girl attack
-
హారన్ కొడితే తప్పుకోలేదని.. బధిరుడిని కత్తితో పొడిచి చంపిన బాలిక
రాయ్పూర్: పదేపదే హారన్ కొట్టినా తన స్కూటీకి దారివ్వలేదని ఆగ్రహించిన ఓ బాలిక సైకిల్పై వెళ్తున్న బధిరుడిని కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లోని కంకాలిపార ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బాలికను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలిక(15) తన తల్లిని తీసుకుని స్కూటీపై వెళుతోంది. సైకిల్ తొక్కుకుంటూ ముందు వెళ్తున్న సదామా లదేర్(40) అడ్డురావడంతో హారన్ కొట్టింది. బధిరుడైన సుదామ హారన్ వినిపించక పక్కకు తప్పుకోలేదు. హారన్ ఎన్నిసార్లు మోగించినా నిర్లక్ష్యంగా వెళ్తున్నాడనే కోపంతో బాలిక స్కూటీని ఆపి, అతడిపై కేకలు వేసింది. ఆపైన తన వద్ద ఉన్న చాకుతో అతడి మెడపై పొడిచింది. అనంతరం తల్లిని అక్కడే వదిలేసి స్కూటీతో పరారైంది. తీవ్ర రక్తస్రావమైన సుదామ ఆస్పత్రికి వెళ్లేలోగానేతీసుకెళ్తుండగానే చనిపోయాడు. ఇదీ చదవండి: జ్యూస్లో మత్తు మందు కలిపి అత్యాచారం -
Viral Video: ఎవడైతే నాకేంటి?.. ఎగిరెగిరి కొడుతూ ఓవరాక్షన్!
-
సిగ్నల్ దగ్గర యువతి ఓవరాక్షన్.. కుదిపేస్తున్న వీడియో
సోషల్ మీడియా అంటే వైరల్ వీడియోలకు హబ్. ప్రేమ-పగ-దాడి.. అదీ ఇదీ అనే తేడా లేకుండా ఏదైనా హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్లో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రచ్చ వీడియో సోషల్ మీడియాను కుదిపిస్తోంది. #ArrestLucknowGirl హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఓ వ్యక్తిని నడిరొడ్డులో ఓ యువతి చితకబాదడం అందులో ఉంది. నాన్ స్టాప్గా అతన్ని కొడుతుంటే.. ట్రాఫిక్ కానిస్టేబుల్తో సహా అక్కడున్నవాళ్లంతా ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. కారణం అడుగుతుంటే.. ఆ వ్యక్తి ఫోన్ను లాక్కుని మరీ పగలకొట్టింది ఆ యువతి. అంతేకాదు అడ్డొచ్చిన మరో వ్యక్తిని కాలర్ లాగి మరీ బాదేసింది. ఈ టైంలో భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. వెనకాల ఉన్న చాలామంది ‘ఆ అమ్మాయికి బుద్ధుందా?’ అంటూ వెనకాల నుంచి అరవడం వినొచ్చు. అయినా పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఎగరి ఎగిరి మరీ ఆ వ్యక్తిని కొడుతూనే ఉంది. మధ్యలో వచ్చిన వ్యక్తిని ‘నీకేం పనిరా’ అంటూ మరీ బాదింది. ఇక తనను ఢీకొట్టిన కారణంగానే ఈ పని చేసినట్లు ఆ యువతి అందులో మాట్లాడినట్లు ఉంది. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియాను కుదిపిస్తోంది. సరిగ్గా ఏ తేదీన జరిగిన ఘటనో తెలియదుగానీ.. ‘మేఘ్ అప్డేట్స్’ అనే ట్విటర్ పేజీ నుంచి ఈ వీడియో సర్క్యూలేట్ అయ్యింది. ఇక ఈ ఘటనలో ఆ యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలంటూ ట్వీట్లు చేస్తుండగా.. ట్విటర్ టాప్ ట్రెండింగ్లో హ్యాష్ ట్యాగ్ కొనసాగుతోంది. అసలేం జరిగింది అనేదానిపై లక్నో పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.. -
అంగట్లో ఆడపిల్ల: ఏడు నెలల్లో ఏడు సార్లు
భోపాల్: మార్కెట్లో ఓ సరుకు మాదిరి అమ్మాయిల జీవితం అయ్యింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ అమ్మాయిని ఏడు నెలల కాలంలో ఏడుసార్లు అమ్మకానికి పెట్టారు. ఆ ఏడుసార్లు ఒక్కొక్కరు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. చివరకు ఒకతను మానసిక దివ్యాంగుడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అవమానంగా భావించిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దీనికి కారకులైన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఛత్తీస్గఢ్లోని జష్పూర్కు చెందిన ఓ 18 ఏళ్ల యువతి తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉండేది. అయితే ఆమె వ్యవసాయ పనులు చేయడం ఇష్టం లేని ఓ బంధువు ఆమెకు మంచి ఉపాధి చూపిస్తానని చెప్పాడు. అనంతరం మధ్యప్రదేశ్లోని ఛత్తార్పూర్కు తీసుకెళ్లింది. అక్కడ ఆమెను కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు ఆ యువతి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్వులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టి ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఛత్తీస్గఢ్ నుంచి తీసుకెళ్లిన దంపతులే బెదిరింపులకు పాల్పడిన వారు కావడం గమనార్హం. ఆ దంపతులు ఏడు నెలల కిందట రూ. 20 వేలకు ఛత్తార్పూర్కు చెందిన ఓ వ్యక్తికి ఆ అమ్మాయిని విక్రయించారు. అక్కడి నుంచి వేరొకరు.. అటు నుంచి ఇతరులు. ఇలా ఏడు నెలల కాలంలో ఆమెను ఏడు మందికి విక్రయించారు. చివరకు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్కు చెందిన సంతోశ్ కుష్వాహాకు రూ. 70 వేలకు ఆ బాలికను విక్రయించారు. సంతోశ్ తన కుమారుడు బాబ్లూ కుష్వాహా (మానసిక దివ్యాంగుడు)కు ఆ యువతినిచ్చి బలవంతంగా పెళ్లి చేశాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురయి గతేడాది సెప్టెంబర్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 8మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ యువతి విషాద జీవితం గురించి తెలిపారు. -
సెలవు కోసం హత్యచేయబోయింది!
