Jacob Bethell
-
ఈసారి ఆర్సీబీ పదో స్థానంలో నిలుస్తుంది: ఆస్ట్రేలియా దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడం గిల్క్రిస్ట్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. సూపర్స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి తానెప్పుడూ వ్యతిరేకం కాదని పేర్కొన్నాడు. అయితే, ఆర్సీబీలో ఓ దేశానికి చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని.. అందుకే ఈసారి ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలుస్తుందంటూ వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశాడు.నాయకుడిగా రజత్ పాటిదార్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ శనివారం (మార్చి 22)ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్కతా నైట్ రైడర్స్- ఆర్సీబీ మధ్య మ్యాచ్తో ఐపీఎల్-2025కి తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతాతో పాటు ఆర్సీబీకి కూడా ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు. కేకేఆర్కు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీఈ నేపథ్యంలో ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతున్న ఆసీస్ దిగ్గజం గిల్క్రిస్ట్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈసారి ఐపీఎల్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉండే జట్టు ఏది? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆ జట్టులో అనేక మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్నారు.కాబట్టి.. వాస్తవాల ఆధారంగానే నేను ఈ మాట చెబుతున్నా. ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీ. వాళ్లకే ఈసారి ఆఖర్లో ఉండే అర్హతలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’ అని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో ఆర్సీబీ, కోహ్లి అభిమానులకు గిల్క్రిస్ట్ క్షమాపణలు కూడా చెప్పడం విశేషం.మనస్ఫూర్తిగా క్షమాపణలు‘‘విరాట్ లేదంటే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు నేను వ్యతిరేకం కాదు. ఇలా మాట్లాడినందుకు వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. కానీ మీ రిక్రూట్మెంట్ ఏజెంట్లకు మీరైనా చెప్పండి. ఆటగాళ్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అత్యంత ముఖ్యం’’ అని గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ప్లేయర్ల ప్రదర్శన అంతగొప్పగా ఉండదని.. ఈసారి వారి వల్ల ఆర్సీబీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.కాగా మెగా వేలం-2025 సందర్భంగా ఆర్సీబీ.. ఇంగ్లండ్ స్టార్లు లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బెతెల్, ఫిల్ సాల్ట్ తదితరులను కొనుగోలు చేసింది. సాల్ట్ ఈసారి కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.కాగా ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టుకు రెండుసార్లు ట్రోఫీని దూరం చేసిన జట్టు హైదరాబాద్. 2009లో ఆడం గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో నాటి దక్కన్ చార్జర్స్.. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఫైనల్లో ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాయి. ఇక ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఈ జట్టు.. ఈసారి టైటిల్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టురజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండగే, జేకబ్ బెతెల్, దేవ్దత్ పడిక్కల్, స్వస్తిక్చికార, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠీ.చదవండి: 44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్ -
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి శుభవార్త
2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త అందింది. ఈ ఏడాది ఐపీఎల్కు దూరమవుతాడనుకున్న జేకబ్ బేతెల్ (ఇంగ్లండ్ ఆటగాడు) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. బేతెల్ మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటాడని సమాచారం. బేతెల్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్గా గుర్తుంపు తెచ్చుకున్న బేతెల్ను ఆర్సీబీ గతేడాది మెగా వేలంలో రూ.2.6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. బేతెల్ మిడిలార్డర్లో విధ్వంకర బ్యాటింగ్ చేయడంతో పాటు ఉపయోగకరమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. బేతెల్ ఇప్పటివరకు 63 టీ20లు ఆడి 136.77 స్ట్రయిక్రేట్తో 1127 పరుగులు చేశాడు. గతేడాది చివర్లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన బేతెల్ 3 టెస్ట్లు, 9 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. బేతెల్ టెస్ట్ల్లో 3, వన్డేల్లో 2, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. బేతెల్ మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో 674 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. 21 ఏళ్ల బేతెల్కు ఇది తొలి ఐపీఎల్ అవుతుంది. ఆర్సీబీ.. మార్చి 22న కోల్కతాలో జరిగే లీగ్ ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో తలపడుతుంది. ఈ ఏడాదే ఆర్సీబీ నూతన కెప్టెన్గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్ -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్కు భారీ ఎదురుదెబ్బ
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champion Trophy-2025) ముందు ఇంగ్లండ్కు (England) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఆల్రౌండర్ జేకబ్ బేతెల్ (Jacob Bethell) గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ధృవీకరించాడు. బేతెల్ లాంటి ప్రామిసింగ్ ఆల్రౌండర్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడం దురదృష్టకరమని బట్లర్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బేతెల్ సేవలు కోల్పోనుండటంపై విచారం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ బేతెల్కు కవర్గా టామ్ బాంటన్ను ఎంపిక చేసింది.21 ఏళ్ల బేతెల్ ఇటీవలే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. భారత్తో జరిగిన టీ20 సిరీస్లో పెద్దగా రాణించలేని బేతెల్.. నాగ్పూర్ వేదికగా భారత్తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీ సహా వికెట్ తీసుకున్నాడు. గాయం కారణంగా బేతెల్ భారత్తో జరిగిన రెండో వన్డేలో ఆడలేదు.తొలి మ్యాచ్లో ఆసీస్ను ఢీకొట్టనున్న ఇంగ్లండ్ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడనుంది. కరాచీలో జరిగే ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలువుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉండగా.. భారత్, పాక్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో పోటీపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్, పాక్ల సమరం ఫిబ్రవరి 23న జరుగనుంది.రెండో వన్డేలోనూ భారత్దే విజయంమూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా కటక్ వేదికగా నిన్న జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు తొలి వన్డేలోనూ నెగ్గిన భారత్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా భారత్ 4-1 తేడాతో గెలుపొందింది.రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ద సెంచరీలతో రాణించారు. సాల్ట్ 26, హ్యారీ బ్రూక్ 31, బట్లర్ 34, లివింగ్స్టోన్ 41, ఆదిల్ రషీద్ 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కించుకున్నారు.సెంచరీతో చెలరేగిన రోహిత్ఛేదనలో రోహిత్ శర్మ (119) సెంచరీతో చెలరేగడంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (60), శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41 నాటౌట్) రాణించారు. విరాట్ కోహ్లి (5) మరోసారి నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ 10, హార్దిక్ పాండ్యా 10 పరుగులకు ఔటయ్యారు. రవీంద్ర జడేజా (11 నాటౌట్) సాయంతో అక్షర్ భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్, ఆదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు. నామమాత్రపు మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్లో జరుగనుంది.