I and PR
-
డిజిటల్ మీడియాకూ ప్రభుత్వ ప్రకటనలు
హైదరాబాద్: ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్లైన్ న్యూస్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలంటూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA) నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్. ఈ మేరకు ఆన్లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ లేఖ అందించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్.. త్వరలోనే ఆన్లైన్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియ షురూ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుందన్నారు.ఈ కొత్త మాధ్యమంలో అనేక మంది జర్నలిస్టులు పని చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సహకరించాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించి, ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం సంతోషకరమని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు తెలంగాణ మీడియా అకాడమీ ఆక్రిడిటేషన్లు ఇచ్చేందుకు గైడ్లైన్స్ రూపొందించడం కొత్త మీడియా జర్నలిస్టులకు శుభపరిణామమని చెప్పారు. -
ఐ అండ్ పీఆర్ చీఫ్ డిజిటల్ డైరెక్టర్గా దేవేందర్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం చీఫ్ డిజిటల్ డైరెక్టర్గా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవేందర్ రెడ్డి ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్గా పార్టీకి విస్తృత ప్రచారం కల్పించారు. -
‘సాంస్కృతిక’ సంరంభం
నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం హన్మకొండ కల్చరల్ : స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని విద్యా శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏజేసీ తిరుపతిరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నృత్య స్రవంతి కూచిపూడి కళా క్షేత్రం , వరంగల్ కృష్ణాకాలనీ హైస్కూల్, హన్మకొండ ప్రాక్టీసింగ్ పాఠశాల, కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్స్ హైస్కూల్, హసన్పర్తి సుజాత విద్యానికేతన్, చాలెంజ్ డ్రీమ్ డ్యాన్స్ స్కూల్, పీఎస్ నాచినపల్లి, సీటీసీ ప్లేస్కూల్, కేజీబీవీ వరంగల్, మల్లికాంబ మనోవికాస కేంద్రం, హన్మకొండ తేజస్విని హైస్కూల్, మాస్టర్జీ గర్్ల్స హైస్కూల్, స్టాండర్డ్ పబ్లిక్ స్కూల్, సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్, అతిథి మనోవికాస కేంద్రం విద్యార్థుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ పాటల పోటీల్లో సుహిత్ ద్వితీయ బహుమతి అందుకున్నారు. పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్, విద్యాసాగర్, పీవీ మదన్మోహన్, నివేదిత, విదుమౌళి, తాడూరి రేణుక పాల్గొన్నారు. -
నేడు జర్నలిస్టుల ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఐ అండ్ పీఆర్ ఎదుట ‘సావధాన దినం’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ జరిగే ఈ ధర్నాలో నగరంలోని జర్నలిస్టులందరూ పాల్గొనాలని సిటీ జర్నలిస్టుల సంఘం నేతలు యాదగిరి, కోటిరెడ్డి, కె. సుధాకర్ రెడ్డిలు తెలిపారు.