infant child
-
కాకినాడలో హృదయ విదారకం.. ఆడపిల్ల పుట్టిందని గోడకేసి..
సాక్షి, కాకినాడ: ఆడపిల్లగా జన్మించడమే ఆ శిశువుపాలిట మరణ శాసనమైంది. ఆడిపిల్ల భారం మోయలేనంటూ అమ్మేస్తానని భార్యతో చెప్పడంతో ఆమె వద్దన్న పాపానికి రక్తం పంచిన కన్న తండ్రే ఆ శిశువును కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. కాకినాడ జగన్నాథపురం పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన చెక్కా భవానీ కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కేతా శివమణి అనే వ్యక్తితో సహాజీవనం చేస్తోంది. వీరికి కొన్నేళ్ల క్రితం బాబు జన్మించాడు. అనంతరం, ఆ బాలుడిని శివమణి మరో వ్యక్తి అమ్మేశాడు. ఇక, 34 రోజుల క్రితమే వీరికి మరో ఆడ శిశువు జన్మించింది. అప్పటి నుంచి శివమణి ఆడపిల్ల పుట్టిందని అసంతృప్తితో ఉన్నాడు. ఆడపిల్ల తనకు భారం అంటూ భవానీతో నిత్యం గొడవ పడుతూనే ఉన్నాడు. దీనిలో భాగంగానే బుధవారం రాత్రి భవానీ వద్దకు వచ్చి మంచి బేరం కుదిరింది అని బిడ్డను అమ్మేస్తానని చెప్పాడు. దీంతో, కంగుతిన్న భవానీ.. శివమణి తీరును తప్పుబట్టింది. బిడ్డను అమ్మేందుకు భవానీ అంగీకరించను అంటూ తెగేసి చెప్పింది.ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం జరుగుతుండగానే పక్కనే నిద్రపోతున్న శిశువును తన చేతిలోకి తీసుకున్న శివమణి.. బిడ్డ గొంతు నులిమి గోడకు కొట్టాడు. అప్పటికే అచేతనంగా పడి ఉన్న శిశువును భవానీ స్థానికుల సాయంతో కాకినాడ జీజీహెచ్కు తీసుకెళ్లింది. కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చేరిన కాసేపటికే శిశువు మృతిచెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ వన్టౌన్ పోలీసులు సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు శివమణి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: జత్వానీ ఫోన్, ల్యాప్టాప్ను ఎఫ్ఎస్ఎల్కు పంపండి -
కిరాతక నర్సు లూసీకి జీవిత ఖైదు..?
లండన్: వాయువ్య ఇంగ్లాండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నియోనైటల్ విభాగంలో పనిచేస్తున్న లూసీ లెట్బీ(35)కి ఏడుగురు పసి పిల్లలను చంపిన నేరంలో జీవితకల జైలుశిక్షపడింది. కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్, నియోనైటల్ విభాగంలో జూన్ 2015 నుండి జోన్ 2016 వ్యవధిలో పసిపిల్లలను చంపిన కేసులో లూసీ లెట్బీని అరెస్టు చేసారు బ్రిటీష్ పోలీసులు. బ్రిటీష్ మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో ఈ కేసుపై వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం లూసీ నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఏడుగురు పిల్లలను చంపగా మరో ఆరుగురిపై హత్యాయత్నానికి పాల్పడింది. పసిపిల్లల శరీరంలోకి ఇంజక్షన్ ద్వారా గాలిని పంపించడం, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, పాలు ఎక్కువగా పట్టించడం ద్వారా ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిపింది. ఈ కేసుపై మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో సుమారు 110 గంటలు వాదనలు జరగగా సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడనుంది. నేరం తీవ్రత పెద్దది కాబట్టి ఆమెకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముందంటున్నాయి కోర్టు వర్గాలు. లూసీకి జీవితఖైదు పడే అవకాశముందని బాధిత కుటుంబాలకు తెలిసిన తర్వాత వారిలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేయగా మరికొంతమంది ఆమెకు ఇంకా పెద్ద శిక్ష పడాలని ఈ శిక్ష సరిపోదని అన్నారు. శుక్రవారం నాడు చివరి రోజు వాదనలు జరిగిన సమయంలో లూసీ కన్నీటి పర్యంతమై సానుభూతి పొందే ప్రత్యత్నం చేసినా కూడా ఆమెను ఎవ్వరూ కనికరించలేదు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
ఎంత ఘోరం? పసికందు పేగులు తీసిన వీధి కుక్క
నోయిడా: తల్లిదండ్రులు భవన నిర్మాణంలో కూలీ పనులు చేసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి ఏడు నెలల పసికందుపై ఓ వీధి కుక్క దాడి చేసింది. పేగులు బయటకు తీయటంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తర్ప్రదేశ్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లోటస్ బౌలేవార్డ్ సెక్టార్ 100లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి శునకాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలీ పని చేసుకునే ఓ కుటుంబం తమ 7 నెలల పాపతో అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన శిశువును నోయిడాలోని యదార్థ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. పసికందు పేగులు బయటకు రావటం వల్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయనా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కలు దాడి చేయటం ఇదేం మొదటి సారి కాదని, ప్రతి 3-4 నెలలకోసారి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. నోయిడా అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. నోయిడా హౌసింగ్ సొసైటీ ముందు స్థానికుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఈ విషయంపై ఏఓఏ స్పందించారు. నోయిడా అథారిటీతో మాట్లాడామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇదీ చదవండి: చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి -
చిన్నారులకు అత్యుత్తమ వైద్యం
ఆరోగ్యశ్రీ దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా నిలవాలి. ఆరోగ్యశ్రీ చికిత్సల కింద ప్రభుత్వం నిర్ధారిస్తున్న రేట్లు ఇబ్బందులకు గురిచేసేలా కాకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఫిక్స్ చేయాలి. ఇవాళ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వారాల లోపే బిల్లులు చెల్లిస్తున్నాం. పథకం అమలులో బాధ్యత, విశ్వసనీయత చాలా ముఖ్యం. సకాలంలో బిల్లుల చెల్లింపు ఆరోగ్యశ్రీ విశ్వసనీయతను పెంచుతుంది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఆరోగ్య ఆసరా కూడా ఒక విప్లవాత్మక చర్య. ప్రతి రోజూ ఆరోగ్యశ్రీ పథకంపై దృష్టి పెట్టాలి. అప్పుడే పేదల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్ తగ్గిన తరువాత ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యల బారిన పడుతున్న చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా హెల్త్ హబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, రెండు వారాల్లోగా హెల్త్ హబ్లపై విధివిధానాలను ఖరారు చేయాలని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కోవిడ్ కారణంగా మరణించిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కుటుంబాలకు త్వరగా ఆర్థిక సాయం అందించాలని సూచించారు. కోవిడ్ రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బందికి కూడా ఆర్ధిక సహాయం అందించడంపై పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్... కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్ సంబంధిత అంశాల్లో నర్సులు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయాల గురించి అధికారులు వివరించారు. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తం 1,600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అదనంగా చిన్న పిల్లల వైద్యులు, స్టాఫ్ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. టైర్–1 నగరాల తరహాలో అత్యుత్తమ వైద్యం హెల్త్ హబ్లపై సమీక్ష సందర్భంగా జిల్లా కేంద్రాల్లో వీటి ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు ఏర్పాటు కావాలని సీఎం సూచించారు. దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లోని పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్స విధానాలు, టెక్నాలజీ, అత్యుత్తమ సదుపాయాలను ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకు రావాలన్నదే హెల్త్ హబ్ల వెనుక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకూ అందుబాటులోకి రావాలన్నారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), కోవిడ్ అండ్ కమాండ్ కంట్రోల్ చైర్పర్సన్ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ.కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వారంలో గణనీయంగా తగ్గిన కోవిడ్ కేసులు (జూన్ 6–12 వరకు) ► జూన్ 12న 6.58 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు. మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం 8 అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 17.5% లోపే. ► 7 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 0–9% లోపే. ► చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో 10–19 శాతం మధ్య పాజిటివిటీ రేటు ► 85,637కి తగ్గిన యాక్టివ్ కేసులు. 94.61 శాతానికి పెరిగిన రికవరీ రేటు. ► 104 కాల్ సెంటర్కు ఏప్రిల్ 15 నుంచి 5 లక్షలకుపైగా కాల్స్ అందగా ఔట్ గోయింగ్ కాల్స్ సంఖ్య 6,41,093. ప్రస్తుతం రోజు వారీ కాల్స్ సుమారు 2,700. ► జూన్ 12 వరకూ 2,303 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు, 157 మంది మృతి. -
రెండేళ్ల పరిచయం.. 105 మంది పిల్లలు కావాలి!
