Home Owner
-
'రియల్ లైఫ్ పరాన్నజీవి'..ఏడేళ్లుగా ఇంటి పాత యజమాని..!
పరాన్నజీవులు గురించి విన్నాం. ఇతరులను ఆశ్రయించి బతికే వాటిని పరాన్నజీవులు అనిపిలుస్తాం. పందులు, ఇతర జంతువులు ఆశ్రయించి ఉండే బద్దేపురుగులు, వైరస్లను ఇలా పిలుస్తాం. అయితే మనుషుల్లో కూడా కొందూ ఇతరులపై ఆధారపడి జీవనం సాగించేవారిని కూడా ఇలా పోలుస్తు తిడుతుంటారు. కానీ అచ్చం అలానే రియల్ లైఫ్ పరాన్నజీవిలా జీవనం సాగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పైగా దొరికిపోయి కూడా అడ్డంగా బుకాయించే యత్నం చేసిందామె. ఈ విషయం కాస్తా కోర్టుదాక చేరుకుంటే గానీ ఆమె తిక్క కుదరలేదు. అసలేం జరిగిందంటే..తూర్పు చైనా(China)లోని జియాంగ్సు ప్రావిన్స్లో నివశిస్తున్న లీ అనే వ్యక్తి ఒక రోజుల తన ఇంటిని శుభ్రపరుస్తున్నాడు. సరిగ్గా ఆసమయంలోనే తన ఇంటి బేస్మెంట్(Basement)లో ఒక గది ఉండటం చూసి విస్తుపోతాడు. అక్కడ ఒక మనిషి జీవనం సాగిస్తున్నట్లు అన్ని వసతులు ఉంటాయి. ఇదేంటని ఆశ్చర్యపోతూ..క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత అక్కడ నిజంగానే ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె ఎవరా అని ఆలోచించగా.. ఈ ఇంటి పాత యజామని(Former Homeowner) జాంగ్గా గుర్తించి కంగుతింటుంది. వెంటనే లీ తనకు ఈ ఇల్లుని కొనుగోలు చేసిన మాజీ యజమానురాలు జాంగ్ని గట్టిగా నిలదీస్తుంది. అయితే ఆమె తెలివిగా ఇంటి గురించి పూర్తి సమాచారం ఇచ్చానే గానీ కింద బేస్మెంట్ మీకు చెందుతుందని ఒప్పందంలో లేదంటూ మాట్లాడుతుంది. కానీ లీ తనకు అమ్మకం సమయంలో ఇంటి బేస్మెంట్ గురించి రహస్యంగా ఉంచి మళ్లీ ఇలా దబాయిస్తుందని మండిపడతాడు. పైగా ఇల్లు అమ్మేశానే కానీ బేస్మింట్ కాదని తేల్చి చెప్పింది పాత యజమానురాలు జాంగ్. పైగా విరామ సమయంలో ఇలా ఆ బేస్మెంట్లో సేదతీరుతానని కరాఖండీగా చెప్పింది. అయితే ఇక్కడ లీ గమనించకుండా జాంగ్ ఎలా ఆ బేస్మెంట్లోకి వెళ్లి వస్తుందన్నది అస్పష్టంగా ఉంది. ఈ స్టోరీ అచ్చం చైనాలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం పారాసైట్ కథలా ఉంది. ఈ మూవీలో కూడా ఒక వ్యక్తి బేస్మెంట్లో రహస్యంగా సంవత్సరాలు గడుపుతాడు. కాగా, దీనిపై చాలా సీరియస్గా ఉన్న లీ వెంటనే ఈ విషయమై కోర్టు(court)ని ఆశ్రయించి గట్టిగా పోరాడతాడు. చివరికి మాజీ ఇంటి యజమానిపైకేసు గెలిచి నష్టపరిహారం కూడా అందుకుంటాడు లీ.(చదవండి: ఈ డివైజ్తో చిన్నారులను నిద్రపుచ్చడం చాలా ఈజీ..!) -
ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు వివాహిత ఆత్మహత్య
