకు స్థానాన్ని నిలుపుకున్నారు. 2021లో సీపీఎంకు చెందిన కడకంపల్లి సురేంద్రన్ 7,374 ఓట్ల తేడాతో తిరిగి గెలిచారు.ఈ నియోజకవర్గంలో 28 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. బీజేపీ 14, ఎల్డీఎఫ్ 10, యూడీఎఫ్ 3, ఒకటి స్వతంత్ర అభ్యర్థి. ఈ సారి సీపీఎం తరఫున సురేంద్రన్ మళ్లీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున వి. మురళీధరన్, కాంగ్రెస్ తరఫున టి. శరత్చంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. -వెబ్డెస్క్ -
ఎవరిదో గెలుపు? బలాలు.. బలహీనతలు ఇవే..!
తమిళనాడు ఎన్నికలంటేనే.. నీలగిరిలో రాజకీయాలు వేడెక్కిపోతాయి. శీతల విడిదికి కేంద్రాలుగా ఉన్న నీలగిరి కొండల్లో వేడి రాజుకుంటుంది. తూర్పు, పశ్చిమ కనుమల కలయికకు కేంద్రబిందువైన నీలగిరుల్లో.. ఊటీ, కున్నూరు, కూడలూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎన్నికలు ఏవైనా కానీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను అంచనా వేయడం తలలు పండిన విశ్లేషకులకు కూడా సాధ్యం కాదనే విషయం ఇక్కడి అభ్యర్థులను కల్లోలపరుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలపై విశ్లేషణను ఎక్కడా మిస్సవ్వకుండా చదివేయండి..అంత ఈజీ కాదు..ఊటీ, కున్నూరు, కూడలూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ కూటమి రెండు చోట్ల.. అన్నాడీఎంకే ఒకచోట బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఇక్కడ గెలుపోటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఊటీ నియోజకవర్గాన్ని ఇక్కడ అధికారికంగా ఉదగై అంటారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.గణేశ్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పర్యాటకమే ప్రధాన ఆర్థిక వ్యవస్థ. టీ-కాఫీ తోటలకు నెలవు. అయితే.. కీలకమైన పరిశ్రమలు మూతపడడంతో ఇక్కడ నిరుద్యోగిత పెరుగుతోంది. స్థానిక సమస్యలు తోడవ్వడం యాంటీ-ఇన్కంబెన్సీకి దారితీసే ప్రమాదాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే..! ఇక కున్నూరు నియోజకవర్గం డీఎంకేకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతం. టీ-కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులకు ఈ నియోజకవర్గం నిలయం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా డీఎంకేకు కలిసివచ్చే అంశమే..! అయితే.. తేయాకును సేకరణకు ఇచ్చే కూలీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఇక్కడి కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని అన్నాడీఎంకే అడ్వాంటేజ్గా తీసుకుంటే.. పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఆ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే..ఇక కూడలూరు నియోజకవర్గంలో గిరిజన ఓటర్లదే ఆధిపత్యం. అనూహ్య ఫలితాలకు ఈ నియోజకవర్గం వేదిక. ఇక్కడ ఇరులర్, కురుంబర్ వర్గాలు గెలుపోటములను శాసిస్తాయి. వీరితోపాటు.. పడుగర్ వర్గానికి పెద్దమొత్తంలోనే ఓటుబ్యాంకు ఉంది. ఈ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ అభ్యర్థి విజయం కరతలామలకమే..! గిరిజనుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చే అభ్యర్థికే ఇక్కడి ఓటర్లు పట్టంకడతారు.ఆ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే..మొత్తానికి నీలగిరిలోని మూడు నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే.. ఏ పార్టీ అయినా.. ఉపాధి, పరిశ్రమల కల్పన, తేయాకు సేకరణ కూలీ ధర, కార్మికుల సంక్షేమం వంటి అంశాలు కీలక భూమిక పోషిస్తాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పడుగర్ వర్గం ఓటు బ్యాంకు అత్యంత కీలకం. డీఎంకే, కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు వేర్వేరుగా ఓటు బ్యాంకులు ఉన్నప్పటికీ.. ఈసారి పెరిగిన యువ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.ఏది ఏమైనా.. ఊటీలో విజయానికి కాంగ్రెస్ ఈసారి చమటోడ్చాల్సిందే..! కున్నూరును తిరిగి నిలబెట్టుకోవాలంటే.. కార్మికుల కూలీ ధరలపై డీఎంకే స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇక కూడలూరులో అన్నాడీఎంకే బలంగా కనిపిస్తున్నా.. నెక్-టు-నెక్ పోటీ తప్పదని తెలుస్తోంది. -
ఏ ఎన్నికల్లో ఎవరు ఎలా గెలిచారు?
కొన్నేళ్ల క్రితం వరకు తమిళనాడు పేరు వినగానే మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత గుర్తుకువచ్చేవారు. ఇక ఎన్నికల సమయంలో వీరిని చూసే ప్రజలు ఓట్లు వేసేవారు. ఇప్పుడు వారిద్దరూ లేరు. ఈ ఇద్దరు ఉద్ధండులు లేకుండానే 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. ఇప్పుడు తమిళనాడులో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు సమీపించే దశ నుంచి ఫలితాలు వెలువడే వరకూ రాజకీయ పార్టీల నేతలు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా, ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఎన్నో వ్యూహాలు రూపొందించుకుంది. ఎన్నికల విషయంలో అనేక అంశాలు విజయం, ఓటమిలో పాత్ర పోషిస్తాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. 1952 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో పలు అంశాలు గెలుపు, ఓటములను నిర్ణయించాయి.1952 నుంచి 2021 వరకు తమిళనాడులో 1952 నుంచి 2021 వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలను పరిశీలిస్తే సాధారణంగా విజయం వేటిపై ఆధారపడి వరిస్తుందో తెలుసుకోవచ్చు. మామూలుగా ప్రజా వ్యతిరేకత, కూటమి బలం, చిన్న పార్టీల ప్రభావం, ఓటర్ల స్పందన వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి.తమిళనాడులో ఏ ఎన్నికల వేళ ఏం జరిగింది?1952–19621952 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆ పార్టీ పాత్ర పోషించడంతో తమిళనాడు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.1957, 1962 ఎన్నికల్లో డీఎంకే ముఖ్య ప్రత్యర్థిగా ఎదిగి రాజకీయంగా కాంగ్రెస్కు పోటీగా మారింది.1967 కాంగ్రెస్పై వ్యతిరేక భావన, బియ్యం ధరలు పెరగడం వంటి ఆర్థిక ఇబ్బందులు డీఎంకేను ఎన్నికల్లో గెలిచేలా చేశాయి. 1971లోనూ డీఎంకే గెలిచింది.1977 డీఎంకేలో విభజన, ఎంజీఆర్ ప్రజాకర్షణ వల్ల అన్నాడీఎంకే భారీ విజయం సాధించింది.1980–1990 దశకం ఎంజీఆర్ ప్రజాదరణ, కూటమి వ్యూహాలు ఫలితాల్లో కీలక భూమిక పోషించాయి. 1980, 1984లో అన్నాడీఎంకే విజయం సాధించింది. 1989లో మాత్రం డీఎంకేను విజయం వరించింది.1991లో రాజీవ్ గాంధీ హత్య ఓటర్ల భావోద్వేగాలను ప్రభావితం చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే విజయం సాధించింది.1996లో అన్నాడీఎంకేపై భారీగా ప్రజా వ్యతిరేకత, రాజకీయ కూటములు డీఎంకేకు స్పష్టమైన విజయం ఇచ్చాయి.2001–2011 మధ్యకూటమి రీతులు, అవినీతి ఆరోపణలు, నాయకత్వ సంక్షోభాలు ఎన్నికల తీర్పులను ప్రభావితం చేశాయి. 2016–2021 2016 ఎన్నికల్లో చిన్న పార్టీల ఓట్ల షేర్, తేడా తక్కువగా ఉండటం ఫలితంపై ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచింది.2021లో జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాజకీయ పరిస్థితి మారి డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది.ఎన్నికల ఫలితాలను నిర్ణయించిన ప్రధాన అంశాలు1. ప్రజా వ్యతిరేకత: అధికార పక్షంపై అసంతృప్తి ఫలితాలను మార్చేస్తుంది.2. నాయకుల ప్రజాకర్షణ: ప్రజాదరణ ఉన్న నాయకులు ఎన్నికలను ప్రభావితం చేస్తారు.3. కూటమి బలం: ఎవరు ఎవరితో కలుస్తారన్నది తుది ఫలితంపై ప్రభావం చూపుతుంది.4. చిన్న పార్టీలు: చిన్న పార్టీల ఓట్లు ప్రధాన పార్టీలకు నష్టం లేదా లాభం కలిగిస్తాయి.5. చారిత్రక సంఘటనలు: ఆర్థిక పరిస్థితులు, పెద్ద సంఘటనలు ఓటర్ల అభిప్రాయాన్ని మార్చుతాయి. -
West Bengal: కబీర్కి ఒవైసీ ‘పెద్దన్న’.. పొత్తు ఖరారు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు- 2026 సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నడవాలని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒవైసీని తన ‘పెద్దన్న’ (బడా భాయ్)గా అభివర్ణించిన హుమాయున్ కబీర్.. రాబోయే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.ఒవైసీ అడుగుజాడల్లోనే..తమ కూటమి వివరాలను వెల్లడిస్తూ 182 నుండి 192 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు కబీర్ తెలిపారు. ‘నా పెద్దన్న అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ గడ్డపైకి వచ్చారు. ఏజేయూపీ, ఏఐఎంఐఎం కలిసి ఈ ఎన్నికల యుద్ధంలో తలపడతాయి. ఆయనను నా సొంత అన్నలా భావిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కనీసం 20 భారీ ర్యాలీల్లో నాతో కలిసి పాల్గొంటారు’ అని అన్నారు. ఏప్రిల్ 1న బెహ్రంపూర్లో లక్షలాది మందితో నిర్వహించే తొలి సభకు ఒవైసీ స్వయంగా హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. Kolkata | Founder of Janata Unnayan Party, Humayun Kabir and AIMIM President Asaduddin Owaisi hold a joint press conference after they announced an alliance between their parties for the West Bengal electionsHumayun Kabir says," We will hold 20 rallies all over the state. The… pic.twitter.com/GOrROLs1cZ— ANI (@ANI) March 25, 2026ఎప్పటికీ విడిపోని బంధంఈ పొత్తు కేవలం 2026 ఎన్నికల కోసమే కాదని, రాజకీయాల్లో తాను ఉన్నంత కాలం ఒవైసీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని కబీర్ ఉద్ఘాటించారు. ‘నా అన్న ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దిశగా నడిపించినా తూచా తప్పకుండా పాటిస్తాను. ఈ కూటమి ఎప్పటికీ విడిపోదు’ అంటూ తన నిబద్ధతను చాటుకున్నారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర బెంగాల్, కోల్కతా తదితర ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ కూటమి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.ప్రతిపక్షాల ఫైర్మరోవైపు ఈ పొత్తుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒవైసీ, హుమాయున్ కబీర్ కలవడం వల్ల సెక్యులర్ ఓట్లు చీలిపోయి, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుతుందని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. ఈ కూటమి వల్ల ముస్లిం ఓటర్లు ఏకాకి అవుతారని, అయితే జనం వీరిని నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రంలో ముస్లిం ఉప ముఖ్యమంత్రి వస్తారని కబీర్ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. -
Assam: ఎగసిపడిన కెరటం.. అస్సాం గణ పరిషత్!
అస్సాం రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం అస్సాం గణ పరిషత్ (ఏజీపీ). ఒకప్పుడు అస్సాం అంటే ఏజీపీ అనే స్థాయి నుండి ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితికి చేరుకుంది. ఆ పార్టీ ప్రస్థానం ఎన్నో ప్రాంతీయ పార్టీలకు పాఠాలు నేర్పుతుంది. అస్సాం గణ పరిషత్ సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఇది ఒక సుదీర్ఘ పోరాటం నుంచి పుట్టిన పార్టీ. 1979 నుంచి 1985 వరకు అస్సాంలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ఉద్యమం దీనికి పునాది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటం ఫలితంగా అస్సాం ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే విద్యార్థి నేతలు ప్రఫుల్ల కుమార్ మహంత నాయకత్వంలో ఏజీపీని స్థాపించారు. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. కేవలం 32 ఏళ్ల వయసులోనే ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రి కావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఉద్యమ ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ఏజీపీ ప్రజల ఆశలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా ఏ అక్రమ వలసల అంశంపై అయితే పార్టీ పుట్టిందో ఆ సమస్యను పరిష్కరించడంలో పాలకులు చొరవ చూపలేకపోయారు. దీనికి తోడు పార్టీ అంతర్గత కుమ్ములాటలు అవినీతి ఆరోపణలు పాలనా వైఫల్యాలు పార్టీని బలహీనపరిచాయి. నేతల మధ్య పెరిగిన ఆధిపత్య పోరు కారణంగా కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన నేతలు క్రమంగా పదవుల కోసం పాకులాడటం ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది.దెబ్బతీసిన స్నేహం..ఏజీపీ పతనానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలతో అది చేసిన స్నేహమనే చెప్పొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ ప్రాంతీయ పార్టీ కాలక్రమేణా తన ప్రత్యేకతను కోల్పోయింది. అస్సాంలో బీజేపీ బలోపేతం కావడం ఏజీపీకి శాపంగా మారింది. బీజేపీ జాతీయవాదం ముందు ఏజీపీ ప్రాంతీయ వాదం వెలవెలబోయింది. చివరకు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి రావడం ఆ పార్టీకి మరింత నష్టాన్ని మిగిల్చింది. పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక అంశాల్లో ఏజీపీ ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్ల తన సంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది.ఏజీపీలో మొదటి నుండి సామూహిక నాయకత్వం కొరవడింది. ప్రఫుల్ల కుమార్ మహంత వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టడం పార్టీలో చీలికలకు దారితీసింది. సరైన రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడింది. సమర్థులైన నాయకులు చాలా మంది బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. పార్టీ కేడర్ సైతం తమ భవిష్యత్తు కోసం జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపారు. నేడు ఏజీపీ కేవలం ఒక జూనియర్ భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయింది. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే శక్తిని ఆ పార్టీ కోల్పోయింది. ఏజీపీ పతనం ఒక హెచ్చరిక..ఏజీపీ పతనం దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక హెచ్చరిక. కేవలం భావోద్వేగపూరిత ఉద్యమాలతో అధికారంలోకి రావడం సులభమే కానీ ఆ భావజాలాన్ని పాలనలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టమని ఈ పార్టీ నిరూపించింది. సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యం అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని ఏజీపీ చరిత్ర చెబుతోంది. అస్సాం ప్రజలు ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వం కోసం సరికొత్త వేదికలను వెతుక్కుంటున్నారు. ఏజీపీ మాత్రం తన గత వైభవం వైపు దీనంగా చూస్తోంది. ప్రస్తుతం అస్సాం అసెంబ్లీలో ఏజీపీ సంఖ్య నామమాత్రంగా మారింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్థాయిని కూడా ఆ పార్టీ కోల్పోయింది. బీజేపీ వేవ్ లో తనను తాను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు ఆ పార్టీ దయనీయ స్థితిని సూచిస్తున్నాయి. మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ మూలాల్లోకి వెళ్లి ఉద్యమ స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంగానే కనిపిస్తోంది. -
Tamil Nadu: ఏఐఏడీఎంకే తొలి జాబితా.. ‘ఎడ్పాడి’ పళనిస్వామిదే!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా, ఎన్డీఏ కూటమి సారథిగా ఉన్న ఏఐఏడీఎంకే తమ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. బుధవారం 23 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసి, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో పైచేయి సాధించే వ్యూహాన్ని పళనిస్వామి అమలు చేస్తున్నారు.సొంత గడ్డపైనే పోటీపార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి (ఈపీఎస్) తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ‘ఎడ్పాడి’ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. తన కంచుకోటను కాపాడుకుంటూనే, రాష్ట్రవ్యాప్తంగా కూటమిని విజయపథంలో నడిపించే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు.సీనియర్లకే పెద్దపీటతొలి జాబితాలో పార్టీలోని హేమాహేమీలకు ఏఐఏడీఎంకే పెద్దపీట వేసింది. సీనియర్ నాయకులు కేపీ మునుసామి, దిండిగల్ సి. శ్రీనివాసన్, నథమ్ ఆర్. విశ్వనాథన్ వంటి కీలక నేతలు తమ పాత స్థానాల నుంచే పోటీ చేయనున్నారు. ముఖ్యంగా పశ్చిమ తమిళనాడుపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో బలమైన నేతలుగా పేరున్న ఎస్పీ వేలుమణి (తోండముత్తూరు), పి. తంగమణి (కుమారపాళయం) నియోజకవర్గాల నుంచి బరిలో నిలవనున్నారు.రేసులో ముందంజరాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాల్లో అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించిన తొలి పార్టీగా ఏఐఏడీఎంకే నిలిచింది. ఇప్పటికే సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిళర్ కట్చి' (ఎన్టీకే) అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, ప్రధాన కూటముల్లో మాత్రం ఏఐఏడీఎంకేనే అందరికంటే ముందుగా అడుగు వేసింది. కేవలం 23 స్థానాలకే ప్రస్తుతం జాబితా పరిమితమైనా, కీలక నేతలందరినీ ముందే రంగంలోకి దించడం ద్వారా కేడర్లో ఉత్సాహం నింపాలని పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏఐఏడీఎంకే, ఈ తొలి జాబితా ద్వారా తన ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்றக் கழக முதற்கட்ட வேட்பாளர்கள் பட்டியல்.- மாண்புமிகு கழகப் பொதுச்செயலாளர் புரட்சித் தமிழர் @EPSTamilNadu அவர்கள் அறிவிப்பு. #EPSfor2026#Vote4AIADMK pic.twitter.com/HVvrcUtDpt— AIADMK - SayYesToWomenSafety&AIADMK (@AIADMKOfficial) March 25, 2026 -
లాటరీ కింగ్ కొడుకు.. పుదుచ్చేరిలో కోట్లకు పడగలెత్తాడు
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న లక్ష్య జన నాయగ కట్చి పార్టీ అధ్యక్షుడు జోస్ చార్లెస్ మార్టిన్ తన ఆస్తి రూ.537 కోట్లుగా ప్రకటించారు. కామరాజర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల సంఘానికి అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. జోస్ చార్లెస్ మార్టిన్ వద్ద రూ.25.67 కోట్ల విలువైన 17.5 కిలోల బంగారం, రూ.44 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. ఆయన పేరిట రూ.328 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రూ.1.29 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయి. రూ.1.77 కోట్ల విలువైన వాచ్, రూ.38.53 కోట్ల విలువైన ముత్యాల హారాలు కూడా ఉన్నాయి. లండన్లో రూ. 5.64 కోట్లు, దుబాయ్లో రూ.1.50 కోట్లు విలువైన నివాసాలున్నాయని పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్, గోవా, నాగాలాండ్, పంజాబ్లో లాటరీ అమ్మకాలలో 4.53 శాతం వాటా, బెంగాల్లో 3 లాటరీ కేసులు, ఎర్నాకుళంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో 3 కేసులున్నాయని తన అఫిడవిట్లో వివరించారు. షేర్లలో రూ.14.28 కోట్లు, వివిధ బ్యాంకుల్లో రూ.200 కోట్లు డిపాజిట్లు ఉన్నట్టు వివరించారు. అలాగే, రూ. 210 కోట్లు అప్పులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం తన ఆస్తి రూ.537 కోట్లుగా లెక్క చూపించారు. చార్లెస్ లాటరీ అధినేత మార్టిన్ కుమారుడు కావడం గమనార్హం. -
‘మామిడి’ వివాదం
సాక్షి, చైన్నె: పార్టీ పేరు, జెండా, మామిడి పండు గుర్తుపై హక్కుల కోసం పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుచైన్నె సివిల్ కోర్టును మంగళవారం ఆశ్రయించారు. ఈ వివాదంపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీలో చీలిక వచ్చినప్పుడు గుర్తును కేటాయించే విష యంలో ఎన్నికల సంఘం తీరును కోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై తక్షణమే చైన్నె సివిల్ కోర్టును ఆశ్రయించాలని రాందాసును ఆదేశించింది. సివిల్ కోర్టు పిటిషన్ను స్వీకరించిన మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.నేడు విచారణ..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాందాసు తరపు న్యాయవాదులు చైన్నె సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం. ధర్మప్రభు ముందు అప్పీల్ చేశారు. రాందాసు తరపున దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం విచారించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అలాగే ఈ పిటిషన్ కాపిని అన్బుమణి వర్గానికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. కాగా తమ విషయంలో ఎన్నికల సంఘం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదని రాందాసు మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.వివాద నేపథ్యంపీఎంకే పార్టీపై ఆధిపత్యం కోసం తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ’మామిడి పండు’ గుర్తును అన్బుమణి వర్గానికి కేటాయించింది. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు గుర్తును స్తంభింపజేయాలి లేదా లాటరీ పద్ధతిలో కేటాయించాలే గానీ, ఏక పక్షంగా అన్బుమణికి ఇవ్వడం సరైన పద్ధతి కాదంటూ రాందాసు కోర్టు తలుపు తట్టారు. -
కమల్ మరో సంచలనం.. స్టాలిన్కు మద్దతుగా..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థులకు బేషరతు మద్దతు ప్రకటించాలని కమల్ నిర్ణయించుకున్నారు.అందుకే ఈ నిర్ణయండీఎంకేతో జరిగిన సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాకపోవడమే కమల్ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డీఎంకేకు చెందిన ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేయాలన్న ప్రతిపాదనను కమల్ హాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ అస్తిత్వమైన ‘టార్చ్ లైట్’ గుర్తును కాపాడుకోవడం, కార్యకర్తల మనోభావాలను గౌరవించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘రాజకీయాలనేవి ఒక నిరంతర ప్రయాణం. ఎన్నికల ఫలితాలు ఒక భాగం మాత్రమే, అవే అంతిమ లక్ష్యం కాదు’ అని కమల్ వ్యాఖ్యానించారు.స్టాలిన్ కృతజ్ఞతలు.. ప్రచారానికి ఆహ్వానంకమల్ హాసన్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. రాష్ట్ర సంక్షేమం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, కమల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. ‘ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు రావడం లేదు. ఈ నిర్ణయం నన్ను ఎంతగానో కదిలించింది’ అని స్టాలిన్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఆయన కమల్ను కోరారు.ద్రవిడ మోడల్ 2.0 లక్ష్యంగా..తమ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడాన్ని త్యాగంగా భావించడం లేదని, అదొక బాధ్యతని కమల్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రగతికి ‘ద్రవిడ మోడల్ 2.0’ ప్రభుత్వం అవసరమని, అందుకే డీఎంకే కూటమికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి, రాజ్యసభలో తమ గళాన్ని వినిపించామని ఆయన గుర్తు చేశారు. కాగా ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నా, డీఎంకే కూటమి విజయానికి కీలకంగా మారడం ద్వారా కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో సరికొత్త వ్యూహానికి తెరలేపారు. ఈ నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదో వేచి చూడాల్సిందే! இது தியாகம் அல்ல; கடமை. சுய நலம் அல்ல; பொறுமை.@mkstalin @Udhaystalin @maiamofficial pic.twitter.com/V19889YYlg— Kamal Haasan (@ikamalhaasan) March 24, 2026 -
సీఎం హిమంత పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
గువాహటి: బీజేపీ పాలిత అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బరిలో నిలిచిన జలూక్బారీలో కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియాంగ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. అయితే తిరస్కరణకు కారణాలను ఈసీ తన వెబ్సైట్లో ప్రస్తావించలేదు. మరోవైపు హాఫ్లాంగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ లాంగ్థాసా నామినేషన్ తిరస్కరణకు గురైంది.అయితే అదే స్థానంలో పోటీకి నిలిచిన మరో కాంగ్రెస్ నాయకురాలు నందితా గార్లోసా నామినేషన్ను ఈసీ ఆమోదించింది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆదివారమే ఆమె కాంగ్రెస్లో చేరి వెంటనే నామినేషన్ వేశారు. ధకౌఖానాలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద నరాహ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. 126 స్థానాలున్న శాసనసభ ఎన్నికల కోసం 815 మంది అభ్యర్థుల నుంచి 1,389 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. పలువురు ఒకటి కంటే ఎక్కువ సెట్ల పేపర్లను సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటిదాకా గడువు ఉంది. -
తమిళ పీఠం: ‘2021’ సీన్ రిపీట్? షాకిస్తున్న సీక్రెట్ సర్వే?
ద్రవిడ గడ్డపై సంచలన రాజకీయాలకు తెరలేచింది. 2026 ఏప్రిల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల, నేతల వ్యూహ ప్రతివ్యూహాలు మరింత పదునెక్కాయి. కుల సమీకరణలు, సంక్షేమ పథకాల హామీలు, పొత్తుల లెక్కలతో చెన్నైలోని వార్ రూమ్లు హోరెత్తిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి తమిళనాట గతంలో ఎన్నడూ లేని విధంగా ‘చతుర్ముఖ పోటీ’ నెలకొంది. అధికార డీఎంకే (డీఎంకే) కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (ఏఐడీఎంకే) కూటమిలతో పాటు, స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే), సీమాన్ సారథ్యంలోని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్టీకే)లు ఎన్నికల బరిలోకి దిగాయి. 2026 తమిళనాడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనేది అంచనా వేయాలంటే, 2021 నాటి ఓటర్ల నాడిని విశ్లేషించడం అవసరం. ఈ నేపధ్యంలోనే ‘లోకనీతి-సిఎస్డీఎస్’ నిర్వహించిన సర్వే గణాంకాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.2021 తీర్పు: గణాంకాలు ఏం చెబుతున్నాయి?పదేళ్ల ఏఐఏడీఎంకే పాలనకు స్వస్తి పలికి.. ఎంకే స్టాలిన్ను ముఖ్యమంత్రిని చేసిన 2021 ఎన్నికల్లో ప్రధానంగా ద్విముఖ పోరు సాగింది. ఆ ఎన్నికల్లో డీఎంకే 39.1 శాతం ఓట్లను సాధించగా, ఏఐఏడీఎంకే 34.1 శాతంతో సరిపెట్టుకుంది. కూటముల పరంగా చూస్తే డీఎంకే కూటమికి 45.4 శాతం, ఏఐఏడీఎంకే కూటమికి 39.7 శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచిన సంఖ్య 6.6 శాతం. ఇది సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే (ఎన్టీకే) సాధించిన ఓట్ల శాతం. ఇక కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్ఎం)2.6 శాతం, టీటీవీ దినకరన్ ‘ఏఎంఎంకే’ 2.5 శాతంతో తమ ఉనికి చాటుకున్నాయి.వారసత్వ పోరులో ‘స్టాలిన్’ టాప్నాడు జయలలిత, కరుణానిధి లేని తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో వారసత్వంపై ఓటర్లు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 78.2 శాతం మంది ఓటర్లు కరుణానిధి అసలైన వారసుడు స్టాలినే అని తేల్చిచెప్పారు. అటు ఏఐఏడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి 47.4 శాతం మంది మద్దతు లభించగా, ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) కేవలం 8.9 శాతానికే పరిమితమయ్యారు. ఇటీవలే ఓపీఎస్ తన కుమారుడితో పాటు డీఎంకేలో చేరడం ఆసక్తికరంగా మారింది.డబుల్ ఇంజిన్ సర్కార్పై వ్యతిరేకత?హిందీ బెల్ట్ రాజకీయాలకు భిన్నంగా తమిళనాడు తన ప్రత్యేకతను చాటుకుంటూవస్తోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమిళ ఓటర్లు 2021లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 51.9 శాతం మంది కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయగా, 47.5 శాతం మంది కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉండాలి అనే (డబుల్ ఇంజిన్) వాదనను తిరస్కరించారు. బీజేపీ ఎదుగుదల రాష్ట్ర సామాజిక ఐక్యతకు కీడు అని 40.3 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం.సంక్షేమం వెర్సస్ అవినీతిగత ఏఐఏడీఎంకే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, విద్యుత్, తాగునీరు తదితర రంగాల్లో మంచి మార్కులే సాధించినప్పటికీ (53.5 శాతం సంతృప్తి), అవినీతి ఆ పార్టీ కొంపముంచింది. 67.3 శాతం మంది ప్రజలు ఏఐఏడీఎంకే పాలనలో అవినీతి పెరిగిందని భావించారు. మరోవైపు తమిళనాడు సంక్షేమ పథకాలు (ఉచిత పాలు, సైకిళ్లు, అమ్మ క్యాంటీన్లు) ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వీటిలో 70 నుంచి 85 శాతం మంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ ఇచ్చారు.2026 పొత్తుల చదరంగంప్రస్తుతం డీఎంకే తన మిత్రపక్షాలైన కాంగ్రెస్ (28 సీట్లు), సీపీఐ (5), ఎండీఎంకే (4) వంటి పార్టీలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న ఏఐఏడీఎంకే, బీజేపీలు తిరిగి ఒక్కటయ్యాయి. కానీ పార్టీల చీలికలు ఈ కూటమిని వేధిస్తున్నాయి. ఈ గ్యాప్లో నటుడు విజయ్ తన ‘టీవీకే’ పార్టీతో చక్రం తిప్పాలని చూస్తున్నారు. డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా ఆయన ఒంటరిగా 234 స్థానాల్లో పోటీకి దిగారు.నిర్ణయాత్మక శక్తి ఎవరు?తమిళ ఓటరు చాలా తెలివైనవాడు. 23 శాతం మంది ఓటర్లు పోలింగ్ రోజే ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకుంటారనే మాట వినిపిస్తుంది. కులం, మతం కంటే పార్టీ గుర్తుకే (53.3%) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సారి ఎన్నికల్లో ‘జెన్ జెడ్’ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఈ నేపధ్యంలో స్టాలిన్ తన కోటను కాపాడుకుంటారా? ఎడప్పాడి తిరిగి పుంజుకుంటారా? లేక విజయ్ ‘తమిళగ వెట్రి’ గెలుపు సాధిస్తారా? అనే ప్రశ్నలకు మే నెలలో వెలువడే ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి. ఇది కూడా చదవండి: పండుగలకు వంటగ్యాస్ సిలిండర్ ఉచితం -
ఉత్తరాన గట్టిపోరు.. 54 స్థానాలు కీలకం
పశ్చిమబెంగాల్లో ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నడుమ సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు అచ్చం దంగల్ కుస్తీ పోటీలను తలదన్నుతోంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పారీ్టలు కావడంతో ఈ ఎన్నికలను రెండు పక్షాలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ బరిలో ఇప్పటికే విజయాల హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది.రాష్ట్రంలో కొన్నేళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వస్తున్న కాషాయ దళం ఈసారి టీఎంసీని ఎలాగైనా ఓడించి తొలిసారి అధికారాన్ని ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. ఆ క్రమంలో కీలకమైన ఉత్తర బెంగాల్ ప్రాంతంపై 2 పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. తనకిప్పటికే పట్టున్న ఈ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ తలమునకలుగా ఉంది. పలు ప్రాంతీయ హామీలతో ఉత్తర బెంగాల్వాసులను ఆకట్టుకునేందుకు, ఆదరణ పెంచుకునేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోంది.నువ్వా, నేనా! బీజేపీ, టీఎంసీ ఎన్నికల పోరుకు ఉత్తర బెంగాల్ ప్రాంతం కీలకంగా మారింది. ఇక్కడ 54 అసెంబ్లీ సీట్లపై రెండు పార్టీలూ గట్టిగా దృష్టి పెట్టాయి. ఒకప్పుడు కొరకరాని కొయ్యగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీలో కొన్నేళ్లుగా బలపడుతూ వస్తోంది. ఆ పట్టును ఈసారి మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా ఉత్తర బెంగాల్పై బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా దృష్టి పెట్టింది. ఈసారి ఇక్కడ కనీసం 40 అసెంబ్లీ స్థానాలకు పైగా గెలిపించే బాధ్యతలను పార్టీ బెంగాల్ ఇన్చార్జి సునీల్ బన్సర్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు అప్పగించింది. వారు ఇటీవలే ముఖ్య స్థానిక నేతలతో కీలక సమావేశం నిర్వహించి సమగ్ర ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. అందులో భాగంగా మూడంచెల ప్రచార పర్వానికి బీజేపీ తెర తీసింది. ఉత్తర బెంగాల్కు తృణమూల్కు అన్నివిధాలా ద్రోహం చేస్తోందంటూ హోరెత్తిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. ‘సరికొత్త ఉత్తర బెంగాల్’ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటింటి ప్రచారంతో దూకుడు పెంచుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఉత్తర బెంగాల్కు దీదీ కేవలం 0.002 శాతం నిధులు విదిలించారన్న బీజేపీ ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. బాగ్డోగ్రా విమానాశ్రయ విస్తరణలో భూమి కోల్పోనున్న రైతులు, కార్మిక సంస్కరణల పేరిట తేయాకు పనివారికి అన్యాయం తదితరాలను కూడా బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కూడా అప్రమత్తమైంది. ఉత్తర బెంగాల్లో అధిక సంఖ్యలో ఉండే తేయాకు కార్మికుల సంక్షేమానికి ఇప్పటికే పలు హామీలిచ్చింది. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తామని పేర్కొంది. రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూసుకునే బాధ్యత మమతదేనంటూ టీఎంసీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాలీ అస్తిత్వ నినాదాన్ని ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. ఎందుకు కీలకం.. ఉత్తర బెంగాల్ గిరిజనులు, మైనారిటీ ప్రాబల్య ప్రాంతం. ఇది చారిత్రకంగా తృణమూల్కు పెద్దగా పట్టు లేని ప్రాంతమనే చెప్పాలి. తొలినుంచీ ఇక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. అవి బలహీనపడ్డాక కొన్నేళ్లుగా వాటి స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది. ఇక్కడి డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయ్గురి, దినాజ్పూర్ ప్రాంతాల్లో బీజేపీ హవా క్రమంగా పెరుగుతూ వస్తోంది. డార్జిలింగ్ లోక్సభ స్థానాన్ని 2009 నుంచీ బీజేపీయే నెగ్గుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఇక్కడ 25 స్థానాలు నెగ్గితే బీజేపీ కేవలం మూడింటితోనే సరిపెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఉత్తర బెంగాల్లోని 8 సీట్లకుగాను బీజేపీ ఏడింటిని చేజిక్కించుకుంది. అదే ఊపులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకంగా 30 సీట్లు ఒడిసిపట్టింది. తృణమూల్ 24 సీట్లతో సరిపెట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 6 స్థానాలు నెగ్గింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్పై బీజేపీ ‘యూపీ’ వ్యూహం.. పోటీలో ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఫలించిన ఎన్నికల వ్యూహాన్ని పశ్చిమబెంగాల్లో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సన్యాసులు, పూజారులు, ఆధ్యాత్మికవాదులను ఎన్నికల బరిలో దించుతోంది. యూపీలో గోరఖ్నాథ్ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ పలుమార్లు ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.సన్యాసి వర్గం నుంచి వచ్చిన సాక్షి మహరాజ్, స్వామి అవైధ్యనాధ్, స్వామి చిన్మయానంద్ తదితరులు ఎన్నికల్లో గెలిచారు. బెంగాల్లో ఆధ్యాతి్మక రంగానికి చెందిన పలువురికి బీజేపీ టికెట్లిచి్చంది. భారత్ సేవాశ్రమంలో పని చేసిన ఉత్పల్ మహారాజ్ను కాలియాగంజ్ నుంచి బరిలో దించింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి 94 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన సౌమన్ రాయ్తో ఉత్పల్ పోటీ పడే అవకాశముంది.ఉల్బేరియా సౌత్ నుంచి స్వామి మంగళానంద పూరికి బీజేపీ టికెట్ దక్కింది. తృణమూల్కు చెందిన పులోక్ రాయ్తో ఆయన తలపడనున్నారు. మఠాలు, ఆశ్రమాలకు ఆదరణ బాగా ఉండే నవద్వీప్ నుంచి శ్రీ శృతి శేఖర్ గోస్వామిని బీజేపీ బరిలోకి దించింది. బెహలా పూర్బ నుంచి సునీల్ మహారాజ్ పోటీలో ఉన్నారు. హన్సన్ నుంచి చారిత్రక తారాపీఠ ఆలయ పూజారి నిఖిల్ బెనర్జీ పోలీకి టికెటిచి్చంది. వీటిలో చాలావరకు తృణమూల్ సిట్టింగ్ స్థానాలే ఉండటం విశేషం! -
ఈ నియోజకవర్గంలో గెలిచే పార్టీనే అధికారంలోకి..!
తమిళనాడులో స్టార్ నియోజకవర్గంగా పేరున్న ఈరోడ్ పశ్చిమంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. తెలుగు ఓటర్లు కూడా ఓ మోస్తరుగా ఉండే ఈ నియోజకవర్గంలో విజయం సాధించేవారు క్యాబినెట్ మంత్రి అవుతారనే ఓ నమ్మకం కొనసాగుతోంది. అంటే.. ఈ నియోజకవర్గంలో విజయం సాధించే పార్టీనే అధికారాన్ని చేపడుతుందని ఓటర్లు విశ్వసిస్తుంటారు. అందుకే.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ని స్టార్ నియోజకవర్గం అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నెక్-టు-నెక్ ఫైట్ జరుగుతోంది.ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలో నగర ప్రాంతాలతోపాటు.. గ్రామాలు కూడా ఉన్నాయి. ఈరోడ్ మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన 40కి పైగా డివిజన్లు, సింతోడు, నస్యనూర్ పట్టణ పంచాయతీలు, పెరుందురై తాలూకాలోని వడముఖం వెల్లోడు, పుంగంబాడి, కౌండాచ్చిపాళ్యం, తెన్ముఖం వెల్లోడు, ముగాసి పులవంపాళ్యం, ఈరోడ్ తాలూకాలోని కరైఎల్లపాళ్యం, ఎలవమలై, మెట్టునాసువంపాళ్యం, పేరోడు, నొచ్చిపాళ్యం, గంగాపురం, ఎల్లాపాళ్యం, విల్లరసంపట్టి, మేల్తిండల్, కీళ్తిండల్, కతిరంబట్టి, రాయపాళ్యం, మెట్టుకడై, కూరపాళ్యం, తొట్టాణి, పుత్తూర్ పుదుప్పాళ్యం, నంజనాపురం, పవళత్తాంపాళ్యం, వెప్పంపాళ్యం, ముత్తంపాళ్యం గ్రామాలు ఉన్నాయి. ఈరోడ్ జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఈరోడ్ పశ్చిమానికి పేరుంది.స్వాతంత్య్రానంతరం వేగంగా అభివృద్ధి రైల్వే స్టేషన్ ఉండడం కారణంగా.. స్వాతంత్య్రానంతర కాలం నుంచే ఈరోడ్ పశ్చిమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ఈ నియోజకవర్గంలో 50% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడగా.. మిగతా 50% పరిశ్రమలను నమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతం డైయింగ్, తోలు, వస్త్ర పరిశ్రమలకు నిలయం. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈరోడ్ పశ్చిమం ఏర్పడింది. ఈరోడ్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో.. ఈరోడ్ పశ్చిమంలోనే అత్యధిక ఓటర్లున్నారు. భారత ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 1,18,206 మంది పురుష ఓటర్లు, 1,27,246 మంది మహిళా ఓటర్లు, 41 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. మొత్తం 2 లక్షల 46 వేల మంది ఓటర్లలో కొంగు వేళాల కౌండర్లు బలమైన సామాజికవర్గంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 40%. అంటే.. ఈ సామాజికవర్గం అండదండలున్నవారే ఇక్కడ విజయం సాధిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో పట్టిక, ముదలియార్, నాదార్ వర్గాలున్నాయి.ఈరోడ్ పశ్చిమంలో వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి ఎన్నెన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. ప్రధానంగా పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడం తరచూ ఇక్కడి రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పసుపు నిల్వకు కోల్డ్ స్టోరేజీలు లేవు. తోలు పరిశ్రమలకు సంబంధించి, శుద్ధి కేంద్రాలు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. డైయింగ్ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. ప్రతికూల అంశాలు ఇవే.. పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించి దారాల ధరలు పెరగడం ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వ లా కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయాల కల్పన వంటివి ప్రజలకు తీరని కలలుగా మిగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే ఈ అంశాలపై ప్రత్యేకంగా హామీలు ఇచ్చినా.. ఇక్కడి ఎమ్మెల్యే ముత్తుస్వామి క్యాబినెట్ మంత్రి అయినా.. వాగ్దానాలను నెరవేర్చలేదనే అపవాదు ఉంది.ఈ నియోజకవర్గంలో ముత్తుస్వామి ఎక్కువసార్లు గెలిచారు. 1980, 1984 ఎన్నికల్లో ఆయన ఎంజీఆర్, వీఎన్ జానకి ప్రభుత్వాల్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో భవానీ నియోజకవర్గానికి మారి.. అక్కడి నుంచి విజయం సాధించి, జయలలిత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 1996లో మళ్లీ ఈరోడ్కు వచ్చినా.. విజయం సాధించలేదు. 2001, 2006 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2010లో డీఎంకేలో చేరారు. అయినా.. 2011, 2016లో ఓటమిని మూటగట్టుకున్నారు. పాతికేళ్ల తర్వాత.. 2021లో విజయం సాధించి, మరోసారి మంత్రిపదవిని దక్కించుకున్నారు. ఇక్కడ గెలిచిన మిగతావారి విషయానికి వస్తే.. 2011లో అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం ఈరోడ్లో విజయం సాధించి, జయలలిత క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2016లో కూడా ఆయనే గెలిచారు. అందుకే.. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఓ విశ్వాసం ఈరోడ్ ప్రజల్లో ఉంది. -వెబ్డెస్క్ -
చుక్కలు చూపిస్తున్న చిన్న నియోజకవర్గం
తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది. అయితే.. కరూర్ - ఈరోడ్ జిల్లాల సరిహద్దులను పంచుకుంటున్న ఓ చిన్న నియోజకవర్గం మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ గెలవాలంటే.. సమస్యల పరిష్కారంపై అభ్యర్థులు నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే..! ఎందుకంటే.. ఇక్కడి ఓటర్లు ఏకతాటిపై ఉంటూ.. అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తారు. శబరిమలకు వెళ్లే తెలుగు భక్తులు పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.. పళనికి సమీపంలో ఉండే ఆ చిన్న నియోజకవర్గం పేరే ‘అరవకురుచ్చి’. తెలుగు భక్తులు ఎంతో ఇష్టంగా ధరించే కరుగంళి మాలలకు నిలయమైన పాతాళ శంభు మురుగన్ ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ నియోజకవర్గ విశేషాలేంటో తెలుసుకుందామా?అరవకురుచ్చి పరిసర ప్రాంతాలు మునగకు ప్రసిద్ధి. ఇక్కడి ఈసనత్తం మార్కెట్ మునక్కాయల విక్రయాలకు అడ్డాగా ఉంది. ఈ ప్రాంతం తీవ్రమైన ఎండలకు నిలయం. అంతేకాదు.. పశ్చిమ కనుమలు అడ్డుగా ఉండడంతో ఏర్పడ్డ వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్న అరవకురుచ్చిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయి. కేవలం లక్షా ఎనభై తొమ్మిది వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గం పరిధిలో పళ్లపట్టి, అండిపెట్టికొట్టాయ్, వెట్టమంగళం, కొంబుపాళయం, తిరుక్కాడుతురై, నంజై పుగళూర్, పుంజై పుగళూర్, పుంజై తోటక్కురిచ్చి వంటి ప్రాంతాలుంటాయి. ఈ ప్రాంతాల్లోని నేషనల్ హైవేకు ఇరువైపులా ఉండే పల్లెల్లో తెలుగువారు కూడా ఉంటారు. అయితే.. వారు ఇక్కడ గెలుపోటములను శాసించే స్థాయిలో లేరు. ఇక్కడ 10% ముస్లిం ఓటర్లుండగా.. మిగతా వారిలో కొంగు వెల్లాళ కౌండర్లు, వెట్టువ కౌండర్లు, నాయగర్ వంటి అనేక సామాజిక వర్గాలున్నాయి.అరవకురుచ్చిలో నీటి సమస్య అత్యంత ప్రధానమైనది. ప్రైవేటు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు తాగేనీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ.. సాగు నీటికోసం రైతులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తున్నారు. నగాంజీ ఆనకట్ట నీటి పంపిణీలో సరైన హక్కులను పేర్కొనకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాదంపాళయం చెరువును అటవీశాఖ నుంచి ప్రజా పనుల శాఖ స్వాధీనం చేసుకున్నాక కొంత వరకు సాగునీటి అవసరాలు తీరుతున్నా.. ఆనకట్టలను నింపడం ఓ మహా క్రతువుగా మారుతోంది. రైతులకు సాగునీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే ఇక్కడ విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.1952 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రామస్వామి కౌండర్, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.కందస్వామి కౌండర్ విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో స్వతంత్రులకు ఇక్కడ విజయం అందని ద్రాక్షగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 1957, 1962, 1977 ఎన్నికల్లో మాత్రమే విజయాన్ని మూటగట్టుకుంది. 1980 నుంచి ఇక్కడ అయితే డీఎంకేకు.. లేకుంటే అన్నాడీఎంకేకు మాత్రమే పట్టం కడతామంటూ ఓటర్లు తీర్పునిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు లేకపోవడమే. 2019, 2021 ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే పాగా వేసింది. ఈసారి హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే.. అతి చిన్న నియోజకవర్గం కావడం.. ఈసారి దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇక్కడ బాగా పుంజుకుంటుండంతో ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం డీఎంకే కొంప ముంచుతుందా? లేక అన్నాడీఎంకేను ఓడించి, డీఎంకేకు హ్యాట్రిక్ ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారుతోంది.అరవకురుచ్చి నియోజకవర్గంలో మొత్తం 90,490 మంది పురుష ఓటర్లు, 99,203 మంది మహిళా ఓటర్లున్నారు. ఏ ఎన్నికల్లో అయినా.. మహిళల మద్దతున్న అభ్యర్థే గెలుస్తాడనేది ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగే ఈ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున సతీశ్, నామ్ తమిళర్ పార్టీ నుంచి డాక్టర్ నరేన్ పోటీ చేస్తున్నారు. -వెబ్డెస్క్ -
పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మంగళవారం 297 హామీలతో ఈ మానిఫెస్టోను విడుదల చేశారు. కుటుంబంలోని యజమానురాలికి ప్రతినెల రూ.2000, మహిళలతో పాటు పురుషులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి ఇస్తామని అన్నాడీఎంకే చెప్పింది. పన్నుల భారం, వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తామని పేర్కొంది."పాలన సామర్థ్యం లేని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గత 5 సంవత్సరాల్లో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆస్తి పన్ను, ఇల్లు పన్ను, విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలు పెరిగాయి. దాంతో కుటుంబాల రోజువారీ ఆర్థిక భారం ఎక్కువైంది. ఈ భారం తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తాం" అని మేనిఫెస్టోలో ఉంది. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలుఈపీఎస్ మహిళల కోసం "కుల విలక్కు పథకం" రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పుధాన్యాలుఉచితంగా ఫ్రిడ్జి కూడా ఇస్తామని ప్రకటనమహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు -
ఒవైసీ మూడో ఫ్రంట్.. పశ్చిమ బెంగాల్లో ముక్కోణపు పోరు!
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్.. క్లుప్తంగా మజ్లిస్ పార్టీ..! హైదరాబాద్లో పత్తర్గట్టీ మునిసిపల్ డివిజన్ నుంచి ప్రస్తానం ప్రారంభించిన మజ్లిస్ పార్టీ.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా భారత్ వ్యాప్తంగా విస్తరిస్తోంది. జాతీయ పార్టీగా ఎదిగిన మజ్లిస్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంగొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది. తాజాగా మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మూడో ఫ్రంట్ను ప్రకటించడంతో.. ఇప్పుడు బెంగాల్లో ముక్కోణపు పోరు మొదలైంది.ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు అంటే.. అయితే టీఎంసీ—లేదంటే బీజేపీ అన్నట్లుగా సాగింది. అయితే.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన హుమయూన్ వేరు కుంపటి పెట్టారు. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ చీఫ్ అసదుద్దీ ఒవైసీ అతనితో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల బీజేపీకి.. కాషాయపార్టీ సాంప్రదాయ ఓటుబ్యాంకుకు ఎలాంటి నష్టం లేకపోయినా.. టీఎంసీ ఓట్లలో మాత్రం చీలికకు కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ చీఫ్ మమతాబెనర్జీ ఈసారి కూడా తన విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ, మజ్లిస్ కారణంగా తెరపైకి వచ్చిన మూడో కూటమి కారణంగా చమటోడ్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు జరగడం కూడా తృణమూల్కు ప్రతికూలాంశంగా మారుతోంది.ఈ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకును మజ్లిస్ కచ్చితంగా చీలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమతకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే హుమయూన్ ప్రకటించగా.. తమ కూటమి 294 స్థానాల్లో కలిసి పోటీ చేస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ కూటమి అహరహం పనిచేస్తోంది. మూడో కూటమి అధికారంలోకి వస్తుందా? బెంగాల్లో పాగా వేయాలనే కాషాయం కల నెరవేరుతుందా? మమత ఎత్తుల ముందు విపక్షాల వ్యూహాలన్నీ చిత్తవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. మే 4న వచ్చే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
రూ.181 కోట్లు నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం
కోల్కతా: 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు రెండు దశల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత సామగ్రి సహా రూ.181 కోట్లకు పైగా విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మొత్తం 294 నియోజకవర్గాల పరిధిలో ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడం తెల్సిందే. అప్పట్నుంచి, విస్తృతంగా సోదాలు చేపట్టినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) కార్యాలయం తెలిపింది. జిల్లాలవారీగా 3,58,986 కేసులు నమోదు చేయగా, మొత్తం 3,11,829 ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాలను, 19,901 ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులకు స్పందించడానికి, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి 1,800కు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FSTలు), 2,200కు పైగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SSTలు)ను మోహరించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీఇక శాంతిభద్రతల విషయానికి వస్తే, ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి కోల్కతా పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి బరనగర్, కాళీఘాట్లలో జరిగిన సంఘటనలలో జోక్యం చేసుకున్నారని వారు తెలిపారు. -
బెంగళూరులో ఆయనకు రూ.200 కోట్ల బంగ్లా..
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తి వివరాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పింది. బెంగళూరులోని కోర్మంగల ప్రాంతంలో ఉన్న సుమారు రూ.200 కోట్ల విలువైన బంగ్లాను అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదని కాంగ్రెస్ ఆరోపించింది.ఆ 49,000 చదరపు అడుగుల బంగ్లా సుమారు 1.07 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రీమియం ప్రాంతంలో ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అఫిడవిట్లో రాజీవ్ చంద్రశేఖర్ ఇల్లు, కారు లేవని పేర్కొన్నారని కాంగ్రెస్ అంటోంది. ఇదే చిరునామాలో తన నివాసంగా ఉందని గతంలో రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్లో పేర్కొన్నట్లు కాంగ్రెస్ తెలిపింది.ఆస్తికి సంబంధించిన పన్నును మార్చి 17న చెల్లించారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నేమోం నియోజకవర్గం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్న సమయంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన మొత్తం ఆస్తి విలువ రూ.93 కోట్లకు పైగా ఉంది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ఆయన లేదా బీజేపీ నుంచి స్పందన లేదు. ఇప్పుడు ఈ విషయంపై ఎన్నికల సంఘం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంది. రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ను రద్దు చేయాలని కాంగ్రెస్ కోరింది. కాగా, కేరళ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. Dear @Ceokerala,BJP candidate from Nemom constituency, Rajeev Chandrasekhar, has not disclosed his residence, a 49,000 sq.ft mansion in Koramangala 3rd Block, Bengaluru, in his affidavit.This is a 1.07 acre property in one of the most expensive locations in the country, where… pic.twitter.com/pyyzD5Sft7— Congress Kerala (@INCKerala) March 23, 2026 -
అక్కడ నుంచే విజయ్ ఎన్నికల ప్రచారం?
చెన్నై: ఎన్నికల పనులను పర్యవేక్షించడం కోసం చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నామ్ తమిళర్ కట్చి, తమిళగ వెట్రి కళగం మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, తమిళనాడు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. అయితే, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ స్వయంగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే, పెరంబూర్ పరిధిలోని కొడుంగయ్యూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్లో విజయ్ ఓ బంగ్లాను సొంతంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ బంగ్లాలోనే ఉండి పనులు పర్యవేక్షించాలని విజయ్ భావిస్తున్నారని.. రేపు ఉదయం(బుధవారం) ఈ బంగ్లాలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
టీ ఎక్కడ? టిఫిన్ లేకపోతే ఎలా?
ఎన్నికలంటేనే కొందరికి ఎక్కడాలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఏదో ఒక పార్టీని ఎంచుకుని, ప్రచారపర్వంలో వెన్నంటి ఉంటూ.. జై కొడితే చాలు.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సమయానికి చాయ్, స్నాక్స్, రాత్రవ్వగానే బీరు, బిర్యానీకి ఢోకా ఉండదు. కానీ, ఇప్పుడు భారత్లో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారపర్వం పేలవంగా సాగుతోందని చెప్పవచ్చు. అందుకు కారణం.. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొనడం.. చమురు సరఫరా తగ్గడమే..! దానికీ.. ఎన్నికల ప్రచారానికి సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా?ఇరాన్ యుద్ధం కారణంగా ఈ సారి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం భిన్నంగా సాగుతోంది. కొన్ని చోట్ల నామినేషన్ల ఘట్టం ముగిసింది. అయినా.. ప్రచారం హడావుడి కనిపించడం లేదు. అక్కడక్కడా ప్రచారాలు జరుగుతున్నా.. అభ్యర్థులు తమ మద్దతుదారులకు టిఫిన్ పెట్టించడం మాట పక్కనపెడితే.. టీ తాగించే అవకాశం లేకుండా పోతోంది. గ్యాస్ కొరత కారణంగా చిన్నాచితకా హోటళ్లు దాదాపుగా మూతపడ్డాయి. ఛాయ్ కోసం నిరంతరం స్టౌని వెలిగించాల్సి ఉంటుంది. లేదంటే.. ఫ్లాస్క్లను వాడాలి. దీంతో.. రోడ్డుపక్కన హోటళ్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఒక్కో అభ్యర్థి వెంట కనీసం 200 మంది కార్యకర్తలు, మద్దతుదారులు ఉంటారు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లలో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. గ్యాస్ సంక్షోభం కారణంగా ఇప్పుడు వీరికి టీ ఇవ్వలేకపోతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.బ్లాకులో గ్యాస్ను కొనే స్తోమతలేదుటీ మాటను అటుంచితే.. మధ్యాహ్న భోజనం, బిర్యానీల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నాచితకా హోటళ్లు, బడ్జెట్ టిఫిన్ సెంటర్లు బ్లాకులో గ్యాస్ను కొనే స్తోమతలేక.. పరిమితంగా ఆహారపదార్థాలను తయారు చేస్తున్నాయి. బడా హోటళ్లలో ధరాఘాతం తప్పదు. పైగా.. కొన్ని హోటళ్లు ఏకంగా గ్యాస్ సెస్ని విధిస్తున్నాయి. తమిళనాడులో ఈ నయా సంస్కృతి తీవ్రంగా ఉంది. దీంతో.. కొందరు అభ్యర్థులు వంట మనుషులను నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆహార పదార్థాల ముడిసరుకును అందజేస్తే.. వీరు వంటచెరుకుతో భోజనాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.మెనూలోంచి దోశ, బోండా ఔట్మరికొన్ని చోట్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాలుగైదు వందల మంది కార్యకర్తలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నా.. వారికి భోజనం కాదు కదా.. కనీసం టీ దొరకడం లేదు. ఎక్కువ మంట అవసరం ఉండే పరోటాలు, దోశలు, బోండాలు అస్సలు లభించడం లేదు. కేరళలోని కోళికోడ్ పరిధిలో ఉన్న మావూర్ రోడ్లోని ఇండియన్ కాఫీ హౌస్ ఏకంగా తన మెనూలోంచి వీటిని తీసివేయడం గమనార్హం..! ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అక్కడ పరోటా, నాన్ వెజ్ కర్రీ దొరుకుతున్నా.. ధరలను విపరీతంగా పెంచారు. ఈస్టర్ సమీపిస్తుండడంతో.. బ్రాయిలర్ కోళ్లు, గుడ్ల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ సంక్షోభం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేస్తామని కేరళ, తమిళనాడు హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్ యుద్ధం మరో రెండుమూడు వారాలు కొనసాగితే.. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. - వెబ్డెస్క్ -
కాషాయ పార్టీదే హవా.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా అధికారపక్షం కొనసాగింపు కోసం జరగనున్నాయని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అస్సాంలో తాజాగా నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు వెల్లడైంది.2026 మార్చి 9 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి రెండో ట్రాకర్ పోల్ సర్వే అస్సాం ఓటర్ల మూడ్ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ ఎన్నికలు అధికార మార్పు కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు. ఇది అస్సాంలో గత ఐదేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతగా కనిపించడం లేదు. స్థిరత్వం, నాయకత్వం, అభివృద్ధి అనే మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వేలో తేలింది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే 69 నుంచి 73 సీట్లు గెలుచుకునే అవకాశముందని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. అంటే, బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటే స్థాయిలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 26 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఈ తేడా కేవలం సీట్ల సంఖ్యలోనే కాకుండా రాజకీయంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపుతోంది.ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరింత బలపడే అవకాశం ఉంది. అస్సాంలో బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ 8 నుంచి 11 సీట్లు, బీపీఎఫ్ 8 నుంచి 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఎన్డీయే కూటమి 90 సీట్లు కైవసం చేసుకునే అవకాశముంది. ఇది సాధారణ విజయం కాదు. ఇది స్పష్టమైన ప్రజా తీర్పు, స్థిరమైన ప్రభుత్వానికి సంకేతంగా చూడాలి. మరోవైపు ఏఐయూడీఎఫ్, రైజోర్ దల్, యూపీపీఎల్, ఏజీపీ, సీపీఐ(ఎం) వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో పరిమిత స్థాయిలోనే ప్రభావం చూపే పరిస్థితి ఉంది.అయితే, ఈ ఎన్నికల్లో ఓటు షేర్ ఫలితాలను విశ్లేషిస్తే పరిస్థితి కాస్త వేరేలా కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో బీజేపీకి 39% ఓటు షేర్, కాంగ్రెస్కు 36.5% ఓటు షేర్ వస్తుందని అంచనా వేసింది. ఈ తేడా పెద్దది కాకపోయినా, అస్సాం రాజకీయాల్లో ఇది భారీ మెజారిటీకి దారి తీస్తుంది. ఎందుకంటే, ఇక్కడ బీజేపీ మిత్రపక్షాలతో కలిసి కట్టుగా ఓట్లను సీట్లుగా మార్చుకునే సామర్థ్యం కలిగి ఉండగా, ప్రతిపక్షం ఇప్పటికీ అంతర్గత కలహాలతో కాలం గడుపుతోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం కూడా కీలక అంశంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు ఉన్న ప్రజాదరణ బీజేపీకి ప్రధాన బలంగా మారింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 40% మంది అస్సాం ప్రజలు మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా కోరుకుంటుండగా, కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గోగోయ్ 33% మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజన వర్గాల్లో ముఖ్యమంత్రి హిమంతకు ఉన్న మద్దతు బీజేపీకి, ఎన్డీయే కూటమి పక్షాలకు అదనపు బలాన్ని ఇస్తోంది.అస్సాం రాష్ట్రాన్ని ప్రధానంగా 5 పరిపాలనా విభాగాలుగా విభజించారు. ఈ ఐదింటిని ప్రాంతాల వారీగా చూసినప్పుడు, అస్సాం రాజకీయాలు ఏకరీతిగా కనిపించడం లేదు. ఎగువ అస్సాంలో ఎన్డీయే బలంగా ఉండి, అధికశాతం నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్, రైజోర్ దల్ కాస్త పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయి. సిబ్సాగర్లో రైజోర్ దల్ పోటీగా ఉండగా, నజీరా, టియోక్, టిటాబర్, జోర్హాట్ లాంటి చోట్ల కాంగ్రెస్ బలపడింది. డూమ్ డూమా, డెర్గావ్, సోనారి లాంటి చోట్ల క్లోజ్ ఫైట్ కనిపిస్తోంది. మధ్య అస్సాంలో రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. నాగావ్, హోజై, కార్బి ఆంగ్లాంగ్ వంటి జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. ధింగ్, దల్గావ్ వంటి బలమైన సీట్లు రైజోర్ దల్కు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఈ ప్రాంతంలో బలహీనపడింది. ఇదే సమయంలో కొన్ని చోట్ల ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏఐయూడీఎఫ్కి అవకాశాలు కల్పిస్తోంది.దిగువ అస్సాంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏఐయూడీఎఫ్ మెరుగైన స్థానంలో ఉంది. గౌరిపూర్, శ్రీజంగ్రామ్ లాంటి చోట్ల పార్టీ ముందంజలో ఉండగా, చెంగా, ధుబ్రి లాంటి చోట్ల గట్టి పోటీ ఇస్తోంది. అయినప్పటికీ మొత్తం ప్రాంతంగా అంచనాలను విశ్లేషిస్తే ఎన్డీయే ఆధిపత్యమే కొనసాగుతోంది. బరాక్ వ్యాలీలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కొన్ని చోట్ల బలంగా ఉంది. సోనై, బార్కోలా, అల్గాపూర్, కరీంఘంజ్ సౌత్ వంటి చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశముంది. కరీంఘంజ్ నార్త్లో మాత్రం హోరాహోరీ పోటీ నెలకొంది.ఈ ఎన్నికల్లో కొన్ని కీలక ట్రెండ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐయూడీఎఫ్ గతంతో పోలిస్తే కొంత మెరుగైంది. కానీ ఇది ఆ పార్టీవైపు వీస్తున్న గాలివల్ల కాకుండా, ఆ పార్టీ నిలబెడుతున్న అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం వల్లే అని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో వెల్లడయింది. గెలిచే అవకాశమున్న సీట్లు వదిలేయడం వల్ల కాంగ్రెస్–రైజోర్ దల్ కూటమిలో కాంగ్రెస్కే నష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీలో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. టికెట్ కేటాయింపుల్లో చేసిన కొన్ని తప్పులు, పాత నాయకులను పక్కన పెట్టడం వల్ల కొంత అసంతృప్తి ఉంది. అయితే ఇవి పెద్ద స్థాయిలో ప్రభావం చూపేలా కనిపించడం లేదు.అస్సాంలో చిన్న పార్టీల పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. జై భారత్ పార్టీ వంటి సంస్థలు టీ ట్రైబ్ ప్రాంతాల్లో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇది కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. టీ తోటలు అధికంగా ప్రాంతాల్లో జై భారత్ పార్టీ కొంత కనిపిస్తోంది. వీరికి జేఎంఎం పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తోంది. రంగాపర, సొనారి, మజ్బత్ నియోజకవర్గాల్లో జై భారత్ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయేలోని ఏజీపీకి కేటాయించినవాటిలో అధికంగా ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏజీపీ తన పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించింది. బీజేపీ మాత్రం రాష్ట్రం వ్యాప్తంగా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం.ఓటర్ల అభిప్రాయాలు కూడా స్పష్టంగా ఒక దిశలోనే ఉన్నాయి. 52% మంది రాష్ట్ర అభివృద్ధికి బీజేపీనే మంచిదని భావిస్తుండగా, 60% మంది మళ్లీ అదే ప్రభుత్వం వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే 60% మంది మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ల వీస్తున్న సానుకూల పవనాలకు నిదర్శనం. సామాజికంగా కూడా బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. గిరిజనులు, ఓబీసీ వర్గాల్లో మద్దతు పెంచుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన విజయాలు పార్టీకి మరింత బలాన్నిచ్చాయి.మరోవైపు అక్రమ వలసలు, అక్రమంగా వచ్చినవారు భూముల ఆక్రమించారనే ఆరోపణలు కూడా రాజకీయ చర్చలో కీలకంగా మారడంతో... అవి ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం అస్సాంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లో 5000 మందితో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించింది. కులం, మతం, వయస్సు, లింగం వంటి అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను విశ్లేషకులు, జర్నలిస్టులతో చర్చించి డేటాను క్రాస్ చెక్ చేశారు.మొత్తానికి చూస్తే, మరికొన్ని రోజుల్లో జరగబోయే 2026 అస్సాం ఎన్నికల్లో ప్రతిపక్షం ఇంకా ఐక్యత లోపంతో పోరాడుతుండగా, బీజేపీ మాత్రం తన నాయకత్వం, సంస్థాగత బలం, ప్రభుత్వంపై ఉన్న సానుకూల అభిప్రాయంతో స్పష్టమైన ఆధిక్యాన్ని నిర్మించుకుంది. ఇదే ధోరణి కొనసాగితే, అస్సాం మరోసారి స్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తుంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుంది!- ఆర్. దిలీప్ రెడ్డి,డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. -
టీఎన్సీసీ సరికొత్త ప్రచార అస్త్రం
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తన ప్రచారంలో వినూత్న పంథాను అనుసరించేందుకు చర్యలు చేపట్టింది. డీఎంకే కూటమిలో భాగంగా 28 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, తన ఎన్నికల ప్రణాళికను (మేనిఫెస్టో) నేరుగా ఓటర్ల గుమ్మం వద్దకే చేర్చేందుకు నిర్ణయించింది. పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్, ఎంపీ కార్తీ చిదంబరం నేతృత్వంలో ఈ మేరకు కసరత్తు జరుగుతోంది.పోస్ట్కార్డులతో ఇంటింటికీ హామీలుకాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోని అత్యంత కీలకమైన, ప్రజలకు ఉపయోగపడే ప్రధాన వాగ్దానాలను ఒక పోస్ట్కార్డుపై ముద్రించనుంది. పార్టీ పోటీ చేస్తున్న 28 నియోజకవర్గాల్లోని ప్రతి ఓటరు ఇంటికి ఈ పోస్ట్కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల పార్టీ హామీలు నేరుగా ప్రజల మనసుల్లోకి వెళ్తాయని నాయకత్వం భావిస్తోంది. మేనిఫెస్టో కమిటీ కసరత్తుల్లో భాగంగా చైన్నెలోని సత్యమూర్తి భవన్లో జరిగిన ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అనంతరం కార్తీ చిదంబరం మాట్లాడుతూ, కమిటీ ఇప్పటికే రెండు మూడు సార్లు సమావేశమై ప్రజా సమస్యలను అధ్యయనం చేసిందన్నారు. మార్చి 27 నాటికి తుది నివేదిక సిద్ధమవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల కోరికలు, సమస్యలను సేకరించడానికి ప్రత్యేక బృందాలను పంపించామన్నారు. వారు సేకరించిన సమాచారాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నామని వివరించారు.ఈ నివేదికను ముందుగా ఢిల్లీలోని ఏఐసీసీ పంపించి, వారి ఆమోదంతో పోస్టు కార్డు ద్వారా ఓటర్లకు చేరవేయనుమన్నారు. తమిళనాడు ప్రజలను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఈసారి మేనిఫెస్టో ఉంటుందని కార్తీ చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు మరియు రైతుల సమస్యలకు ఇందులో పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. -
175 లక్ష్యంగా డీఎంకే వ్యూహం
సాక్షి, చైన్నె: డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో 175 మంది అభ్యర్థులను నిలబెట్టే దిశగా వ్యూహ రచనలో ఆపార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ఉన్నట్టు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆశావహులతో ఆయన ఐదు రోజుల పాటుగా నిర్వహించిన ఇంటర్వ్యూలు సోమవారంతో ముగిసింది. మంగళవారం లేదా బుధవారం నాటికి సీట్ల పంపకాలను ముగించి ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితా ప్రకటన దిశగా స్టాలిన్ కార్యాచరణలో ఉన్నారు. వివరాలు.. డీఎంకే కూటమిలో కాంగ్రెస్కు 28 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. సీపీఐకు ఐదు ఇవ్వగా ఎండీఎంకేకు నాలుగు అప్పగించారు. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు, మనిద నేయక్కల్ కట్చి, కొంగు దేశీయ మక్కల్ కట్చిలకు తలా రెండు సీట్లు ఖరారు చేశారు. ఇక, సీపీఎం, వీసీకే, మక్కల్ నీది మయ్యం, డీఎండీకేకు సీట్లు కేటాయించాల్సి ఉంది. సీపీఎంకు ఐదు సీట్లు, వీసీకేకు ఐదు సీట్లు , మక్కల్ నీది మయ్యంకు రెండు, డీఎండీకేకు ఐదు చొప్పున సీటును డీఎంకే ఖరారుచేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, ఎస్డీపీఐతో పాటుగా మిగిలిన చిన్న పార్టీలకు తలా ఓసీటు ఇవ్వడానికి నిర్ణయించారు. సీపీఎం అయితే, ఐదు సీట్లు తీసుకునేందుకు ముందుకు వచ్చినా మిగిలిన ఆయా పార్టీలు లెక్కను అంగీకరించాల్సి ఉంది. అదే సమయంలో ఎండీఎంకే మూడు, మనిద నేయమక్కల్ కట్చి, కొంగు దేశీయ మక్కల్ కట్చి డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయనున్నాయి. మక్కల్ నీది మయ్యంతో పాటుగా చిన్న పార్టీలన్నీ ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేసే విధంగా డీఎంకే సూచిస్తున్నది. దీంతో డీఎంకే తరపున 175 మంది అభ్యర్థులు రేసులో ఉండే దిశగా ఉదయ సూర్యుడి చిహ్నంపై పోటీకి కార్యాచరణలో ఉన్నారు.ముగిసిన ఇంటర్వ్యూలుడీఎంకేలో ఆశావహులను ఐదు రోజుల పాటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ప్రధాన కార్యదర్శిదురై మురుగన్, కోశాధికారి టీఆర్బాలులు ఇంటర్వ్యూ చేస్తూ వచ్చారు. జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో మంత్రులు సైతం ఇంటర్వ్యూలకు హాజరై, తమ గెలుపు అవకాశాలు, నియోజకవర్గంలో బలం తదితర అంశాలను గురించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం ఉదయ నిధిస్టాలిన్ సైతం ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సోమవారం డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్ నెహ్రు మంత్రి అన్బిల్ మహేశ్ తదితరులతో పాటుగా కావేరి తీర డెల్టా జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన ఆశావహులను స్టాలిన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రక్రియను ముగించిన స్టాలిన్ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి పెట్టారు. ముందుగా మంగళ, బుధవారం లోపు కూటమిలోని పార్టీలకు సీట్లను, నియోజకవర్గాలను ఖారారు చేయడానికి సర్దుబాటు కమిటీని ఆదేశించారు. ఈ ప్రక్రియ ముగియగానే, తొలుత మ్యానిఫెస్టో, ఆ తదుపరి అభ్యర్థుల జాబితా ప్రకటించి, రాష్ట్ర పర్యటనకు స్టాలిన్ సిద్ధం కానున్నారు.ఉదయ నిధి ఆసక్తికరం..కాగా, తనను ఇంటర్వ్యూలో పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అడిగిన ప్రశ్నలను ఓ మీడియాతో పంచుకుంటూ ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య తేడా, నియోజకవర్గ ప్రజల మనో భావాలను గురించిన ప్రశ్నలను అడిగి, చివరకు వెళ్లి రండి... అభ్యర్థి ఎవరో అన్నది ఆలోచించి చెబుతామని పంపించేశారని చమత్కరించారు. -
శరత్ కుమార్కు నైనార్ బుజ్జగింపు
సాక్షి, చైన్నె : సినీ నటుడు శరత్కుమార్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ బుజ్జగించారు. దీంతో ఆయన కాస్త శాంతించారు. అదే సమయంలో తమ డిమాండ్ల వినతి పత్రాన్ని నైనార్కు శరత్కుమార్ అందజేశారు. వివరాలు.. సినీ నటుడు శరత్కుమార్ తన సమత్తువ మక్కల్ కట్చిని బీజేపీలో లోక్ సభ ఎన్నికల సమయంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. తనకు జాతీయ స్థాయిలో పదవి ఇస్తామని చెప్పి ఏడాదిన్నర కాలంగా పక్కన పెట్టడం శరత్కుమార్లో వేదనను కల్గించింది. దీంతో ఆదివారం తన మద్దతుదారురులతో సమావేశమై అసంతృప్తి, ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో ఆయన్ని బుజ్జగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ రంగంలోకి దిగారు. కమలాలయంకు పిలిపించారు. తన మద్దతుదారులతో కలిసి నైనార్ను శరత్కుమార్ కలిశారు. నైనార్ ఇచ్చిన హామీ, బుజ్జగింపుతో శరత్కుమార్ కాస్త తగ్గారు. మరి కొంత కాలం వేచి చూసే ధోరణికి నిర్ణయించారు. అదే సమయంలో ఎన్నికలలో తన మద్దతుదారులకు సీట్లు ఇవ్వాలన్న డిమాండ్తో పాటూ పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని నైనార్కు అందజేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్తో మాట్లాడి న్యాయం చేస్తానని నైనార్ హామీ ఇవ్వడం గమనార్హం.ప్రత్యేక పర్యవేక్షకుడిగా ప్రతాప్ సింగ్తమిళనాడు శాసనసభ సాధారణ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం) కీలక చర్యలు చేపట్టింది. భారత రాజ్యాంగంలోని తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి ప్రతాప్ సింగ్ను తమిళనాడు ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షకుడి ఎన్నికల కమిషన్ నియమిచింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. చైన్నెలోని అనెక్స్ బిల్డింగ్ అయకరా భవన్లో ఆయనకు కార్యాలయం ఏర్పాటు చేశారు. కార్యాలయ ఫోన్ నంబర్: 044–28338378, మొబైల్ నంబర్: 7845321461 ప్రకటించారు. ఆయనకు లైసెన్ ఆఫీసర్గా జగన్ మోహన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా లేదా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లు గమనించినా, వెలుగులోకి వచ్చినా పైన పేర్కొన్న ఫోన్ నంబర్లు లేదా ఈమెయిల్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షకుడిని నేరుగా సంప్రదించవచ్చని తమిళనాడు ఎస్ఈసీ అర్చనా పట్నాయక్ తెలియజేశారు. -
పుదుచ్చేరిలో ముగిసిన నామినేషన్ల పర్వం
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. ఐదు కూటములు ఈ ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టాయి. నామినేషన్ల పర్వం సోమవారం సాయంత్రం మూడు గంటలకు ముగిసినా, డీఎంకే– కాంగ్రెస్ ఇండియా కూటమిలో సీట్ల లెక్క అన్నది తేల లేదు. దీంతో చివరి రోజున 23 నియోజకవర్గాలలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు వేయడంతో పరిణామాలు ఆసక్తికరంగా మార్చాయి. చివరకు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఉత్కంఠకు ఇండియా కూటమిలో తెర పడింది. 30 సీట్లతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనుంది. ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వద్ద ఈనెల 16 నుంచి నామినేషన్లు స్వీకరిస్తూ వచ్చారు. ఈ ఎన్నికలలో ప్రధాన సమరం ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ఉంటుందని తొలుత భావించినా, తాజాగా పరిణామాలు రాజకీయాన్ని రసవత్తరం చేశాయి. ఈ రెండు కూటములను ఢీ కొట్టేందుకు ఒంటరిగా నామ్ తమిళర్ కట్చి పోటీలో ఉంది. అలాగే, విజయ్ టీవీకే పార్టీ నేయం మక్కల్ కళగంతో కలిసి పోటీలో అభ్యర్థులను పెట్టింది. ఇందులో టీవీకే 28 చోట్ల, నేయం మక్కల్ కట్చి రెండు చోట్ల పోటీ చేస్తోంది. బీజేపీలో సీట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సాయి శరవణన్ కుమార్, ముత్యాల పేట స్వతంత్ర సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్కుమార్లు టీవీకే తరపున పోటీ చేస్తున్నారు. అలాగే, మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సైతం టీవీకే నుంచి పోటీ చేస్తుండటమే కాకుండా, ఇక్కడి ఎన్నికల వ్యవహారాలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిభుస్సీ ఆనంద్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో పోటీ హోరా హోరీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఓట్ల చీలిక దిశగా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు నేతృత్వంలోని కూటమి సైతం 30 చోట్ల అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం. దీంతో పుదుచ్చేరి పంచముఖ సమరం నెలకొన్నట్లయ్యింది.చివరి క్షణం వరకు..పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. దీంతో నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులుదీరారు. అన్ని పార్టీలు చివరి రోజునే నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు చేయడంతో పూర్తి లెక్క తేలాల్సి ఉంది. చివరి రోజు రెండు వందల నామినేషన్లు దాఖలై ఉండవచ్చని అంచనా. అదే సమయంలో డీఎంకే, కాంగ్రెస్ కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఆదివారం అర్థరాత్రి 12:30 గంటల నుండి సోమవారం వేకువ జామున నాలుగు గంటల వరకు సాగిన చర్చలలో కూటమి ఖారారైంది. అయితే, సీట్ల లెక్క తేలలేదు. దీంతో నేతలు అసంతృప్తితో బయటకు వెళ్లారు. ఉదయాన్నే నామినేషన్ల దాఖలుపై ఎవరికి వారు దృష్టి పెట్టారు. సిట్టింగ్, ముఖ్య నేతల నియోజకవర్గాలు పోగా, మిగిలిన 23 నియోజకవర్గాలలో డీఎంకే, కాంగ్రెస్నాయకులు ఇరువురు నామినేషన్లు వేయడం గమనార్హం. అలాగే, ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే నాయకులు పలువురు సైతం నామినేషన్లు వేశారు. సీట్లు, నియోజకవర్గం లెక్క తేలినానంతరం ఉప సంహరించుకునే దిశగా నిర్ణయించారు. అదే సమయంలో నెల్లితోపు, కాలపట్టు, ముత్యాలపేట వంటి నియోజకవర్గాల కోసం ఇరు పార్టీలు పట్టుబడుతుండటం గమనార్హం. ఇక, మాజీ సీఎం నారాయణ స్వామి ఈ ఎన్నికలలో పోటీ చేయకుండా అధిష్టానం నిలువరించిన సమాచారంతో ఆయన మద్దతుదారులు మరో మాజీ సీఎం వైద్యలింగం నివాసాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇండియా కూటమిలో ఉత్కంఠకు తెర పడింది. సీట్లను పరస్పరం సర్దుకున్నారు. కాంగ్రెస్ 16 చోట్ల, డీఎంకే 12 చోట్ల, సీపీఐ ఒక చోట, వీసీకే ఒక చోట పోటీ చేయడానికి నిర్ణయించాయి. అయితే, ఈకూటమిలోని డీఎండీకే సీటు ఇవ్వలేదు. కూటమి నిర్ణయించిన స్థానాలే ఫైనల్ అని, కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన వాళ్లంతా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, డీఎంకే అధిష్టానాలు ఆదేశాలు జారీ చేశాయి.సజావుగా ఎన్డీఏ పయనంప్రధాన ప్రతిపక్ష డీఎంకే – కాంగ్రెస్ ఇండియా కూటమిలో చివరి క్షణం వరకు ఉత్కంఠ నెలకొంటే, అధికార ఎన్.ఆర్. కాంగ్రెస్ – బీజేపీ ఎన్డీఏ కూటమిలో సజావుగా సర్దుబాటు పయనం సాగింది. ఇందులో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాలు, బీజేపీ 10 స్థానాలు, అన్నాడీఎంకే , ఎల్జేపీ తలా రెండు చోట్ల పోటీ చేస్తున్నాయి. ఆయా పార్టీల అధికారిక అభ్యర్థులున ఎలాంటి టెన్షన్ అన్నది లేకుండా సజావుగా తమ నామినేషన్లు సమర్పించేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో మంగళవారం పరిశీలన, గురువారం ఉపసంహరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. -
మళ్లీ డీఎంకేదే అధికారం
చెన్నై: త్వరలో తమిళనాడు అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి రానుందని ఓ సర్వే అంచనా వేసింది. అసెంబ్లీలోని 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 180 వరకు సీట్లు గెల్చుకుంటుందని సర్వే చేపట్టిన అగ్ని న్యూస్ సరీ్వస్(ఏఎన్ఎస్) సీఈవో ఆర్.సురేశ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమికి 44.9 శాతం వరకు ఓట్లు పోలవుతాయి. ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమి 38.5 శాతం ఓట్లతో 54 సీట్లు వస్తాయి’అని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై ప్రాంతంలో ప్రతిపక్ష కూటమి ఘోర పరాజయం చవిచూడనుందని, ఒక్క సీటూ గెల్చుకునే అవకాశాలు లేవని చెప్పారు. నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగా వెట్రి కళగం(టీవీకే)కు 9.7 శాతం ఓట్లు, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి 4.8 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. -
తమిళనాట ఎన్డీఏ డీల్ ఖరారు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23వ తేదీన జరిగే ఎన్నికలకు ఏఐఏడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నడుమ సీట్ల పంపిణీ దాదాపు ఖరారైంది. బీజేపీ సహా భాగస్వామ్య పార్టీలకు 56 సీట్లను కేటాయించేందుకు ఇచ్చేందుకు పళని స్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకే అంగీకరించింది. దీని ప్రకారం..బీజేపీ 27, పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) 18, ఏఎంఎంకే 11 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపనున్నాయి. ఏఐఏడీఎంకే ఎన్ని స్థానాల్లో పోటీ చేసేదీ త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి తెలిపారు. మరికొన్ని భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సోమవారం ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేత పీయూష్ గోయల్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్లతో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ ఏఐఏడీఎంకే పోటీ చేసే సీట్ల సంఖ్యపైనా త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్(మూపనార్), ఇందియ జననాయగ కట్చి(ఐజేకే)లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్న పళనిస్వామి..ఆయా పార్టీలతో త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందని స్పష్టం చేశారు. 234 సీట్లకు గాను తమ కూటమి కనీసం 210 చోట్ల గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
గౌరవ్ గొగొయ్ నామినేషన్
జోర్హాత్: లోక్సభ సభ్యుడు, అస్సాం కాంగెస్ర్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ సోమవారం జోర్హాట్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. జోర్హాట్ స్టేడియం నుంచి భారీ ర్యాలీతో అట్టహాసంగా జిల్లా కమిషనర్ కార్యాలయానికి ఆయన బయలుదేరారు. దాదాపు మూడు గంటలపాటు ర్యాలీ కొనసాగింది. గొగొయ్ మద్దతుదారులతోపాటు కాంగ్రెస్ కూటమిలోని ఆరుపార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోర్హాట్ ఎంపీగా ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష ఉపనేతగా గొగోయ్ కొనసాగుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే మొదటిసారి. నామినేషన్కు ముందు మీడియాతో మాట్లాడుతూ అస్సాం రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు దీనినో అవకాశంగా భావిస్తున్నానన్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమాజాన్ని, రాజకీయాలను శుద్ధి చేసేందుకు తనతో చేతులు కలపాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే పార్టీలతో నిమిత్తం లేకుండా అందరినీ సమానంగా ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములుగా చేస్తామని చెప్పారు. పార్టీ ర్యాలీలు, కార్యక్రమాల్లో పాల్గొన్న వారికే పథకాలను అమలు చేస్తామంటూ అధికార బీజేపీ మహిళలను అవమానిస్తోందని గొగొయ్ విమర్శించారు. జోర్హాట్ స్థానం నుంచి బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్రనాథ్ గోస్వామితో గొగొయ్ తలపడనున్నారు. గోస్వామి 1991 నుంచి ఏజీపీ తరఫున, అనంతరం 2016 నుంచి బీజేపీ తరఫున వరుసగా ఐదు పర్యాయాలు జోర్హాట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
పుదుచ్చేరిలో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరోసారి ప్రజాతీర్పు కోరడానికి సిద్ధమైంది. ఆయన సారథ్యంలోని ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమాగా ఉంది. విపక్ష డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా అదృష్టం పరీక్షించుకుంటోంది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరు మరోసారి కలిసొస్తుందని ఎన్డీఏ ఆశిస్తోంది. కూటమి భాగస్వామి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం, పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులివ్వడాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తోంది. డీఎంకే, కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. హామీలు నెరవేర్చలేదని, శాంతి భద్రతలు దిగజారాయని ఆరోపిస్తున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ బలపడటంపై బీజేపీ కన్నేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు పుదుచ్చేరిలో ఇప్పటికే పలుమార్లు విస్తృతంగా పర్యటించారు. విజయ్ పార్టీతో చేటెవరికి? అంతర్గత కలహాలు, సీట్లపై సిగపట్లు డీఎంకే కూటమిని కలవరపెడుతున్నాయి. పుదుచ్చేరిలో ఒకప్పుడు ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం డీఎంకేకు జూనియర్ భాగస్వామిగా మారిపోయింది. అలాగని డీఎంకే 20 సీట్లకు పట్టుబడుతుండటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసినా సీట్ల పంపకంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దాంతో పలు అసెంబ్లీ స్థానాలకు డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులిద్దరూ నామినేషన్లు వేశారు. ఇది వాటి మధ్య స్నేహపూర్వక పోటీలకు దారి తీస్తే కూటమి విజయావకాశాలపై ప్రభావం పడుతుంది. విజయ్ పార్టీ టీవీకే పోటీలో ఉండటం తమకే లాభమని అధికార, విపక్ష కూటములు రెండూ లెక్కలేసుకుంటున్నాయి. తమిళ జాతీయవాది సీమాన్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ మూడో స్థానం దక్కించుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏ కూటమి సానుకూలతలు → సీఎం రంగస్వామి ప్రజాదరణ → ప్రధాని మోదీ కరిష్మా → కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధి పనులు → డీఎంకే కూటమి అనైక్యత ప్రతికూలతలు → ప్రభుత్వ వ్యతిరేకత → మంత్రులపై అవినీతి ఆరోపణలు → విజయ్ పార్టీతో ఓటుబ్యాంకుకు గండి పడే ఆస్కారండీఎంకే కూటమి సానుకూలతలు → రంగస్వామి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత→ డీఎంకే ద్రవిడ జాతీయవాద నినాదం → పలు జనాకర్షక పథకాల హామీలుప్రతికూలతలు → సీట్ల సర్దుబాటుపై ఎడతెగని సిగపట్లు → పలు అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులను బరిలో దింపడం– సాక్షి, నేషనల్ డెస్క్ -
డబ్బులు పట్టుకుని వచ్చారో..
ప్రజాస్వామ్యంలో ఓటు అంటే ఓ ఆయుధం. దాన్ని డబ్బుకు అమ్ముకుంటుంటారు చాలా మంది. ‘ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తాం’ అని చెబుతుంటారు కొందరు. ఓట్లు వేసే వేళ తమకు డబ్బులు ఇవ్వలేదని నిరసనకు దిగుతున్న వారు కూడా కనపడుతుంటారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా అనేక ప్రాంతాల్లో అభ్యర్థులు డబ్బులు పంచుతూనే ఉంటారు. ఓటుకు ఇంతగా అమ్ముడుపోతున్న ఓటర్లు ఉన్న ఈ కాలంలో.. తాము ఓటు వేసేందుకు డబ్బు వద్దని చెబుతున్నారు. రెండు గ్రామాల ప్రజలు. ‘అభ్యర్థులు డబ్బు ఇవ్వకూడదు, ఓటర్లు డబ్బు తీసుకోకూడదు’ అని బోర్డు పెట్టి మరీ, ఆచరణాత్మకంగా సందేశం ఇస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైకాల్ ప్రాంత ప్రజలు. ఆ ప్రాంతంలోని తీర గ్రామ ప్రజలు ఓటుకు డబ్బు ఇచ్చే అభ్యర్థులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హెచ్చరిస్తూ గ్రామంలో బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ, స్థానిక ప్రజల తరఫున తీసుకున్నారు. డబ్బు లేదా బహుమతులు ఇచ్చే అభ్యర్థులను గ్రామం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘిస్తే గ్రామం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.“మా ఓటుకు ధర నిర్ణయించవద్దు, మా జీవనోపాధికి మార్గం చూపండి” అని బ్యానర్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ సాధారణంగా జరుగుతుండటంపై గ్రామస్తులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ బ్యానర్ అభ్యర్థుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి.డబ్బులు తీసుకోంగానీ 100% ఓటేస్తాంమరోవైపు, ‘మా ఓటు అమ్మకానికి లేదు’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడి సమీపంలోని ఆలంపట్టు పెరియర్ నగర్ గ్రామ యువకులు. అంతేగాక, తమ గ్రామంలో 100 శాతం ఓటింగ్ నమోదవుతుందని హామీ ఇస్తున్నారు. పెరియర్ మరుమలర్చి డాక్టర్ అంబేద్కర్ యువ నర్పణి మండలి సభ్యులు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు. పలు పోస్టర్లను బస్ స్టాండ్ ప్రయాణికుల షెల్టర్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో అతికించారు.దీనిపై ఆలంపట్టు పెరియర్ నగర్ యువకులు మాట్లాడుతూ.. ‘మా గ్రామంలో అందరం ఓటుకు డబ్బు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి రావద్దని గ్రామ సరిహద్దులోనే ప్రకటన బ్యానర్ ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. -
'చివరి ఎత్తుగడ.. కేరళలో సీపీఎం–బీజేపీ పొత్తు'
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీజేపీ పార్టీలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాష్ట్రంలో సీపీఎం, బీజేపీల స్నేహం కొత్తేమీ కాదని, కానీ ఈసారి ఆ పొత్తు విజయం సాధించదని స్పష్టం చేశారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని, సీపీఎం, ఎల్డీఎఫ్లకు అర్థమైందని, అందుకే వారు తమ చివరి ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు.ఆదివారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిపై ఉన్న లావ్లిన్ కేసు వాయిదా పడటం, కేరళలో కేంద్ర దర్యాప్తు సంస్థల వేగం, పీఎం–శ్రీ వంటి అంశాలు.. కేంద్ర ప్రభుత్వం, వామపక్ష పార్టీ సంబంధాలేంటో స్పష్టమవుతున్నాయని కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాల్లోనూ ఇదే సంబంధం ప్రతిబింబించిందని, ఎన్నికల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని వేణుగోపాల్ ఆరోపించారు. కానీ ఈ ఒప్పందాన్ని పార్టీ కార్యకర్తలు తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో మేనిఫెస్టో... రాష్ట్రం కోసం నిర్దిష్ట ప్రాజెక్టులు, ప్రణాళికలతో మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని పునరుద్ఘాటించారు. కొబ్బరి పీచు, జీడిపప్పు, మత్స్య, చేనేత రంగాల్లో, అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తూ, పూటగడవడమే ఇబ్బందిగా ఉన్న మహిళల జీవితాల్లో ఇది విప్లవాత్మక మార్పు తెస్తుందన్నారు.చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఇవే..ఈ పథకం కేఎస్ఆర్టీసీపై ఆర్థిక భారం మోపుతుందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేశామని వేణుగోపాల్ పేర్కొన్నారు. రవాణా సంస్థలోని సమస్యలను పరిష్కరించడానికి యూడీఎఫ్ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ వంద స్థానాలను గెలుచుకుంటుందననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి మహిళా మంత్రి
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం (మార్చి 22) ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.టికెట్ దక్కకపోవడమే కారణమా?2022 నుంచి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో విద్యుత్, గనులు, గిరిజన సంస్కృతి వంటి కీలక శాఖల మంత్రిగా నందితా సేవలందించారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న హాఫ్లాంగ్ సీటును బీజేపీ నిరాకరించింది. ఆమె స్థానంలో కొత్త అభ్యర్థి రూపాలి లాంగ్థాసాకు టికెట్ కేటాయించడంతో నందిత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన ఆత్మాభిమానం కోసం, నియోజకవర్గ ప్రజల కోసం పార్టీ మారుతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.త్యాగం చేసిన నిర్మల్.. కాంగ్రెస్ వ్యూహంనందితా చేరికతో కాంగ్రెస్ తన సమీకరణలను వేగంగా మార్చేసింది. నిజానికి హాఫ్లాంగ్ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మల్ లాంగ్థాసా పేరును కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది. అయితే నందిత.. పార్టీలోకి రావడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మల్ తన సీటును త్యాగం చేశారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ‘గత ఐదేళ్లుగా డిమా హసావో గొంతుకగా ఉన్న నందిత, తన సిద్ధాంతాల కోసం నిలబడ్డారు’ అని కాంగ్రెస్ కొనియాడింది.సీఎం చర్చలు విఫలం?నందిత పార్టీ మారడానికి కొద్ది గంటల ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఆ భేటీలో ఏం జరిగిందనేది ఇరు పక్షాలూ బయటపెట్టలేదు. కానీ, సీఎం పర్యటన తర్వాతే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చూస్తుంటే, బుజ్జగింపులు ఫలించలేదని స్పష్టమవుతోంది. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9, 2026న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. మంత్రి నందిత కాంగ్రెస్లో చేరడంతో పోరు రసవత్తరంగా మారింది. -
బీజేపీలో కొత్త సెగ.. కనీస గుర్తింపు కరువు
సాక్షి, చైన్నె: ప్రముఖ నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆర్. శరత్ కుమార్ తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మి పార్టీలో చేరిన వారికి, తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశారు. చైన్నెలో ఆదివారం తన మద్దతుదారులతో అత్యవసరంగా సమావేశమైన శరత్ కుమార్, అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలో చేరినప్పుడు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి పదవీ కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి బాధ్యత లేకపోతే కార్యకర్తలతో కలిసి ఎలా పని చేయగలను? అని ప్రశ్నించారు.విలీనంపై విచారం..తన సొంత పార్టీ అఖిల భారత సమత్వ మక్కల్ కట్చిని బీజేపీలో విలీనం చేయకుండా ఉంటేనే బాగుండేదని తన మద్దతుదారులు భావిస్తున్నారని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకుని పెద్ద తప్పే చేశామన్నారు. పార్టీలో చేర్చుకుని వేచి చూడమనడం సరైన పద్ధతి కాదన్నారు. తన ఆవేదనను వివరిస్తూ జాతీయ నాయకత్వానికి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్కు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. తాను అసంతృప్తితో లేనని, కేవలం ఆవేదనతో ఉన్నానని వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో పోటీ చేయనుతాజా అసెంబ్లీ ఎన్నికల్లో తాను గానీ, తన భార్య రాధిక గానీ పోటీ చేయమని శరత్ కుమార్ స్పష్టం చేశారు. అధిష్టానం చెప్పినా సరే పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు. అయితే తనతో పాటూ నడిచిన సమర్థులైన నాయకులకు అవకాశం ఇవ్వాలని ఓ జాబితాను అందజేసినట్లు చెప్పారు. నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం గురించి మాట్లాడుతూ, విజయ్ని ఒక నాయకుడిగా తాను పరిగణించడం లేదన్నారు. ఆయనపై తనకు ఎలాంటి అంచనాలు లేవని వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో జరిగిన బీజేపీ సదస్సులో తన ఫొటో కూడా వేయకపోవడంపై తన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, కనీసం ఇప్పటికై నా పార్టీ గుర్తించాలని ఆయన కోరారు. ప్రస్తుతానికి పార్టీని వీడే ఆలోచన లేదని చెబుతూనే, బాధ్యతలు ఇస్తేనే పనిచేయడం సాధ్యమని పరోక్షంగా బీజేపీ అఽధిష్టానాన్ని హెచ్చరించడం గమనార్హం. -
రెండు సార్లు ఏలిన పార్టీకి రెండు సీట్లే
సాక్షి, చైన్నె: ఒకప్పుడు పుదుచ్చేరిలో రెండు సార్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు తాజాగా గడ్డు కాలం నెలకొంది. తాజాగా రెండు సీట్లతో సర్దుకునే స్థాయి ఆ పార్టీ అక్కడ పతనం అయ్యింది. ఎట్టకేలకు ఆ రెండు సీట్లకు అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 1974, 1977లో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. ఆ తదుపరి పరిణామాలతో ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. ఓ మారు డీఎంకే సైతం అధికారం ఏర్పాటు చేసింది. తాజాగా ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే రెండు సార్లు అధికార పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే పరిస్థితి పుదుచ్చేరిలో దయనీయంగా మారింది. 2021 ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైన తదుపరి ఆ పార్టీ తరపున ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కూడా కరువైనట్టు పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అధికారంలో ఉండటమే కాదు, ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న అన్నాడీఎంకే తాజాగా రెండు సీట్లలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ఆర్కాంగ్రెస్, బీజేపీ కూటమిలో అన్నాడీఎంకేకు రెండు సీట్లు కేటాయించారు. ఈ స్థానాలకు అభ్యర్థులుగా చివరకు ఆ పార్టీ పుదుచ్చేరి కార్యదర్శి, మరో కీలక నేత పోటీచేయక తప్పలేదు.అభ్యర్థులు వీరే..పుదుచ్చేరి ఎన్నికలలో పోటీ చేసే అన్నాడీఎంకే అభ్యర్థులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు. ఉప్పళం నియోజకవర్గం నుంచి పుదుచ్చేరి రాష్ట్ర అన్నాడీఎంకే కార్యదర్శి ఎ. అన్బళగన్ పోటీ చే స్తారని తెలిపారు. అలాగే ఉరుళయన్ పేట నియోజకవర్గం నుంచి పుదుచ్చేరి రాష్ట్ర పార్టీ మాజీ డిప్యూటీ కార్యదర్శి ఎ. గాంధీ బరిలోకి దిగుతారని వివరించారు. ఈ ఇద్దరి గెలుపునకు పార్టీ వర్గాలు కృషి చేయాలని, కూటమికి మద్దతుగా ప్రచారాలలో దూసుకెళ్లి, కూటమి అభ్యర్థుల గెలుపునకు కూడా కృషి చేయాలని ఆదేశించారు. -
నగదు బట్వాడాపై ఉక్కుపాదం
సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ధనబలాన్ని ఉపయోగించే రాజకీయ నాయకులపై నిఘాను ముమ్మరం చేయాలని కేంద్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకుడు ప్రతాప్ సింగ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి భయం కలిగేలా పర్యవేక్షణ కార్యకలాపాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్ అభినవ్తో కలిసి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.తమిళనాడుపై ప్రత్యేక దృష్టిదేశంలోనే ఎన్నికల ఖర్చు అత్యధికంగా ఉండే రాష్ట్రంగా తమిళనాడును ఎన్నికల సంఘం గుర్తించింది. గతంలో 2016లో అరవకురిచ్చి, తిరుపరంకుండ్రం, 2017లో ఆర్.కె. నగర్ ఉపఎన్నికల్లో ధనప్రవాహం కారణంగా ఎన్నికలు రద్దు చేయబడిన విషయాలను ఆయన ఉదాహరణగా గుర్తు చేశారు. సాధారణంగా ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక వ్యయ పరిశీలకుడు ఉంటారని పేర్కొంటూ, ఈసారి తమిళనాడులోని 234 నియోజకవర్గాల కోసం ఏకంగా 151 మంది వ్యయ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందన్నారు. జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు సరికొత్త సాంకేతికతను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షించాలని ప్రతాప్ సింగ్ సూచించారు.అలాగే, ఈవీఎంల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మాజీ మంత్రి ఉదయకుమార్పై డీఎంకే ఫిర్యాదుతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మదురై జిల్లా తిరుమంగళం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఏఐఏడీఎంకే కీలక నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ నగదు పంపిణీ చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాయి.మనీ లాండరింగ్ ఆరోపణలుఉదయకుమార్ తన సొంత ట్రస్ట్ ద్వారా భారీగా నగదు బదిలీలు చేస్తున్నారని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మదురై దక్షిణ జిల్లా డీఎంకే న్యాయవాదుల విభాగం ప్రతినిధి శివనేశన్, ఐటీ వింగ్ ఆర్గనైజర్ జయచంద్రన్ ఆరోపించారు. తిరుమంగళం నియోజకవర్గ పరిధిలోని టి. కున్నత్తూరులో ఉదయకుమార్ నిర్మించిన దివంగత సీఎం జయలలిత ఆలయాన్ని ఎన్నికల కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం భోజనాలు ఏర్పాటు చేస్తూ, నగదు పంపిణీకి వేదికగా మార్చుకున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, ఆ ఆలయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, ఎన్నికలు ముగిసే వరకు ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని డీఎంకే నేతలు తిరుమంగళం ఎన్నికల అధికారి శివజ్యోతికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
డీఎంకే కూటమికి బై..బై..!
డీఎంకే కూటమి నుంచి వైదొలగుతున్నట్లు తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ ప్రకటించారు. బయటకు వెళ్తూ డీఎంకేపై ఆరోపణల వర్షం కురిపిస్తూ, వన్నియర్లను ఆ కూటమికి దూరం చేసే ప్రయత్నంలో వ్యాఖ్యల తూటాలను పేల్చారు.సాక్షి, చైన్నె : 2019 లోక్సభ ఎన్నికల నుంచి తమిళర్ వాల్వురిమై కట్చి డీఎంకే కూటమిలో కొనసాగుతూ వస్తోంది. ఆ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఓ స్థానంలో గెలిచింది. ఆ పార్టీ అధ్యక్షుడు వేల్ మురుగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా కూడా ఆ పార్టీకి ఒక్క సీటు ఇవ్వడానికి డీఎంకే నిర్ణయించింది. ఇందుకు వేల్మురుగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చర్చలకు ఆ పార్టీని డీఎంకే కమిటీ పిలవ లేదు. పలుమార్లు వ్యాఖ్యల తూటాలను పేల్చినా, అల్టిమేటం ఇచ్చినా డీఎంకే పట్టించుకోలేదు. దీంతో ఆదివారం చైన్నెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేల్ మురుగన్ డీఎంకేను టార్గెట్ చేస్తూ తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆరోపణలు గుప్పించారు. 2019 లోక్సభ ఎన్నికల నుండి డీఎంకేతో కలిసి నడుస్తున్నామని గుర్తు చేశారు. తాజా ఎన్నికల కోసం జరిగిన చర్చల్లో డీఎంకే తమ కేవలం ఒకే సీటు కేటాయించిందన్నారు. దీనిని అంగీకరంచ లేమని, అదనపు స్థానాలు ఇవ్వాల్సిందేనని కోరినా పట్టించుకోలేదన్నారు.10 అంశాల డిమాండ్లుతమిళ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా 10 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. ఇందులో కుల గణన చేపట్టాలని, వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తమిళులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చే చట్టాన్ని తీసుకురావాలని కోరినట్టు వివరించారు. అయితే డీఎంకే ప్రభుత్వం తమ డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వంలోని కొందరు తమిళ వ్యతిరేక అధికారులు తనను కూటమి నుంచి బయటకు పంపించే కుట్ర పన్నినట్టు ఆరోపించారు. సీఎం స్టాలిన్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండే అధికారులు అడ్డుపడుతున్నారని వివరించారు.భవిష్యత్తు ప్రణాళికదేశాన్ని మతం పేరుతో విభజించే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో తాము చేరబోవడం లేదన్నారు. 10 అంశాల డిమాండ్లను అంగీకరించే పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం 25కు పైగా చిన్న పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. డీఎంకే శ్రీపెద్దన్నశ్రీ పాత్ర పోషిస్తూ తమను విస్మరించిందని, అందుకే కార్యకర్తల అభిప్రాయం మేరకు కూటమి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా వేల్ మురుగన్ బయటకు వెళ్తుండటం గురించి డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ స్పందిస్తూ, బయటకు వెళ్లేటప్పుడు ఆరోపణలు చేయడం సహజమేనని వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ, చర్చలకు చివరి క్షణంలో ఇచ్చే కొన్ని అవకాశాలు ఉంటాయని, అయితే, ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.సందిగ్ధంలో సీపీఎండీఎంకే కూటమి నుంచి వైదొలగుతున్న వేల్ మురుగన్ ప్రకటిస్తే, ఇదే కూటమిలోని సీపీఎం సందిగ్ధంలో పడి ఉంది. తాము ఆశిస్తున్న సీట్లను డీఎంకే ఇవ్వక పోవడంతో తీవ్ర అసంతృప్తితో సీపీఎం వర్గాలు ఉన్నాయి. గతంలో ఆరు సీట్లు ఇవ్వగా రెండు స్థానాలలో మాత్రమే సీపీఎం గెలవడంతో ఈసారి ఐదు సీట్లకు డీఎంకే పరిమితం చేసింది. ఇందుకు సీపీఎం అంగీకరించడం లేదు. ఆదివారం సీపీఎం ప్రధాన కార్యదర్శి షణ్ముగం నేతృత్వంలోని బృందం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో సమావేశమైంది. ఐదు సీట్లే అని తేల్చిచెప్పడంతో సీపీఎం సందిగ్ధంలో పడింది. ఈ భేటీ అనంతరం షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ, కూటమిలో ఈసారి కొత్తగా మరిన్ని పార్టీలు చేరడం వలన సీట్ల సర్దుబాటు సవాలుగా మారిందని సీఎం తమకు వివరించారన్నారు. 5 స్థానాలకు అంగీకరించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు షణ్ముగం తెలిపారు. అయితే తమకు ఆరు స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టామని, ఈ విషయంగా తమ పార్టీతో చర్చించి సోమవారం నిర్ణయం ప్రకటిస్తామన్నారు. తమ తుది నిర్ణయా న్ని ప్రకటిస్తామని ఈసందర్భంగా ఓ ప్రశ్నకు షణ్ముగం వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇదే కూటమి లోని వీసీకే నేత తిరుమావళవన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ సీట్ల సంఖ్య తగ్గింపు గురించి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇదే కూటమిలోని కమల్ మక్కల్ నీది మయ్యం సైతం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఆ పార్టీకి కేవలం రెండుసీట్లు ఇవ్వడానికి డీఎంకే ముందుకు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇది కూడా డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. దీంతో పార్టీ వర్గాలతో కమల్ సుదీర్ఘ చర్చలలో ఉండటం గమనార్హం. -
క్యూ వరసల్లో బెంచీలు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కోట్లాది మంది ఓటర్లు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఓటేసేందుకు అనువుగా పోలింగ్ కేంద్రాల వద్ద తగు సదుపాయాలు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా వెంటనే ఈ మేరకు ఆదివారం రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ)లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.అస్సాం, కేరళ, పుదుచ్చెరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలతో పాటు 6 రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికల వేళ కచ్చితంగా కనీస సౌకర్యాలను కల్పించాలంటూ ‘అష్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్’ పేరిట కొన్ని సూచనలు చేసింది. మొత్తం 2,18,807 పోలింగ్ కేంద్రాల్లో ఈ సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని సీఈఓలను ఈసీ ఆదేశించింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు వేచి ఉండే చోట ఎండపడకుండా నీడ ఏర్పడేలా టెంట్లు, పరదాలు ఏర్పాటుచేయాలని సూచించింది. చాంతాడంత క్యూ వరసల్లో చాలాసేపు నిలబడి అలసిపోయే ఓటర్ల సౌకర్యం కోసం మధ్యమధ్యలో బెంచీలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించింది. సరిపడా వెలుతురుతో టాయిలెట్లు ఏర్పాటుచేయాలని తెలిపింది. దివ్యాంగ ఓటర్ల కోసం సరైన గ్రేడియంట్ ఉన్న ర్యాంప్లను నిర్మించాలి. పోలింగ్ కేంద్రం చిరునామా, వివరాలు, అభ్యర్థుల జాబితా, ఓటు వేసే విధానం, పోలింగ్ కేంద్రంలో నిషేధిత పనులు, పోలింగ్కు ఏఏ గుర్తింపుకార్డులను అనుమతిస్తారనే వివరాలతో కూడిన ‘ఓటర్ ఫెసిలిటేషన్ పోస్టర్లు’ ప్రతి కేంద్రం వద్ద ప్రదర్శించాలని స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూడదని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను బయటే భద్రపరుచుకునేలా పోలింగ్ కేంద్రం బయట ‘మొబైల్ ఫోన్ డిపాజిట్’సదుపాయాన్ని కల్పించనున్నారు. తొలుత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అక్కడి వలంటీర్కు ఇస్తే, ఓటేశాక ఓటరుకు తిరిగి ఇచ్చేస్తారు. ఓటరు జాబితాలో తమ పేరు, సీరియల్ నంబర్ వెతుక్కునే పనిలేకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ‘ఓటరు అసిస్టెన్స్ బూత్’లను ఏర్పాటు చేయనున్నారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇక్కడ అందుబాటులో ఉండి ఓటర్లకు మార్గనిర్దేశం చేస్తారు. పోలింగ్కేంద్రంలో పోలింగ్ బూత్ నంబర్, సీరియల్ నంబర్ విషయంలో ఓటర్లకు బూత్స్థాయి అధికారులు సాయపడతారు. ఈ నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, పోలింగ్ తేదీకల్లా తగు సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని ఈసీ ఆదేశించింది. -
అభ్యర్థుల ప్రచార పాట్లు!
ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లడగటం పాత పద్ధతి. పశ్చిమ బెంగాల్లో అభ్యర్థులు ప్రచారం రూటు మార్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వింత పాట్లు పడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని కుండను పగుల గొట్టడం వంటి ఆటలు ఒకరు ఆడుతుంటే.. మరొక అభ్యర్థి బార్బర్ అవతారమెత్తారు. ఇంకొకరు ఏకంగా వంటింట్లోకి వెళ్లి చపాతీలు చేస్తే.. మరొకరు గుడిలో భజన కీర్తనలు పాడే పరమ భక్తుడిగా మారిపోయారు.చపాతీలు చేస్తూ... అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ఇక్కట్లు అందరికీ తెలిసిందే. హుగ్లీలోని పుర్సురాలో గ్యాస్ లేక కట్టెల పొయ్యితో కుస్తీలు పడుతున్న ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు టీఎంసీ అభ్యర్థి పార్థ హజారీ. ఓ ఇంట్లో నేరుగా కిచెన్లోకి వెళ్లి మట్టి పొయ్యిపై రొట్టెలు చేశారు. సునాయాసంగా రొట్టె చేసి తన పాక కళను ప్రదర్శించారు. ‘‘గతంలో నేను రొట్టెలు చేశాను. వంట గురించి కొంత తెలుసు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. వారికి సాయం చేయాలని ప్రయతి్నంచాను’’ అని చెప్పుకొచ్చారు.కళ్లకు గంతలు కట్టుకుని.. రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో అసాధారణమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ చంద్ర బౌరీ సంప్రదాయ ‘హండీ ఫోడ్’ ఆట ఆడారు. కళ్లకు గంతలు కట్టుకుని, కుండను కర్రతో పగలగొట్టడానికి ప్రయతి్నంచారు. అయితే కుండ పగులగొట్టడంలో ఆయన విఫలమైనప్పటికీ.. జరగబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా ఇలాగే ఓడిపోతుందని సింబాలిక్ చెప్పాలనుకున్నారు. దీనిని బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా విమర్శించారు. కళ్లు మూసుకుని బీజేపీని ఓడించడం సాధ్యం కాదంటూ అధికార పారీ్టపై తవ్రంగా స్పందించిన ఆయన.. సామాన్య ప్రజలను ఆకట్టుకోవడానికి క్షురకుడి అవతారమెత్తారు. సాహా దుబ్రాజ్పూర్లో ఒక గ్రామస్తుడికి ఏకంగా గడ్డమే గీశారు! ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.సీపీఎం అభ్యర్థి పూజలు పానిహటిలో సీపీఎం పార్టీ అభ్యర్థి కల్తాన్ దాస్గుప్తా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా పక్కకు పెట్టి మరీ ఏకంగా మహోత్సవ్ తళా ఘాట్ ఆలయంలో ప్రార్థనలతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలాంటి వైరుధ్యాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని దాస్గుప్తా చెప్పారు. మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత సుభాష్ చక్రవర్తి సైతం ఒకప్పుడు తారాపీఠ్ ఆలయంలో ఇలాగే ప్రార్థనలు చేసి పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. గోపీబల్లవ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీజేపీ రాజేశ్ మహతో ఏకంగా భక్తుడి అవతారమెత్తారు. ఝార్గ్రామ్ అటవీ ప్రాంతంలోని పటాశిముల్లో ఇంటింటి ప్రచారానికి ముందు హరి నామ సంకీర్తన పాడారు. గ్రామస్తులతో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. సభలో ప్రజలపై గులాల్ చల్లుతూ ఆడుకున్నారు.‘మత్స్య’ రాజకీయాలు బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారాన్ని నిషేధిస్తుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వాత్ ముఖర్జీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాల్ట్ లేక్లోని ఐఏ మార్కెట్లో ఆయన ‘కట్ల’ చేపను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేశారు. ‘‘బెంగాలీ సంస్కృతిలో చేపలు, అన్నం ప్రధానాహారం. అలాంటిది, బీజేపీ గెలిస్తే చేపలను తినకుండా నిషేధం విధిస్తుందని టీఎంసీ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘బెంగాలీలకు చేప ఆహారం మాత్రమే కాదు. మన సంప్రదాయం. మన గుర్తింపులో ఒక భాగం. చేప లేకుండా ఏ శుభకార్యమూ ప్రారంభం కాదు. చివరకు పెళ్లి పత్రికలతో కూడా చేపను పంపిస్తారు. అందుకే చేప ద్వారానే నా ప్రత్యర్థులకు సందేశం పంపాలనుకుంటున్నా. చేపలు, అన్నంపై నిషేధం సంగతి అలా ఉంచితే... ప్రజలు కనీసం ఒక చేప ముక్కను కూడా కొనలేని దుస్థితిని టీఎంసీ పాలన తీసుకొచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలు రెండింతలు ఎక్కువగా చేపలు తినగలుగుతారు’ అని పేర్కొన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అస్సాం పోరు 2026: ఈ ఐదు అంశాల్లోనే ‘దోబూచులాట’
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 9న జరగనున్న ఒకే దశ పోలింగ్ కోసం రాష్ట్రంలో సన్నాహాలు సాగుతున్నాయి. 126 స్థానాల కోసం జరుగుతున్న ఈ సమరంలో కేవలం అభివృద్ధి మాత్రమే కాదు.. అస్తిత్వం, సామాజిక న్యాయం, వివాదాస్పద ‘ఎవిక్షన్’ డ్రైవ్లు.. మొదలైనవి గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా ఐదు అంశాలు ఈసారి ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్’గా మారబోతున్నాయి.1. జుబీన్ గార్గ్ సెంటిమెంట్అస్సాం సాంస్కృతిక దిగ్గజం జుబీన్ గార్గ్ 2025 సెప్టెంబర్లో సింగపూర్లో మృతిచెందడం రాష్ట్ర ప్రజలను విషాదంలోకి నెట్టింది. ఈ కేసును హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం స్పెషల్ కోర్టుకు అప్పగించినప్పటికీ, విచారణ వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. యువతలో ‘వాయిస్ ఆఫ్ జనరేషన్’గా పేరొందిన జుబీన్ ప్రభావం ‘సైలెంట్ ఓటర్ల’ రూపంలో తీర్పును మార్చే అవకాశం ఉంది.2. ఎవిక్షన్ డ్రైవ్లు (ఆక్రమణల తొలగింపు)అటవీ భూములు, ఆలయ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేశామని బీజేపీ కూటమి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే కాంగ్రెస్, ఏఐడీయూఎఫ్ మాత్రం దీనిని మైనారిటీలను లక్ష్యం చేసుకుని చేసిన మానవతా సంక్షోభంగా చిత్రీకరిస్తున్నాయి. ఈ అంశం మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కీలకం కానుంది.3. చొరబాటు - సీఏఏ/ఎన్ఆర్సీ చర్చఅక్రమ వలసల అంశం అస్సాం రాజకీయాల్లో ఎప్పుడూ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పీడిత మైనారిటీలకు రక్షణగా సీఏఏను బీజేపీ సమర్థిస్తుంటే, అస్సాం ఒప్పందాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఎన్ఏఆర్సీ ద్వారా అసలైన భారతీయులను వేధిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.4. బాల్య వివాహాలపై ఉక్కుపాదం‘పాక్సో’ చట్టం కింద ప్రభుత్వం చేపట్టిన సామూహిక అరెస్టులను ఎన్డీఏ ప్రభుత్వం ఒక చారిత్రక సామాజిక సంస్కరణగా అభివర్ణిస్తోంది. అయితే ఇది ఓటర్ల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నమని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు సగం మంది ఉన్న మహిళా ఓటర్ల తీర్పుపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.5. సంక్షేమం - నిరుద్యోగంనెలకు ₹1,250 అందించే ‘అరుణోదయ్ పథకం, టీ-వర్కర్ల సంక్షేమం, 1.6 లక్షల ఉద్యోగాల కల్పనపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అయితే పెరిగిన అప్పులు, నిరుద్యోగం, భూసేకరణ సమస్యలను ఎత్తిచూపుతూ గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ దీటుగా బదులిస్తోంది.అస్సాం ఎన్నికల కీలక తేదీలునామినేషన్ల గడువు: మార్చి 23, 2026పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9, 2026 (ఒకే దశ)ఫలితాల విడుదల: మే 4, 2026ఇది కూడా చదవండి: Kerala Polls: వణికిస్తున్న ‘తీరప్రాంత ఓటు’ -
Kerala Polls: వణికిస్తున్న ‘తీరప్రాంత ఓటు’
తిరువనంతపురం: కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అధికారం కోసం వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అయితే 600 కిలోమీటర్ల పొడవైన కేరళ తీరంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏ పార్టీ గెలిచినా తమ బతుకులు మారడం లేదని ఇక్కడ ఉంటున్న మత్స్యకారులు నేతలను నిలదీస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల వేళ, కేవలం ‘ఓటు బ్యాంకు’గా మాత్రమే తమను వాడుకుంటున్నారన్న కోపం ఇప్పుడు వారి గళంలో స్పష్టంగా వినిపిస్తోంది.నిర్ణయాత్మక శక్తిగా..ఈ ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది జనాభా కలిగిన లాటిన్ కాథలిక్ కమ్యూనిటీ ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. తిరువనంతపురం లాటిన్ ఆర్చ్డయోసీస్ వికార్ జనరల్ ఫాదర్ యూజీన్ పెరీరా మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తమ సమస్యలకు మేనిఫెస్టోలో ఇచ్చే ప్రాధాన్యతను బట్టే మద్దతు ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఇది అన్ని పార్టీలకు ఒక హెచ్చరికలా మారింది.విజింజం కల.. జాలర్ల కన్నీరుఒకప్పుడు గర్వకారణంగా భావించిన విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం, నేడు స్థానిక మత్స్యకారుల పాలిట శాపంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోర్టు నిర్మాణంతో తమ జీవనోపాధి దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే, అంతర్జాతీయ పోర్టుకు ఆనుకుని ఉన్న కోవలం తదితర నియోజకవర్గాల్లో ప్రజలు నేటికీ తాగే నీటిని బిందె రూ. 7 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ నీటి కష్టాలు రాబోయే ఎన్నికల్లో పాలకులకు గట్టి దెబ్బే తగిలేలా ఉన్నాయి.కబళిస్తున్న సముద్రం.. కనుమరుగవుతున్న ఇళ్లుతీరప్రాంతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘సముద్ర కోత’. అలల ఉధృతికి ఇళ్లు జలసమాధి అవుతుంటే, పునరావాసం కోసం మత్స్యకారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బ్లూ ఎకానమీ’ విధానాలు, సముద్ర భాగాలను మైనింగ్ కోసం లీజుకు ఇవ్వడం వంటి నిర్ణయాలపై జాలర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సముద్రమే తమ తల్లి అని నమ్ముకున్న వారు, ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాటం చేస్తున్నారు.పెండింగ్ డిమాండ్లు.. అప్పుల ఊబిచిరయింకీజులో సముద్రపు గోడ నిర్మాణం, ముతలపొళి వద్ద పూడికతీత పనులు వంటి మౌలిక వసతుల డిమాండ్లు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు, వాతావరణ మార్పుల వల్ల వేట తగ్గి, ఆదాయం పడిపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. రాజకీయ నేతల ఆర్భాటపు ప్రసంగాలు తమ ఆకలిని తీర్చవని, తమ సమస్యలను పరిష్కరించే వారికే ఈసారి ఓటు వేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.జాలర్ల ఆగ్రహం..కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత్స్యకారులందరిదీ ఇప్పుడు ఒకటే గోడు. ఈ ‘తీరప్రాంత ఓటు’ కేరళ రాజకీయాల్లో ఏ పార్టీని ముంచుతుందో, ఎవరిని గట్టెక్కిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఓట్ల పండగ వస్తోంది కానీ, ఆ ఇళ్లలో వెలుగులు నింపే నేత ఎవరో తేలాల్సి ఉంది. జాలర్ల ఆగ్రహం ఈసారి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. భక్తులకు ప్రత్యేక సూచన -
ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు
కాసరగోడ్: త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళలో విషాదం చోటుచేసుకుంది. కాసరగోడ్లో ఎన్నికల విధుల ఒత్తిడిని తట్టుకోలేక ఒక ఉపాధ్యాయుడు నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.అసలేం జరిగింది?మొగ్రాల్ పుత్తూరుకు చెందిన బి. మహమ్మద్ సవాద్ (32) చెర్కల సెంట్రల్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో అరబిక్ టీచర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన కుడ్లు విలేజ్ పరిధిలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం మొగ్రాల్ వంతెన వద్ద సవాద్ స్కూటర్ కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు నదిలో గాలించారు. రెండు పడవల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న సవాద్ను గుర్తించి వెంటనే వారు కాసరగోడ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూనే కన్నుమూశారు.పని ఒత్తిడే కారణమా?సవాద్ మృతికి మితిమీరిన పని ఒత్తిడే కారణమని ఆయన సహోద్యోగులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ పనులను మార్చి 21లోపు పూర్తి చేయాలని అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని వారు చెబుతున్నారు. ‘ఈద్ పండుగ దృష్ట్యా గడువు పెంచాలని ఆయన అధికారులను కోరారు, కానీ అందుకు నిరాకరించారు’ అని తోటి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆస్పత్రి వద్ద పలువురు ఆందోళనకు దిగారు.పోలీసుల వాదన వేరేలా ఉంది..మరోవైపు సవాద్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని వారు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్డీవో బిను జోసెఫ్, ఏఎస్పీ అచ్యుత్ అశోక్ రంగంలోకి దిగి, పూర్తిస్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. మహమ్మద్ సవాద్కు తండ్రి షఫీ, తల్లి ఫౌసియా, నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ఎన్నికల వేళ ఒక అధికారి ఇలా మరణించడం జిల్లాలో విషాద ఛాయలు నింపింది.ఇది కూడా చదవండి: ‘మన గ్యాస్ని ఎవర్రా ఆపేది?’.. భారత్కు అమెరికా గ్యాస్! -
అస్సాంలో బీజేపీ దూకుడు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ నడుమ మరోసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవి్వళ్లూరుతోంది. కాషాయ పార్టీ ఆశలను వమ్ము చేసి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. రెండు పారీ్టలూ భాగస్వాములతో పొత్తుల ప్రక్రియను పూర్తి చేసుకుని పోటాపోటీగా అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. రాష్ట్రమంతటా ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి కూడా. అయితే సీఎం హిమంత సారథ్యంలో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... చొరబాట్లు, అస్తిత్వ, హిందూత్వ–ముస్లిం రాజకీయాలు. ఇవే అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చేలా కని్పస్తున్న ప్రధానాంశాలు. అస్సామీల అస్తిత్వం, భూముల పరిరక్షకునిగా ముఖ్యమంత్రి సాధించిన హిమంత బిశ్వశర్మ ఇమేజీ బీజేపీకి పెద్ద సానుకూలతగా కనిపిస్తోంది. అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆయన సర్కారు ఉక్కుపాదం మోపింది. భూమి లేని స్థానికులకు, తేయాకు కారి్మక కుటుంబాలకు భూ పట్టాలిచి్చంది. వీటికితోడు మహిళలు, విద్యార్థులు, యువత కోసం రూ.5,000 కోట్లతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఎన్డీఏ భాగస్వాములైన అస్సాం గణ పరిషద్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్), రభా హసోంగ్ జతా మంచ్ వంటివాటితో బీజేపీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా సజావుగా సాగిపోయింది. ఏజీపీకి 26, బీపీఎఫ్కు 11 స్థానాలు కేటాయించింది. మోదీ కరిష్మాకు సీఎం హిమత జనాదరణ కూడా తోడవనుంది. ఇక కాంగ్రెస్ మరోసారి వామపక్షాలు, రాయ్జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషద్ వంటి పార్టీలతో జట్టు కట్టింది. కానీ నేతల వలసలు కాంగ్రెస్ను కుంగదీస్తున్నాయి. పీసీసీ మాజీ చీఫ్ భూపేన్ బోరా, మాజీ ఎంపీ ప్రద్యోత్ బోర్డోలోయ్ ఇటీవల పార్టీని వీడారు. దీనికి తోడు పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఏకంగా పాకిస్తానీ ఏజెంట్ అంటూ సీఎం హిమంత చేస్తున్న ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. హిందూ నేతలకు కూడా కాంగ్రెస్లో కనీస గౌరవం లేదంటూ ర్యాలీల్లో ఆయన పదేపదే చేస్తున్న విమర్శలకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది. వీటికి తోడు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కూడా కాంగ్రెస్ను బాగానే దెబ్బ తీసింది. ఆ పార్టీ సులువుగా గెలవగలిగిన ముస్లిం ప్రాబల్య స్థానాల సంఖ్యకు గండి పడింది. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ టికెట్ అడిగా: ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని రేప్, హత్య ఘటనలో బాధితురాలి తల్లికి ఈసారి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పనిహాతీ నియోజకవర్గం నుంచి ఈమెను బరిలో దింపాలని విపక్ష బీజేపీ గతంలో నిర్ణయించుకున్నా అందుకు అప్పట్లో ఈమె తన సమ్మతి తెలపలేదు. తాజాగా రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హత్యాచార ఘటనలో మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నా కూతురు విషయంలో న్యాయపోరాటంలో భాగంగా బరిలోకి దిగుతా. పనిహాతీ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులను వ్యక్తిగతంగా అడిగాను. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నాకు అవకాశం కల్పిస్తే బెంగాల్లో తణమూల్ ప్రభుత్వాన్ని ఓడించి మహిళలకు భద్రత కల్పించడానికి ప్రయత్నిస్తాను’’ అని ఆమె అన్నారు. కాగా, బీజేపీ తాజాగా విడుదల చేసిన బీజేపీ రెండో జాబితా లోనూ ఆమె పేరు లేదు.కచ్చితంగా టికెట్ వస్తుందిబాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తన భార్య అభ్యర్థిత్వం గురించి బీజేపీ నాయకులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు. తాము లాంఛనంగా పార్టీలో చేరిన తర్వాతే తన భార్యను అభ్యర్థిగా ప్రకటిస్తారని వెల్లడించారు. తమకు కచ్చితంగా పోటీ చేసే అవకాశం బీజేపీ కల్పిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం పోరాడటానికే తన భార్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తోందని చెప్పారు. 112 మందితో బెంగాల్లో బీజేపీ రెండో జాబితా న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ శాసనసభలో పోటీచేసే 112 మంది అభ్యర్థులతో బీజేపీ తమ రెండో జాబితాను గురువారం విడుదలచేసింది. హింగాల్గంజ్లో రేఖా పాత్రాను, సోనార్పూర్ దక్షిణ్లో రూపా గంగూలీని బీజేపీ బరిలోకి దింపుతోంది. ఇతాహర్లో సబితా బర్మన్, నబగ్రామ్లో దిలీప్ సాహా, ఖర్గ్రామ్లో మిథాలీ మాల్, కండీలో గర్గీదాస్ ఘోష్ను పోటీకి నిలబెడుతున్నట్లు బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.భరత్పూర్ నుంచి అనామికా ఘోష్, బొంగావ్ దక్షిణ్ నుంచి స్వపన్ మజూందర్, కమర్హాతిమ్ నుంచి అరూప్ చౌదరీ, సందేశ్ఖాలీ నుంచి సనత్ సర్దార్, మందిర్బజార్ నుంచి మల్లికా పైక్, ఎంటలీ నుంచి ప్రియాంకా తిబేరేవాల్, బాలాగఢ్ నుంచి సుమనా సర్కార్ పోటీకి నిలబడుతున్నారు. చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఎంతో తెలుసా? -
శశికళ వెన్నుపోటు.. ‘నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్’!
తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపించే వెన్నుపోటు రాజకీయాలు ఇప్పుడు తమిళనాట ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ రాజకీయంగా ఒంటరయ్యారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా నిలిచిన ఆర్బీ ఉదయ్కుమార్ ఇప్పుడు అదే శశికళ వ్యూహాలకు బలవుతున్నారా? ఆనాడు అండగా నిలిచిన ఉదయ్ ఓటమికి శశికళ పావులు కదుపుతున్నారా? అందుకే ఆమె తిరుమంగళం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారా? ఇప్పుడు దక్షిణ తమిళనాడులో.. ఇంకా చెప్పాలంటే మదురైలో ఇదే చర్చ జరుగుతోంది.మదురై జిల్లాలోని తిరుమంగళం నియోజకవర్గానికి వీఐపీ అసెంబ్లీ సెగ్మెంట్గా పేరుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. శశికళ ఇప్పుడు ఈ నియోజకవర్గంపై దృష్టిసారించడం ఇందుకు ప్రధాన కారణం. శశికళ శిష్యుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష ఉపనేత అయిన ఆర్బీ ఉదయ్కుమార్ని ఓడించేందుకు శశికళ వ్యూహాలకు పదునుపెడుతున్నారనే చర్చ తిరుమంగళంలో జరుగుతోంది. నిజానికి ఉదయ్కి ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు రెండుసార్లు అప్రతిహతంగా విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు.జయలలిత మరణం తర్వాత.. శశికళకు మద్దతుగా నిలిచిన వారిలో ఉదయ్ ముందంజలో ఉంటాడు. అయితే.. ఆ తర్వాత వీరి మధ్య దూరం ఎందుకు పెరిగింది?? ఈ ప్రశ్నకు తదనంతర పరిణామాలే ప్రధాన కారణమనే సమాధానం వస్తోంది. జయ మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం అయ్యారు. దాంతో.. ఉదయ్ ఆయన వర్గానికి దగ్గరయ్యారు. అయితే.. ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. సొంతపార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారు. అంతేకాదు.. పొత్తుధర్మంలో భాగంగా ఈ సీటును ఎన్డీయేకు ఇవ్వడానికి కూడా పళనిస్వామి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ తనకే టికెట్ దక్కినా.. ఉదయ్ని ఓడించడమే లక్ష్యంగా శశికళ పావులు కదుపుతున్నారు. దీంతో.. ఉదయ్ విజయం అంత సులభమేమీకాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా.. ఇక్కడ దళపతి విజయ్ పార్టీ టీవీకే చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటు పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరాక.. తిరుమంగళంలో కూడా పరిణామాలను అంచనావేసే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.జయలలితకు నెచ్చెలిగా ఉంటూ.. రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న శశికళ.. ఇప్పుడు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు వస్తున్నారు. టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే నుంచి బహిష్కరణకు గురైన సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయన్సర్ జీవా నాచియార్తో సంప్రదింపులు జరుపుతున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న జీవా నాచియార్ ముక్కులత్తోర్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే వర్గానికి చెందిన ఉదయ్కుమార్కు ఇది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా ఉదయ్ వర్గీయులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఉదయ్ మద్దతుదారులను డీఎంకేలో చేర్చుకున్నారు. ఈ పరిణామాలు పళనిస్వామి వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది.ఒకప్పుడు ఉదయ్ మద్దతుదారులుగా ఉన్నవారు ఇప్పుడు పళనిస్వామికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ పరిణామాలను తట్టుకుని ఉదయ్ విజయం సాధించి, హ్యాట్రిక్ను నమోదు చేసుకుంటారా? శశికళ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి, విజయం సాధిస్తుందా? పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా.. వీరి వివాదం మూడో వ్యక్తి విజయానికి బాటలు వేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
జలుక్బరి నుంచి హిమంత బిశ్వ శర్మ పోటీ
న్యూఢిల్లీ: అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం 88 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేరు కూడా ఉంది. జలుక్బరి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. తొలి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు.బుధవారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నాయకుడు ప్రద్యుత్ బోర్డోలోయ్ను దిస్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి తమ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరిన భూపేన్ కుమార్ బోరా, బిహ్పురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీ తముల్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జోర్హాట్ స్థానంలో మాజీ స్పీకర్ హితేంద్ర నాథ్ గోస్వామి, గౌరవ్ గోగోయ్తో తలపడనున్నారు. రాష్ట్ర మంత్రులు పిజూష్ హజారికా, జయంత మల్లా బారుహ్, అశోక్ సింఘాల్, అజంతా నియోగ్, చంద్రమోహన్ పట్వారీ, రూపేష్ గోవాలా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. హఫ్లాంగ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందితా గర్లోసా ఈసారి అక్కడ నుంచి బరిలోకి దిగడం లేదు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సిద్ధార్థ భట్టాచార్యకు ఆయన ప్రస్తుత స్థానమైన గౌహతి తూర్పు నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అమియా కుమార్ భూయాన్ (బిహ్పురియా), అతుల్ బోరా (దిస్పూర్)లకు మొండిచేయి చూపారు. ఈ రెండు స్థానాల నుంచి ఫిరాయింపుదారులు బోరా, బోర్డోలోయ్లకు టికెట్ ఇచ్చారు. కాగా, అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఎంతో తెలుసా? -
కేరళ సీఎం విజయన్ ఆస్తులు కోటిపైనే..
కన్నూర్: కేరళలో శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్థిరచరాస్తులకు సంబంధించిన అఫిడవిట్ను ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించారు. దీని ప్రకారం విజయన్ పేరిట పథిరియాద్ ఆమ్సమ్లో 78 సెంట్ల వ్యవసాయ భూమి, ఒక నివాస స్థలం సహా రూ.45 లక్షల విలువైన చరాస్తులున్నాయి.విజయన్ భార్య పేరిట 80 గ్రాముల బంగారం సహా రూ.60 లక్షలకుపైగా విలువైన చరాస్తులు ఉన్నాయి. ఈమె పేరిట రూ.36 లక్షల విలువైన స్థిరాస్తులున్నాయి. ఈయన 2024–25లో రూ.5.33 లక్షల ఆదాయం సంపాదించారు. భార్య ఇదే కాలంలో రూ.5.77 లక్షల ఆదాయం సంపాదించారు. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.39 మందితో కేరళ బీజేపీ రెండో జాబితా న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. ఆరన్ముళ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ను బరిలోకి దింపింది. ఈ సీనియర్ నాయకుడు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్తో తలపడనున్నారు. 2021లో నేమోం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజశేఖరన్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి వి.శివన్కుట్టి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం నేమో నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.ఇక గురువాయూర్ నుంచి సీనియర్ బీజేపీ నాయకుడు బి. గోపాలకృష్ణన్ పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోటీ చేస్తున్న ధర్మడోం నుంచి బీజేపీ కె.రంజిత్ను కూడా బరిలోకి దింపింది. త్రిస్సూర్లోని ఎస్సీ–రిజర్వ్డ్ నట్టికా నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గీతా గోపికి సీటు నిరాకరించి, ఇటీవల కమ్యూనిస్ట్ పార్టీని వీడిన సీసీ ముకుందన్ను బీజేపీ బరిలోకి దింపింది. 140 స్థానాలకు గాను పార్టీ తన తొలి జాబితాలో 47 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 86కు చేరింది.చదవండి: కేరళ కాంగ్రెస్ పార్టీలో కుంపటి? -
కేరళ కాంగ్రెస్లో ‘కుంపటి’?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల అంతర్గత చర్చల తర్వాత మొత్తం 92 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. చివరగా 37 మంది పేర్లను గురువారం రాత్రి ప్రకటించింది. దీంతో, సీటు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం. నేమోం, కన్నూర్, పెరుంబవూర్ వంటి కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది.అయితే, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా కన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ కే.సుధాకరన్కు టికెట్ ఇవ్వలేదు. ఆయన సూచించిన అభ్యర్థి కూడా తిరస్కరించబడ్డారు. బదులుగా కన్నూర్ మేయర్ మోహనన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఎంపీ సుధాకరన్ స్పందిస్తూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే, స్వతంత్రంగా పోటీ చేయను అని కూడా వెల్లడించారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారని సమాచారం.ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎల్దోస్ కున్నాపిల్లిల్ పెరుంబపూర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎల్దోస్ మాట్లాడుతూ.. పార్టీ కింద స్థాయి కార్యకర్త వరకు నన్ను అభ్యర్థిగా కోరుకుంటున్నారు. మేము మా నియోజకవర్గంలో దాదాపు 9,000 కొత్త ఓటర్లను జమ చేశాం. 15,000 ఇళ్లను సందర్శించాం. కానీ నా కృషిని హైకమాండ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ, పార్టీని వదిలిపెట్టను. ఇది కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, పెరుంబవూర్లో ఎల్డోస్ స్థానంలో మనోజ్ మూథేదన్ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది.మరోవైపు.. నేమోం నియోజకవర్గంలో కాంగ్రెస్ కేఎస్ సబరీనాథన్ను బరిలో నిలిపింది. ఇక్కడి నుంచే కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. ఇక, సీపీఎం నుంచి శివంకుట్ట పోటీ చేస్తున్నారు. నేమోం నియోజకవర్గం గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీని ప్రతిబింబిస్తున్నాయి. 2016లో బీజేపీ నుంచి రాజగోపాల్ మొదటిసారి విజయం సాధించగా, 2021లో సీపీఎం తిరిగి సీటు గెలుచుకుంది. 2021లో సీపీఎం నుంచి శివంకుట్టి విజయం సాధించారు. 2006లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ జాబితాపై పలువురు అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నట్టు కార్యకర్తలు బహరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించి, నేతలు చివరికి విధేయత చూపుతున్నారు. -
దురంధర్గా ఇళయ దళపతి విజయ్?
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందే తడవుగా తమిళనాట రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ముఖ్యంగా వరుసగా రెండోసారి విజయం కోసం డీఎంకే సారథి ఎంకే స్టాలిన్ సిద్ధమవుతుండగా.. ఎన్డీయేతో పొత్తు ఉన్నప్పటికీ అన్నాడీఎంకే తడబడుతోంది. జయలలిత మరణానంతరం ఆ పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేత లేరనే అపవాదును పళనిస్వామి కొంత వరకు దూరం చేస్తున్నా.. పొత్తు ధర్మంలో స్వతంత్ర నిర్ణయాలు పనికి రావనే విషయాలను విస్మరిస్తున్నారు. దీంతో డీఎంకే ఆయనను పది ఓటముల పళనిస్వామి అని హేళన చేస్తుండగా.. అన్నాడీఎంకే నేతలు మాత్రం అధికార పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు తప్పనిసరి. పళనిస్వామి మాత్రం అన్నాడీఎంకే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అన్నాడీఎంకే పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేకి సీట్ల సర్దుబాటు కలిసి వస్తుందా? తలనొప్పిని తెచ్చిపెడుతుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. అదే సమయంలో సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగంతో పొత్తుకోసం బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దక్షిణాదిలో పాగా కోసం తహతహలాడుతున్న బీజేపీ.. విజయ్కి పెద్దపీట వేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. ఆ పరిణామం అన్నాడీఎంకేకు ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దళపతి విజయ్ రాజకీయ దురంధురుడుప్రస్తుతానికి విజయ్ మాత్రం తాను బీజేపీతో కలిసే ప్రసక్తే లేదంటున్నారు. అయితే.. రాజకీయాల్లో చివరి క్షణం వరకు సమీకరణాలు ఎలామారిపోతాయో పసిగట్టడం కష్టమే..! ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్లాలని టీవీకే భావిస్తే.. అన్నాడీఎంకే పొత్తుధర్మంలో భాగంగా పలు స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయాల్సి ఉంటుంది. దాంతో.. పార్టీలో రెబెల్స్ పుట్టుకొచ్చి, మరింత తలనొప్పిని తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు బీజేపీ మాత్రం తమిళనాట పాగా వేయడమే పరమావధిగా భావిస్తూ.. దళపతి విజయ్ని తమిళ రాజకీయ దురంధరుడిగా భావిస్తోంది. అంటే.. పొత్తు కుదిరితే.. ఎన్డీయే ఘనవిజయం సాధిస్తే.. కింగ్ మేకర్ విజయ్ అవుతారన్నమాట..!సామ, దాన, బేధ, దండోపాయాలతో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తే.. రాజనీతిని ప్రయోగిస్తుంది. రాజనీతిలో అత్యంత కీలకమైన నియమం.. సామ, దాన, బేధ, దండోపాయాలను అందిపుచ్చుకుంటుందని సమాచారం. నామినేషన్ల తేదీ సమీపిస్తున్నా.. అన్నాడీఎంకే తన అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పుడు తమిళనాట విజయం అనేది అన్నాడీఎంకేకు సీట్ల కేటాయింపు సమస్యే కాదు.. ఒకవేళ మళ్లీ ఓటమిపాలైతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు.ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్?ఒకవేళ ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్ చేరితే.. అన్నా డీఎంకే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు తమిళ తంబీలను వేధిస్తోంది. అటు డీఎంకే కూడా ఈ పరిణామాలను అత్యంత సమీపం నుంచి పరిశీలిస్తోంది. అయితే.. అన్నాడీఎంకే వర్గాల మేరకు.. ఆ పార్టీ కచ్చితంగా తమకు 130 సీట్లు కావాలనే డిమాండ్ను బీజేపీ ముందు పెడుతుంది. పట్టణ, నగర ప్రాంతాల్లో బీజేపీ కొద్దోగొప్పో పుంజుకుంటోంది. టీవీకే విజయ్కి కూడా అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. అందుకే.. పళనిస్వామి తనకు పట్టున్న ప్రాంతాలను కోరే అవకాశాలున్నాయి.అగమ్య గోచరంగా అన్నాడీఎంకే అవి.. అన్నాడీఎంకేకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న కొంగు ప్రాంతం. అంటే పశ్చిమ తమిళనాడులోని నియోజకవర్గాలు. అదేవిధంగా దక్షిణ జిల్లాల్లోనూ అన్నాడీఎంకేకు మంచి పట్టున్నప్పటికీ.. మదురై, ఈరోడ్, దిండిగల్, థేని వంటి ప్రాంతాల్లో టీవీకేకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆ ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు పరిమిత సీట్లే దక్కే అవకాశాలున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ అన్నాడీఎంకేకు కంచుకోటల్లాంటివి. ఇప్పటికీ అక్కడ సంప్రదాయ ఓటర్లున్నా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ స్థానాలను కోల్పోతే.. పార్టీ ఆదరణ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు.మొత్తానికి ఇప్పుడు టీవీకే తమిళనాడులో అన్నాడీఎంకే పాలిట శరాఘాతంగా మారుతోంది. టీకప్పులో తుఫానును పుట్టిస్తోంది. పొత్తు ఉన్నా.. లేకున్నా.. అన్నాడీఎంకే పట్టున్న ప్రాంతాల్లో పాగావేసి, పెను విధ్వంసం సృష్టించేలా ఎదిగే ప్రమాదముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
ముక్కోణపు పోరు
ఇటు కాంగ్రెస్ తదితర పార్టీలతో కూడిన అధికార డీఎంకే కూటమి. అటు బీజేపీ–అన్నాడీఎంకేల విపక్ష కూటమి. మరోవైపు కొత్తగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే. దాంతో తమిళనాడులో ఈసారి అత్యంత ఆసక్తికరమైన ముక్కోణపు పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వ పటిమకు ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. దశాబ్దాలుగా తనకు ఏ మాత్రమూ కొరుకుడు పడని తమిళ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా పాతాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ప్రజల్లో, ముఖ్యంగా యువత, మహిళల విశేషమైన ఆదరణ కచి్చతంగా ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందని విజయ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నా కూటమిని, విజయ్ పార్టీని స్టాలిన్ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. మరోసారి అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా బరిలో దిగుతున్న సీమన్ సారథ్యంలోని ఎన్టీకే ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తుందన్నది కూడా కీలకంగా మారనుంది...డీఎంకే కూటమికి... మోదమో, ఖేదమో! తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగనుంది. అన్నాడీఎంకే కూటమితో పాటు కొత్త పార్టీ టీవీకే నుంచి గట్టి పోటీ తప్పదని తేలిపోవడంతో అధికార డీఎంకే సర్వశక్తులూ ఒడ్డుతోంది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ) పేరిట కాంగ్రెస్, వామపక్షాలతో పాటు దాదాపు 20 పార్టీలతో మరోసారి జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగుతోంది! కాంగ్రెస్, ఎండీఎంకేతో పాటు విజయ్కాంత్ స్థాపించిన డీఎంఎంకేలతో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఎప్పట్లా ద్రవిడ నినాదంతో పాటు ప్రధానంగా సంక్షేమ పథకాలనే స్టాలిన్ పార్టీ నమ్ముకుంటోంది. విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం తదితర పథకాలే తమను ఒడ్డున పడేస్తాయని భావిస్తోంది. దీనికి తోడు తమిళ అస్తిత్వం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో తలపడుతున్న యోధునిగా స్టాలిన్కు ఉన్న ఇమేజీ కూడా కలిసొస్తుందని ఆశిస్తోంది. ముస్లింలు, మైనారిటీల ఓట్లపైనా ఆశలు పెట్టుకుంది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత, మంత్రుల విచ్చలవిడి అవినీతి, రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న నేరాలు, డ్రగ్స్ వంటివి డీఎంకేకు పెద్ద తలనొప్పిగా మారాయి. కుటుంబ రాజకీయాల ముద్ర కూడా ప్రతికూలంగా మారుతుందేమోనన్న భయం డీఎంకేను వెంటాడుతోంది. దీనికి తోడు సీమన్ పార్టీ నామ్ తమిళార్ కట్చి (ఎన్టీకే) కూడా స్టాలిన్ పార్టీకి తలనొప్పిగా మారేలా ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీకే సీట్లేమీ గెలుచుకోకపోయినా 6 శాతం ఓట్లు సాధించింది. దాని ఓటు షేరు ఈసారి 10 నుంచి 15 శాతానికి పెరగవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి! ఎన్టీకే ప్రధానంగా డీఎంకే ఓటు బ్యాంకుకే గండి కొట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ అంచనాలే గనక నిజమైతే ముక్కోణపు పోరులో కోలుకోలేని నష్టం తప్పదేమోనని డీఎంకే కలవరపడుతోంది.డీఎంకే కూటమి సానుకూలతలు → భాగస్వాములతో సజావుగా సాగిన పొత్తుల ఖరారు → డీఎంకేకు బూత్ స్థాయి దాకా పటిష్టమైన నిర్మాణం → సంక్షేమ పథకాలు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు మొదలుకుని గిగ్ వర్కర్ల దాకా నగదు బదిలీ పథకాలు → డీఎంకే వ్యతిరేక ఓట్లను టీవీకే చీల్చనుందన్న సంకేతాలు → మైనారిటీల మద్దతు ప్రతికూలతలు → మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు → రాష్ట్రంలో బాగా పెరిగిన నేరాలు → తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతఅన్నాడీఎంకే... కష్టాలకు ఎదురీత!జయలలిత మరణానంతరం పదేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా గెలుపు ముఖం చూడని అన్నాడీఎంకే ఈసారి కూడా కష్టాలకు ఎదురీదుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మాజీ సీఎం ఒ.పన్నీర్సెల్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి డీఎంకే, టీవీకే గూటికి చేరారు. దీనికి తోడు నాయకత్వ లేమి పార్టీని తీవ్రంగా బాధిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలంగానే ఉండటం అన్నాడీఎంకేకు అతి పెద్ద సానుకూలత. దానికి బీజేపీ బలం కూడా తోడవుతోంది. కన్యాకుమారి తదితర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పశి్చమ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా కాషాయ పార్టీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. తన క్షేత్రస్థాయి బలానికి బీజేపీ ఆర్థిక వెన్నుదన్ను తోడై మెరుగైన ఫలితాలు సాధిస్తానని అన్నాడీఎంకే నమ్ముతోంది. అయితే విజయ్ పార్టీని కూటమిలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి రుచించడం లేదు. ఇది అంతిమంగా వాటి మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే ఆస్కారం లేకపోలేదు. పైగా బీజేపీ హిందూత్వ ఎజెండా తమిళనాడులో పెద్దగా ఫలించకపోవచ్చని గత అనుభవాలు చాటుతున్నాయి.అంతేగాక బీజేపీకి ఉన్న మైనారిటీ వ్యతిరేక ముద్ర అంతిమంగా కూటమికి చేటు చేయవచ్చన్న అంచనాలూ లేకపోలేదు. పైగా జయలలిత నెచ్చెలి శశికళ పెట్టిన కొత్త పార్టీ కూడా అన్నాడీఎంకే ఓట్లకు ఎంతోకొంత గండి కొట్టవచ్చంటున్నారు. ఇన్ని సవాళ్ల నేపథ్యంలో పార్టీ పునాదులను పదిలంగా కాపాడుకోవడమే ఎడప్పాడి కె.పళనిస్వా మికి పరీక్షగా నిలవనుంది. అయితే కావేరీ డెల్టాలో రైతుల దుస్థితి తదితర సమస్యలపై గళమెత్తడం ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఆయన గట్టిగానే చెమటోడుస్తున్నారు.అన్నాడీఎంకే–బీజేపీ కూటమి సానుకూలతలు → బీజేపీ రూపంలో అపారమైన అర్థ, అంగ బలాలు → అన్నాడీఎంకేకు క్షేత్రస్థాయి దాకా ఉన్న పట్టు → జయలలిత పట్ల ప్రజల్లో చెక్కుచెదరని ఆదరణ ప్రతికూలతలు → నాయకత్వ లేమి → శశికళ సొంత పార్టీతో ఓట్లు చీలే ఆస్కారం → ముఖ్య నేతల వలసలు → బీజేపీపై హిందూత్వ, తమిళ వ్యతిరేక ముద్రవిజయ్ పార్టీ... ఆశల పల్లకీలో! సినీ నటుడు విజయ్ తమిళ రాజకీయాల్లో ఎక్స్ ఫ్యాక్టర్గా దూసుకొచ్చారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు ఆందోళన కలిగించింది. వాటికి మూడో ప్రత్యామ్నాయంగా కనిపించింది. విజయ్ రోడ్ షోలు, సభలకు జనం విరగబడ్డారు. కానీ వీఎంకే జోరుకు కొన్నాళ్లుగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. గత సెప్టెంబర్లో కరూర్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఉదంతం విజయ్కి బాగా మైనస్గా మారింది. ఏకంగా 41 మంది కార్యకర్తలు దుర్మరణం పాలైతే వేదిక నుంచి హడావుడిగా నిష్క్రమించారన్న ప్రచారం చేటు చేసింది. కనీసం ఆ తర్వాతైనా చనిపోయిన వారి కుటుంబాలను కలిసేందుకు అయిష్టత వెలిబుచ్చడం విజయ్ ఇమేజీని మసకబార్చింది. తొక్కిసలాటపై ఆయన పలుమార్లు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వచి్చంది. బీజేపీతో పొత్తు దిశగా ఒత్తిడి పెంచేందుకు దీన్ని మోదీ సర్కారు వాడుకుంటోందన్న ప్రచారాన్ని విజయ్ గట్టిగా ఖండించకపోవడం టీవీకేకు మరింత చేటు చేస్తోంది. దీనికి తోడు ఎన్నికలు సమీపించిన తరుణంలో విజయ్తో విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టుకెక్కడం మరో మైనస్గా మారింది. సినీ నటి త్రిషతో ఆయన బంధమే ఇందుకు కారణమన్న ప్రచారం మహిళల్లో ప్రతికూలంగా మారేలా కనిపిస్తోంది. పైపెచ్చు డీఎంకే, అన్నాడీఎంకేలతో పోలిస్తే టీవీకేకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన వ్యవస్థాగత నిర్మాణం లేకపోవడం పెద్ద లోటే. ఇప్పటికైతే ఒంటరి పోరుకే విజయ్ పార్టీ మొగ్గుతోంది. అదే జరిగితే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో దేని ఓట్లకు టీవీకే గండికొడుతుందన్నది అంతిమ ఫలితాల్లో నిర్ణాయకంగా మారేలా కనిపిస్తోంది.టీవీకే సానుకూలతలు → విజయ్ కరిష్మా. యువత, మహిళల్లో భారీ ఫాలోయింగ్ → కొత్త పార్టీ కావడంతో క్లీన్ ఇమేజీ → మూడో ప్రత్యామ్నాయంగా తటస్థ ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ప్రతికూలతలు → బలహీనమైన వ్యవస్థాగత నిర్మాణం → ఆదరణను ఓట్లుగా మలిచే యంత్రాంగం లేకపోవడం → నాయకుల లేమి, అనుభవ రాహిత్యం → విజయ్ విడాకుల కేసు, ఆయనపై సీబీఐ విచారణ -
కేరళ సీఎం రేసులో లేను
న్యూఢిల్లీ: కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలయ్యింది. పార్టీలు గెలుపు వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్), సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) మధ్య ప్రధాన పోటీ సాగుతోంది. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని ఆయన తేలి్చచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు సీఎంగా ఎన్నికయ్యే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన నాయకుడే సీఎంగా బాధ్యతలు చేపడితే బాగుంటుందని సూచించారు. శశి థరూర్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడం లేదు కాబట్టి ఏదో ఒక నియోజకవర్గంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండాపోయిందన్నారు. కేరళ ఎన్నికల్లో తన పాత్ర మిక్స్డ్ బ్యాగ్ లాంటిదని చెప్పారు. రాష్ట్రమంతటా తిరుగుతూ తమ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని సంకేతాలిచ్చారు. యూడీఎఫ్ విజయమే లక్ష్యంగా పని చేస్తానని ఉద్ఘాటించారు. ఎల్డీఎఫ్పై గూగ్లీలు విసురుతున్నాం రాష్ట్రంలో కూటమి నేతలంతా కలిసికట్టుగా పని చేయాలంటూ తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ఆదేశించారని శశి థరూర్ వివరించారు. క్షేత్రస్థాయిలో రాహుల్ ఆదేశాలను పాటిస్తున్నామని, సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలుండగా, ఎన్నికల్లో యూడీఎఫ్కు 85 నుంచి 100 స్థానాలు లభిస్తే చాలా సంతోషిస్తానని థరూర్ వ్యాఖ్యానించారు. తమకు స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎల్డీఎఫ్పై గూగ్లీలు విసురుతున్నామంటూ క్రికెట్ పరిభాషలో చెప్పారు. వామపక్ష కూటమిని కచ్చితంగా ఇంటికి పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల కంటే ముందు ప్రకటించే విధానాన్ని వ్యక్తిగతం తాను సమర్థిస్తానని చెప్పారు. కేరళలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకుండానే గెలిచే సత్తా కాంగ్రెస్కు ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ పేరు, అజెండా, లోగోతోనే గెలుస్తామని అన్నారు. సీఎం అభ్యరి్థని ప్రకటించకపోయినా విజయావకాశాలపై ఎలాటి ప్రభావం ఉండదని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ అధిష్టానం ఎమ్మెల్యేలతో మాట్లాడి సీఎం అభ్యరి్థని ఎంపిక చేస్తుందన్నారు. అస్సాంలో ఆ నిర్ణయమే కరెక్టు దేశంలో ఎన్నికల పరిణామ క్రమాన్ని చాలా ఏళ్లుగా దగ్గరగా గమనిస్తున్నానని థరూర్ తెలిపారు. మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ రాజకీయా పార్టీలు అధ్యక్ష తరహా విధానాన్ని పాటిస్తున్నాయని చెప్పారు. ఎన్నికలు కూడా అదే తరహాలో జరుగుతున్నాయని పేర్నొన్నారు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి పదవుల కోసం పార్టీలు తమ అభ్యర్థులను ముందే ప్రకటించి ఎన్నికలకు వెళ్తున్నాయని గుర్తుచేశారు. కేరళలో యూడీఎఫ్కు సీఎం అభ్యర్థి లేకపోవడం అందరికీ వింతగా కనిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు.ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కాంగ్రెస్కు ఓటర్లు ఉన్నారని చెప్పారు. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. అయితే, ఇదే సూత్రం అన్నిచోట్లా పని చేయదని అభిప్రాయపడ్డారు. అస్సాంలో గౌరవ్ గొగోయ్ని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ అలాంటి నిర్ణయమే సముచితమని స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ సీఎం అభ్యర్థులను ముందే ప్రకటించాల్సిన అవసరం రావొచ్చన్నారు. కేరళలో పదేళ్ల ఎల్డీఎఫ్ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని శశి థరూర్ చెప్పారు. ఈసారి మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్కు పట్టం గట్టడం తథ్యమని పేర్కొన్నారు. ఆర్భాటాలు సహాయపడవుఇరాన్ యుద్ధంపై ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతుకాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన పార్టీతో విభేదించారు. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంపై మోదీ ప్రభుత్వ వైఖరిని సమరి్థంచారు. ప్రభుత్వ మౌనం బాధ్యతాయుతమైన రాజనీతిజ్ఞతని అభివర్ణించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ సంఘర్షణను సమర్థించలేమని, సార్వ¿ౌమాధికారం, అహింస వంటి భారతదేశం ఎప్పటినుంచో పాటిస్తున్న సూత్రాలను ఇది ఉల్లంఘిస్తోందని థరూర్ అంగీకరించారు. అయినప్పటికీ, ప్రభుత్వ సంయమనం వ్యూహాత్మక తెలివిని ప్రతిబింబిస్తుందన్నారు. ‘ఈ సందర్భంలో మౌనం పిరికితనం కాదు. ఇది మన జాతీయ ప్రయోజనాలకు, ఈ ప్రాంత వాస్తవాలకు మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని గంభీరంగా గుర్తించడమే’నని వ్యాఖ్యానించారు. ఖమేనీ హత్యపై ఆలస్యంగా సంతాపం తెలిపి దేశం తన స్పందనలో తడబడిందని థరూర్ పేర్కొన్నారు. అయితే, మౌనాన్ని ఎంచుకున్నందుకు ప్రభుత్వాన్ని తప్పుపట్టకూడదని ఆయన వాదించారు. విదేశాంగ విధానం ఒక విద్యా సదస్సు కాదని, పరిణామాలను పట్టించుకోకుండా ఖండించాలని పట్టుబట్టడం సరికాదని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో నెహ్రూ, గాంధీ సూత్రాలను స్వీకరించి, అమలు చేయాలని థరూర్ వాదించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యాతో భారతదేశానికి ఉన్న సంబంధాలను ఆయన ప్రస్తావించారు. అదే తర్కం ఈ రోజు కూడా వర్తిస్తుందని, ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి, ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడికి కూడా ఇది వర్తిస్తుందని ఆయన జోడించారు. చంచల స్వభావి అయిన ట్రంప్ నాయకత్వంలో వ్యతిరేకత ఎదురైతే విరుచుకుపడే స్వభావం ఉన్న అమెరికా, మనదేశానికి నమ్మకమైన మిత్రదేశం కాదని హెచ్చరించారు. రక్షణ సంబంధాలు, సాంకేతిక భాగస్వామ్యాలు, చైనాకు ప్రతిఘటనగా నిలవడానికి భారత్కు అమెరికాతో స్థిరమైన సంబంధాలు అవసరమని ఆయన నొక్కిచెప్పారు. అన్ని పక్షాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సంయమనం పాటించడంతో దేశం తన ప్రయోజనాలను కాపాడుకోగలదని ఆయన వాదించారు. ఆయన వైఖరి తన పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉంది. కీలకమైన అంశాలపై థరూర్ ప్రభుత్వంతో ఏకీభవించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రధాని మోదీ ఉగ్రవాద వ్యతిరేక అజెండానూ ప్రశంసించారు. ఆయన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించడంతో పాటు, పార్టీ అధినేతలతో ఆయన సంబంధాలనూ మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. -
భార్య సంగీతతో మరో చిక్కు..? విజయ్కు షాక్ తగలనుందా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ దాఖలు చేయబోయే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే పట్టుదలతో విజయ్ ఉండగా.. అయితే, ఆయన అసలు ఎన్నికల్లో నిలబడగలరా? అంటూ డీఎంకేలోని న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో అప్రమత్తమైన విజయ్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేంత తీవ్ర వ్యవహారంగా మారిందిఎన్నికల కేసుల్లో అనుభవం ఉన్న కొందరు డీఎంకే న్యాయవాదులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. "భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి తన ఆస్తుల వివరాలను దాచకూడదు. సమగ్రమైన అఫిడవిట్ను సమర్పించడం తప్పనిసరి. ఆ అఫిడవిట్లో అభ్యర్థి తన పేరుతో ఉన్న చరాస్తులు, స్థిరాస్తులే కాకుండా.. భార్య, కుమారులు, కుమార్తెల పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాల నిల్వలు, ఆదాయపు పన్ను వివరాలన్నింటినీ సమర్పించాలి.ఇందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. ఈ అఫిడవిట్ను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచుతారు. ఎవరైనా ఇందులో తప్పుడు సమాచారం, ఆస్తులను దాచడం వంటివి గుర్తిస్తే.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. అయితే, ప్రస్తుతం.. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం విజయ్ నామినేషన్ దాఖలు చేయడంలో అడ్డంకిగా మారవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆమె పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయి? బ్యాంకు నిల్వలు ఎంత? ఏవైనా అప్పులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు విజయ్ దగ్గర స్పష్టమైన సమాధానాలు ఉన్నాయా? అనే సందేహాలు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.విజయ్, ఆయన భార్య గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ కాలంలో ఆమె తన పేరు మీద, పిల్లల పేరు మీద గానీ ఏవైనా ఆస్తులు కొన్నారా? అప్పులు చేశారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా? వంటి వివరాలు విజయ్కు తెలిసే అవకాశం లేదు. తన భార్యతో సంప్రదిస్తేనే విజయ్ తన నామినేషన్లో సరైన వివరాలను పొందుపరచగలరు. కానీ, ప్రస్తుతం వారద్దరూ మాట్లాడుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది.అందుకే విజయ్ నామినేషన్ చట్టపరమైన చిక్కులు కలగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ నామినేషన్ దాఖలును మా సీనియర్ లాయర్లు నిశితంగా గమనిస్తారు, దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి’’ అని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దీనిపై విజయ్కు చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?. భార్యతో విడిగా ఉంటున్నందున కొత్తగా కొన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేనని చెప్పడానికి చట్టపరమైన వెసులుబాటు ఉందా? అని దానిపై విజయ్ సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
అభ్యర్థులుగా నటీమణులు.. ఓటర్ లిస్టులో పేర్లు మాత్రం..
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎర్నాకుళం జిల్లాలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఎన్డీఏలోని ‘ట్వంటీ20’ అనే పార్టీకి ట్విస్ట్ ఎదురైంది. ట్వంటీ20 పార్టీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. దీంతో వారు పోటీకి అనర్హులు.పెరుంబవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ‘ట్వంటీ20’ అభ్యర్థిగా నటి లక్ష్మీ ప్రియ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో తాజాగా నిర్వహించాలనుకున్న రోడ్షోను చివరి నిమిషంలో రద్దు చేశారు. మొదట రోడ్ షో రద్దు లక్ష్మీ ప్రియకు ఆరోగ్య సమస్యలే కారణమని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని అన్నారు. లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు రావడంతో దీనిపై ‘ట్వంటీ20’ పార్టీ సీనియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం నిజమైతే పెరుంబవూర్లో మరో అభ్యర్థిని నిలబెట్టాల్సి రావచ్చని తెలిపారు. ఇవాళ లక్ష్మీ ప్రియ స్థానంలో జీబీ వర్గీస్ పతిక్కల్ను ట్వంటీ20 పార్టీ పెరుంబవూర్ అభ్యర్థిగా ప్రకటించింది.లక్ష్మీప్రియ ప్రస్తుత నివాసం త్రిపుణితుర సమీపంలోని కారింగచిరలో ఉంది. ఆమె పేరు ఓటర్ల జాబితాలో నిజంగానే లేదని తెలిసింది. ఆమె గతంలో నివసించిన త్రిక్కాకరలో కూడా ఓటరు జాబితాలో ఆమె పేరు లేదు. దీనిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.లక్ష్మీ ప్రియ వివాదం మరవకముందే..లక్ష్మీ ప్రియ ఘటనను మరవకముందే అదే ట్వంటీ20 పార్టీలో అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఎట్టుమనూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నటి వీణా నాయర్ను ప్రకటించారు. అయితే, ఆమె పేరు కూడా ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని బయటపడింది. ఆమె స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీణా నాయర్ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తాను పోటీ చేయడం లేదని వీణా నాయర్ తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇద్దరు సినీ నటీమణులను అభ్యర్థులుగా ప్రకటించడం ఎన్డీఏకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, త్రిపుణితుర నియోజకవర్గంలో నటి అంజలిని ట్వంటీ20 పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అక్కడ ఆమె ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. -
ఎన్నికల వేళ విజయ్ ‘టీవీకే’కి మరో షాక్
చెన్నై: సినీనటుడు, టీవీకే అధినేత విజయ్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు ఎన్నికల వేళ కూడా ఆయనకు పలువురి రూపంలో షాక్ తగులుతోంది. మొదట కరూర్ తొక్కిసలాట, ఆ తర్వాత భార్యతో విడాకులు, హీరోయిన్ త్రిష ఇష్యూ. ఇప్పుడు నటి రంజనా నాచియార్ కూడా టీవీకే పార్టీకి గుడ్బై చెప్పారు. అంతేగాక, ఆ పార్టీపై రంజనా తీవ్ర ఆరోపణలు చేశారు. “విజయ్ పార్టీలో మహిళలకు ఎల్లప్పుడూ అవమానం జరుగుతూనే ఉంటుంది” అని తెలిపారు. ఇవాళ రంజనా నాచియార్ టీవీకే నుంచి డీఎంకేలో చేరారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆమె డీఎంకే కండువా కప్పుకున్నారు. “టీవీకే అగ్ర నాయకులను ఎవరూ కలవలేకపోతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల బాధను పట్టించుకోరు. పార్టీలో మహిళలకు నిరంతరం అవమానం జరుగుతోంది’’ అని రంజనా అన్నారు. డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఆమె గతంలో బీజేపీలో సుమారు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో ఆ పార్టీని ఆమె వీడారు. ఆ తర్వాత టీవీకేలో చేరారు. ఇప్పుడు టీవీకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.మరోవైపు, నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “డీఎంకే కమల్ హాసన్ పార్టీని, చిన్న మిత్ర పార్టీలన్నింటిని మింగేసింది... అవన్నీ తమ గుర్తులను వదిలి డీఎంకే గుర్తుపై పోటీ చేస్తున్నాయి. ఇటువంటివి బీజేపీలో జరగవు...” అని అన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనెల 23న జరగనున్నాయి. -
ఎన్నికలకు ముందే రక్తపాతం: టీఎంసీ నేత చేతులు నరికి..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందే రాష్ట్రంలో రాజకీయ హింస పడగ విప్పింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బూత్ ప్రెసిడెంట్ను గుర్తుతెలియని దుండగులు అత్యంత క్రూరంగా హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో బెంగాల్లో మరోసారి ఎన్నికల ముందే 'రక్తపాతం' మొదలైందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.హరోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝుజుర్గాచా గ్రామంలో గురువారం ఉదయం టీఎంసీ నేత మొషీయుర్ కాజీ (38) మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. దేగంగాలోని చపాతల పంచాయతీ పరిధిలో గల గంగ్నియా నివాసి అయిన కాజీ బూత్ నంబర్ 178కి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దుండగులు కాజీ రెండు చేతులను నరికివేసి, శరీరంపై కత్తులతో విచక్షణారహితంగా గాయపరిచారు. మృతుడిని గుర్తించకుండా ఉండేందుకు ముఖంపై యాసిడ్ పోసినట్లు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు పక్కన దుప్పటిలో చుట్టి ఉన్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో కాజీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన మొబైల్ స్విచ్ఛాఫ్ అయింది. రాత్రంతా గాలించినా అతని ఆచూకీ లభించలేదు. చివరకు గురువారం ఉదయం ఆయన శవమై కనిపించారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందని కాజీ సోదరుడు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రత్యర్థులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని టీఎంసీ వర్గాలు అనుమానిస్తున్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, హరోవా రూరల్ ఆస్పత్రి నుంచి పోస్టుమార్టం కోసం బసిర్హాట్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పాత కక్షలా లేక రాజకీయ విరోధాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఐదు వేల ఏళ్ల ఫ్యాషన్.. అప్పటికీ, ఇప్పటికీ.. -
‘నవ కేరళ సర్వే’ టార్గెట్.. బీజేపీ ప్లాన్ ఫలించిందా?
కేరళలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే, ఎన్నికల వేళ కేరళలోని పినరయి విజయన్ సర్కార్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘నవ కేరళ సర్వే’ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.కేరళలో ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను సేకరించి “నవ కేరళ సర్వే” అనే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కేరళలో దాదాపు 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, సర్వేలో భాగంగా కేవలం 49.42 లక్షలు మాత్రమే సేకరించినట్టు సమాచారం. కాగా, సర్వేల సందర్బంగా ప్రభుత్వ పెద్దల ఆడియో లీక్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. సర్వే అసలు ఉద్దేశ్యం ఎల్డీఎఫ్ను తిరిగి అధికారంలోకి తేవడమే అని బయటపడింది. దీంతో, కేరళ బీజేపీ నేతలు రంగంలోకి దిగి తీవ్ర ఆరోపణలు చేశారు.రాజకీయ ఉద్దేశంతోనే నవ కేరళ సర్వేను చేపట్టినట్టు ఆరోపించారు. అనంతరం, కాషాయ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ నేతల పిటిషన్లపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను వాడటం అన్యాయమని పేర్కొంటూ సర్వేను రద్దు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సర్వేను చేపట్టినట్టు తెలిపింది. అనంతరం, హైకోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది పబ్లిక్ అవుట్రీచ్ & డెవలప్మెంట్ ఫీడ్బ్యాక్ ఇనిషియేటివ్ మాత్రమే, ఎన్నికల ప్రచారం కాదని తెలిపింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. సర్వే కొనసాగించడానికి అనుమతించింది. ఇదే సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అని తెలుసుకోవడంలో తప్పు లేదంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే, ఈ సర్వేలో ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్న నెంబర్ కంటే తక్కువ సంఖ్యలో సర్వే జరగడం, పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకంగా కనిపించడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, సర్వేలో తక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల సర్వే విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి.సర్వే ముఖ్యాంశాలుసర్వే లక్ష్యం: 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించడం.నిజంగా చేరుకున్న ఇళ్లు: 49.42 లక్షలు.సేకరించిన అభిప్రాయాలు: కేవలం 4.5 లక్షలు.ఫోకస్ గ్రూప్ చర్చలు: కుడుంబశ్రీ వంటి సంఘాల ద్వారా 46,000 అభిప్రాయాలు మాత్రమే సేకరించబడ్డాయి.వాలంటీర్లు: 96,200 మంది నమోదు చేసుకున్నా, శిక్షణకు హాజరైన వారు చాలా తక్కువ.ఆర్థిక వ్యయాలుస్టేషనరీ, బ్రోచర్లు, పుస్తకాలు: సర్వే కోసం రూ.8 కోట్లు ఖర్చు చేశారు.85,000 బుక్లెట్లు ముద్రించబడ్డాయి.ఫారమ్లు, ఫీడ్బ్యాక్ ప్యాడ్లు, నోటు బుక్స్ కోసం భారీగా ఖర్చు జరిగింది.ఇక, నవ కేరళ సర్వేలో ప్రజలు ప్రధానంగా ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆరోగ్య సదుపాయాలు, పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్, రహదారులు–నీటి సరఫరా, మహిళా సాధికారత, రైతు సహాయం వంటి అంశాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి.ప్రజలు ఇచ్చిన ప్రత్యేక సూచనలు1. ఉద్యోగాలు & ఉపాధికొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు పెంచాలని సూచించారు.ప్రభుత్వ రంగంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు.2. ఆరోగ్యంగ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కొరతను తీర్చాలని కోరారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, అత్యవసర సేవలు పెంచాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు.3. విద్యపాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు పెంచాలని కోరారు.స్కాలర్షిప్లు మరియు ఆర్థిక సహాయం విస్తరించాలని సూచించారు.గ్రామీణ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు.4. మౌలిక సదుపాయాలురహదారులు, నీటి సరఫరా, గృహ నిర్మాణం, శుద్ధి వ్యవస్థలు మెరుగుపరచాలని సూచించారు.పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు పెంచాలని కోరారు.5. సంక్షేమ పథకాలుకుడుంబశ్రీ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.పింఛన్లు, రైతు సహాయం, గృహ పథకాలు మరింత పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.సామాజిక భద్రతా పథకాలు విస్తరించాలని అభిప్రాయపడ్డారు. -
విజయ్కు సీఎం పదవి, పార్టీకి 50 శాతం సీట్లు ఆఫర్ చేశారు
చెన్నై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50 శాతం అసెంబ్లీ సీట్లను ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్లపాటు పంచుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారని, కానీ తమ అధ్యక్షుడు విజయ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని అర్జున వెల్లడించారు. ‘పదవి కోసం ఢిల్లీ పెద్దల ముందు తలవంచే వ్యక్తి విజయ్ కాదు. వారు మాకు 50 నుంచి 90 సీట్ల వరకు రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అయితే విజయ్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి కాదు, తమిళనాడు ప్రజల నమ్మకం మాత్రమే కావాలని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు. అయితే ఆఫర్ ఇచ్చిన పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని, రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో టీవీకే ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. పొత్తులపై ఇటీవల మీడియాతో మాట్లాడిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పొత్తుల కోసం తమ పార్టీ టీవీకేతో చర్చలు జరపలేదన్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేసిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్పై చేసిన వ్యాఖ్యలకు అధవ్ అర్జున క్షమాపణలు చెప్పారు. -
ఎన్నికల వేళ పొత్తులపై కుండబద్దలు కొట్టిన విజయ్
చెన్నై: పొత్తులపై టీవీకే చీఫ్, సినీనటుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తనను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు.తమిళనాడులోని మహాబలిపురంలో విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మేము ప్రజల టీమ్. కొందరు మమ్మల్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు... కానీ, అది పని చేయలేదు. మేము ఏదో ఒక కూటమిలో చేరతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎప్పుడూ లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెబుతున్నాను. దానిపై రాజీ పడము. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే నమ్మవద్దు. మన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం" అని అన్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.కాగా, దీనిపై ఇప్పటికే టీవీకే నేత ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. అలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. -
పొత్తుల కుమ్ములాట.. అభ్యర్థుల వేట!
బంగాళాఖాతం తీరంలో ఉన్న పుదుచ్చేరిలో రాజకీయ వేడి పారాకాష్టకు చేరింది. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్కు గడువు సమీపిస్తున్నా ఇక్కడ ప్రధాన కూటముల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమిలో మిత్ర భేదాలు రచ్చకెక్కుతున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైనా అభ్యర్థులెవరో తేల్చుకోలేని అయోమయంలో పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి.ఇండియా కూటమిలో ఇలా..డీఎంకే, కాంగ్రెస్ మధ్య సాగుతున్న అంతర్గత చర్చలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. స్థానిక అభ్యర్థులను పొత్తు విషయం అడిగితే ‘అధిష్టానంతో మాట్లాడి చెబుతాం’ అనే సమాధానాలతోనే ముగిస్తున్నారు. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని, ఈసారి 18 నుంచి 20 సీట్లలో తామే పోటీ చేస్తామని డీఎంకే పట్టుబడుతోంది. సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి మిత్రపక్షాలకు 4 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.కాంగ్రెస్ వాదనతమిళనాడులో డీఎంకే పెద్దన్న పాత్ర పోషించినట్లే పుదుచ్చేరిలో తమకే అగ్రతాంబూలం దక్కాలని కాంగ్రెస్ వాదిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ తన పట్టును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. డీఎంకే దారికి రాకపోతే నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కజగం (టీవీకే) వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తామనే సంకేతాలను పంపడం గమనార్హం.ఎన్డీఏలో స్థానాల కోసం ఘర్షణఅధికార ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం (బీజేపీకి 14, ఏఐఎన్ఆర్సీకి 16) పూర్తయినట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో అసలు చిక్కులు మొదలయ్యాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ ఆధీనంలో ఉన్న స్థానాలను బీజేపీ కోరుతుండటంతో పేచీ మొదలైంది. కొన్నిచోట్ల పొత్తు తేలకముందే ఆశావహులు తమకు కేటాయించని స్థానాల్లో కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇది కూటమిలో అంతర్గత గందరగోళానికి దారితీస్తోంది. రంగస్వామికి ఉన్న పీపుల్స్ సీఎం ఇమేజ్తో పాటు కేంద్రంలోని బీజేపీ బలాన్ని వాడుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఎన్డీఏ భావిస్తోంది.గెలుపు గుర్రాలను మార్చే మార్చే ఇతర శక్తులుపుదుచ్చేరి రాజకీయాల్లో ఈసారి మూడో పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళగ వెట్టి కజగం(టీవీకే) అధినేత, నటుడు విజయ్ పార్టీ బహిరంగ సభలకు యువత భారీగా తరలివస్తుండటం ప్రధాన పార్టీల్లో వణుకు పుట్టిస్తోంది. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఇప్పటికే 28 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోతోంది.సంక్షిప్త విశ్లేషణ.. 2021 ఫలితాలు (మొత్తం 30 సీట్లు)కూటమి/పార్టీ గెలిచిన స్థానాలుఏఐఎన్ఆర్సీ 10బీజేపీ 06 డీఎంకే 06కాంగ్రెస్ 02ఇతరులు/స్వతంత్రులు 06నామినేషన్ల గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరికి చెక్ పెడతారో చూడాలి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