ఆమె వయసు 23. ఆయనకు 56. ఆమె తన ఆరేళ్ల కూతుర్ని వెంటపెట్టుకుని నల్ల సముద్ర తీర ప్రాంతంలో విహారానికి వెళ్లినప్పుడు తొలిసారి ఆయన్ని చూసింది. ఆయన తనను చూసి ‘హాయ్’ అన్నప్పుడు ఆ కళ్లలో తనపై కనిపించిన ప్రేమను చూసింది. ఆమె సింగిల్ మదర్. ఆయన పెళ్లయిన పెద్ద మనిషి. ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ‘ఏదైనా కోరుకో హృదయేశ్వరీ..’ అని భార్యకు వరమిచ్చాడు భర్త. ఆయన బిలియనీర్. అందుకు వరం ఇవ్వడం కాదు. ఆమె మీద ఆయనకు ఉన్న ప్రేమ అంతకన్నా సంపన్నమైనది! ‘‘నాకు 105 మంది పిల్లలు కావాలి..’’ అందామె! దానర్థం.. ‘‘నిన్నే కోరుకున్నా.. నీ ప్రతి రూపాలే నాకు నూటా అయిదు కావాలి’’ అని. గత ఏడాదిలో వాళ్లకు పది మంది పిల్లలు పుట్టారు. మిగతా పిల్లల్ని కొంత గ్యాప్ తర్వాత ప్లాన్ చేసుకుంటుందట ఆమె. ఇక్కడ చూడండి.. పిల్లల్లో పిల్లలా కలిసిపోయి ఆ తల్లి ఎలా నవ్వులు చిందిస్తోందో!! ఆ ఇరవై మూడేళ్ల అమ్మాయి పేరు క్రిస్టీనా ఆజ్టర్క్. ఇక నుంచి క్రిస్టీనా అందాం. రష్యన్ తను. మాస్కోలో ఉండేది. ఆ యాభై ఆరేళ్ల పెద్దాయన పేరు గాలిప్ ఆజ్టర్క్. ఇక నుంచి గాలిప్ అందాం. జార్జియా తనది. ఒకప్పుడు రష్యన్ భూభాగం. ఇప్పుడు ప్రత్యేక దేశం. ఆ దేశంలోని నల్ల సముద్ర తీరప్రాంతమైన బటూమీ పట్టణంలో ఉంటారు ఆయన. ట్రావెల్ మేగ్నెట్. కనుక మిలియనీర్. దేవుడు ఎలా కలుపుతాడో చూడండి. ఇద్దర్నీ కలిపాడు. ఇద్దరూ కలిసి ఇప్పుడు బటూమీలో ఉంటున్నారు. భర్త ఎక్కడుంటే అక్కడే కదా భార్య ఉండేది. అందుకే మాస్కో నుంచి తన ఆరేళ్ల కూతురు వికాతో పాటు గాలిప్ దగ్గరికి వచ్చేసింది క్రిస్టీనా. ఇప్పటి వరకు ఇదంతా ఒక మామూలు విషయం. లోకంలో అనేకం ఉంటాయి.. ‘నువ్వాదరిని, నేనీదరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనుకునే జంటలు. వీళ్ల స్టోరీ ప్రత్యేకమైనది. ఆసక్తి కలిగించేది. అయితే స్టోరీ మొత్తం చదివినా సమాధానం లభించని రెండు ప్రశ్నలైతే మీకు మిగిలిపోతాయి. క్రిస్టీనాకు పదిహేడేళ్ల వయసుకే పుట్టిన కూతురు ‘వికా’ కు తండ్రి ఎవరన్నది, గాలిప్ భార్యా బిడ్డలు ఎవరన్నది. ఈ దంపతులు ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు కనుక అడిగి బలవంత పెట్టడం మర్యాద కాదు. ప్రస్తుతం అయితే వీళ్లకు పదిమంది పిల్లలు! వికా తో కలిపి పదకొండు మంది. ఇక కథలోకి వెళ్దాం. పిల్లల్లో ఒకరిగా క్రిస్టీనా క్రిస్టీనాకు, గాలిప్కు పరిచయం అయింది రెండేళ్ల క్రితమే. కూతుర్ని తీసుకుని మాస్కో నుంచి నల్ల సముద్రానికి విహారానికి వచ్చినప్పుడు ఒడ్డున ఉన్న ఆ ఇసుకలో వారి చూపులు కలిశాయి. ‘నాకనిపించిందీ.. తను నా కోసమే పుట్టింది’ అని ఇప్పటికీ ఆశ్చర్యంగా చెబుతుంటారు గాలిప్. ఇక క్రిస్టీనా అయితే ‘ఆయనలో తెలియని ఆకర్షణ ఏదో నన్ను ఆయన వైపు లాగేసింది’ అంటారు. కాబట్టి.. వయసును పక్కన పెట్టి చూస్తే వీళ్లు చూడచక్కని జంట. ఆయనకు ఆస్తులు, అంతస్తులు, ఇంకా అలాంటివేవో కోట్ల కొద్దీ ఉన్నాయి. కానీ క్రిస్టీనా.. ‘నిన్నే కోరుకున్నా’ అన్నారు. ‘నన్ను సరే, ఏదైనా కోరుకో’ అన్నారు ఆయన. దేవుడు వరం ఇస్తానంటే మొహమాటపడాలి. భర్త వరం ఇస్తానంటే ఎగిరి భుజంపై కూర్చోడానికి వెనకాముందూ చూడక్కర్లేదు. ‘నీలాంటి పిల్లలు కావాలి. వంద మంది కావాలి. వంద మంది కాదు. వందా ఐదు మంది’ అంది క్రిస్టీనా. ‘ఓ బేబీ’ అని మురిసిపోయారు గాలిప్. ‘అదేం లెక్కా.. వన్నాట్ వైఫ్’ అని ఆయనేం ఆశ్చర్యపోలేదు. ‘ఓకే.. ప్లాన్ చేద్దాం’ అన్నారు. ప్లాన్ చేస్తే అయ్యే పనా! అయినా ప్లాన్ చేశారాయన. పదిమంది సరోగేట్ మదర్స్ని వెదికి రెండేళ్ల వ్యవధిలో పదిమంది బిడ్డల్ని ఆమె చేతికి అందించాడు. అండం ఆమెది. శుక్రకణం అతడిది. గర్భం వేరే స్త్రీది. ఇప్పుడా ఇల్లు క్రిస్టీనా సొంత కూతురు విగాతో, పాటు గాలిప్తో కలిగిన పది మంది శిశువుల కేరింతలతో బెలూన్లు ఎగురుతున్నట్లుగా కళకళలాడుతోంది. మొదటి బిడ్డ ముస్తాఫా 2020 మార్చి 10 పుట్టాడు. పదో బిడ్డ ఒలీవియా 2021 జనవరి 16 న పుట్టింది. మరి క్రిస్టీనా కోరుకున్న వరంలోని మిగతా 95 మంది మాటేమిటి! ‘కాస్త ఆగుతాను’ అంటోంది క్రిస్టీనా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటూ. మొదటైతే.. ‘ఏడాదికో బిడ్డను కంటాను..’ అని పట్టింది. క్రిస్టీనా. గాలిప్ ఒప్పుకోలేదు. ‘మన బిడ్డలే కదా నీకు కావలసిందీ’ అని సరోగసీ ఐడియా చెప్పారు. పిల్లల కోసం కొని పెట్టిన పుస్తకాలతో క్రిస్టీనా, ∙భర్తతో క్రిస్టీనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయా చొప్పున పదిమంది ఆయాలు ఉన్నారు! వాళ్లందరి సంరక్షణను వారికే అప్పగించింది క్రిస్టీనా. అయితే తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. అందరికీ ఒకటే నిద్ర టైమ్. రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు. అలా వారికి అలవాటు చేయించింది. శిశువుల్లో కవలలు, ఒకే పోలికలు ఉన్నవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ.. ‘హూ ఈజ్ హూ..’ అన్నది పేర్లతో చెప్పేస్తుంది క్రిస్టీనా. ‘వంద మంది పిల్లలైనా కనిపెట్టేస్తాను’ అని నవ్వుతూ అంటోంది తను. ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకుంటోంది. ‘పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవడం తేలికైన సంగతి కాదు. ఈ పది మందీ కొంచెం పెద్దయ్యాకే మరికొంత మంది పిల్లల కోసం ప్రయత్నిస్తాను’’అంటోంది. ఆరేళ్ల కూతురుకి కూడా ఆ పిల్లల చిన్నచిన్న పనులు అప్పజెబుతోంది. ఇక పిల్లలకు ఏం చదివి వినిపించాలి, ఏ వేళకు వారికి ఏ పని చేయాలి అనేవి క్రిస్టీనానే ఆయాలకు చెబుతంటుంది. ఏడుస్తున్న పిల్లల్ని మాత్రం ఆయాలను ఎత్తుకోనివ్వదు. తనే దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది. ఫుడ్డు కూడా గ్రాముల్లోనే. ఒక గ్రాము తక్కువా కాదు. ఒక గ్రాము ఎక్కువా కాదు. ఆయాలకు ఇంకొక పని కూడా ఉంది. తడిసిన డయపర్లను ఫొటో తీయడం. ఆ తడి కలర్ని బట్టి బిడ్డల ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది క్రిస్టీనా. ప్రతి శిశువుకూ ఒక డైరీ ఉంటుంది. అందులో ఆ శిశువు వివరాలన్నీ ఏ రోజుకారోజు ఆయాలు నోట్ చేస్తుంటారు. వాళ్లేం తిన్నారు, ఎంత తిన్నారు, ఎన్ని గంటలకు నిద్రలోకి ఒరిగిపోయారు, తిరిగి ఎన్ని గంటలకు నిద్ర లేచారు. మధ్యతో ఎన్నిసార్లు మేల్కొన్నారు.. ఇలా ప్రతి వివరమూ ఉంటుంది. ఇటీవల క్రిస్టీనా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘మా ఇల్లు నందనవనం, ప్రశాంత నిలయం. నేనూ నా భర్త ఇంట్లో సినిమాలు, కార్టూన్ షోలు చూస్తాం. పిల్లలకు పెట్టం గానీ మేమిద్దరం జంక్ఫుడ్ తింటాం.. (ఆ ఆరేళ్ల పిల్లకు కొద్దిగా పెడతారేమో!), బ్యాక్గామన్ గేమ్ ఆడతాం.. ఇంకా పిల్లలందరితో కలిసి వాకింగ్ చేస్తాం..’’ అని షేర్ చేసుకున్నారు. నిజంగా పంచుకుంటే పెరిగే సంతోషమే ఇది. పిల్లలు, పిల్లల్లాంటి పెద్దలు ఎక్కడున్నా వారి ప్రేమ వెలుగులు భూగోళమంతా ప్రసరిస్తూ ఉంటాయి. -
ఏ తల్లి కన్నబిడ్డో... ఎందుకు వదిలేసిందో
సాక్షి, చందానగర్ : ఏ తల్లి కన్నదో...ఎందుకు వదిలేసిందో తెలియదు...పుట్టిన కొద్ది గంటల్లోనే ఓ పసికందును రోడ్డుపై వదిలేశారు. స్థానికులు ఆ పసికందును చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్లితే.. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహా కల్ప బ్లాక్ నెం. 26,27 మధ్య రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్న ఒక మగ శిశువును వదిలేశారు. మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చలికాలం కావడంతో ఆ బాలుడు గుక్క పెట్టి ఏడవంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం స్థానికులను విచారించారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం కొండాపూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం యూసుఫ్గూడలోని శిశువిహార్లో బాలుడ్ని అప్పగించినట్టు సీఐ రవీందర్ తెలిపారు. ∙ -
వికసించని బాల్యానికి విహంగాల నైపుణ్యం!
అంబిక శారీరంగా, మానసికంగా ఆరోగ్యవంతమైన పిల్లలు ఇంట్లో ఇద్దరికి మించి ఉన్నారంటే ఆ అల్లరి అంతా ఇంతా కాదు. అలాంటిది బుద్ధిమాంద్య, మానసిక వైకల్యం కలిగిన పిల్లలు ఉంటే.. వారిని చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు. పదిహేనేళ్ల వయస్సు వచ్చినా ఆకలేస్తే అన్నం తినాలనే ఆలోచన ఉండదు. అత్యవసరాలకు వెళ్లాలన్నా చెప్పడం రాదు. అలాంటి మనో, దేహ అసహాయతలను జయించడానికి అవసరమైన బాటలను చిన్నారుల బాల్యం నుంచే వేస్తోంది కర్నూలులోని అంబికా శిశు కేంద్రం. ఈ కేంద్రంలో వైకల్యంతో మాటలు రాని పిల్లలకు ఫిజియోథెరపి, స్పీచ్ థెరపి లాంటి అత్యవసరమైన చికిత్సలతోపాటు అనునిత్యం పాఠాలు, ఆటలు, పాటలు నేర్పిస్తున్నారు. ఎటువంటి విరాళాలూ సేకరించకుండా, ఆర్థిక సహకారాలు పొందకుండా గత ఇరవై మూడేళ్లుగా ఉచిత సేవలు అందిస్తోంది అంబికా శిశు కేంద్రం. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో అంబికా శిశు కేంద్రం 1995లో ఆవిర్భవించింది. హేమ్చంద్ దేవ్చంద్ చారిటబుల్ ట్రస్ట్ (హెచ్డీసీ ట్రస్ట్) ఆధ్వర్యంలో.. బహుళ వైకల్యాలు కలిగిన పిల్లలకు జీవన నైపుణ్యాలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కేవలం ఇద్దరితో ప్రారంభమైన ఈ కేంద్రంలో ప్రస్తుతం నూటఎనభై మంది సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవడం, వీలైనంత తక్కువగా ఇతరుల సేవలను ఉపయోగించుకోవడం నేర్పుతారు. అలాగే చేయగల, చేసుకోగల సాధారణ పనులు నేర్పుతారు. సమాజంలో ఎలా మసులుకోవాలి, షాపులకు వెళ్తే కావాల్సిన వస్తువులను ఎలా కొనుగోలు చేయాలి, పొదుపు, సురక్షిత జీవనం, ప్రమాదం ఉందనుకున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, తప్పిపోయినప్పుడు తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సమీపంలో ఉన్న వాళ్లకు ఇచ్చి సమాచారం ఇవ్వమని చెప్పడం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా సమాజంలో అవహేళనకు గురి కాకుండా ఉండేలా సూచనలిస్తారు.హేమ్చంద్ దేవ్చంద్ చారిటబుల్ ట్రస్ట్ 1968లో ఏర్పడింది. ప్రస్తుతం కాంతిలాల్ షా మేనేజింగ్ ట్రస్ట్గా వ్యవహరిస్తున్నారు. వ్యాపారం రంగంలో రాణిస్తున్న కాంతిలాల్ షా సొదరులు సమాజ సేవా చేయాలన్న లక్ష్యంతో ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 1971లో హెచ్డీసీటీ (సేuŠ‡ హాస్పిటల్) పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలందించేందుకు శ్రీకారం చుట్టారు. మెడికల్ క్యాంప్ల నిర్వహణ, ఉచిత మందులు, కంటి పరీక్షల క్యాంప్లు, ఉచిత కళ్ల అద్దాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో బుద్ధిమాంద్య, మానసిక, బహుళ వైకల్యం కలిగిన పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్ని చూపును తొలిగించేందుకు అంబికా శిశుకేంద్రం ఏర్పాటు చేశారు. ప్రసుత్తం నాలుగు అంతస్తుల సొంత భవనంలో కేంద్రాన్ని నడుపుతూ సేవలందిస్తున్నారు. ప్రత్యేక వైద్యసేవలు, శిక్షణతో పాటు చదువు, స్వయం ఉపాధి పనులు వంటి ముఖ్య అంశాలతో అంబికా శిశుకేంద్రం పని చేస్తోంది. వివిధ వ్యాపారాలలో నిత్యం తీరిక లేకుండా ఉన్నా సేవా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ట్రస్టు వ్యవస్థాపకులు. అంబికా శిశు కేంద్రంలో అరవై రెండు మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉండగా వారి జీత భత్యాలు, శిక్షణ, కేంద్రం నిర్వాహణకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఎస్.పి. యూసుఫ్, సాక్షి, కర్నూలు ఫోటోలు: డి. హుసేన్ నాన్న ఇచ్చిన స్ఫూర్తి మా నాన్న హేమ్చంద్ దేవ్చంద్ 1943లో చెన్నై నుంచి కర్నూలుకు వచ్చారు. వంట నూనె తయారి, అమ్మకాలు చేపట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. క్రమంగా రైస్మిల్, దాల్మిల్, రిఫైనరీ, సబ్బుల ఫ్యాక్టరీలను నెలకొల్పాం. ‘మనకు అన్నం పెట్టే ఊరి ప్రజల కోసం చేతనైనంత చేయాలి’ అని నాన్న చెప్పేవారు. ఆ మాట ఇచ్చిన స్ఫూర్తితో అంబికా శిశు కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నాం. కేంద్రం నిర్వహణలో మా కోడలు, ఇతర కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, సహకారం ఉంది. కాంతిలాల్ షా, మేనేజింగ్ ట్రస్ట్ డిగ్రీ చదువుతున్నా నాకు సెరిబ్రల్ పాల్సీ (మెదడుకు సంబంధించిన ఓ వ్యాధి) అని డాక్టర్లు నిర్ధారించారు. 1995లో నన్ను అంబికా శిశు కేంద్రంలో చేర్పించారు. అక్కడ శిక్షణ, చదువు నేర్చుకొని 2009లో టెన్త్ పూర్తి చేశా. ఇంటర్ చేసి ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నా. ఇక్కడ చేరిన వాళ్లకు కంప్యూటర్ చేర్పించేందుకు ఇక్కడే ట్రైనీ ఉద్యోగంలో చేరాను. కిరణ్, సెరిబ్రల్ పాల్సీ విద్యార్థి -
కన్నతల్లే.. బిడ్డను కడతేర్చింది
-
కన్నతల్లే.. బిడ్డను కడతేర్చింది
తిరుపతి : కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కన్నబిడ్డను కడతేర్చింది. అనురాగం పంచాల్సిన అమ్మ మనసు శిశువు ఉసురుతీసింది. పేగు తెంచుకుని పుట్టిన తన 8 నెలల మగ శిశువును తల్లి దారుణంగా హతమార్చింది. తల్లి కొట్టిన దెబ్బలకు చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం తిరుపతిలోని విద్యానగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... విద్యానగర్కు చెందిన కరిష్మా, మోహన్ కుమార్లకు ఏడాదిన్నర కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న ప్రభాస్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే సోమవారం ఉదయం కోపంతో ప్రభాస్ను తల్లి బలంగా కొట్టడంతో గోడకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కరిష్మా గతంలో కూడా ఇలానే ప్రవర్తించేదని, పలుమార్లు చిన్నారి గాయపడేలా కొట్టిందని చిన్నారి నాయనమ్మ పోలీసులకు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.