వర్ధన్నపేట: లైంగిక వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన పస్తం శ్రీనుకు 2006 సంవత్సరంలో మంజుల (34)తో వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం 10 సంవత్సరాల క్రితం ముంబై వెళ్లిన దంపతులు.. మూడు నెలల క్రితం ఇంటికి చేరుకున్నారు. ఈక్రమంలో మండలంలోని ఎలికెట్ట గ్రామం టిక్షతండాకు చెందిన జాటోత్ జితేందర్కు తమ ఇంట్లోని ఓ గదిని అద్దెకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జితేందర్ తరుచూ మంజులను లొంగదీసుకోవాలని యత్నించాడు. దీనిపై తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు జితేందర్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో మరోసారి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ వేధింపులు తాళ లేక మంజుల 15 రోజుల క్రితం తన సోదరి శారద ఇంటికి వెళ్లింది. అక్కడ మంజులకు మాయమాటలు చెప్పిన జితేందర్.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి యత్నించడంతో మంజుల ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనలో లైంగిక వేధింపులు తట్టుకోలేక తన భార్య మంజుల ఆత్మహత్యకు పాల్పడిందని భర్త శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. -
రేట్ల పెంపు రూటు..ఇంటికి దారెటు
సొంతింటి కలను రుణం సాకారం చేస్తుంది. రుణం తీసుకోకపోయినా సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. కాకపోతే మధ్య తరగతి వాసులు రుణం జోలికి వెళ్లకుండా ఉండాలంటే.. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పొదుపు, మదుపు చేసినప్పుడే ఇంటి కొనుగోలుకు కావాల్సినంత సమకూరుతుంది. అదే గృహ రుణం అయితే, కొన్నేళ్ల ముందుగానే ఇంటి కల నెరవేరుతుంది. పైగా రుణం తీసుకున్న తర్వాత ఎలా అయిన తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక దానికి కట్టుబడి ఉంటాం. కానీ, 20–30 ఏళ్లపాటు ఇంటి కోసం పొదుపు చేసే క్రమంలో.. జీవితంలో వచ్చే ముఖ్యమైన అవసరాల కోసం గృహ రుణ నిధి విషయంలో రాజీపడే ప్రమాదం ఉంటుంది. కనుక గృహ రుణం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. కాకపోతే, గృహ రుణం విషయంలో సరైన ప్రణాళిక, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలూ, ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. గృహ రుణం అంటే చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కనుక దీనిపై వడ్డీ రేట్ల ప్రభావం కూడా ఎక్కువే. గత 10 నెలలుగా వడ్డీ రేట్లు అసాధారణంగా పెరిగాయి. రుణం తీసుకున్న వారు, తీసుకోబోయే వారు ఈ రిస్క్లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకునే ముందు తప్పకుండా గమనించాల్సిన అంశాలేంటో ఈ కథనంలో చూద్దాం... గృహ రుణంపై ఫ్లోటింగ్ రేటు చాలా తక్కువ రేటు ఆప్షన్లలో ఒకటి. అదే ఫిక్స్డ్ రేటు (స్థిరంగా ఉండే వడ్డీ రేటు, అదీ కొన్నేళ్ల పాటే) అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఫ్లోటింగ్ రేటు కంటే ఫిక్స్డ్ వడ్డీ రేటు 2 శాతం అధికంగా ఉంటుంది. గృహ రుణం తీసుకునే వారిలో ఎక్కువ మంది ఫ్లోటింగ్ రేటును ఎంపిక చేసుకోవడానికి ఈ వ్యత్యాసమే కారణం. కానీ, ఫ్లోటింగ్ రేటు అన్నది రెండు వైపులా పదునున్న కత్తి మాదిరే అనుకోవాలి. వడ్డీ రేట్లు తగ్గిపోయే క్రమంలో ఫ్లోటింగ్ రేటు వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. కానీ, అదే వడ్డీ రేట్లు పెరిగిపోయే తరుణంలో రుణ గ్రహీతలను మరింతగా బాధిస్తుంది. ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాలు తీసుకుంటే, అవి రెపో రేటుకు అనుసంధానమై ఉంటాయి. అందుకని ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణం తీసుకునే వారు, వడ్డీ రేట్లు పెరిగే సమయంలో అదనంగా చెల్లించేందుకు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. రేట్లు ఇంకా పెరగొచ్చు సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సాధారణంగా అవి తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటారు. కానీ, వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఇలాంటి కోరికలు నెరవేరవు. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం పెంచింది. రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. చాలా మంది నిపుణులు రెపో రేటు 6.5 శాతానికి చేరిన వెంటనే వడ్డీ రేట్ల పెంపు ముగుస్తుందని లోగడ అంచనా వేశారు. కానీ, పరిస్థితులు తర్వాత మారిపోయాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సమస్యాత్మకంగా తయారైంది. అందుకే అన్ని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో రుణ గ్రహీతలు మరో విడత లేదంటే, మరిన్నిసార్లు రెపో రేటు పెంపును చూడాల్సి రావచ్చని నిపుణులు అంటున్నారు. చాలా సైకిల్స్ వడ్డీ రేట్లన్నవి ఆర్థిక చక్ర భ్రమణాల మాదిరే ఉంటాయి. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. మరి గృహ రుణం అంటే ఎంత లేదన్నా 20 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకుంటూ ఉంటారు. దీంతో వడ్డీ రేట్ల సైకిల్స్ ఎన్నో వచ్చి పోతుంటాయి. దీనిపై రుణం తీసుకునే వారు ముందుగానే అవగాహన కలిగి ఉండాలి. గృహ రుణం ఈఎంఐ అనేది ఆర్జించే వేతనంలో 40 శాతం మించకుండా చూసుకుంటే, ఇలాంటి ఆర్థిక అనిశ్చితులు, వడ్డీ రేట్ల పెరుగుదలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సరైన సమయం కోసం వేచి చూడొద్దు ఏదీ శాత్వతం కాదు. కనిష్ట వడ్డీ రేట్లు అయినా, గరిష్ట వడ్డీ రేట్లు అయినా ఒక నిర్ణీత కాలం పాటే కొనసాగుతాయి. ఉదాహరణకు 20 ఏళ్ల గృహ రుణ కాలవ్యవధిలో ఒకటి నుంచి రెండు సైకిల్స్ అధిక వడ్డీ రేట్లు ఉండొచ్చు. కనుక కనిష్ట వడ్డీ రేట్లు ఉన్నప్పుడే గృహ రుణం తీసుకుందామని అనుకోవద్దు. దీనివల్ల విలువైన కాలం గడిచిపోతుంది. ఇంటి కొనుగోలు ధర కూడా పెరగొచ్చు. కనుక తక్కువ వడ్డీ రేట్ల కోసం చూస్తే, అందులో మిగిలేది, పెరిగే ఇంటి ధరతో పోలిస్తే తక్కువే ఉండొచ్చు. అవసరం, తక్కువ ధరలే ఇంటి కొనుగోలుకు ఆధారం కావాలి కానీ, వడ్డీ రేట్లు కాదని నిపుణుల సూచన. రేట్ల పెంపునకు సన్నద్ధం ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కొందరు తమ అభిరుచులకు అనుగుణంగా సదుపాయాలు ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం అదనపు ఖర్చుకూ వెనుకాడరు. ఇంటి బడ్జెట్ పెంచుకోవడం అన్నది అదనపు భారానికి దారితీస్తుంది. తీసుకునే గృహ రుణం పెరుగుతుంది. దీంతో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో మరింత చెల్లించాల్సి రావచ్చు. కనుక అధిక మొత్తానికి గృహ రుణం తీసుకోవడం అన్నది పెద్ద సవాలు అవుతుందని ఆండ్రోమెడా లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి. స్వామినాథన్ పేర్కొన్నారు. కనుక అవసరమైతే, వడ్డీ రేట్లు ఊహించని విధంగా పెరిగిపోతే, నెలవారీ ఈఎంఐ 20–25 శాతం అధికంగా చెల్లించేందుకు వీలుగా, నెలవారి ఆదాయంలో వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు నెలవారీ గరిష్టంగా రూ.40,000ను ఈఎంఐ కింద చెల్లించే సామర్థ్యం ఉంటే, అప్పుడు రూ.30,000–32,000 ఈఎంఐకి పరిమితమై గృహ రుణం తీసుకోవాలి. దీంతో వడ్డీ రేట్లు పెరిగినా, ఇబ్బంది లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కాలవ్యవధి పెంపు వడ్డీ రేట్లు పెరిగిన ప్రతీ సందర్భంలోనూ రుణమిచ్చిన సంస్థలు రుణగ్రహీతల ఈఎంఐ పెంపు కంటే, కాల వ్యవధిని పెంచేందుకు మొగ్గు చూపిస్తుంటాయి. అయితే, దీనికీ పరిమితి ఉంది. రుణ గ్రహీతలు పదవీ విరమణకు ఇంకా ఎన్నేళ్లు ఉందన్న అంశాన్ని బ్యాంకులు చూస్తాయి. సాధారణంగా గృహ రుణ కాలాన్ని బ్యాంకులు రుణ గ్రహీతల వయసు, ఆర్జన ఆధారంగా నిర్ణయిస్తుంటాయి. అదే పనిగా వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో.. బ్యాంకులు రేటు పెరిగినప్పుడల్లా ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకుంటూ పోతే, తిరిగి చెల్లింపుల కాలం రిటైర్మెంట్ వయసుకు త్వరగా చేరిపోవచ్చు. ఇక ఆ తర్వాత కాలవ్యవధి పెంచుకోవడానికి ఉండదు. దీనికి బదులు ఈఎంఐ మొత్తాన్ని పెంచుతుంటాయి బ్యాంకులు. దీంతో అదనపు భారం పడుతుంది. రుణ కాల వ్యవధి పెంచుకోవడం వల్ల అంతిమంగా చెల్లించే వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక రుణదాత కాల వ్యవధి పెంచేందుకు ఆసక్తి చూపించినా.. రుణ గ్రహీతలు దీనికి మొగ్గు చూపకపోవడమే మంచిది. కాల వ్యవధి పెంచుకోవద్దంటే, పెరిగిన వడ్డీ రేట్ల మేర అదనపు ఈఎంఐ చెల్లించేందుకు సిద్ధం కావాలి. నెలవారీ చెల్లించే ఈఎంఐని పెంచడం వల్ల గృహ రుణాన్ని త్వరగా తీర్చేయవచ్చు. అందుకే గృహ రుణ గ్రహీతలకు నెలవారీ మిగులు ఉండాలి. దీనివల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు అదనంగా చెల్లించే సామర్థ్యం ఉంటుంది. దీంతో కాల వ్యవధి పెంచుకోవడం కంటే ఈఎంఐ పెంపునకే మొగ్గు చూపుతారు. ఫలితంగా అదనపు వడ్డీ భారం పడదు. ముందస్తు చెల్లింపులు వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎవరూ చెప్పలేరు. అందుకనే గృహ రుణం తీసుకున్న తర్వాత వీలు చిక్కినప్పుడల్లా పాక్షిక చెల్లింపులకు మొగ్గు చూపించడం మెరుగైన ఆప్షన్ అవుతుంది. దీనివల్ల గృహ రుణం బకాయిని వేగంగా తగ్గించుకోవచ్చు. నిర్ణీత కాలం కంటే ముందుగానే తీర్చివేయవచ్చు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగినా పెద్ద భారం పడకుండా ఉంటుంది. ఉద్యోగులు అయితే బోనస్ రూపంలో వచ్చిన మొత్తాన్ని గృహ రుణానికి చెల్లింపులు చేసుకోవచ్చు. అదే మాదిరి, ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనంలో సగ భాగాన్ని గృహ రుణ ఈఎంఐ పెంచి కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. క్రెడిట్ స్కోరు అనుకూలత వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అప్పుడు ఫ్లోటింగ్ రేటును ఎంచుకోవడమే మార్గం. అప్పటికే తీసుకున్న గృహ రుణానికి సంబంధించి వడ్డీ భారాన్ని భరించలేకపోతుంటే.. దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేసే బ్యాంకుకు లేదా ఇతర సంస్థకు బదిలీ చేసుకోవడం ఒక మార్గం. సేవలు బాగుండి, తక్కువ రేటుకు ఆఫర్ చేసే సంస్థకు నిశ్చింతంగా మారిపోవచ్చు. గృహ రుణ బ్యాలన్స్ను బదిలీ చేసుకునే ముందు, కొత్తగా రుణం ఇచ్చే బ్యాంకులో ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర చార్జీలను కూడా చూడాలి. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే కాస్త డిమాండ్ చేసి రేటును తగ్గించుకోవచ్చు. బ్యాలన్స్ బదిలీ విషయంలోనూ మెరుగైన క్రెడిట్ స్కోరు ఉపయోపడుతుంది. -
అద్దెల బాదుడు
- రెండు గదుల పోర్షన్కే రోజుకు రూ.10 వేలు అద్దె! - పుష్కరాల సాకుతో సొమ్ము చేసుకుంటున్న వైనం - హోటళ్లు, లాడ్జిల్లో గదులు హౌస్ఫుల్ సాక్షి, రాజమండ్రి : ‘ఇల్లు అద్దెకు ఇస్తారా?’ అని ఇప్పుడు రాజమండ్రిలోని కొన్ని ప్రాంతాల్లో ఏ ఇంటి యజమానినైనా అడిగితే.. రోజువారీ ఇస్తామని చెబుతున్నారు! ఇదేమిటనుకుంటున్నారా? డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను రూమ్లు, హాల్ను వేరు చేసి మరీ అద్దెకు ఇస్తున్నారు. రోజువారీ అద్దె కూడా రూమ్కు వెయ్యి రూపాయల నుంచి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. అదే ఒక పోర్షన్ తీసుకోవాలనుకుంటే రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ డిమాండు చేస్తున్నారు. మరికొంతమంది డార్మిటరీ మాదిరిగా మంచాలు వేసి అద్దెకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇల్లు మారదామని ఏర్పాట్లు చేసుకున్నవారు ఈ నెలకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ అద్దెల దరువు భరించలేక భక్తులే కాదు.. బయటి ప్రాంతాల నుంచి రాజమండ్రికి బదిలీ అయినవారు, ఉపాధి కోసం వచ్చినవారు ఇంటికోసం నానా ఇబ్బందులూ పడుతున్నారు. గోదావరి తీరానికి ఒకటి రెండు కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల అద్దె చుక్కలను తాకుతోంది. హోటళ్లు, లాడ్జీల్లో గదుల్లేవని తెలుసుకున్న భక్తులు తమకు తెలిసినవారి ద్వారా అద్దె ఇళ్ల కోసం గాలిస్తున్నారు. ఇదే అదనుగా ఇంటి యజమానులు అద్దె నెలకు కాకుండా రోజువారీగా చెబుతున్నారు. ఇక ఘాట్లకు సమీపంలోని ఇంటి యజమానులైతే ఒకప్పుడు నెలకు నాలుగైదు వేల అద్దెకు ఇచ్చిన పోర్షన్లకే ఇప్పుడు రోజుకు రూ.10 వేల అద్దె చెబుతున్నారంటే డిమాండ్ ఏవిధంగా ఉందే ఊహించవచ్చు. క్యాష్ చేసుకునేందుకు పోటాపోటీ! గోదావరి పుష్కరాలకు కోట్లాదిగా భక్తులు వస్తారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీసీ, రైల్వే వంటి ప్రభుత్వ శాఖలే కాదు ప్రైవేటు వ్యాపారులూ పోటీ పడుతున్నారు. మరోవైపు హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులు కూడా ముందుగానే జాగ్రత్త పడ్డారు. పుష్కరాల సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోగలమని, మిగతా రోజుల్లో అంత బిజినెస్ ఉండదని చెబుతున్నారు. ఇదేం దారుణమని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ప్రభుత్వాధికారులు, పోలీసులకే చాలావరకూ ఇచ్చేయాల్సి వచ్చింది! గదుల్లేవ్.. ఒకటీ రెండు మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందు రూ.1200 ఉన్న డబుల్ బెడ్ రూమ్ టారిఫ్ ఇప్పుడు 12 గంటల చెక్ అవుట్తో రూ.2 వేలకు ఇస్తాం’ అని నగరంలో ఓ ‘సి’ గ్రేడ్ హోటల్ నిర్వాహకుడు చెప్పారు. వాస్తవానికి నగరంలో ‘ఎ’ గ్రేడ్ హోటళ్లు ఐదింటిలోని మొత్తం 334 గదుల్లో సగం, ‘బి’ గ్రేడ్ 24 హోటళ్లలోని 741 గదుల్లో 30 శాతం, ‘సి’ గ్రేడ్ 21 హోటళ్లలోని 299 గదుల్లో 25 శాతం మాత్రమే తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఇలా తీసుకున్న దాదాపు 1350 గదులను పుష్కరాలకొచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ఉన్నతాధికారులకు కేటాయించనున్నారు. ఇవి కాకుండా పోలీసులు కూడా తమ ఉన్నతాధికారుల కోసం హోటళ్లలో మరికొన్ని గదులను అనధికారికంగా రిజర్వు చేయించినట్లు విమర్శలు వస్తున్నాయి. భక్తులకు బాదుడే బాదుడు మామూలుగా హోటళ్లు, లాడ్జీల్లో చెక్ అవుట్ సమయం 24 గంటలు ఉంటుంది. అధికారులకు కేటాయించిన రూములకు పుష్కరాలు 12 రోజులూ ఇదే సమయం వర్తిస్తుంది. టారిఫ్లో 25 శాతం తగ్గించేశారు. దీనివల్ల హోటళ్లు, లాడ్జిల యజమానులకు కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి భక్తులపై భారం వేస్తున్నారు. చెక్ అవుట్ టైం 12 గంటలకు కుదించేశారు కాబట్టి టారిఫ్ కూడా సగానికి తగ్గాలి. కానీ, అలాకాకుండా 20 శాతమే తగ్గించడానికి జిల్లా అధికారులు అనుమతి ఇచ్చారు. చెక్ అవుట్ టైం కుదించడం వల్ల రద్దీ తగ్గుతుందని, భక్తులు స్నానాలు ఇతరత్రా పూజలు ముగించుకొని వెనువెంటనే నగరం నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారని ఓ హోటల్ మేనేజర్ అన్నారు. టారిఫ్ తగ్గించినా సర్వీస్ టాక్స్, ఇతరత్రా చార్జీలను మామూలుగానే వసూలు చేస్తున్నారు. హోటళ్ల నిర్వాహకులు. పుష్కరాల్లో 18, 19, 20, 22 తేదీలకు ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. ఈ దృష్ట్యా భక్తులు ఆ రోజుల్లో రెట్టింపు సంఖ్యలో రావచ్చన్నది అంచనా. ఆయా తేదీల్లో నగరంలోని ఏ హోటల్, లాడ్జిలోనూ ఒక్క గది కూడా దొరకని పరిస్థితి. దీంతో గంటల చొప్పున అద్దెకు ఇచ్చేందుకు కొన్నిచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులపై భారం మోపే హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులకే కాకుండా ఇంటి యజమానులకు కూడా అధికారులు తగు హెచ్చరికలు జారీ చేయాలని సగటు పౌరులు ఆశిస్తున్నారు. ఏం చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే!