gudivada ramakrishna
-
ఇద్దరు ‘కాల్’ నాగుల అరెస్టు
విశాఖలో టీడీపీ నేత ‘గుడివాడ’ దందాలు వెలుగులోకి సాక్షి, విశాఖపట్నం, విజయవాడ: ధనార్జనే ధ్యేయంగా అధిక వడ్డీలకు డబ్బులు తిప్పుతూ బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు ‘కాల్మనీ’ వ్యాపారులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరు టీడీపీ నేత కాగా మరొకరు వ్యాపారి.పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడితో సన్నిహితంగా ఉంటూ, టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూ కాల్మనీ కేసులు ఎదుర్కొంటున్న గుడివాడ రామకృష్ణను విశాఖ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 37 చెక్లు, 39 ప్రామిసరీ నోట్లు, నాలుగు కత్తులు, ఎల్ఐసీ బాండ్లు, కారు, ద్విచక్రవాహనంను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ త్రివిక్రమవర్మ వెల్లడించారు. నిందితుడిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు తిరుపతి వెళ్లి వస్తూ ప్రత్యేక పోలీసు బృందానికి చిక్కాడు. రామకృష్ణ తన కారుకు టీడీపీ జెండాను అమర్చుకుని తిరుగుతున్నాడు. మంత్రి అయ్యన్నతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు అతడి నివాసంలో దొరికాయి. పోలీసులు మాత్రం రికార్డుల్లో రామకృష్ణ ఏ పార్టీకీ చెందని వాడిగా పేర్కొంటున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనానికి ఉన్న టీడీపీ జెండాను కూడా తొలగించారు. బెజవాడలో ఉద్యోగులకు బెదిరింపులు ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలపై కాల్మనీ వ్యాపారి రాంపిళ్ల పాపారావును విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ కమిషనరేట్లో కాల్మనీ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాక తొలి అరెస్టు ఇదే. డీసీపీ ఎల్.కాళిదాస్ విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. -
కాల్మనీ కేటుగాడు అరెస్ట్
అల్లిపురం: కాల్మనీ కేసులో తప్పించుకు తిరుగుతు న్న బడా ఫైనాన్షియర్ గుడివాడ రామకృష్ణను ఆరి లోవ, ఎంవీపీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించారు. అతని వద్ద నుండి 37 బ్లాంక్ చెక్కులు, 39 ప్రామిసరీ నోట్లు, 4 కత్తులు, ఎల్ఐసీ బాండ్లు, కారు, స్కూటర్, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర శాంతిభద్రతల డీసీపీ టి.త్రివిక్రమవర్మ వివరాలు వెల్లడించారు. లాసన్స్బే కాలనీకి చెందిన గుడివాడ రామకృష్ణ రియల్ ఎస్టేట్, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాలు చేస్తుంటాడు. ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, విలువైన డాక్యుమెంట్లు తీసుకుని నూటికి రూ.6 వడ్డీ చొప్పున అప్పులు ఇస్తుంటాడు. అప్పు తీర్చేసినా డాక్యుమెంట్లు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు తిరిగి ఇవ్వకుండా అప్పు తీసుకున్న వారిని ఇబ్బంది పెట్టటమే కాకుండా మహిళలను లైంగిక వే ధింపులకు గురి చేయటం, చంపేస్తానని, వారి కు టుంబసభ్యులను కిడ్నాప్ చేస్తానని బె దిరించటం చేస్తుంటాడు. ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఆదర్శనగర్కు చెందిన దీప్తి శారద అనే మహిళ, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కుమారి అనే మహిళ రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. తాను తీసుకున్న రూ.5 లక్ష ల అప్పుకుగాను రూ.35 లక్షల ఇంటిని స్వాధీనం చేసుకున్నారని పెదవాల్తేరుకు చెందిన బి.వి.ఆర్.కె.సి.కిషోర్ ఎంవీపీ కాలనీ స్టేషన్లో ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. మధురవాడ ఏసీపీ దాసరి రవి బాబు పర్యవేక్షణలో ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు, ఎంవీపీ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ కాంతారా వు, ఇతర సిబ్బందితో నిందితుడిని 2 రోజుల క్రితం తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. గురువారం నగరానికి తీసుకువచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు గుడివాడ రామకృష్ణపై 1993 లో టూటౌన్లో మోటారు సైకిల్ దొంగతనం కేసు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డులను అందజేశారు. రామకృష్ణ వేధింపులు భరించలేనివి డబ్బులు ఇవ్వకపోతే తనతో ఒక రోజు గడపమనేవాడని, అలా అయితే అప్పును వదులుకుంటానని వేధించేవాడని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలా కానిపక్షంలో పిల్లలను కిడ్నాప్ చేస్తానని బెదిరించేవాడని వాపోయారు. తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తరువాత కూడా కాసానిబాబా అనే వ్యక్తితో బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. భార్యాభర్తలను విడదీస్తామని, కాపురాలు కూల్చుతామని నిత్యం టార్చర్ పెడుతుండేవాడని తెలి పారు. ఏసీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ‘అలాంటివి కామనే’ అని కొట్టి పారేశారన్నారు. తమలా చాలా మంది బాధితులు ఉన్నారని వారు తెలిపారు. బాధితులు 1090కి ఫిర్యాదు చేయవచ్చు గుడివాడ రామకృష్ణ బాధితులు ఎవరైనా ఉంటే 1090 నంబరుకు ఫోన్ చేసిగాని, నేరుగా గాని ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ టి.త్రివిక్రమవర్మ తెలిపారు. బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకునేందుకు 24 గంటలు ఈ నంబరు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. -
వేధింపుల కేసులో టీడీపీ నాయకుడి అరెస్ట్.
-
వేధింపుల కేసులో టీడీపీ నాయకుడి అరెస్ట్
విశాఖపట్నం : విశాఖపట్నంలో కాల్ మనీ సెక్స్ రాకేట్ తరహా కేసులో నిందితుడు, టీడీపీ నాయకుడు గుడివాడ రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పులు తీసుకున్న మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న గుడివాడ రామకృష్ణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు అరిలోవకు చెందిన ఓ మహిళ ఇటీవల విశాఖపట్టణంలోని పట్టణ నాలుగో పోలీస్ స్టేషన్లో గుడివాడ రామకృష్ణపై ఫిర్యాదు చేసింది. అందులోభాగంగా పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయం గమనించిన రామకృష్ణ విశాఖ నుంచి పరారైయ్యారు. అతడి కోసం పోలీసుల గాలింపు తీవ్రతరం చేశారు. ఆ క్రమంలో అతడు చెన్నైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బుధవారం గుడివాడ రామకృష్ణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గురువారం విశాఖపట్నం నగరానికి తీసుకు వచ్చారు. గుడివాడ రామకృష్ణని జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించినట్లు విశాఖపట్నం డీసీపీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. అంతకుముందు గుడివాడ రామకృష్ణను త్రివిక్రమ వర్మ మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ... రామకృష్ణ వల్ల బాధితులుగా మారిన వారు ఎవరైనా తమ వద్దకు వచ్చి... ఫిర్యాదు ఇవ్వవచ్చని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.