heart airlifted
-
గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతం
-
యశోదలో గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతం
హైదరాబాద్: సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. దాదాపు 6గంటలపాటు గుండెమార్పిడి సర్జరీని ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరించి 45ఏళ్ల మహిళకు అమర్చారు. ఈ రోజు ఉదయం గుండెను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్సులో నేరుగా ఆస్పత్రికి గుండెను చేర్చారు. ఇందుకోసం ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ యంత్రాంగం చర్యలు తీసుకుంది . కేవలం మూడే మూడు నిమిషాల్లో బేగంపేట విమానాశ్రయం నుంచి శర వేగంగా సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏళ్ల పద్మకు ఈ గుండెను అమర్చారు. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. -
యశోదకు చేరుకున్న 'గుండె' !
-
యశోదకు చేరుకున్న 'గుండె'
హైదరాబాద్: అప్పుడు బెంగళూరు....ఇప్పుడు హైదరాబాద్. భాగ్యనగరం మరోసారి గుండెమార్పిడికి వేదికైంద. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలోని ఓ మహిళకు అమర్చాల్సిన గుండెను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్సులో నేరుగా ఆస్పత్రికి గుండెను చేర్చారు. ఇందుకోసం ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ యంత్రాంగం చర్యలు తీసుకుంది . కేవలం మూడే మూడు నిమిషాల్లో బేగంపేట విమానాశ్రయం నుంచి శర వేగంగా సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏళ్ల పద్మకు ఈ గుండెను అమర్చనున్నారు. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరగనుంది. షోలాపూర్ కు చెందిన రోజువారి కూలి చేసుకునే వ్యక్తి రెండు రోజుల క్రితం కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాంతో అతన్ని చికిత్స నిమిత్తం పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిలో చేర్చారు. అయితే రోగికి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. దీనితో మృతుని బంధువులు అవయవదానానికి అంగీకరించారు. హైదరాబాద్ లో గుండె మార్పిడి జరిగింది. అప్పట్లో అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి జరిగింది. మరోవైపు మృతుని కాలేయం, రెండు మూత్ర పిండాలు హైదరాబాద్ లోని మరో ముగ్గురు రోగులకు అమర్చనున్నారు. -
యశోదకు చేరుకున్న 'గుండె'
-
బెంగళూరు - చెన్నై.. ఓ గుండె ప్రయాణం!
ఒకే నగరంలో ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి గుండెను పంపి.. అక్కడ గుండెమార్పిడి శస్త్రచికిత్సలు చేయడం ఈమధ్య కాలంలో మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. కానీ, ఏకంగా ఒక నగరం నుంచి మరో నగరానికి గుండెను తీసుకెళ్లిన సంఘటన మాత్రం తాజాగా జరిగింది. బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి చెన్నైకి ఓ గుండెను తీసుకెళ్లి.. విజయవంతంగా అవతలి రోగికి అమర్చారు. బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో సుమారు రెండేళ్ల 10 నెలల చిన్నారి బ్రెయిన్ డెడ్ పరిస్థితిలోకి వెళ్లాడు. మరోవైపు చెన్నైలో రెండేళ్ల 8 నెలల చిన్నారి గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తోంది. గుండె దానానికి తల్లిదండ్రులు అంగీకరించడంతో బెంగళూరు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి హుటాహుటిన మణిపాల్ ఆస్పత్రి నుంచి విమానాశ్రయానికి గుండెను తరలించారు. గత సెప్టెంబర్ నెలలో కూడా ఇలాగే బ్రెయిన్ హెమరేజితో మరణించిన మహిళ గుండెను బెంగళూరు నుంచి చెన్నైకి తరలించారు.