లక్నో: లక్నోలో బ్రైట్లాండ్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న ఓ బాలిక(11) సెలవు దొరుకుతుందని అదే పాఠశాలలో చదువుతున్న రితిక్(6) అనే చిన్నారిపై జనవరి 16న హత్యాయత్నం చేసింది. పాఠశాల వాష్రూమ్లో పదునైన కత్తితో రితిక్ కడుపు, ఛాతీపై పొడిచింది. రక్తపు మడుగులో ఉన్న రితిక్ను పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆధారాలను దాచిపెట్టినందుకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మానస్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాలికను త్వరలో జువనైల్ బోర్డు ముందు హాజరుపరుస్తారు. ‘నీపై దాడిచేసి గాయపరిస్తేనే పాఠశాలకు సెలవు ప్రకటిస్తారు’ అని దాడికి ముందు బాలిక రితిక్తో వ్యాఖ్యానించిందన్నారు. ‘ఓ అక్క నన్ను వాష్రూమ్కు తీసుకెళ్లి వైపర్తో కొట్టి ఆతర్వాత కత్తితో దాడిచేసింది’ అని వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిందితురాలి ఫొటోను చూడగానే తనపై దాడిచేసింది ఆ అమ్మాయేనని రితిక్ తెలిపాడన్నారు. బ్లూవేల్ తరహా ఆటకు బానిసయ్యే ఈ దారుణానికి పాల్పడినట్లు బాలిక తమ విచారణలో అంగీకరించిందని తెలిపారు. గతేడాది ఈ బాలిక రెండు సార్లు ఇంట్లో నుంచి పారిపోయిందనీ, ఓసారి రూ.లక్ష నగదును ఎత్తుకెళ్లిందని వెల్లడించారు. రితిక్ ఆరోగ్యపరిస్థితిని సీఎం యోగి ఆస్పత్రికి వెళ్లి తెల్సుకున్నారు. -
ఆకతాయిని చెప్పు తెగేలా కొట్టి ఈడ్చి తన్నింది
సాక్షి, యానాం : యువతులు ఇప్పుడు ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అల్లరిచిల్లర పనులు చేయాలనుకుంటున్నవారి దుమ్ముదులుపుతున్నారు. మాటలతో బెదిరించడం మాత్రమే కాదు చేయి కూడా చేసుకుంటూ మరోసారి అల్లరి చేయాలనే ఆలోచన అంటేనే భయపడేలా చేస్తున్నారు. యానాంలో అల్లరికి పాల్పడిన ఓ ఆకతాయికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువతులు కలిసి యానాంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఓ పనిమీద వచ్చారు. అదే సమయంలో అక్కడే మద్యం మత్తులో ఉన్న ఓ ఆకతాయి యువకుడు వారిపై చేయి వేసే ప్రయత్నం చేశాడు. అసభ్యంగా తాకబోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి అతడి దుమ్ముదులిపింది. కిందపడేసి ఈడ్చి తన్నింది. గల్లాపట్టి లాక్కెళ్లింది. చెప్పుతీసుకొని వీపు పగులగొట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి స్కూటిపై వెళ్లిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. -
ఆకతాయికి చుక్కలు చూపించిన యువతి
-
రైల్వేస్టేషన్లో చిన్నారిని హత్య చేసిన ఉన్మాది
-
6ఏళ్ల బాలికపై ఉన్మాది దాడి
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చిన్నారిని హత్యచేసిన ఉన్మాది
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఘోరం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రియదర్శిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని 10వ నెంబర్ ప్లాట్ఫామ్పై తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఈ దారుణం చోటుచేసుకుంది. అడ్డు వచ్చినవారిపై కూడా ఉన్మాది దాడి చేశాడు. మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన దంపతులు వివాహ వేడుకకు హాజరవడానికి షోలాపూర్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారు. ఆ ఉన్మాది వీరంగం సృష్టించడంతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను చిత్తూరు జిల్లాకు చెందిన కుమార్గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనిపై పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.