breaking news
govenment job
-
కాలేజ్కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..
సరిగ్గా ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ టైంలో తండ్రిని కోల్పోయాడు. అంతటి విషాదాన్ని దిగమంగి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇక ఆ తర్వాత చదువు కొనసాగించలేని దుస్థితి. కుటుంబ బాధ్యతలు మీద పడటంతో..కాలేజీ ముఖం చూడకుండానే..డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఆ తర్వాత పోస్టాఫీస్ క్లర్క్ ఉద్యోగం నుంచి మొదలు పెట్టి.. యూపీఎస్సీ వరకు మొత్తం 12 ప్రభుత్వ ఉద్యోగాలను కొల్లగొట్టి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. అనుకోని అవాంతరంలా హఠాత్తుగా వచ్చిపడే కష్టాలనే అభ్యున్నతికి సోపానంగా చేసుకుని ఎదగడం ఎలా అనేది చూపించి ప్రేరణగా నిలిచాడు.అతడే ఐపీఎస్ సందీప్ చౌదరి. దృఢ సంకల్పం ఉన్నవారికి జీవితంలో ఓటమి ఉండదు అనేందుకు ఉదహారణ సందీప్ చౌదరి. చిన్న వయసులో తండ్రిని కోల్పోయాడు. సరిగ్గా ఇంటర్ బోర్డు పరీక్షల టైంలో తండ్రిని కోల్పోయాడు. ఆ దుఃఖాన్ని దిగమింగి..రాసి ఉత్తీర్ణుడయ్యాడు. చెప్పిరాని కష్టాన్ని ఓర్పుకుంటూ..మన గమనం ఆగిపోకూడదు అన్నట్లుగా..సందీప్ ముందుకు సాగిన తీరు ప్రశంసించదగ్గ విషయం. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల నిమిత్తమై రెగ్యులర్ కాలేజీ చదువుకి స్వస్తి పలికి దూరవిద్య ద్వారా చదవుని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. అలా ఇగ్నో ఓపెన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ సాయంతో బీఏ, ఎంఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పోస్టాఫీసులో పోస్టల్ క్లర్క్ ఎగ్జామ్కి దరఖాస్తు చేసుకున్నాడు. ఉన్నవి జస్ట్ 40 ఖాళీలు..దరఖాస్తు చేసుకుంది వందలాది మంది. అసలు నెగ్గుకురాగాలనా అనుకున్నాడు. కట్చేస్తే..కోచింగ్ లేకుండానే తొలి ప్రభుత్వ ఉద్యోగాన్ని కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. అలా అక్కడ నుంచి మొదలు పెట్టి..మహర్షి మూవీలో మహేశ్ బాబు డైలాగ్ సక్సెస్ ఈజ్ జర్నీ కామాలే ఉంటాయ్, పులిస్టాప్ ఉండదు అన్నట్లుగా సాగిపోయింది ఆయన విజయ పరంపర. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్ లేకుండా మొత్తం పది ప్రభుత్వ పరీక్షలను క్లియర్ చేశాడు. వాటిలో బ్యాంక్ పీఓ, ఎస్ఎస్సీ, ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, నాబార్డ్, పంజాబ్ సివిల్ సర్వీసెస్ పరీక్ష తదితరాలు ఉన్నాయి.సివిల్స్ ఎగ్జామ్ వైపుకి దృష్టి మళ్లింది అలా..గుహతి అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుండగా ఒక ఘట్టం అతడి జీవితాన్ని సివిల్స్ ప్రిపేరయ్యేందుకు పురిగొల్పింది. సరిగ్గా 2010 యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో తన రూమ్మేట్ 13వ ర్యాకు సాధించిడం చూసి..తాను ఆ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్కి సన్నద్ధం కావాలని భావించాడు. అయితే సందీప్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి పూర్తి నిబద్ధత అవసరం. అందువల్ల యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమైంది. అయినప్పటికీ..మిగతావాటికి ప్రిపేరయ్యినట్లుగానే తన శక్తి మేర కృసి చేశాడు. అలా 2014 యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే సందీప్ 158వ ర్యాంక్ సాధించాడు. ఇంటర్వ్యూలో మొత్తం 240 మార్కులు సాధించాడు. అది ఆ సమయంలో దేశంలోనే అత్యధికమని సందీప్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు కూడా. ప్రస్తుతం ఆయన జాతీయ దర్యాప్తు సంస్థలో(ఎన్ఐఏ) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)గా పనిచేస్తున్నారు. ఏదో సాధించేశాం హమ్మయ్య అనుకోలేదు..తకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునేలా సక్సెస్ పరంపరను సాగించి.. ప్రపంచమే తనవైపు చూసేలా చేసుకుని "దటీజ్ సందీప్ చౌదరి" అనిపించుకున్నారు. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
రెండు ఉద్యోగాలు సాధించిన నెమ్మికల్ వాసి
ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన మహిళ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో రెండు ఉద్యోగాలు సాధించి తన సత్తాచాటింది. గ్రామానికి చెందిన జటంగి సువర్ణ ఎంఎస్సీ, బీఈడీ చేసింది. అయితే గత ఏడాది జరిగిన గురుకుల సైన్స్ టీచర్, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తు చేసి పరీక్షలు రాసింది. అయితే ఆమె రాసిన రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం గమనార్హం. ఈమె 1నుంచి 12వ తరగతి వరకు నెమ్మికల్లో, డిగ్రీ సూర్యాపేటలో, ఎంఎస్సీ, బీఈడీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసింది. గ్రామానికి చెందిన సువర్ణ ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఒంటి కాలిపై నిల్చొని రెండో ఏఎన్ఎంల నిరసన
మంచిర్యాల టౌన్ : తమను రెగ్యులరైజ్ చేయాలని, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలు బుధవారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో గత పది రోజులుగా చేస్తున్న సమ్మె శిబిరంలో ఒంటి కాలిపై నిల్చొని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెగ్యులర్ ఏఎన్ఎంలతో సమానంగా పనిచేస్తున్న, తమకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని,. కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ. 21,500లు ఇస్తూ, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే తమకు 35 రోజుల క్యాజువల్ లీవ్లు, 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, విధుల్లో ఉండి మతి చెందిన వారికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా చెలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఐ. సుజాత, జిల్లా కార్యదర్శి బి. పద్మ, డివిజనల్ అధ్యక్షురాలు ఎన్. మంజుల, సభ్యులు తిరుమల, నలిత, విజయ, రాజేశ్వరీ, విమల, భవాని, సత్యవతి పాల్గొన్నారు.


