herbicide
-
విరుగుడు లేని విషం!
⇒కాగజ్నగర్కు చెందిన యువకుడు (35) కుటుంబ గొడవలతో గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అప్పటికే కిడ్నీలు దెబ్బతినడంతో ప్రత్యేక డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి విషమించి నాలుగు రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. ⇒ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన యువకుడు (21) స్నేహితుల మధ్య విభేదాలతో గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. పరిస్థితి చేయి దాటిపోయింది. చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ యువకుడు బతకడం కష్టమని తేల్చి చెప్పారు. రెండు రోజులకే అతడి ప్రాణాలు పోయాయి.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంట చేన్లలో కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు రెండు, మూడు చోట్ల ‘పారాక్వాట్’ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో ఈ మందును తాగిన వారిని కాపాడుకునేందుకు విరుగుడు కూడా లేక నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును పొలాల్లో పిచికారీ చేసే సమయంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు సమస్యలు వస్తున్నాయి. అది పర్యావరణానికి, జీవజాతులకూ ప్రమాదకరమని వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్సకు లొంగని మందు! పారాక్వాట్ గడ్డి మందు కేవలం పది మిల్లీలీటర్లు (ఎంఎల్) శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. అది శ్వాస వ్యవస్థ, కిడ్నీలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని... గుండె, కాలేయం సహా అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. గత ఏడాది ఈ గడ్డిమందు తాగిన ఓ యువకుడికి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల మారి్పడి చేయాల్సి వచి్చందని గుర్తు చేస్తున్నారు. చాలా క్రిమిసంహాకర మందులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని.. వాటి తయారీ కంపెనీలే విరుగుడు ఫార్ములా ఇస్తుంటాయని చెబుతున్నారు. కానీ ఈ గడ్డి మందుకు మాత్రం ఇప్పటికీ సరైన విరుగుడు చికిత్స లేక.. ఎన్నో పేద, మధ్య తరగతి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఏమిటీ పారాక్వాట్? పారాక్వాట్ డైక్లోరైడ్గా పిలిచే గడ్డిమందు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అత్యంత విషపూరితమైనా.. కూలీల కొరత ఓవైపు, సులువుగా కలుపు నివారణ అవుతుందనే ఉద్దేశంతో మరోవైపు రైతులు ఈ మందును వాడుతున్నారు. కేవలం రూ.200 ఖర్చుతో ఎకరం చేనులో కలుపు నివారణ చేయవచ్చని.. అధిక గాఢత కారణంగా 24 గంటల్లోనే మొక్కలు మాడిపోతాయని అంటున్నారు. పిచికారీ చేసే సమయంలోనూ తలనొప్పి, వికారం, ఒంటిపై దద్దుర్లు వస్తుంటాయని చెబుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు సరైన చికిత్స లేని ఈ మందు దుష్ప్రభావాలపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని గమనించిన కొందరు వైద్యులు ప్రభుత్వానికి విన్నవించేందుకు ఓ గ్రూప్గా ఏర్పడ్డారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంచిర్యాల పరిధిలోని ప్రతినిధులు పారాక్వాట్ తీవ్రతపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం ఇచ్చారు కూడా. పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పారాక్వాట్ తీవ్రతపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఆత్మహత్య నిరోధక కమిటీలు ఈ మందు విషయంలో అవగాహన కలి్పస్తున్నాయి. తయారు చేసే దేశంలోనే ఆంక్షలు పారాక్వాట్ను చాలా దేశాలు నిషేధించాయి. ఈ మందు తయారీ కంపెనీ ఉన్న స్విట్జర్లాండ్లో, ఉత్పత్తి చేసే చైనాలోనూ ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశాలోని బుర్లా జిల్లాలో రెండేళ్లలో 170 మంది వరకు ఈ గడ్డి మందు తాగి చనిపోవడంతో నిషేధించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడి సర్కారు పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై ఆంక్షలు విధించింది. కానీ రాష్ట్రాలకు 60రోజులు మాత్రమే అమ్మకాలను నిలిపేసే అధికారం ఉండటంతో.. శాశ్వతంగా నిషేధించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో కలుపు గడ్డి నివారణ కోసం మరో మందును ప్రత్యామ్నాయంగా చూపాలనే డిమాండ్లు వస్తున్నాయి. కిడ్నీలపై తీవ్ర ప్రభావం ఎవరైనా పారాక్వాట్ తాగిన వెంటనే ఆస్పత్రికి వస్తే బతికే చాన్స్ ఉంటుంది. కిడ్నీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక డయాలసిస్ చేస్తాం. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే ప్రాణాలు కోల్పోయినట్టే. అందుకే ఈ మందు తీవ్రతను సర్కారుకు తెలియజేయాలని అనుకుంటున్నాం. – రాకేశ్ చెన్నా, నెఫ్రాలాజిస్టు, మంచిర్యాల నిషేధం విధించాలి గడ్డిమందుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిమోతాదులో శరీరంలోకి వెళ్లినా బతకడం కష్టమవుతోంది. చికిత్సకు కూడా లొంగకుండా ఉన్న ఈ మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాలి. సమాజ శ్రేయస్సు కోసం కొంతమంది వైద్యులం కలసి ప్రభుత్వానికి నివేదించనున్నాం. – సతీశ్ నారాయణ చౌదరి, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాక్టిషనర్, ఖమ్మంచాలా కేసుల్లో మరణాలే.. పారాక్వాట్కు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. మా వద్దకు వస్తున్న చాలా కేసుల్లో మరణాలే సంభవిస్తున్నాయి. ఈ మందు రోగి పెదవులు మొదలు శరీరంలో అన్ని అవయవాలను వేగంగా దెబ్బతిస్తుంది. తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం చాలా కష్టం. – ఆవునూరి పుష్పలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
కేన్సర్ కారక ‘గ్లైఫోసేట్’ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో విచ్చలవిడిగా వినియోగంలో ఉన్న కలుపుమందు గ్లైఫోసేట్ను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మనుషులు, పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో దీని వాడకాన్ని కట్టడి చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇకపై గ్లైఫోసేట్ను పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్లు (పీసీఓ) తప్ప ఇతరులెవరూ ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి దేశంలో గ్లైఫోసేట్ను కేవలం తేయాకు తోటల్లో కలుపు నివారణకే అమనుతివ్వగా పండ్ల తోటలు, ఇతర చోట్ల సైతం దాన్ని అక్రమంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, కేరళ సహా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ కలుపుమందును నిషేధించాయి. మరోవైపు గ్లైఫోసేట్ వాడకంపై నియంత్రణ సరిపోదని... దాన్ని పూర్తిగా నిషేధించాలని రైతాంగ నిపుణులు డిమాండ్ చేయగా ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్నపళంగా గ్లైఫోసేట్ వాడకంపై నియంత్రణ విధిస్తే రైతులు అన్యాయమైపోతారని అధికారులు చెబుతున్నారు. గ్లైఫోసేట్తో కేన్సర్ ముప్పు... గ్లైఫోసేట్ వాడకం వల్ల పంటలు విషపూరితమై ప్రజలు కేన్సర్ బారినపడే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) 2015లో తేల్చింది. ఆ తర్వాత అమెరికా జరిపిన పరిశోధనల్లోనూ ఇదే విషయం నిర్ధారణ అయింది. అయితే తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో గ్లైఫోసేట్ వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. గత నాలుగైదు ఏళ్లుగా నిషేధిత బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణతోపాటు పండ్ల తోటలు, చెరువు గట్లు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పరిసరాల్లో కలుపును తొలగించేందుకు కూలీల కొరత కారణంగా దీన్ని రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. కంపెనీల లాబీయింగ్తోనే విచ్చలవిడి విక్రయాలు గ్లైఫోసేట్ వాడకంపై నామమాత్రపు నియంత్రణ చర్యలే తప్ప ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడంలేదు. నియంత్రణ సరిగా అమలు కాకపోతే ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కలుపుమందు విక్రయాల కోసం కంపెనీలు భారీగా లాబీయింగ్ జరుపుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలు దాని వినియోగాన్ని తాత్కాలికంగా పరిమితం చేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం పెద్దగా ఉండదు. గ్లైఫోసేట్ బారిన పడిన వారికి నష్టపరిహారం చెల్లించాలి. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు -
గ్లైఫోసేట్పై దేశవ్యాప్త నిషేధం అత్యవసరం
గ్లైఫోసేట్.. ఇది కలుపును చంపే విష రసాయనం. దీన్ని చల్లితే కలుపుతో పాటు నేలపై ఉన్న అన్ని రకాల మొక్కలూ చనిపోతాయి. కలుపు తీయాలంటే కూలీలకు ఖర్చు అధికమవుతోందని గ్లైఫోసేట్ మందును చల్లుతున్నారు. కానీ, ఆరోగ్యం చెడిపోతే, చికిత్సకు ఇంకా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది అని రైతులు గ్రహించడంలేదు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా గ్లైఫోసేట్ ఉపయోగం మీద కొంత కాలం పాటు ఆంక్షలు విధిస్తున్నది. సాధారణంగా, పత్తి పంట కాలం అయిన జూన్ నుంచి అక్టోబర్ వరకు గ్లైఫోసేట్ అమ్మకాల మీద ఆంక్షలు పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా ఒకసారి ఆంక్షలు విధించాయి. కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే క్రమం తప్పకుండా 2018 నుంచి ప్రతి ఏటా ఆంక్షలు ప్రకటిస్తున్నది. అయితే, దురదృష్టవశాత్తూ, ఈ ఆంక్షల అమలు మాత్రం ఆశించిన మేరకు లేదు. ప్రతి ఏటా గ్లైఫోసేట్ అమ్మకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. దుకాణాలలో ఈ డబ్బాలు దొరుకుతూనే ఉన్నాయి. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం చట్టవిరుద్ధమైన బీజీ–3 పత్తి విత్తనాలను మన దేశంలో అక్రమంగా ప్రవేశపెట్టారు. కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే వీటి విస్తృతిని నివారించి, బాధ్యులమీద క్రిమినల్ చర్యలు చేపట్టలేదు. గ్లైఫోసేట్ అనేది పరాన్నజీవి వ్యవసాయ రసాయన ఉత్పాదన. జన్యుమార్పిడి విత్తనాల సాంకేతిక పరిజ్ఞానంపై స్వారీ చేస్తుంది. కలుపు రసాయనాలను తట్టుకునే విధంగా జన్యుమార్పిడి చేసిన (హెచ్.టి. బీటీ–3) అక్రమ పత్తి విత్తనాలతోపాటు గ్లైఫోసేట్ అమ్మకాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. పైగా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా చట్ట వ్యతిరేక బీజీ–3 పత్తి విత్తనాల మార్కెట్ 40 శాతానికి పెరిగిందని ఒక అంచనా. కేంద్రం చేతుల్లోనే అధికారం విత్తనాలను మార్కెట్ చేస్తున్న కంపెనీల మీద చర్యలు చేపట్టే ఉద్దేశం లేకపోవడంతో, మధ్యేమార్గంగా గ్లైఫోసేట్ను నియంత్రించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సు చేసింది. ఆ విధంగా గ్లైఫోసేట్ మీద ఆయా రాష్ట్రాల్లో కొద్ది నెలల పాటు ఆంక్షలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా గ్లైఫోసేట్ను నియంత్రించవచ్చు. అది అత్యంత ప్రమాదకారి అనుకుంటే నిషేధించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ‘మీకు అవసరం అనిపిస్తే నియంత్రించండి’ అని రాష్ట్రాలకు చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, పురుగు మందుల నియంత్రణ చట్టం కింద తన కున్న అధికారాలను, బాధ్యతలను నిర్లక్ష్యం చేసింది. పనిచేయని తాత్కాలిక ఆంక్షలు ఎనిమిదేళ్ల్ల క్రితం మన దేశంలో గ్లైఫోసేట్ పెద్దగా ఎవరికీ తెలియదు. చట్టపరంగా అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాల రాకతో దీని అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. వీటి వాడకాన్ని అరికట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వదిలిపెట్టింది. గ్లైఫోసేట్ ఉపయోగం మీద ఏటా కొద్ది నెలలు ఆంక్షలు పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తర్వులు జారీ చేస్తున్నది. కాగా, ఈ వ్యూహం పని చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా పురుగు మందును, పురుగు మందుల నియంత్రణ చట్టం–1968 ఉపయోగించి 60 రోజుల వరకు నిషేధించవచ్చు. పూర్తిగా నిషేధించే అధికారాలు మటుకు లేవు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పూర్తిగా, శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. అయితే, కేరళ, సిక్కిం రాష్ట్రాల మాదిరి కొన్ని అధికరణాల ద్వారా రాష్ట్రాలకు అవకాశం ఉంది. కేరళ రాష్ట్రం ఆ విధంగానే ఇదివరకు ఎండోసల్ఫాన్ మీద చర్యలు చేపట్టింది. గ్లైఫోసేట్ మీద కూడా పూర్తి నిషేధం అక్కడ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇచ్చిన ఉత్తర్వులలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. ప్రతి ఏటా ఆంక్షల తీవ్రతను నీరుగార్చే మార్పులు జరుగుతున్నాయి. పంట ఉన్న ప్రాంతంలో వాడవద్దు (జూన్ – అక్టోబర్ వరకు), పంట లేని ప్రాంతంలో వాడవచ్చు, విస్తరణ అధికారి నుంచి తీసుకున్న పత్రం ప్రకారమే అమ్మాలి, విస్తరణ అధికారులు గ్లైఫోసేట్ ఉపయోగాన్ని అరికట్టాలి.. వంటి ఆచరణ సాధ్యం కాని ఆంక్షలు ఈ ఉత్తర్వుల్లో ఉన్నాయి. ఆచరణాత్మక ప్రణాళికేదీ? తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఒక ఆచరణాత్మక ప్రణాళిక జిల్లాల వారీగా తయారు చేసి ఉండవచ్చు. 2018 ఉత్తర్వులలో పురుగు మందుల విక్రయదారులకు ఇచ్చే లైసెన్స్లో గ్లైఫోసేట్ పదాన్ని తొలగించాలన్నారే గానీ దాన్ని అమలు చేయలేదు. 2019లో ఆ పదాన్నే తీసివేశారు. పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా అనేక సూచనలు ఇచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. మన దేశంలో గ్లైఫోసేట్ ప్రభావంపై అధ్యయనాలు లేవు. అనేక గ్రామాలలో రైతులు పత్తి చేలల్లో గ్లైఫోసేట్ చల్లితే పంటంతా మాడిపోయిన ఉదంతాలు ఉన్నాయి. గ్లైఫోసేట్ వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. దీని ప్రధాన తయారీదారు అయిన బేయర్ కంపెనీ (ఇది వరకు మోన్సాంటో) మీద అమెరికాలో అనేక నష్ట పరిహారం కేసులు వేశారు. దేశవ్యాప్త నిషేధమే మార్గం చట్టవిరుద్ధమైన కలుపు మందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నంత కాలం తాత్కాలిక ఆంక్షలు పని చేయవు. ముందుగా బీజీ–3 విత్తనాల తయారీదారుల మీద, విక్రయదారుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. రైతులు, గ్రామీణుల ఆరోగ్య రక్షణకు, ఆర్థిక, పర్యావరణ కారణాల రీత్యా కూడా గ్లైఫోసేట్ తయారీ, దిగుమతి, ఎగుమతి, వాడకంపై కేంద్రం దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించడం తక్షణ అవసరం. - డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త: ప్రముఖ విధాన విశ్లేషకులు ఈ–మెయిల్: nreddy.donthi20@gmail.com -
మార్కెట్లోకి ‘మోవెంటోఎనర్జీ’ కీటకనాశిని
-
మార్కెట్లోకి ‘మోవెంటోఎనర్జీ’ కీటకనాశిని
సాక్షి, గుంటూరు : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బేయర్ క్రాప్ సైన్స్ అంతర్జాతీయ ప్రమాణాలు, నూతన సాంకేతిక పరిశోధనలతో రూపొందించిన కీటకనాశిని ‘మోవెంటో ఎనర్జీ’ ఉత్పాదనను సోమవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సౌత్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.మోహనరావు మాట్లాడుతూ 1863లో జర్మనీలో స్థాపించిన బేయర్ కంపెనీ ఎన్నో విశిష్ట ఉత్పాదనలను సుమారు 165 దేశాలలో కోట్లాది మంది రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. సౌత్ కోస్టల్ డివిజినల్ మేనేజర్ ఎస్.నరసయ్య మాట్లాడుతూ నూతనంగా విడుదల చేసిన మోవెంటో ఎనర్జీ ఒక అద్భుతమైన క్రిమిసంహారిణి అని తెలిపారు. క్రాప్ మేనేజర్ పి.శ్రావణ్కుమార్ మాట్లాడుతూ మోవెంటో ఎనర్జీ మొక్కలోని ప్రసరణ ద్వారా అనేక రకాల రసంపీల్చు పురుగులను నియంత్రిస్తుందన్నారు. ప్రొడక్ట్ మేనేజర్ అరింధమ్ ముఖర్జీ మాట్లాడుతూ.. ఈ మందు కూరగాయల పంటలు, పత్తి పంటలో రసంపీల్చు పురుగులను దీర్ఘకాలంగా నియంత్రించడమే కాకుండా పూర్తి రక్షణ ఇచ్చేందుకు చిగురు నుంచి వేరు వరకు వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు. లాం ఫారం పత్తి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.చెంగారెడ్డి మాట్లాడుతూ దేశ రైతాంగానికి నూతన పరిశోధన ఫలాలను అందించడంలో బేయర్ కంపెనీ ముందుంటుందని చెప్పారు.