Free Stay
-
ఫ్రీగా ఓయో రూమ్స్లో బస
భారతదేశ ప్రముఖ ఆతిథ్య బ్రాండ్లలో ఒకటైన ఓయో రూమ్స్ వినియోగదారులకు హోలీ సందర్భంగా ఉచిత ఆఫర్ను ప్రకటించింది. ఇండియా క్రికెట్ టీమ్ ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించండం, తర్వాత హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 13 నుంచి 18 వరకు ఓయో దేశవ్యాప్తంగా 1,000 ప్రీమియం కంపెనీ సర్వీస్ హోటళ్లలో రోజూ 2,000 ఉచిత స్టేలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రితేష్ అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు.వినియోగదారులు ఈ పరిమిత ఓయో ప్రీమియం ఆతిథ్యాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఆస్వాధించవచ్చని రితేష్ తెలిపారు. ఓయో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు కూపన్ కోడ్ ‘CHAMPIONS’ అని ఎంటర్ చేయాలని పేర్కొన్నారు. దాంతో కస్టమర్లు తమ కాంప్లిమెంటరీ స్టేను రెడీమ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఆఫర్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్(ముందుగా బుక్ చేసుకున్న వారికే వర్తించేలా) ప్రాతిపదికన పని చేస్తుందని స్పష్టం చేశారు.Some wins are bigger than just a trophy. India’s ICC Champions Trophy victory isn’t just about cricket—it’s about the unshakable spirit of a billion people, the collective cheers, the nail-biting finishes, and that electrifying moment when the whole country erupts in joy.And… pic.twitter.com/M0m6KAdHds— Ritesh Agarwal (@riteshagar) March 13, 2025ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని అందరూ అస్వాదిస్తున్నారని రితేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హోలీ తోడవడం వినియోగదారులకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ తరుణంలో కంపెనీ కస్టమర్లకు ఉచిత ఆఫర్ ప్రకటించిందని చెప్పారు. ఈ వారాంతంలో మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసేందుకు కంపెనీ తోడైందని తెలిపారు. ప్రయాణాలు చేయడం, ప్రియమైనవారిని కలవడం కంటే సంతోషకరమైన క్షణాలు ఏముంటాయన్నారు. అందుకోసం ఓయో రూమ్స్ ‘టౌన్ హౌస్, కలెక్షన్ ఓ’తో సహా 1000కి పైగా ఓయో కంపెనీ సర్వీస్ హోటళ్లలో మార్చి 13-18 వరకు ప్రతిరోజూ ఉచిత బసలను అందిస్తున్నట్లు చెప్పారు. -
టెకీలకు గుడ్న్యూస్..న్యూజిలాండ్ ఫ్రీ ట్రిప్
వెల్లింగ్టన్: ఐటీ నిపుణులను ఆకర్షించేందుకు న్యూ జిలాండ్ ఓ వినూత్నమైన ఆఫర్ ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టెకీలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా తన టెక్ హబ్కు బూస్ట్ ఇచ్చేలా భలే ప్రచారానికి తెరతీసింది. ప్రపంచంలో ఎక్కడైనా నుండి న్యూజిలాండ్కు ఉచిత ట్రిప్ ఆఫర్ చేస్తోంది. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ వేదికగా ’లుక్ సీ’ అనే కొత్త పథకాన్ని ప్రకటించింది.ఇందులో భాగంగా సుమారు 100మంది టెక్ నిపుణులను ఇంటర్వ్యూలకు పిలుస్తోంది. ఇలావచ్చే వారికి ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. అంతేనా.. అక్కడ సైట్ సీయింగ్ ఆఫర్ను కూడా అందిస్తోంది. 2017, మే 8 -11మధ్య ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. టెక్ ఇన్నోవేషన్ పరిశ్రమకోసం ఎవరైనా కాదు...