Indian eves
-
భారత్దే టి-20 సిరీస్
రాంచీ: శ్రీలంకతో మూడు టి-20ల సిరీస్లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం జరిగిన రెండో టి-20లో భారత్ ఐదు వికెట్లతో గెలుపొంది.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. భారత కెప్టెన్ మిథాలీ రాజ్ (51) అజేయ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు బౌలర్లు ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. దిలానీ మనోదర 27, సిరివర్దనె 26, జయంగని 22 పరుగులు చేశారు. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదు వికెట్లు కోల్పోయి మరో ఆరు బంతులు మిగిలుండగా విజయం సాధించింది. మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీతో పాటు అనూజా పాటిల్ 34 పరుగులు చేసింది. -
అమ్మాయిలు అదే జోరు..
రాంచీ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. టి-20 సిరీస్లోనూ అదే జోరు కొనసాగించింది. లంక మహిళల జట్టుతో మూడు టి-20ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో మిథాలీ రాజ్ సేన 34 పరుగులతో విజయం సాధించింది. అనూజా పాటిల్ (22 నాటౌట్, మూడు వికెట్లు) ఆల్రౌండ్ షోతో రాణించి జట్టు విజయంతో కీలక పాత్ర పోషించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 36, మందన 35, అనూజా పాటిల్ 22 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లు సుగంధిక కుమారి మూడు, కౌశల్య రెండు వికెట్లు తీశారు. అనంతరం 131 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక పూర్తి ఓవర్లు ఆడి 7 వికెట్ల నష్టానికి 96 పరుగులే చేయగలిగింది. దిలాని మనోదర 41 (నాటౌట్) చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది. సిరివర్దెనె 18, కరుణరత్నె 14 పరుగులు చేశారు. భారత బౌలర్లు అనూజా పాటిల్ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. -
రెండో వన్డేలో భారత మహిళలు ఓటమి
స్కార్బోరగ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో రెండో వన్డేలో 13 పరుగులతో ఓటమి చవిచూశారు. దీంతో మూడు వన్డేలో సిరీస్లో మరో మ్యాచ్ మిగిలివుండగానే ఇంగ్లండ్ 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి విజయం సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ చార్లొటె ఎడ్వర్డ్స్ సెంచరీ చేసి జట్టును ఆదుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48.4 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది.