international criminals
-
జగత్ కిలాడీలకు ఝలక్
సాక్షి హైదరాబాద్: దేశ, విదేశీ పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ.. మూడేళ్లుగా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుదారులను మోసం చేస్తున్న అంతర్జాతీయ నేరస్తులను సైబరాబా ద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్రీధర్తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. మూడు కాల్ సెంటర్ల ఏర్పాటు ఐటీలో విశేష అనుభవం ఉన్న న్యూఢిల్లీకి చెందిన నవీన్ భూటానీ 2017లో ఆర్ఎన్టెక్ సర్వీసెస్ కంపెనీని ఏర్పాటు చేసి.. విదేశీ కస్టమర్లకు సాంకేతిక సేవల ను అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన మోహిత్ కుమార్, మోను సింగ్లతో పరిచయం ఏర్పడింది. టెక్నాలజీ సేవల పేరుతో విదేశీ కస్టమర్లను మోసం చేయాలని నిర్ణయించుకొని ఢిల్లీలోని జనక్పురి, ఘజియాబాద్లోని కోశాంబి, పంజాబ్లోని మొహాలీలో మూడు కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 80 మంది టెలీకాలర్లను నియమించుకున్నారు. అమెజాన్, పేపాల్ వంటి ఈ– కామర్స్ సైట్లలో నమోదయిన ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుల వివరాలను సేకరించారు. ‘మీరు ఫలానా రోజున ఆన్లైన్ షాపింగ్ చేశారు. మీ ఖాతా నుంచి సొమ్ము కట్ అయింది. మీరు సంబంధిత లావాదేవీలు జరపకపోతే కింద ఉన్న టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయండని’ నకిలీ మెసేజ్లు, ఈ– మెయిల్స్ పంపించారు. మరికొందరికి మీ కంప్యూటర్, రూటర్, ఇంటర్నెట్ సాంకేతిక పరికరాలలో సమస్యలు వచ్చాయని పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. కస్టమర్లు స్పందించగానే.. టెలీ కాలర్లు కాల్ రిసీవ్ చేసుకొని మోసానికి తెరలేపేవారు. ఎలక్ట్రానిక్స్ను హ్యాకింగ్ చేసి.. క్రెడిట్ కార్డ్ నంబర్, సీవీవీ, ఎక్స్పైరీ తేదీ, పిన్, పేరు ఇతరత్రా వివరాలను తస్కరించారు. వీటి సహాయంతో లావాదేవీలు నిర్వహించేందుకు నలుగురు హైదరాబాదీలతో చేతులు కలిపారు. ఇలా ఇప్పటివరకు సాంకేతిక సేవల ముసుగులో ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్దారులను రూ.25 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ∙అన్ని రకాల సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ జీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్లు.. న్యూఢిల్లీకి చెందిన నవీన్ భూటానీ, మోహిత్, మోను, హైదరాబాద్కు చెందిన నాగరాజు బొండాడ, దొంతుల శ్రవణ్ కుమార్, సాధనాల ముక్కంటి శ్రీనివాసరావు, పవన్ వెన్నెలకంటిలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.11,40,000 నగదుతో పాటు మూ డు వాహనాలు, నాలుగు ల్యాప్ట్యాప్లు, 12 సెల్ఫోన్లు, 10 సీపీయూలు, 6 రబ్బర్ స్టాంప్లు, 16 చెక్కుబుక్లు, 18 డెబిట్ కార్డ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా బయటపడింది.. హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ క్రెడిట్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్ యూనిట్ ప్రతినిధి అబ్దుల్ నయీమ్.. బ్యాంక్ లావాదేవీలను పర్యవేక్షిస్తున్నప్పుడు హెచ్డీఎఫ్సీ జారీ చేసిన స్వైపింగ్ మెషీన్లో రూ.64.40 లక్షల అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీంతో ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇలా ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, ఐడీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ, ఆర్బీఎల్, యాక్సెస్ బ్యాంక్లకు గత ఆరు నెలల్లో రూ.50 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 2018 నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. కొట్టేసిన మొత్తం ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ఘరానా సైబర్ నేరగాళ్లు దుబాయ్లో కూడా రూ.20 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న దుబాయ్కు చెందిన అర్షద్, అమీర్, డాక్టర్ ఫహద్లను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. లావాదేవీలన్నీ హైదరాబాద్లోనే.. హైదరాబాద్కు చెందిన నాగరాజు బొండాడ అలియాస్ రాజు, దొంతుల శ్రవణ్ కుమార్, సాధనాల ముక్కంటి శ్రీనివాసరావు, పవన్ వెన్నెలకంటి మాదాపూర్ పోలీస్స్టేషన్ వెనకాలే డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. టెలీ కాలర్లు తస్కరించిన ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల వివరాలతో షాపింగ్ చేయడం కోసం మర్చంట్ సైట్లను అభివృద్ధి చేశారు. వీటికి సొంత బ్యాంక్ ఖాతాలతో పేమెంట్ గేట్వేలను అనుసంధానించారు. దీంతో మోసపూరిత క్రెడిట్ కార్డ్లతో వాళ్ల వెబ్సైట్లలో లావాదేవీలు జరపగానే ఆ సొమ్ము వాళ్ల ఖాతాలోనే జమ అయ్యే -
కార్డ్ రాజా కార్డ్..!
-
32 లక్షల డెబిట్ కార్డులు బ్లాక్!
అంతర్జాతీయ నేరగాళ్ల చేతిలో కార్డుల సమాచారం సాక్షి, హైదరాబాద్: దేశంలో బ్యాంకు ఖాతాలోని డబ్బును విత్ డ్రా చేసుకోవటానికి, షాపుల్లో లావాదేవీలు నిర్వహించటానికి ఉపయోగించే డెబిట్ కార్డుల సమాచారం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లింది. ముందే అప్రమత్తమైన బ్యాంకులు... ఏకంగా 32 లక్షల డెబిట్ కార్డుల్ని బ్లాక్ చేసేశాయి. కాకపోతే పెను ప్రమాదాన్ని తప్పించుకున్నా... కొన్ని కార్డులు మాత్రం ఇప్పటికే నేరగాళ్ల లావాదేవీలకు బలయ్యాయి. చైనా, అమెరికాల్లో లావాదేవీలు జరిపిన ఈ నేరగాళ్లు... కోటిన్నర రూపాయల్ని కాజేశారు. ఈ విషయం వాటి యజ మానులు బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే బయట పడింది. మరి ఇప్పటికీ తమ లావాదేవీల నివేదికలను చూసుకోనివారి సంగతో..? ఏమో!! దేశీ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర 19 బ్యాంకులకు చెందిన కార్డుల సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కటంతో... ఖాతాదారుల్లో ఆందోళన రేగుతోంది. ఏమిటిది? ఎలా జరిగింది? ఒక బ్యాంకులోని ఖాతాదారుడు ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎం నుంచైనా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. కారణం... ఆ కార్డు పేమెంట్ ప్రాసెసింగ్ గేట్వేలు అనుసంధానమై ఉండటమే. ఇండియాలో వీసా, మాస్టర్ కార్డ్, రూపే ఈ మూడే ప్రధాన పేమెంట్ ప్రాసెసింగ్ సంస్థలు. ఇపుడు వీటి నుంచే డెబిట్ కార్డు హోల్డర్ల సమాచారం తస్కరణకు గురైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, అమెరికాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) బ్యాంకుల్ని హెచ్చరించటంతో మొత్తం వ్యవహారం బయటపడినట్లు భావిస్తున్నారు. జరిగిందిలా...!! ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎస్ బ్యాంకు తాలూకు ఏటీఎంలను ‘హిటాచి పేమెంట్ సర్వీసెస్’ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. ఏటీఎం ద్వారా పేమెంట్ సేవలు అందించటం, ఏటీఎం యంత్రాల్లో నగదు నింపడం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) తదితర సేవలను చూస్తోంది. బ్యాంకు ఆటో పాస్బుక్ ఎంట్రీ మెషిన్ల నిర్వహణ కూడా ఈ సంస్థే నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే, జూలై నెలల్లో ఓ మాల్వేర్ (దొంగ సాఫ్ట్వేర్) ఈ సంస్థకు చెందిన కంప్యూటర్ల వ్యవస్థలోకి చొరబడింది. దీన్ని ఆలస్యంగా సెప్టెంబర్లో గుర్తించారు. ఒక బ్యాంకు ఏటీఎం నెట్వర్క్ అన్ని బ్యాంకుల నెట్వర్క్తో అనుసంధానమై ఉంటుంది కను క తద్వారా అన్ని బ్యాంకులకు చెందిన కార్డు హోల్డర్ల సమాచారం ఈ మాల్వేర్ ద్వారా నేరగాళ్ల చేతికి చిక్కింది. తమ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు సంబంధించి చైనా, అమెరికాల్లో అనుమానిత లావాదేవీలు జరిగినట్టు పలు బ్యాంకుల కస్టమర్లు బ్యాంకు ల దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించిన నేషనల్ పేమెం ట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా.. ఇప్పటిదాకా 641 మంది ఖాతాదారుల నుంచి ఇలాంటి ఫిర్యాదులొచ్చాయని, లావాదేవీల విలువ రూ.1.3 కోట్లని బుధవారం వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకుల్ని ఎన్పీసీఐ హెచ్చరించటంతో బ్యాంకులు పలు చర్యలు చేపట్టాయి. 32 లక్షలకుపైగా కార్డుల సమాచారం చోరికి గురై ఉంటుందని అంచనాకు వచ్చి... వాటిని బ్లాక్ లేదా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రాంతంలో యస్ బ్యాంకు ఏటీఎం నెట్వర్క్ సేవలను వినియోగించుకున్న వారి కార్డులకే ఈ ముప్పు ఉన్నట్టు బ్యాంకులు చెబుతున్నాయి. కాగా, తమ నెట్వర్క్ భద్రతలో లోటుపాట్లూ జరగలేదని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ స్పష్టం చేసింది. తనిఖీ చేసి నివేదిక ఇచ్చేందుకు ఆడిట్ ఏజెన్సీని నియమించినట్లు తెలిపింది. తక్షణం చేయాల్సిందేంటి? ♦ కార్డు బ్లాకయిందని సందేశం వచ్చినా, లావాదేవీలు సాధ్యం కాకున్నా తక్షణం బ్యాంకును సంప్రదించాలి. ♦ చాలా బ్యాంకులు ఫిర్యాదుదారులకు వెంటనే చిప్ ఆధారిత హైసెక్యూరిటీ కార్డుల్ని ఉచితంగా జారీ చేస్తున్నాయి. ♦ మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులున్నవారు బ్లాక్ కాకున్నా చిప్ ఆధారిత కార్డులు తీసుకోవటం మంచిది. పిన్ నంబర్లూ మార్చుకోవాలి. ♦ బ్యాంకు ఖాతాలను అప్డేట్ చేస్తున్నామంటూ ఫోన్లు చేసినా... మీ ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, పిన్ నంబరు పంపాలని ఎస్సెమ్మెస్లు వచ్చినా సమాచారం పంపరాదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ♦ ఏటీఎంలో డబ్బు తీసుకునేప్పుడు డెబిట్ కార్డు పిన్ నంబరును అపరిచిత వ్యక్తులకు ఎవరికీ తెలియనీయొద్దు. అపరిచితుల సహకారం తీసుకోవద్దు. ♦ షాపుల్లో వస్తువులు కొని కార్డు ద్వారా చెల్లింపులు చేసేప్పుడు పిన్ నంబరు చెప్పొద్దు. మిషన్పై ఎవరికీ కనిపించకుండా మీరే ఎంటర్ చేయండి. 6 లక్షల కార్డులు బ్లాక్ చేశాం...: ఎస్బీఐ ముందు జాగ్రత్తగా సదరు నెట్వర్క్ వినియోగించుకున్న కస్టమర్ల కార్డులను బ్లాక్ చేశాం. వాస్తవానికి ఈ డేటా ఉల్లంఘనలు ఈ ఏడాది మే, జూలై నెలల్లో చోటు చేసుకున్నాయి. కానీ సెప్టెం బర్లో గుర్తించాం. దీంతో ముందే కార్డులను మార్చేస్తున్నాం. డేటా చోరీకి గురైందని తెలిసిన వెంటనే ఏటీఎం పిన్ నంబర్లను మార్చుకోవాలని కస్టమర్లకు సూచించాం. కేవలం 7 శాతం మందే మార్చుకున్నారు. దీంతో రిస్క్ తలెత్తకుండా కార్డులను రీకాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మా బ్యాంకు సిస్టమ్స్ అన్నీ పూర్తి సురక్షితంగానే ఉన్నాయి. ఇది మా బ్యాంకు వ్యవస్థ వెలుపల జరిగిన వ్యవహారం. ప్రస్తుత కార్డు దారులకు ముప్పేమీ లేదు. బ్లాక్ చేసిన కార్డుల స్థానంలో కొత్తవి ఉచితంగానే ఇస్తాం. - మంజు అగర్వాల్, ఎస్బీఐ డిప్యూటీ ఎండీ మరింత నిఘా అవసరం: యస్ బ్యాంకు అవుట్సోర్సింగ్ భాగస్వాములు తమ సేవలను కచ్చితంగా నిర్విహించేందుకు మరింత నిఘా అవసరం. వ్యవస్థకు ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. వీరికి పోలీసులు కూడా తగిన స్థాయిలో సేవలందించాలి. - రాణా కపూర్ యాక్సిస్ బ్యాంక్: డేటా తస్కరణ ప్రభావానికి గురైన కస్టమర్లను వెంటనే పిన్ మార్చుకోవాలని కోరాం. మా బ్యాంకు ఏటీఎం నెట్వర్క్ పూర్తి భద్రతతో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా: మా బ్యాంకు వ్యవస్థలోని సాఫ్ట్వేర్ను తనిఖీ చేశాం. ఇప్పటికే కార్డులను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాం. సెంట్రల్ బ్యాంక్: చైనాలో తమ కార్డులపై అనధికారిక లావాదేవీలు జరిగినట్లు కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. వారికి కనీసం పాస్పోర్టులు కూడా లేవు. వారి కార్డులను మార్చాం. ఆందోళన వద్దు: కేంద్ర ఆర్థిక శాఖ కార్డుల బ్లాక్ నేపథ్యంలో... 99.5 శాతం కార్డులు సురక్షితంగానే ఉన్నాయని, 0.5 శాతం మేర కార్డుల సమాచారానికే ముప్పు ఏర్పడిందని కేంద్ర ఆర్థిక శాఖ అడిషనల్ సెక్రటరీ జీసీ ముర్ము మీడియాకు తెలిపారు. దేశంలో మొత్తం 60 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయని, వీటిలో 19 కోట్ల కార్డులను రూపే కార్డ్స్ దేశీయంగానే రూపొందించినట్టు చెప్పారు. మిగిలినవి వీసా, మాస్టర్కార్డు జారీ చేసినవన్నారు. కేవలం ఓ కంపెనీ మెషిన్లలో పరిమిత కాలంలోనే చోటుచేసుకున్న చిన్న అంశంగా తేల్చేశారు. -
ఆచూకీ చెబితే ఆరుకోట్లు మీవే!!
అర్జంటుగా మీకు కోటీశ్వరులు అయిపోవాలని ఉందా? అయితే ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఆరు కోట్ల రూపాయల భారీ బహుమతి మీ కోసమే వేచి చూస్తోంది. ఇంత పెద్ద బహుమతి ఎవరిస్తున్నారా అనుకుంటున్నారా.. ఇంకెవరు, పెద్దన్న అమెరికానే. మధ్య ఆసియా కేంద్రంగా పనిచేస్తున్న ఓ పెద్ద క్రిమినల్ నెట్వర్క్ గురించి సరైన సమాచారం వాళ్లకు అందిస్తే, ఇంతమొత్తం బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. కమ్చైబెక్ కొల్బయెవ్ అనే ఈ నెట్వర్క్ అలాంటిది, ఇలాంటిది కాదు. డ్రగ్స్, ఆయుధాలు, అమ్మాయిల అక్రమ రవాణాతో పాటు బెదిరించి సొమ్ములు తీసుకోవడం, ఇతర నేరాలకు పాల్పడుతుందని సిన్హువా వార్తాసంస్థ తెరలిపింది.బ్రదర్స్ సర్కిల్ అనే మరో అంతర్జాతీయ నేరగాళ్ల ముఠాతో కూడా దీనికి సంబంధం ఉంది. యూరేషియన్ నేరగాళ్ల బృందానికి చెందిన పలువురు సభ్యులు, నాయకులు కూడా ఇందులో ఉన్నారు. బ్రదర్స్ సర్కిల్ తరఫున పనిచేస్తున్నందుకు కొల్బయెవ్ గ్యాంగును అమెరికా ఎప్పుడో 2012 ఫిబ్రవరిలోనే బ్లాక్లిస్ట్ చేసింది.