తమకు మరింతమంది ఉత్తమ నిపుణులు అవసరమని వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెస్టర్ చెప్పారు.అయితే ఈ పథకం ద్వారా ముందుగా టెకీలు రిజస్టర్ చేసుకొని, సీవీని అప్లోడ్ చేయాలని. దీన్ని పరిశీలించిన అనతరం వీడియో ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో పాల్గొన్న ఆయా సంస్థల యజమానులు (ఎంప్లాయిర్) అభ్యర్థుల ప్రొఫైల్ వీక్షించడానికి వీలుగా ఉండాలి. తద్వారా వారు నేరుగా సంప్రదించి ఒక అంచనాకు వస్తారు. ఇలా యజమానులు తమకు నచ్చిన వారిని 'నామినేట్' చేస్తారు. ఇలా ఎక్కువ లైకులు, నామినేషన్లతో 100మందిలో చోటు సంపాదించుకున్నవారు వెల్లింగ్టన్ ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఆహ్వానం గెలుచుకుంటారు. అయితే ఉద్యోగుల నియామకం ఆయా యజమానుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
పైసా ఖర్చు లేకుండా ఆ దేశానికి ప్రయాణం
అమెరికాలో విదేశీయులకు ఆంక్షలు పెరిగిపోతున్న నేపథ్యంలో మిగతా దేశాల్లో నిబంధనలు సరళతరమవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇక న్యూజిలాండ్ కు ఉచితంగా ప్రయాణించవచ్చట. ఉచితంగా విమానంలో ప్రయాణించడం దగ్గర్నుంచి... అక్కడ ఫ్రీగా ఉండటం వరకు న్యూజిలాండ్ ఆఫర్ చేస్తోంది. న్యూజిలాండ్ రాజధాని నగరం వెల్లింగ్టన్ 100 టెక్ వర్కర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. తమ టెక్ హబ్ ను పెంచుకునే నేపథ్యంలో జాబ్ ఇంటర్వ్యూకు వచ్చిన వారికి ఈ ఆఫర్ ను అందించబోతున్నట్టు ప్రకటించింది. లుక్సీ పేరుతో వెల్లింగ్టన్ ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. 2017 మే 8 నుంచి మే 11 వరకు నాలుగు రోజుల పాటు జాబ్ ఇంటర్వ్యూలకు, టెక్ లీడర్లలతో మీట్-అప్స్ కు ఈ అరెంజ్మెంట్స్ చేస్తోంది. తమ టెక్ ఆవిష్కరణలు సదూర ప్రదేశాలకు ప్రయాణించాలని తాము భావిస్తున్నాం.. అందుకు అనుగుణంగా తమకు ఎక్కువమంది ప్రతిభావంతులైన ప్రజలు కావాలని వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెస్టర్ చెప్పారు. వెల్లింగ్టన్ లో ఇంటర్వ్యూకు హాజరుకావాలనుకునే వారు మొదట తమ అభ్యర్థిత్వాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని, తమ సీవీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వీడియో ఇంటర్వ్యూకు అభ్యర్థులను వెల్లింగ్టన్ ఆహ్వానిస్తోంది. అనంతరం ఎంప్లాయిర్స్ అభ్యర్థులను నామినేట్ చేస్తోంది. ఈ విధంగా జరిగిన ప్రక్రియలో అందుబాటులో ఉన్న వంద స్పాట్స్ లో అవకాశం దక్కించుకుని ఈ ఆఫర్ ను పొందవలసి ఉంటుంది. అనంతరం వెల్లింగ్టన్ లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. -
నిజాం రుబాత్లో హజ్ యాత్రికులకు ఉచిత బస: మహమూద్
సాక్షి, హైదరాబాద్: హజ్యాత్ర-2015 సందర్భం గా నిజాం రుబాత్కు ఎంపికైన యాత్రికులకు ఉచిత బసతోపాటు భోజనం, లాండ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. గురువారం హైదరాబాద్లోని హజ్హౌస్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సౌదీ అరేబియాలోని మక్కా మదీనాలో నిజాం రుబాత్ సమస్య పూర్తిగా పరిష్కారమైందన్నారు. రుబాత్లోని రెండు భవనాల్లో యాత్రికులకు బస ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు జిల్లాకొక రెసిడెన్షియల్ స్కూల్, వసతిగృహాలను నెలకొల్పుతోందని తెలి పారు. త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్ను ముగ్గురు జడ్జి ల ప్యానల్తో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.