gajuladinne project
-
అడుగంటిన జీడీపీ
– తలెత్తనున్న తాగునీటి కష్టాలు గోనెగండ్ల: మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్ట్లో నీరు అడుగంటిపోతోంది. దీంతో ప్రాజెక్ట్ కింద ఉన్న మంచినీటి పథకాలకు నీటి పంపింగ్ ఇబ్బందిగా మారింది. ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో ఆశించిన మేర తొలకరి వర్షాలు కురవకపోవడం, హంద్రీనీవా నుంచి నీటి సరఫరా లేకపోవడంతో ప్రాజెక్ట్ డెడ్స్టోరేజీకి చేరిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ద్వారా పత్తికొండ, కృష్ణగిరి, డోన్లలోని మంచినీటి పథకాలకు ప్రతి రోజు 10 క్యూసెక్కుల నీటి పంపింగ్ జరుగుతుంది.అదే విధంగా కర్నూలుకు ఎడమ కాలువ ద్వారా ప్రతి రోజు 50 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. 4.5 టీఎంసీల నీరు నిలువ చేసే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 650 ఏంసీఎఫ్టీ( 0.65 టీఎంసీ)ల మేర పూడిక పేరుకొని పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. కొంత నీరు మిగిలి ఉందని, ఆ నీరు మంచినీటి పథకాలకు 15 రోజులకు మించి సరఫరా చేయలేమని వారు స్పష్టం చేశారు. క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురవకపోతే రెండు వారాల తర్వాత తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. వర్షాలు వస్తేనే నీరు: రవి, జీడీపీ ఏఈ వర్షాలు వస్తేనే ప్రాజెక్ట్లో నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్లో నిల్వ ఉన్న నీరు 15 రోజుల వరకు మంచినీటి పథకాలకు సరఫరాచేయవచ్చు. వర్షాలు ఆలోగా కురవకపోతే నీటి సమస్య తీవ్రమవుతుంది. -
మూడు రోజుల్లో ముప్పు
కర్నూలు నగరవాసులకు బురద నీరే గతి – జీడీపీలో కనిష్ట స్థాయికి నీటి నిల్వలు – ప్రస్తుతం 0.2 టీఎంసీలు మాత్రమే – మరో 3 రోజుల్లో నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం – పొంచి ఉన్న తాగునీటి ఇక్కట్లు కర్నూలు సిటీ/టౌన్: కర్నూలు నగర ప్రజలకు తాగునీటి ముప్పు పొంచి ఉంది. మరో మూడు రోజుల్లో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోనుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. జీడీపీలో నీటి నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇప్పటికే వారం రోజులుగా బురద నీరు సరఫరా అవుతోంది. ఈ నీటిని ఫిల్టర్ చేయలేక అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా ప్రజాప్రతినిధులు మాత్రం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందుచూపు లేకపోవడమే తాజా దుస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. నాయకులకు పనుల్లో వాటాలపై ఉన్న శ్రద్ధ నీటి సమస్య శాశ్వత పరిష్కారంపై లేకపోవడం వల్లే ఏటా తాగునీటి సమస్య జటిలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలలుగా తాగునీటిని అందించిన గాజులదిన్నె ప్రాజెక్టు చరిత్రలోనే అత్యంత దిగువకు నీటి నిల్వలు పడిపోయాయి. ఇప్పటికే నెలన్నర రోజులకు పైగా శివారు కాలనీలకు వారం, పది రోజుల నుంచి నీరందని పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం నగరంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతుండటం గమనార్హం. కనిష్ట స్థాయికి నీటి నిల్వలు హంద్రీనదిపై గోనెగండ్ల మండలం గాజులదిన్నె దగ్గర 4.5 టీఎంసీల సామర్థ్యంతో మధ్యతరహా ప్రాజెక్టు(దామెదరం సంజీవయ్య)ను నిర్మించారు. కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని తాగు, సాగు నీటి నీటిని అందించాలనేది దీని ఉద్దేశం. ఈ ఏడాది సుంకేసుల బ్యారేజీ ఎండిపోవడం వల్ల కర్నూలు నగర వాసులకు తాగు నీటి ఇబ్బందులు రావడంతో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ప్రత్యామ్నాయంగా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో కూడా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రాజెక్టు చర్రితలోనే మొదటి సారి 0.2 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. నగరపాలక సంస్థ పరిధిలోని 51 వార్డుల్లో 5.25 లక్షల జనాభా ఉంది. రోజుకు ఒక కుటుంబానికి 155 లీటర్ల చొప్పున నీరు సరఫరా చేయాలి. అయితే ఆ స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో అధికారులు రోజుకు 135 లీటర్ల చొప్పున మాత్రమే సరఫరా చేస్తున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో ఉన్న నీటి నిల్వల ప్రకారం పది రోజులకు సరిపడా నీరు ఉన్నట్లు అంచనా. అధికారులు మాత్రం 25 రోజులకు సరిపోతుందని చెబుతుండటం గమనార్హం. అయితే అధికారులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికీ చేపట్టకపోవడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తం మీద కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలు తీరాలంటే వరుణుడు కరుణించాల్సి ఉంది. ఇబ్బంది లేదు.. ఇటీవల కురిసిన వర్షాల వల్ల గాజులదిన్నె ప్రాజెక్టులో 50 ఎంసీఎఫ్టీ పరిమాణం పెరిగింది. ఈ నీరు నగరవాసులకు 12 రోజులకు సరిపోతుంది. సమ్మర్స్టోరేజీలో మరో 25 రోజులకు పరిపడా నీరు నిల్వ ఉంది. అందువల్ల తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. – రమణమూర్తి, మున్సిపల్ ఇంజనీర్ -
వైఎస్ జగన్ గాజుల దిన్నెప్రాజెక్ట్ పరిశీలన
-
'గాజులదిన్నె'కు వైఎస్ఆర్ రూ. 52 కోట్లు కేటాయించారు
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ ప్రజల తాగునీటి సమస్యలు తీర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాజుల దిన్నె ప్రాజెక్ట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2008లో గాజులదిన్నె ప్రాజెక్ట్కు వైఎస్ఆర్ రూ. 52 కోట్ల నిధులు కేటాయించిన సంగతి గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ ఈ ప్రాజెక్ట్ను చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పడు ఆయన వచ్చి తానే 10 రోజుల్లో చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. హంద్రీ - నీవా నుంచి కొత్త చెరువుకు నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని ఆయన డోన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఓ వేళ ఇప్పుడు సాధ్యం కాకుంటే వచ్చే మన ప్రభుత్వంలో నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ జగన్ ప్రకటించారు. -
'గాజులదిన్నె'కు వైఎస్ఆర్ రూ. 52 కోట్లు కేటాయించారు
-
మట్టి పోసి.. నిధులు నొక్కేసి!
ఎమ్మిగనూరు, న్యూస్లైన్: వర్షాధారమే అయినప్పటికీ నాలుగు దశాబ్దాలుగా గాజులదిన్నె ప్రాజెక్టు కోడుమూరు, గోనెగండ్ల, వెల్దుర్తి, డోన్, క్రిష్ణగిరి మండలాల్లోని పంట పొలాలను తడుపుతూ.. ప్రజల దాహార్తి తీరుస్తోంది. 5.25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 32,500 ఎకరాలకు రబీలో సాగునీరు ఇవ్వాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. నాలుగేళ్ల క్రితం వరకు కుడి కాలువ కింద 21వేలు, ఎడమ కాలువ కింద 5వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యేది. అయితే ప్రాజెక్టు నుండి బండగట్టు ర క్షిత మంచినీటి పథకం పేరుతో పత్తికొండ నియోజకవర్గంలోని 21 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. అదేవిధంగా డోన్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ప్రజలతో పాటు 40 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు క్రిష్ణగిరి వద్ద మంచినీటి పథకాన్ని నిర్మిస్తున్నారు. ఫలితంగా ఏటా ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతోంది. ఇదే సమయంలో ప్రాజెక్టు పటిష్టతకు చర్యలు చేపట్టకపోతే మనుగడ కష్టమంటూ 1996లో సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్(సీడీఓ), ఇరిగేషన్ ఈఎన్సీ బృందం ఓ నివేదిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు దివంగత ఎమ్మెల్యే శిఖామణి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు 2009లో ఆయన పరిపాలనా అనుమతులివ్వగా.. 2011లో ఆధునికీకరణకు టెండర్లను ఆహ్వానించారు. హైదరాబాద్కు చెందిన హార్విన్ కన్స్ట్రక్షన్ గ్రూపు ఒక శాతం తక్కువతో టెండర్ను రూ.43.9 కోట్లకు దక్కించుకుంది. 2011 ఆగస్టు నుంచి 2013 సెప్టెంబర్ 30వ తేదీ లోపు పనులను పూర్తి చేసేలా అగ్రిమెంట్ ఖరారైంది. జపాన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెన్సీ(జేఐసీఏ) నిధులతో చేపట్టే ఈపనుల పర్యవేక్షణ నీటిపారుదల ఇంజనీర్లుతోపాటు జపాన్ ప్రతినిధుల అజమాయిషీ ఉంది. మంజూరైన నిధులతో ఆనకట్ట(బండ్)పటిష్టత, డ్యామేజైన 6 స్లూయిస్ గేట్ల మరమ్మతు, వరద ఉద్ధృతిని నుంచి ప్రాజెక్టు పరిరక్షణకు రెండు అదనపు స్లూయిస్ గేట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అదేవిధంగా ఎడమ కాలువకు 25 కిలోమీటర్లు, కుడి కాలువకు 36 కిలోమీటర్ల వరకు లైనింగ్, కాలువ గట్ల పటిష్టత పర్చాల్సి ఉంది. మట్టి పనులకే ప్రాధాన్యం: అధికార పార్టీ ప్రధాన ప్రజాప్రతినిధులకు భారీగా గుడ్విల్ ఇచ్చుకోవాల్సి రావడం.. అధికారుల పర్సెంటేజీల నేపథ్యంలో కాంట్రాక్టర్ ప్రధానమైన ప్రాజెక్టు గేట్లు, బండ్ పటిష్టతను పక్కనపెట్టి మట్టి పనులకే ప్రాధాన్యమిచ్చాడు. ఎడమ కాలువకు 17.3 కిలోమీటర్లు, కుడి కాలువకు 26.35 కిలోమీటర్ల మేర లైనింగ్ చేశారు. కాలువ గట్ల పటిష్టతకు గ్రావెల్ ప్రెస్సింగ్ పనులు చేయాల్సిన చోట రైతుల పొలం గట్టున ఉన్న మట్టిపోసి మెరుగులుదిద్దారు. బండ్ డ్యామేజీ ఉన్న చోట రివిట్మెంట్, రెండు కెనాల్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టి పని పూర్తయిందనిపించారు. ఈ పనులకు ఇప్పటికే రూ.38కోట్ల బిల్లు కూడా తీసేసుకున్నాడు. మరో రెండు కోట్ల రూపాయలకు బిల్లులు సిద్ధమయ్యాయి. మిగిలిన ప్రధానమైన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ కుంటి సాకులు చెబుతూ చేతులెత్తేశాడు. చేయాల్సిన పనులకు సరిపడా నిధులు లేవని.. అగ్రిమెంట్ గడువు కూడా ముగిసిందంటూ కాంట్రాక్టర్ తప్పుకోవడం గమనార్హం. అధికారులు సైతం ముందుగా ప్రాజెక్టు పటిష్టత పనులు చేయించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ చేస్తే తప్ప పంట పొలాలకు నీరందదని రైతులు వాపోతున్నారు. ఆధునికీకరణ పనుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఉన్నతాధికారులచే విచారణ చేపట్టాలని గతంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ప్రకాష్రెడ్డి ఇరిగేషన్ ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.